మూడు రోజుల విరామం అనంతరం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి.
హైదరాబాద్ : మూడు రోజుల విరామం అనంతరం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఉదయం పది గంటలకు సమావేశాలు మొదలవుతాయి. ఈ సందర్భంగా విపక్షలు పలు అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలుపై కాంగ్రెస్, మహిళల సంక్షేమంకు సంబంధించి టీడీపపీ, క్వాలిఫై టీచర్ల సమస్యలు, టీచర్ పోస్టుల భర్తీపై బీజేపీ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. ఈ నెల 11వ తేదీ వరకూ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.