టీఎస్ఎస్పీ పోలీసుల నివాసగృహాలకే రక్షణ లేకుండా పోయింది.
మామునూరు: టీఎస్ఎస్పీ పోలీసుల నివాసగృహాలకే రక్షణ లేకుండా పోయింది. వరంగల్ జిల్లా మామునూరు టీఎస్ఎస్పీ నాలుగో బెటాలియన్లో తాళం వేసి ఉన్న ఎనిమిది క్వార్టర్స్ల్లో దొంగలు చోరీకి పాల్పడి 39 తులాల బంగారు ఆభరణాలు, సుమారు 67తులాల వెండి వస్తువులు, రూ.1.12లక్షల నగదు దొంగిలించారు. హన్మకొండ మండలం మామునూరులో టీఎస్ఎస్పీ నాలుగో బెటాలియన్లోని సుమారు 7వందల క్వార్టర్స్లో పోలీసు కుటుంబాలు నివాసముంటున్నారుు. ఉగాది సందర్భంగా కొంతమంది కానిస్టేబుళ్లు క్వార్టర్లకు తాళాలు వేసి తమ స్వగ్రామాలకు వెళ్లారు. ఇదే అదనుగా దొంగలు చోరీలకు పాల్పడ్డారు.