
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో చలి మొదలైంది. తెల్లవారుజామున, సాయంత్రం, రాత్రి వేళల్లో వీస్తున్న చలిగాలులు సిటీజనులను వణికిస్తున్నాయి. ఆదివారం కనిష్టంగా 19 డిగ్రీలు, గరిష్టంగా 30 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 30 శాతానికి పడిపోయింది. చర్మ, శ్వాస సమసమస్యలున్న రోగులు, వృద్ధులు చలితో ఇబ్బందులు పడుతున్నారు. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప మార్పులుంటాయని బేగంపేట్లోని వాతావరణ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment