చంద్రబాబుతో భేటికి సీనియర్ నేతల డుమ్మా | Telangana TDP Leaders not Attend to Chandrababu meeting | Sakshi
Sakshi News home page

చంద్రబాబుతో భేటికి సీనియర్ నేతల డుమ్మా

Published Fri, Jul 18 2014 6:54 PM | Last Updated on Sat, Aug 11 2018 4:50 PM

చంద్రబాబుతో భేటికి సీనియర్ నేతల డుమ్మా - Sakshi

చంద్రబాబుతో భేటికి సీనియర్ నేతల డుమ్మా

హైదరాబాద్: చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలంగాణ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ప్రారంభమైంది. ఈ భేటీకి ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాస యాదవ్, రేవంత్ రెడ్డి డుమ్మా కొట్టారు. తెలంగాణ పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

అయితే సీనియర్ నాయకులు ఈ భేటికి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. తలసాని శ్రీనివాస యాదవ్ త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. శ్రావణమాసంలో ఆయన పార్టీ మారే అవకాశముందని ఊహాగానాలు విన్పిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement