winter
-
ఫిబ్రవరి.. ఈవెంట్ల ఝరి..
విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారా, వినోదాన్ని ఆశిస్తున్నారా? ‘సంత’కెళ్లి కొనాలి అనుకుంటున్నారా? సంగీతాన్ని కోరుకుంటున్నారా? ఆల్ ఇన్ వన్ అన్నట్టుగా అన్నీ నగరంలోనే అన్నట్టు ఈ నెల మొత్తం విందు వినోదాల సంగమంగా మారనుంది నగరం. నవంబర్ నుంచి మొదలై అత్యధిక కార్యక్రమాలను అందించే వింటర్ సీజన్కు ముగింపు నెల కావడంతో ఫిబ్రవరి ఈవెంట్స్ ఫీవర్లో చిక్కుకుంది. వినోదాన్ని ఆస్వాదించే ఔత్సాహికుల నుంచి విద్యార్థుల వరకూ, వ్యాపారుల నుంచి క్రియేటర్స్ వరకూ.. అందరికీ ఉపకరించే ఈవెంట్స్కు నగరం ఆతిథ్యం ఇస్తోంది. నగరంలో సాధారణంగా చలికాలం అన్ని విధాలా.. అన్ని రకాల కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటుంది. దీంతో వింటర్లో అత్యధిక సంఖ్యలో ఈవెంట్లు జరుగుతుంటాయి. అదే విధంగా ఫిబ్రవరి నెలతో వింటర్ ముగుస్తుంది కాబట్టి ఈ నెలలో ఈవెంట్లు హోరెత్తుతాయి. బాలీవుడ్ స్టార్ సింగర్ సోనూ నిగమ్ గత శనివారం (నిన్న) లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అదే విధంగా పలువురు గాయనీ గాయకులు కూడా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో జరగనున్న కొన్ని విజ్ఞాన, వినోద కార్యక్రమాల విశేషాలివి..డెస్టినేషన్ యుఎస్ఏ.. అగ్ర విశ్వవిద్యాలయ ప్రతినిధులను కలవడానికి వీసాలకు సంబంధించిన సందేహాల నివృత్తికి.. సలహాలు, సూచనలను పొందడానికి ఈ ఈవెంట్ ఉపకరిస్తుంది. జీవితాన్ని మార్చగల విద్యావకాశాలను సూచిస్తుంది. విశ్వవిద్యాలయాల్లో చోటు సంపాదించడానికి విదేశీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోడానికి అవసరమైన సమగ్ర సమాచారాన్ని పొందడానికి సహకరిస్తుంది. – ఫిబ్రవరి 15, ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూటెక్నాలజీ సభ –2025 సాంకేతిక విద్య పట్ల ఆసక్తి కలిగిన టెక్నాలజీ ఔత్సాహికులకు ఇది హాజరు కావాల్సిన కార్యక్రమం. డిజిటల్ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీలతో పాటు అత్యాధునిక టెక్నాలజీ విశేషాలను కూడా ఇది కవర్ చేస్తుంది. వృత్తి నిపుణులు, విద్యార్థులు, పారిశ్రామిక వేత్తలకు ఉపకరిస్తుంది. సాంకేతిక భవిష్యత్తును అన్వేషించడానికి చక్కని అవకాశం. తేదీ: ఫిబ్రవరి 21 నుంచి 23 వరకూ స్థలం: నోవోటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్గిఫ్ట్స్ అండ్ స్టేషనరీ ఇండియా ఎక్స్పో.. సంబంధిత వ్యాపారులైనా లేదా కార్పొరేట్ గిఫ్ట్స్, స్టేషనరీలో తాజా ట్రెండ్లపై ఆసక్తి కలిగి ఉన్నా, ఈ ఈవెంట్ సందర్శనీయ ఎంపిక. బహుమతులు, స్టేషనరీ పరిశ్రమలో అందుబాటులో ఉన్న తాజా ఉత్పత్తులు, సేవల గురించి తెలుసుకోవచ్చు. తేదీ : ఫిబ్రవరి 28 వరకూ.. స్థలం : హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్స్టార్టప్ పార్టీ.. స్టార్టప్ ప్రయాణంలో అవసరమైన, అర్థవంతమైన సమన్వయాన్ని ఈ కార్యక్రమం అందిస్తుంది. ప్యానెల్ చర్చలు–స్వీయ–ప్రమోషనల్ స్టార్టప్ ఈవెంట్స్లా కాకుండా స్టార్టప్ను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి వీలుగా నైపుణ్యాలు అందించే దేశంలోని మొట్టమొదటి కాన్సెప్చువల్ స్టార్టప్ ఈవెంట్ ఇది. తేదీ : ఫిబ్రవరి 23 సమయం : మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.30 వరకు స్థలం : హైటెక్ సిటీకుక్డుకూ ఫెస్ట్.. చిన్నారులకు విందు, వినోదం, విజ్ఞానాలను అందించే కార్యక్రమం ఇది. స్టోరీ టెల్లింగ్, రచయితలతో సంభాషణలు, హస్తకళలు, చేతి వృత్తుల పరిచయం, పప్పెట్ షోలు, వెంట్రిలాక్విజమ్, క్విజ్, బుక్ ఫెయిర్, ఫుడ్ ఫెస్టివల్స్, ఆటలు, పాటలు, నృత్యాలు.. వంటివి కలగలిపే కార్యక్రమం. తేదీ : ఫిబ్రవరి 15, 16 (రెండు రోజులు) సమయం : ఉదయం 11 గంటల నుంచి స్థలం : నిథిమ్ క్రికెట్ గ్రౌండ్స్, గచ్చిబౌలిహమ్రాహి.. ఓ గజల్ సాయంత్రం.. ప్రముఖ గాయకుడు హరిహరన్ నగరంలో సంగీతాభిమానులను అలరించనున్నారు. హమ్రాహి పేరుతో హిందీ, ఉర్దూ భాషల్లో సాగే గజల్ గానాలాపనతో నగరవాసులను మంత్రముగ్ధులను చేయనున్నారు. తేదీ : ఫిబ్రవరి 21, స్థలం : శిల్పకళావేదిక సమయం : సాయంత్రం 6.30 గంటల నుంచిది సాస్ ఎట్ స్కేల్ 2025.. భవిష్యత్తు పరిశ్రమను, కృత్రిమ మేధస్సు ఎలా రూపాంతరం చెందిస్తుందో తెలిపే ఈవెంట్ ఇది. ఏఐ నిపుణుల నుంచి నేర్చుకోడానికి సారూప్యత కలిగిన వ్యక్తులతో నెట్వర్క్ పెంచుకునేందుకు అవకాశం ఇస్తుంది. తేదీ : ఫిబ్రవరి 15 సమయం : ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకు స్థలం : టీ–హబ్, నాలెడ్జ్ సిటీ రోడ్ప్రేమికుల రోజున సునీత.. వాలెంటైన్స్డే సందర్భంగా ప్రముఖ టాలీవుడ్ గాయని సునీత పాటల కార్యక్రమం నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచనుంది. ప్రేమ చిత్రాల్లో వినసొంపైన టాప్ లవ్ సాంగ్స్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సునీత.. ప్రేమికుల దినోత్సవాన.. పాటల వాన కురిపించనున్నారు. తేదీ : ఫిబ్రవరి 14 సమయం : రాత్రి 9గంటల నుంచి స్థలం : అర్బన్ మాయాబజార్, ఎల్బీనగర్ -
హిమపర్వం ఆగడం బగడం
మంచు కురిసే శీతకాలం ఎంత సరదాగా ఉంటుందో ప్రపంచానికి చూపించడంలో అమెరికావాసులు ఎప్పుడూ ముందే ఉంటారు. అందులో భాగంగానే మిన్నెసోటా రాష్ట్రం, సెయింట్ పాల్ నగరంలో ప్రతి ఏడాది పది రోజుల పాటు ఈ ‘వింటర్ కార్నివాల్ ఉత్సవాలు’ జరుగుతాయి. ఇవి అత్యంత పురాతనమైన సంబరాలు.సెయింట్ పాల్ను 1885లో సందర్శించిన న్యూయార్క్ విలేఖరులు ‘ఈ సెయింట్ పాల్ నగరం మరో సైబీరియా లాంటిది. శీతకాలంలో మానవ నివాసానికి పనికిరాదు’ అని పత్రికల్లో రాశారు. ఆ రాతలకు సెయింట్ పాల్ వాసులు మనస్తాపం చెందారు. తమ ప్రాంతం గొప్పదనాన్ని ప్రపంచానికి వెల్లడించడానికి, ప్రపంచంలో తమదైన ప్రత్యేకతను నిలుపుకోవడానికి ఈ వినూత్న సంబరాలను మార్గంగా ఎన్నుకున్నారు. అప్పటికే కెనడాలోని మాంట్రియల్ నగరంలో ఈ కార్నివాల్ ఉత్సవాలు జరుగుతుండేవి. వాటిని ప్రేరణగా తీసుకుని, 1886లో ఈ ఉత్సవాలకు నమూనాలు రూపొందించారు. ఇవి ప్రారంభమైన నాటి నుంచి కేవలం రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో తప్ప, ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ఈ ఏడాది జనవరి 25 నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు ఫిబ్రవరి 3తో ముగుస్తాయి. ఈ వేడుకలకు బోరియాస్ పురాణాన్ని ప్రామాణికంగా చెబుతారు. ఇక్కడి ప్రజలు శీతకాలపు దేవుడుగా బోరియాస్ను కొలుస్తారు. కళ్లు చెదిరేలా జరిగే ఈ వేడుకల్లో ఐస్ పాలస్, మంచు శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.ఈ వేడుకల్లో గడ్డాల పోటీలు, హాట్ డిష్ పోటీలు, ఐస్ రన్ పోటీలు ఇలా చాలానే నిర్వహిస్తుంటారు. కనువిందు చేసే ఈ మంచు వేడుకను చూడటానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తుంటారు. వివిధ దేశాల రాచ కుటుంబీకులు, ప్రముఖులు, అధికారులు ఇలా చాలామంది ఈ వేడుకకు ప్రత్యేకంగా హాజరవుతుంటారు. -
Winter Travel Ideas: శీతాకాలంలో తప్పక చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు
దేశంలో చలివాతావరణం కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ శీతాకాలంలో దేశంలోని కొన్ని పర్యాటక ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. ఇటువంటి తరుణంలో ఆయా ప్రాంతాలకు వెళితే బిజీలైఫ్ నుంచి మానసిక ప్రశాంతత లభిస్తుంది.మనదేశంలో శీతాకాలంలో సందర్శించదగిన అనేక ప్రదేశాలున్నాయి. అక్కడ చలిని కూడా ఎంజాయ్ చేయవచ్చు. ప్రతీయేటా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఈ ప్రాంతాల్లో టూరిస్టుల తాకిడి అధికంగా ఉంటుంది. ఆ ప్రాంతాలు ఏవి? ఎక్కడున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.గోవాప్రకృతి అందాలకు నిలయమైన గోవా.. స్వదేశీ, విదేశీ పర్యాటకుల గమ్యస్థానం. అందమైన సముద్రం, బీచ్, నైట్ లైఫ్, పార్టీలు, వినోదాన్ని ఇష్టపడేవారు వింటర్ సీజన్లో గోవాను సందర్శిస్తే మంచి అనుభూతి దొరుకుతుంది. గోవా ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపుపొందింది. గోవాకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో వెళ్లవచ్చు. లేదా ఒంటరిగా నైనా వెళ్లవచ్చు. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో గోవాలో అత్యంత రమణీయమైన వాతావరణం కనిపిస్తుంది.జైసల్మేర్శీతాకాలంలో రాజస్థాన్లోని జైసల్మేర్ ప్రకృతిశోయగాలతో మరింత సుందరంగా తయారవుతుంది. జైసల్మేర్లో చారిత్రక వారసత్వం, సంస్కృతి రెండూ కనిపిస్తాయి. ఇక్కడ క్యాంపింగ్, నైట్ అవుట్, ఒంటె సవారీ తదితర వినోద కార్యకలాపాల్లో పాల్గొని, ఎంజాయ్ చేయవచ్చు. చలికాలంలో జైసల్మేర్ను సందర్శించాలని పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు.కూర్గ్కర్ణాటకలో ఉన్న కూర్గ్ అధికారిక పేరు కొడగు. దీనిని స్కాట్లాండ్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటారు. చలికాలంలో కూర్గ్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం ఇక్కడి విశేషం. దేశమంతటా అత్యధిక చలివున్న సమయంలో కూర్గ్లో వెచ్చదనాన్ని అనుభవించవచ్చు. కూర్గ్లోని ప్రకృతి అందాలు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి.ముంబైవింటర్ సీజన్లో ముంబైని కూడా సందర్శించవచ్చు. ఇక్కడి బీచ్లో బలమైన అలలను చూసి ఎంజాయ్ చేయవచ్చు. ముంబైలో సందర్శించేందుకు పలు పర్యాటక ప్రదేశాలున్నాయి. ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ను ఆహార ప్రియులను అమితంగా ఇష్టపడుతుంటారు. ముంబైలో సందర్శించేందుకు పలు పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ శీతాకాలంలో తక్కువ బడ్జెట్లో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే అందుకు ముంబై అనువైన ప్రాంతమని పర్యాటకులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: Delhi Election 2025: ఆ మూడు పార్టీల బలాలు.. బలహీనతలు -
వింటర్ ది డ్రాగన్: చలిపులి.. చర్మం వలుస్తోందా?
కొత్త ఏడాది తర్వాత క్రమక్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయేమోగానీ... అందరూ బయటే ఎక్కువసేపు గడిపే సాయంత్రాలూ, పనులకు వెళ్లే ఉదయం వేళల్లో చలి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ సీజన్లో వీచే కరకుగాలులు వాతావరణం నుంచి తేమను లాగేస్తాయి. అవి చర్మం నుంచి కూడా తేమను లాగేస్తుండం వల్ల మేను పొడిబారుతుంది. పొట్టుగా రాలుతుంది. ఇలాంటి సమస్యలన్నీ ఈ సీజన్లో అనివార్యంగా కనిపిస్తుంటాయి. ఒక్కొక్కరి చర్మ స్వభావం ఒక్కోలా ఉండటం వల్ల కొందరిలో చలికాలపు సమస్యలు ఎక్కువగానూ, మరికొందరిలో తక్కువగానూ కనిపిస్తుంటాయి. ఈ చలి సమస్యల తీవ్రత చర్మంపై చాలా ఎక్కువగా ఉన్నవారిలో... వారి మేనిపై పగుళ్లు, చర్మం పొట్టుగా రాలడం వంటి లక్షణాలతో ఎక్జిమా తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఈ సీజన్లో కనిపించే సమస్యల నుంచి రక్షణ పొందడమెలాగో తెలుసుకుందాం.కేవలం కొన్ని చిన్న చిన్న మార్పులతో చలికాలపు తీవ్రత నుంచి మిమ్మల్ని కాపాడుకోవచ్చు. అవి తెలుసుకునే ముందర ఈ కాలంలో వచ్చే కొన్ని సాధారణ చర్మ సమస్యలేమిటో చూద్దాం...ఇవీ సాధారణంగా కనిపించే చర్మ సమస్యలు... ఎక్జిమా ఫ్లేర్స్ : తక్కువ ఉష్ణోగ్రతల వల్ల చర్మం ప్రభావితమై ఎగ్జిమాలాంటి పగుళ్లు. చర్మం పొడిబారడం, పొట్టుగా రాలడం : బయటి చల్లగాలి కారణంగా దేహంలోని వేడిమి చర్మం నుంచి బయటకు వెళ్లడంతో తేమ కూడా బయటకు వెళ్తుంది. దాంతో చర్మం బాగా పొడిబారిపోవడమే కాకుండా, పొట్టుగా రాలుతుంది. పగిలే పెదవులు : సున్నితమైన పెదవుల చర్మమూ పగుళ్లువారుతుంది. చిల్ బ్లెయిన్స్ : చేతులూ, పాదాల మీద చర్మం కొన్నిచోట్ల (పగుళ్లు రాబోయే చోట) ఉబ్బెత్తుగా మారుతుంది. ఇలాంటి ఉబ్బెత్తు ప్రదేశాల్లో నొప్పి ఉంటుంది. వీటిని చిల్ బ్లెయిన్స్ అంటారు. వింటర్ యాక్నె : జిడ్డు చర్మం వల్లనే మొటిమలు ఎక్కువగా వస్తాయన్న భావన చాలామందిలో ఉంటుంది. దీనికి భిన్నంగా వాతావరణంలో చలి ఎక్కువగా ఉన్నప్పుడూ మొటిమలు వస్తాయి. వీటిని ‘వింటర్ యాక్నే’గా చెప్పవచ్చు.చర్మం ప్రభావితమైందని తెలిపే సూచనలివి... చలికాలపు చల్లగాలులకు చర్మం ప్రభావితమైనదనీ, దానికి ఇప్పుడు మరింత రక్షణాత్మక చర్యలు అవసరమని తెలియజేసేలక్షణాలివి... చర్మం ఎర్రబారడం, ఇలా ఎర్రబారిన చోట దురద రావడం ఏవైనా ఉపశమన చర్యలకోసం లేపనాల వంటివి రాసినప్పుడు ప్రభావితమైన చర్మభాగాలు మంటగా అనిపించడం చర్మం తీవ్రంగా పొడిబారినప్పుడు అక్కడ పొట్టులా రాలడం చర్మం నుంచి తేమ తొలగి΄ోవడంతో చర్మం బాగా బిగుతుగా ఉన్న ఫీలింగ్ ఏవైనా చర్మ సంరక్షణ లేపనాలు రాసినప్పుడు చర్మం ముట్టుకోనివ్వకపోవడం. చర్మంపై చలికాలపు దుష్ప్రభావాల నివారణ, రక్షణ చర్యలివి... తేమ పెరిగేలా చూసుకోవడం: చర్మం ఎప్పుడూ తేమ కోల్పోకుండా చూసుకునేందుకు క్రమం తప్పకుండా... హైలూరానిక్ యాసిడ్, షియా బటర్ లేదా సెరమైడ్స్ ఉండే మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. మరవకూడని సన్ స్క్రీన్ : చలికాలపు ఎండవేడిమిలోనూ అల్ట్రా వయొలెట్ కిరణాలు చర్మంపై ప్రభావం చూపుతాయి. అందుకే ఎండలోకి వెళ్లేముందర 30 ప్లస్ ఎస్పీఎఫ్ ఉన్న సన్స్క్రీన్ను చర్మంపై రాసుకోవడం మంచిది. హ్యుమిడిఫైయర్ వాడటం : గదిలోపల ఉండే పొడిదనాన్ని ఎదుర్కోవడం కోసం (మరీ ముఖ్యంగా బెడ్రూమ్ వంటి చోట్ల) క్రమం తప్పకుండా హ్యుమిడిఫైయర్ వాడాలి. గోరువెచ్చటి నీటితో స్నానం : వెచ్చటి నీళ్లతో స్నానం చేయడమన్నది స్నానం వేళ బాగున్నప్పటికీ ఆ తర్వాత చర్మం తీవ్రంగా పొడిబారి పగుళ్లుబారినట్లుంటుంది. దీనికి బదులు గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేస్తే... స్నానం తర్వాత చర్మం బాగుంటుంది. గాఢమైన సౌందర్యసాధనాలు వద్దు చర్మంపై రాసుకునే ఉత్పాదనల్లో ఆల్కహాల్, రెటినాల్, మెంథాల్ వంటివి ఎక్కువ మోతాదుల్లో ఉన్నవి గానీ లేదా ఇతరత్రా గాఢమైన వాసనలు వచ్చే సౌందర్యసాధనాలకు బదులు తేలికపాటి సువాసన వెదజల్లే మైల్డ్ సౌందర్యసాధనాలు వాడుకోవడమే మంచిది. నీళ్లు తాగుతుండటం: చర్మం కోల్పోయే నీటి మోతాదులను మళ్లీ మళ్లీ భర్తీ చేసుకునేందుకు వీలుగా ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండటం మంచిది. మేని నిగారింపును పెంచే ఆహారాలు తీసుకోవడం: మేని నిగారింపును మరింతగా పెంచే తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో కూడిన... అన్ని రకాల ΄ోషకాలూ పుష్కలంగా ఉండే సమతులాహారం తీసుకోవడం మేలు. వైద్యనిపుణులను సంప్రదించడం: పైన పేర్కొన్న అన్ని రకాల జాగ్రత్తలను తీసుకున్న తర్వాత కూడా చర్మంపై చలికాలపు దుష్ప్రభావాలు కనిపిస్తుంటే... తక్షణం చర్మవ్యాధి నిపుణులను సంప్రదించడం మంచిది. డా. బాల నాగ సింధూర కంభంపాటి, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ (చదవండి: టేస్టీ బర్గర్ వెనుకున్న సీక్రెట్ తెలిస్తే కంగుతినడం ఖాయం..! ) -
చలికాలం.. కాస్త ఎండపడనిద్దాం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చలికాలమని ముసుగుతన్ని ఇంట్లోనే పడుకుని కాలక్షేపం చేద్దామనుకుంటున్నారా? చలికి భయపడి మార్నింగ్ వాక్కు వెళ్లడం మానేశారా? ఇంట్లోంచి నేరుగా ఉదయం 10 తర్వాత కార్యాలయానికి బయలుదేరుతున్నారా? ఉదయం బాగా చలేస్తోందని.. సాయంత్రం వాకింగ్ చేస్తున్నారా? చలి పేరుతో ఇలా చేస్తుంటే వెంటనే మీ అలవాటును మార్చుకోండి. లేదంటే మానసిక ఒత్తిడి తప్పదని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంవో) హోవార్డ్ లీవైన్ చెబుతున్నారు. చలికాలంలో వచ్చే వాతావరణ మార్పులతో మెదడులో కొన్ని రసాయన మార్పులు జరిగి.. శారీరకంగా నీరసంగా ఉన్నామనే భావన వస్తుందని.. ఈ భావనతో బయటకు వెళ్లి ఇతరులను కలవడం కూడా తగ్గిపోతుందని ఆయన పేర్కొంటున్నారు. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా తెలిసిన విషయాన్ని మర్చిపోవడం.. కొన్ని పదాలను అసలు పలికేందుకు ఇబ్బంది పడి.. వేరే పదాలను పలకడం వంటివి కూడా చేస్తారని ఆయన అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిరోజూ ఉదయం 10 గంటలలోపు అరగంట పాటు సూర్యరశ్మిలో ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ సూర్యరశ్మి అందుబాటులో లేని రోజుల్లో ప్రత్యేకంగా కాంతిని ప్రసరింపచేసేందుకు ఉపయోగించే లైట్ బాక్సుల ద్వారా కూడా ఉపశమనం పొందవచ్చని ఆయన చెబుతున్నారు.ఎస్ఏడీ.. ఎలా వస్తుందంటే..చలికాలంలో కాంతి లేకపోవడం వల్ల మన మానసిక, శారీరక ప్రవర్తనపై ప్రభావం పడుతుంది. దీనిని సీజనల్ అఫెక్టివ్ సిండ్రోమ్ (ఎస్ఏడీ) అని.. వైద్య పరిభాషలో ‘సిర్కాడియల్ రిథమ్స్’ అని అంటారు. ఎస్ఏడీ మన మెదడులోని నిద్రను ప్రేరేపించే హార్మోన్ మెలటోనిన్ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇది మానసిక స్థితిని ప్రభావితం చేసే మరో ఎంజైమ్ సెరోటోనిన్ తక్కువ విడుదల కావడానికి దోహదం చేస్తుంది. ఈ రసాయన అసమతుల్యత వల్ల నీరసంగా మారిపోతాం. తద్వారా ఎక్కువగా తినడం.. ప్రధానంగా కార్బొహైడ్రేట్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకుని.. ప్రోటీన్ ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం కూడా జరుగుతుందని ఈ అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా ఇతరులతో కలవడంపై దీని ప్రభావం ఉంటుందని అంటున్నారు. దీంతో ఇంటికే పరిమితమై మానసికంగా ఇబ్బంది పడతారని లీవైన్ స్పష్టం చేశారు. ఎస్ఏడీ అనేది కేవలం మానసిక స్థితి మాత్రమే కాదని అంతకుమించి ఏకాగ్రతను కూడా దెబ్బతీస్తుందని ఆయన పేర్కొంటున్నారు. జ్ఞాపకశక్తి వంటి సమస్యలతో పాటు మన పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. ఈ సిండ్రోమ్ మన ఉచ్ఛారణలో సరైన పదాలు పలకలేకపోవడంతో పాటు.. సరైన సమాచారం కూడా సకాలానికి గుర్తుకురాకపోవడం జరుగుతుందని ఆయన చెబుతున్నారు. సూర్యరశ్మి లేదా లైట్ థెరపీసీజనల్గా వచ్చే ఈ సిండ్రోమ్కు సాధారణంగా డోపమైన్ స్థాయిని పెంచే యాంటీ డిప్రెసెంట్స్ మందులను వాడతారు. అయితే, దీనికంటే మంచి మందు ఏమిటంటే.. ప్రతిరోజూ అరగంట పాటు సూర్యుడి ఎండ తగిలేలా ఉండటమేనని హోవార్డ్ లీవైన్ చెబుతున్నారు. అది కూడా ఉదయం 10 గంటలలోపు అరగంటపాటు సూర్యుడి ఎండ తగిలేలా ఉంటే ఈ సిండ్రోమ్ నుంచి బయటపడవచ్చని ఆయన జరిపిన అధ్యయనంలో తేలింది. ఒకవేళ చలికాలంలో వాతావరణ ప్రభావంతో సూర్యరశ్మి లేనిపక్షంలో లైట్ థెరపీని ఆయన సూచిస్తున్నారు. తెల్లని కాంతిని ఉత్పత్తి చేసే లైట్ బాక్సులను కొనుగోలు చేసి ఉపయోగించడమే ఈ లైట్ థెరపీ. ఆన్లైన్లో ఈ లైట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయి. మీ లైట్ బాక్స్లో 10,000 లక్స్ (‘లక్స్’ అంటే నిర్దేశిత ప్రదేశంలో ఎంతమేర లైట్ పడుతుందని తెలిపేది. దీనిని కాంతి తీవ్రత/కాంతి ప్రకాశం అని పేర్కొంటారు) ఎక్స్పోజర్ ఉండాలి. సాధారణంగా సూర్యుడు బాగా ప్రకాశించే సమయంలో 50 వేల కాంతి ప్రకాశాలు ఉంటాయి. అందులో పదో వంతు కాంతి తీవ్రత ఉండేలా చూసుకుంటే చాలని ఆయన స్పష్టం చేస్తున్నారు. -
చలి కాలంలో వర్షం.. అనుకూలమా? ప్రతికూలమా?
దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. శీతాకాలంలో వర్షాలు కురవడం విచిత్రంగా అనిపిస్తుంది. ఇటువంటి వాతావరణంలో పొగమంచు పెరిగేందుకు అవకాశం ఉంటుందని, చలి తీవ్రత కూడా పెరుగుతుందని కొందరు అంటుంటారు. సాధారణంగా వేసవికాలంలో వర్షం కురిస్తే వాతావరణం చల్లగా మారి, మనకు హాయినిస్తుంది. అలాగే వాతావరణంలో తేమ శాతాన్ని పెంచుతుంది. మరి శీతాకాలంలో వర్షం పడినప్పుడు ఏమి జరుగుతుంది?మనదేశంలో శీతాకాలంలో వర్షాలు పడటం అనేది అతి అరుదుగా జరుగుతుంటుంది. అయితే ఈ వర్షాలుకు రుతుపవనాలకు ఏమాత్రం సంబంధం లేదు. భారత్తో చలికాలంలో వాయువ్య దిశ నుండి వచ్చే గాలులు గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. వీటిని వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ అంటారు. ఈ గాలులు పశ్చిమాన మధ్యధరా సముద్రం నుండి వస్తాయి. ఈ గాలుల కారణంగా వాతావరణంలో అల్ప పీడనం ఏర్పడుతుంది. ఫలితంగా వర్షాలు కురుస్తాయి.ఉష్ణోగ్రతలపై ప్రభావంభారతదేశంలో హిమాలయ ప్రాంతాలలో కురుస్తున్న మంచు కారణంగా ఏర్పడే చలి మైదాన ప్రాంతాల వరకూ వ్యాపిస్తుంది. శీతాకాలంలో వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ, ఈ సమయంలో కురిసే వర్షం వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది. ఈ వర్షం కారణంగా ఉత్తర, మధ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. గాలిలో తేమ పెరుగుతుంది. ఈ రెండింటి కలయిక కారణంగా చలి మరింతగా పెరుగుతుంది. మంచు కురుస్తున్న ప్రాంతాల్లో ఒకవేళ వర్షం పడితే, అక్కడ చలి తగ్గుతుంది. చాలా చల్లగా ఉండే ప్రాంతాల్లో, కురిసే వర్షపు నీరు ఉష్ణోగ్రతను పెంచడంలో సహాయపడుతుంది. ఇది ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుగుతుంది. అయితే అత్యంత అరుదుగా ఇది జరుగుతుంది. శీతాకాలంలో కురిసే తేలికపాటి వర్షం ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోకుండా కాపాడుతుంది.గాలిలో తేమశాతం పెరిగి..ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో వర్షం కారణంగా, గాలిలో తేమశాతం చాలావరకూ పెరుగుతుంది. పొగమంచు కూడా పెరుగుతుంది. మరోవైపు ఇప్పటికే పొగమంచు ఉన్న ప్రాంతాల్లో, వర్షాలు కురిస్తే పొగమంచు తగ్గుతుంది. చలికాలంలో కురిసే వర్షాల వల్ల ఒక ప్రయోజనం ఉంది. ఢిల్లీ ఎన్సీఆర్ వంటి ప్రాంతాలలో కాలుష్యాన్ని తగ్గించడంలో, గాలి నాణ్యతను మెరుగుపరచడంలో వర్షాలు ఎంతో ఉపయోగపడతాయి. శీతాకాలంలో కురిసే వర్షాలు గాలిలోని కాలుష్య కారకాలను కడిగివేస్తాయి. ఇది గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. పొగ, కాలుష్యం అధికంగా ఉండే నగరాల్లో వర్షం వల్ల కాలుష్యం తగ్గుతుంది. ఉత్తర భారతదేశంలో కురిసే శీతాకాలపు వానలు చలి గాలులను పెంచవు. వర్షం పడితే అది ఖచ్చితంగా చలిని కొంతవరకు ప్రభావితం చేస్తుంది. కానీ చలిగాలులను నియంత్రింపజేయదు. చలికాలంలో కురిసే వర్షం చల్లదనాన్ని తగ్గించడమనేది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఇటువంటి వర్షం గాలిలో తేమను, చల్లదనాన్ని పెంచుతుంది. అదే సమయంలో కలుషితమైన గాలిని తగ్గిస్తుంది. ఇది కూడా చదవండి: Year Ender 2024: చిన్న పొరపాట్లు.. పెను ప్రమాదాలు -
చికాగోలో నాట్స్ వింటర్ క్లాత్ డ్రైవ్
భాషే రమ్యం.. సేవే గమ్యం నినాదం తో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. చికాగోలో పేదవారి కోసం ముందడుగు వేసింది. గడ్డ కట్టే చలిలో పేదలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వారి కోసం వింటర్ క్లాత్ డ్రైవ్ నిర్వహించింది. ఈ డ్రైవ్ ద్వారా చలికాలంలో వేసుకునే స్వెట్టర్లు, కోట్లు సేకరించింది. చిన్ననాటి నుంచే విద్యార్ధుల్లో సామాజిక సేవ అనేది అలవాటు చేసేందుకు ఈ వింటర్ డ్రైవ్ని నాట్స్ ఎంచుకుంది. చికాగో నాట్స్ సభ్యులు, తెలుగు కుటుంబాలకు చెందిన వారు ఈ వింటర్ క్లాత్ డ్రైవ్లో స్వెట్టర్లు, కోటులు, బూట్లు విరాళంగా ఇచ్చారు.. నాట్స్ చికాగో బృందం ఇలా సేకరించిన వాటిని చికాగోలోని అరోరా ఇల్లినాయిస్లో ఉన్న గుడ్ విల్ సంస్థకు విరాళంగా అందించింది. గుడ్విల్ సంస్థ నిరాశ్రయులకు, పేదలకు చలికాలంలో వారికి కావాల్సన సాయం చేస్తుంటుంది. నాట్స్ నిర్వహించిన వింటర్ క్లాత్ డ్రైవ్లో పాల్గొన్న చిన్నారులను నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అభినందించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సేవా పథం వైపు నడిపిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు. థ్యాంక్స్ గివిండే సందర్భంగా నాట్స్ చికాగో విభాగం చేపట్టిన వింటర్ క్లాత్ డ్రైవ్ సామాజిక సేవలో నాట్స్ వేసిన మరో ముందడుగు అని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. ఈ డ్రైవ్లో పాల్గొన్న నాట్స్ చికాగో బృంద సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.నాట్స్ వింటర్ క్లాత్ డ్రైవ్ కార్యక్రమాన్ని నాట్స్ చాప్టర్ కోఆర్డినేటర్లు హవేల మద్దెల, బిందు వీడులమూడి, లక్ష్మి బొజ్జ, రోజా సీలంశెట్టి, చంద్రిమ దాడి, సిరిప్రియ బాచు, భారతి కేశనకుర్తి, భారతి పుట్ట, సింధు కాంతంనేని, ప్రియాంకా పొన్నూరు, వీర తక్కెలపాటి, అంజయ్య వేలూరు, ఈశ్వర్ వడ్లమన్నాటి తదితరులు చక్కటి ప్రణాళిక, సమన్వయంతో నిర్వహించారు. వింటర్ క్లాత్ డ్రైవ్ విజయంలో కీలక పాత్ర పోషించిన వాలంటీర్లు సుమతి నెప్పలాలి, రాధ పిడికిటి, బిందు బాలినేని, రామ్ కేశనకుర్తి, పాండు చెంగలశెట్టి, ప్రదీప్ బాచు, బాల వడ్లమన్నాటి, వీర ఆదిమూలం, రాజేష్ వీడులమూడి, శ్రీకాంత్ బొజ్జ, గోపీ ఉలవ, గిరి మారిని, వినోత్ కన్నన్, అరవింద్ కోగంటిలకి చికాగో నాట్స్ చాప్టర్ కోఆర్డినేటర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు శ్రీనివాస్ పిడికిటి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్కే బాలినేని, హరీష్ జమ్ముల, ఎమాన్యూల్ నీల, కిరణ్ మందాడి, రవి తుమ్మల, కిషోర్ నారె, మురళి మేడిచర్ల, రాజేష్ కాండ్రు మరియు బోర్డ్ సభ్యులుగా ఉన్న ముర్తి కోప్పాక, మహేశ్ కాకర్ల, శ్రీనివాస్ అరసాడ , శ్రీనివాస్ బొప్పాన, డా. పాల్ దేవరపల్లిలు ఈ వింటర్ క్లాత్ డ్రైవ్కు తమ మద్దతు, సహకారం అందించినందుకు నాట్స్ చికాగో విభాగం ధన్యవాదాలు తెలిపింది.(చదవండి: టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'' 209 వ సాహిత్య సదస్సు) -
Snowfall Destinations: అత్యధిక మంచు కురిసే ప్రాంతాలివే..
భారతదేశంలోని ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో ప్రస్తుతం విపరీతంగా మంచుకురుస్తోంది. దీంతో పర్యాటకులు ఆ మంచుతో కూడిన ప్రాంతాలను చూసేందుకు క్యూ కడుతున్నారు. ఆ మంచులో చాలాసేపు ఆడుకోవాలని తహతహలాడుతున్నారు. మరి ప్రపంచంలో అత్యధికంగా మంచుకురిసే ప్రాంతాలు ఎక్కడున్నాయో తెలుసా?నూతన సంవత్సరం ప్రారంభంలో ప్రపంచంలోని పలు దేశాల్లో మంచు కురుస్తుంటుంది. అయితే కొన్ని ప్రాంతాలు భారీ హిమపాతం కారణంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఈ సమయంలో టూరిస్టులు ఆయా ప్రాంతాలకు తరలివచ్చి, తనివితీరా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ ప్రాంతాలేవో, ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.మౌంట్ డెనాలి, అలాస్కా ఉత్తర ధ్రువానికి సమీపంలోని అందమైన ప్రాంతం అలస్కా(Alaska). ఇది అమెరికాలో ఉంది. హిమపాతానికి ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాస్కాలో ఏడాది పొడవునా మంచు కురుస్తుంటుంది. అయితే శీతాకాలంలో డెనాలి పర్వతంపై హిమపాత దృశ్యం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.వెర్ఖోయాన్స్క్ అండ్ ఐమ్యాకాన్, రష్యారష్యాలోని వెర్కోయాన్స్క్, ఐమ్యాకాన్లు ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందాయి. శీతాకాలంలో వెర్ఖోయాన్స్క్లో ఉష్ణోగ్రత -48 డిగ్రీల సెల్సియస్ వరకుచేరుకుంటుంది. ఐమ్యాకాన్(iMacon)లో ఉష్ణోగ్రత -71 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుంది. అందుకే ప్రతీయేటా నూతన సంవత్సరంలో హిమపాతాన్ని చూసేందుకు పర్యాటకులు రష్యాకు తరలివస్తుంటారు.ఫ్రేజర్, కొలరాడోకొలరాడో అమెరికాలోని రెండవ అత్యంత శీతల ప్రదేశంగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా శీతాకాలంలో కొలరాడోలో భారీ హిమపాతంతో పాటు, తెల్లటి మంచు పలకలు కనిపిస్తాయి. కొలరాడోలోని ఫ్రేజర్లో మంచు కురుస్తున్న దృశ్యం టూరిస్టులను సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యేలా చేస్తుంది.మిన్నెసోటా అండ్ యుకాన్, అమెరికాఅమెరికాలోని మిన్నెసోటాలో గల అంతర్జాతీయ జలపాతం(International Falls) ప్రపంచంలోని అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటిగా గుర్తిస్తారు. ఈ జలపాతాన్ని ‘ఐస్ బాక్స్ ఆఫ్ ది నేషన్’ అని కూడా పిలుస్తారు. అమెరికాలోని యుకాన్లో గల స్నాగ్ అనే చిన్ని గ్రామం కూడా భారీ హిమపాతానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.ఉలాన్బాతర్, మంగోలియామంగోలియా రాజధాని ఉలాన్బాతర్ ప్రపంచంలోని అత్యంత శీతల ప్రదేశాలలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. శీతాకాలంలో ఇక్కడి ఉష్ణోగ్రత -16 డిగ్రీల సెల్సియస్కి పడిపోతుంది. ఫలితంగా భారీగా హిమపాతం కురుస్తుంది.ఇది కూడా చదవండి: భారత్పై ‘బంగ్లా’ విషం.. ఈ అంశాలతో స్పష్టం -
సుదీర్ఘ రాత్రికి కారణమేమిటి?
ఈ ఏడాది డిసెంబర్ 21కి ఓ ప్రత్యేకత ఉంది. పగటి సమయం 8 గంటలూ, రాత్రి సమయం 16 గంటలూ ఉంటుందని అంటున్నారు. కానీ, పదమూడున్నర గంటలే ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం.సాధారణంగా ప్రతిరోజూ మనకు 12 గంటల పగలు 12 గంటలు రాత్రి సమయం ఉంటుంది. అయితే రుతువులను బట్టి, భూమిపై ఉన్న ప్రాంతాన్ని బట్టి పగలు – రాత్రుల సమయంలో ఎక్కువ తక్కువలూ ఉంటాయి. భూమి ఇరుసు 23.4ని కోణంలో వంగి ఉండటం వలన సూర్యుని నుండి వెలువడే సూర్యకాంతి భూమిపైన సమానంగా కాకుండా వివిధ కాలాలలో వివిధ రీతుల్లో పడుతుంది. ఫలితంగా రాత్రి–పగలు సమయాల్లో ఒక్కోసారి ఎక్కువ తేడాలు వస్తాయి. దీన్నే ‘ఆయనాతం’ అంటారు.సంవత్సరంలో రెండుసార్లు అయనాతం ఏర్పడుతుంది. మొదటిది వేసవి కాలపు ఆయనాతం కాగా, రెండవది శీతాకాలపు ఆయనాతం. శీతాకాలపు ఆయనాతం డిసెంబర్ 19–23 తేదీల మధ్యలో ఏదో ఒక రోజు ఏర్పడుతుంది. ఈరోజు మనం చూసేది శీతాకాలపు అయనా తాన్నే. ఇదే సమయంలో ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో పగలు ఎక్కువగా ఉండి రాత్రి తక్కువగా ఉంటుంది. శీతకాల ఆయనాతంతో భూమి ఉత్తరాయణం ప్రారంభిస్తుంది. అంటే... సూర్యుడు ఉత్తర దిశ వైపుకు కదలడం ప్రారంభిస్తాడు. అదే క్రమంలో జనవరి నుండి పగలు సమయం క్రమంగా పెరుగుతూ రాత్రి సమయం క్రమంగా తగ్గుతుంది.చదవండి: పురాతన నిధిలో గ్రహాంతర పదార్థాలు..!అయనాతం వంటి వాటిని ఆసరా చేసుకుని కొంతమంది ప్రత్యేక పూజలు చేస్తామంటూ కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేసే అవకాశం ఉంది. గ్రహణం ఏర్పడడం, ఆయనాతం ఏర్పడడం, నెలలో ఒకసారి పౌర్ణమి, ఒకసారి అమావాస్య ఏర్పడడం... ఇవన్నీ ప్రకృతిలో చోటు చేసుకునే సహజ ప్రకియలు. శాస్త్రీయ సమాచారాన్ని అర్థం చేసుకుని మోసగాళ్ల పాలబడకుండా జాగ్రత్తగా ఉండాలి. మూఢనమ్మకాలను నిర్మూలించి శాస్త్రీయ సమాజం నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.– చార్వాక, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నేషనల్ కోఆర్డినేటర్ -
ఓవైపు చలి మరోవైపు ఆకలి
శీతాకాలం.. అంటేనే భూమిమీద ఉత్తరార్థ గోళానికి పండుగ వాతావరణం. ప్రపంచంలో మూడోవంతు జనాభా ఇప్పుడు హాలిడే సీజన్ కోసం సిద్ధమవుతోంది. ఉత్తరార్థగోళ చలి ప్రభావాన్ని నేరుగా చవిచూస్తే గాజా స్ట్రిప్ మాత్రం వేడుకలకు దూరంగా ఆకలితో పోరాటం చేస్తోంది. చుట్టూ ఉన్న ప్రపంచమంతా పండుగకు సిద్ధమవుతుంటే క్షిపణుల మోతలు, బాంబుల దాడులతో ధ్వంసమైన గాజా నిరాశ, ఆకలితో మరణపు అంచున ఒంటరిగా నిలబడింది. ఉత్తరార్ధ గోళంలోకి వచ్చిన శీతాకాలం గాజాలో మరింత విషాదాన్ని తెచ్చిపెట్టింది. చల్లని వాతావరణం, వర్షం గాజాలో నిరాశ్రయులైన 20 లక్షల మంది పాలస్తీనియన్ల జీవితాలను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టింది. ఇప్పటికే పలుమార్లు భారీ వర్షం కురిసింది. నిర్వాసితుల గుడారాలు వరదనీటిలో చిక్కుకుపోయాయి. కొన్ని కూలిపోయాయి. ఇది వేలాది నిరుపేద కుటుంబాలను మరింత కష్టాల్లోకి నెట్టింది. బాంబు దాడుల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఇళ్ల నుంచి కేవలం కట్టుబట్టలతో బయటపడ్డారు. కొందరు శిథిలాల నుంచి బట్టలు తెచ్చుకున్నారు. కానీ అత్యధిక శాతం పాలస్తీనియన్లకు ఆ అవకాశం లేకుండాపోయింది. చలికాలం రావడంతో ఒంటిని వెచ్చగా ఉంచే సరైన దుస్తులులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కనీసం చెప్పులు కూడా కొనుక్కోలేని దుస్థితి. ఆకాశాన్నంటుతున్న ధరలు ప్రస్తుతం అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం ఒక కొత్త గుడారం 1,000 డాలర్ల వరకు ఉంటుంది. ఒక తాత్కాలిక షెల్టర్ వందల డాలర్లు ఖర్చవుతుంది. ఒక కొత్త దుప్పటి 100 డాలర్ల వరకు ఉంటుంది. బట్టల ధరలు మరింత పెరిగిపోయాయి. ఒక లైట్ పైజామా ధర ఇప్పుడు 95 డాలర్లు. ఒక కోటు వంద డాలర్లు. ఒక జత బూట్లు 75 డాలర్లు. చలి కాచుకోవడానికి సరిపడా ఇంధనం లేదు. ఇక 8 కిలోల గ్యాస్ ధర 72 డాలర్లకు చేరుకుంది. కలప ధర కొంచెం తక్కువ. కానీ పునరావాస శిబిరాల్లో ఉన్న ఎవరి దగ్గరా అంత డబ్బు లేదు. విపరీతమైన డిమాండ్ను తీర్చడానికి గాజా అంతటా సెకండ్ హ్యాండ్ దుస్తుల మార్కెట్లు వెలిశాయి. అక్కడా ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రబలుతున్న వ్యాధులు వెచ్చగా ఉంచేందుకు బట్టలు, ఇంధనం లేకపోవడంతో శీతాకాలంలో జలుబు, ఫ్లూ, ఇతర వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇవి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. పోషకాహార లోపంతో బలహీనపడిన శరణార్థుల శరీరాలు విపరీతమైన భయం, బాంబుల గాయాలతో అలసిపోయాయి. అందుకే సాధారణ జలుబును కూడా వాళ్లు తట్టుకోలేక ఊరకనే జబ్బు పడుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు కూడా అరకొరగా పనిచేస్తున్నాయి. బాంబు దాడిలో తీవ్రంగా గా యపడిన వారికి మాత్రమే వైద్యం అందుతోంది. ఔషధాలు, సిబ్బంది కొరతతో సాధారణ రోగాలకు వైద్యం అందించలేకపోతున్నాయి. పరిశుభ్రత దాదాపు అసాధ్యంగా మారడంతో వ్యాధులు వేగంగా ప్రబలుతున్నాయి. చలివాతారణంలో సరైన విద్యుత్, ఇతరత్రా వసతులు ఏక గుడారాల్లో నిర్వాసితులు సరిగా స్నానం చేయలేక తిప్పలు పడుతున్నారు. చివరకు చేతులు కూడా శుభ్రంగా కడుక్కోలేని దైన్యం వాళ్లది. అత్యంత విలాసం.. రొట్టె ముక్క అక్టోబర్ నుంచి గాజాలోకి వచ్చే అంతర్జాతీయ మానవతా సహాయం కూడా చాలా తగ్గిపోయింది. గాజా స్ట్రిప్ మొత్తం వినాశకరమైన కరువును ఎదుర్కొంటోంది. డిమాండ్ పెరిగి సరకు రవాణా బాగా తగ్గిపోవడంతో ధరలు విపరీతంగా పైకి ఎగశాయి. ఒక బస్తా పిండి ధర ఇప్పుడు ఏకంగా 300 డాలర్లకు పైనే ఉంది. ఇతర ఆహార పదార్థాలు కూడా ప్రియమైపోయాయి. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వేట మాంసం, కోడి మాంసం కోరుకోవడం చాలా పెద్ద అత్యాశ కిందే లెక్క. ఒకప్పుడు కుటుంబాలకు జీవనాడి అయిన బేకరీలు ఇప్పుడు ముడి సరుకులు అందక మూతపడ్డాయి. ఒక రొట్టె దొరకడమే చాలా కష్టంగా మారింది. పిండి దొరికినా అది పురుగులమయం. ఒకవేళ పురుగులు లేకుంటే అప్పటికే అది ముక్కిపోయి ఉంటోంది. దీంతో ప్రజలు ఇప్పుడు తకాయా(ఛారిటీ సూప్ కిచెన్ల)పై ఆధారపడవలసి వస్తోంది. ఉదయం 11:00 గంటలకు ఇవి తెరిచే సమయానికి పంపిణీ కేంద్రాల ముందు జనం చాంతాడంత వరసల్లో క్యూ కడుతున్నారు. వేలాది మంది శరణార్థుల కుటుంబాలకు తమ పిల్లలను పోషించడానికి ఇవి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. భరించలేని మానసిక వేదన ఆకలి శారీరక బాధే అయినా మానసిక వేదన అంతులేకుండా ఉంది. 2 లక్షలకు మందికి పైగా పిల్లలు పోషకాహార లేమితో బాధపడుతున్నారు. సరైన పౌష్టికాహారం లేక చిన్నారుల శరీరాలు ఎముకల గూడులాగా తయారయ్యాయి. వందలమంది చిన్నారులు సరైన తిండితిప్పలు లేక అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. పిల్లలకు సరైన తిండికూడా పెట్టలేకపోతున్నామన్న బాధ తల్లిదండ్రులను విపరీతంగా వేధిస్తోంది. ఆకలితో చచ్చిపోతున్న పిల్లలను చూసి నిస్సహాయంగా కుమిలిపోతున్నారు. కన్నపిల్లలు కడతేరిపోతుంటే కన్నవారి కష్టాలకు హద్దుల్లేకుండా పోయిది. అత్యంత క్రూరమైన ఈ పరిస్థితులను దూరం నుంచి చూస్తున్న పశి్చమదేశాలు నిశ్శబ్దంగా ఉండటం మరింత దారుణం. భూతలంపై నడిమధ్యలోనే ఉన్నా చలి, ఆకలితో పాలస్తీనా సమాజం ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ మరణంకోసం ఎదురుచూస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫోన్లూ వణుకుతాయ్
ఎండలకు రాళ్లు కూడా పగులుతాయని విన్నాం. కానీ.. చలికి ఫోన్లు సైతం పగిలిపోతాయట. వేసవితో పోలిస్తే శీతాకాలంలో స్మార్ట్ఫోన్లు కిందపడితే స్క్రీన్లు అత్యంత సులభంగా పగిలిపోతాయని ఎలక్ట్రానిక్ నిపుణులు చెబుతున్నారు. ఫోన్లతో పాటు స్మార్ట్ వాచ్లు, ల్యాప్టాప్లు, కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల పనితీరుపై చలి తీవ్ర ప్రభావాన్నే చూపుతాయని పేర్కొంటున్నారు. చలికాలం వచ్చిందంటే చాలామంది ఆరోగ్య విషయాల్లో అనేక జాగ్రత్తలు తీసుకుంటారని.. ఇకపై చలికాలంలో స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ల్యాప్టాప్లు, కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, అమరావతివిలువైన డేటా కోల్పోయే అవకాశంప్రస్తుత డిజిటల్ యుగంలో ఏ సమాచారమైనా పేపర్ డాక్యుమెంట్ల రూపంలో భద్రపరుచుకోవడం కంటే.. వాటిని ఫోన్లు లేదా వ్యక్తిగత కంప్యూటర్లు, ల్యాప్టాప్లలో సేవ్ చేసుకుని భద్రపరచుకుంటుంటాం. అయితే ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లలో ఉండే హార్డ్ డ్రైÐవ్లు కొన్ని సందర్భాల్లో విపరీతమైన చలికి ప్రభావితమై పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. దీంతో హార్డ్ డ్రైవ్లలో మాత్రమే నిక్షిప్తమై ఉండే మన విలువైన సమాచారం, డాక్యుమెంట్లను పూర్తిగా తిరిగి చూడడానికి వీలులేని విధంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లు, ల్యాప్టాప్లను ఉపయోగించేవారు తాము వాడేవి కొత్తవి కదా అని అజాగ్రత్త ఉండొచ్చు. కానీ, కొత్తవి అయినంత మాత్రాన చలికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకోవడం కేవలం అపోహేనట. కొత్త ఎల్రక్టానిక్ పరికరాలు కూడా విపరీతమైన చలి పరిస్థితుల్లో వాటి పనితీరు తగ్గుముఖం పట్టవచ్చని నిఫుణులు పేర్కొంటున్నారు.చలి విపరీతంగా ఉంటే ఫోను ఆగిపోయే ఛాన్స్» ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ల్యాప్టాప్ల ఎల్సీడీ, ఓఎల్ఈడీ స్కీన్లు నిదానంగా పనిచేయడం వల్ల ఆ సమయంలో వాటిని ఉపయోగిస్తున్నప్పుడు ఆ పరికరాల స్కీన్లపై కనిపించే బొమ్మలు, అక్షరాల నాణ్యత, స్పష్టత సరిగా ఉండకపోయే అవకాశం ఉంది. » ప్రమాదవశాత్తు స్మార్ట్ ఫోను వంటివి కిందపడితే వేసవి కాలంలో కంటే శీతాకాలంలో వాటి స్క్రీన్లు అత్యంత సులభంగా పగిలిపోతాయి. » ఎలక్ట్రానిక్ పరికరాలను వేలిముద్రల గుర్తింపు, ముఖ గుర్తింపు ద్వారానే త్వరగా అన్, ఆఫ్ అయ్యేలా పెట్టుకుంటాం. కానీ.. ఎక్కువ చలి సమయంలో సెన్సార్ విధానం సరిగా పనిచేయక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. స్మార్ట్వాచ్లు, ఫిట్నెస్ బ్యాండ్లు వంటి ధరించగలిగేవి విపరీతమైన చలిలో కచి్చతమైన రీడింగ్లను తెలపలేవు. » కంప్యూటర్లు, ల్యాప్టాప్లో ఉపయోగించే హార్డ్ డ్రైవ్లు చలి ప్రభావంతో ఆలస్యంగా ఓపెన్ కావడం వంటి పరిస్థితులు తలెత్తుతాయి. » ఎల్రక్టానిక్ వస్తువులలో ఉండే సున్నితమైన, అతి సున్నితమైన సర్క్యూట్లు చలికి తుప్పు పట్టే అవకాశం ఉండటంతో ఆయా వస్తువులు పూర్తిగా పనిచేయకుండా పోయే అవకాశం ఏర్పడుతుంది. » కెమెరాలు సైతం చలి తగ్గి ఎండ పెరిగే కొద్దీ వాటి అద్దాలపై పొరగా ఏర్పడే పొగమంచు ఫొటోల్లోని బొమ్మ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. » ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ల్యాప్టాప్లలో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలు చల్లని ఉష్ణోగ్రతలలో పేలవంగా పనిచేస్తాయని, విపరీతమైన చలిలో బ్యాటరీ తాత్కాలికంగా పనిచేయడం ఆగిపోవచ్చు లేదా శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉంది. » స్మార్ట్వాచ్లు, ఇయర్ బడ్లు వేగంగా బ్యాటరీ నష్టానికి గురికావడంతో అవి పనిచేయడంలో ఎక్కువగా అవాంతరాలు ఏర్పడే వీలుంది. » ఎలక్రానిక్ పరిరకాలకు ఉపయోగించే గాజు, ప్లాస్టిక్ వంటివి చలికి పెళుసుబారి చిన్న ఒత్తిడికే పగుళ్లు లేదా విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఇలా చేయడం బెటర్» చలికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వ్యక్తిగతంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో.. ఎల్రక్టానిక్ పరికరాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని నిఫుణులు సూచిస్తున్నారు. » శీతాకాలంలో ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ల్యాప్టాప్లకు సాధారణ కన్నా ఎక్కువసార్లు చార్జింగ్ పెడుతూ ఉండాలి. ఎక్కువ కాలం పాటు గడ్డకట్టే చలికి పరికరాలను బహిర్గతం చేయకుండా ఉంచాలి. తప్పనిసరిగా బయటకు తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు చలి సోకని కవర్లలో వాటిని ఉంచాలి.» చలికాలంలో స్మార్ట్ ఫోన్లు సహా అన్ని ఎల్రక్టానిక్ వస్తువులను ఆరుబయట చలిలో ఎక్కువ సమయం వినియోగించాల్సి వస్తే.. ఇంటికి చేరుకోగానే వాటిని శుభ్రం చేయడం మంచిదని సూచిస్తున్నారు. » చల్లటి పరిస్థితులను తట్టుకునేలా రూపొందించిన ఎల్రక్టానిక్ పరికరాలను కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. -
చలికాలంలో గీజర్లు వాడుతున్నారా ? జాగ్రత్తలు పాటించండి! లేదంటే ముప్పే!
ప్రస్తుతం చలి పులి పంజా విసురుతోంది. బారెడు పొద్దెక్కినా మంచంమీద నుంచి లేవాలంటే వణుకు పుడుతోంది. మరి ఈ చలినుంచి తప్పించుకోవాలంటే రూం హీటర్లు, గీజర్లు వాడడం అనివార్యమనే చెప్పాలి. అయితే ఇటీవల గీజర్లకు సంబంధించి కొన్ని విషాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో గీజర్ల వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అవేంటో చూద్దాం. గీజర్ల కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉత్తమ బ్రాండ్లను మాత్రమే ఎంచుకోవాలి. అంతేకాదు తొందరంగా నీళ్లు వేడెక్కాలంటే నాణ్యమైన గీజర్లను వాడాలి. గీజర్ను ఆన్ చేసి, స్నానం చేయడం కాకుండా, నీళ్లను బకెట్లో నింపుకొని, గీజర్ ఆఫ్ చేసిన స్నానానికి వెళ్లాలి. దీని కరెంట్ ఆదా అవుతుంది. ప్రమాదాలను చాలావరకు నివారించే అవకాశం ఉంది.గీజర్ ఎక్కువ సమయం ఆన్లో ఉండటం అంత మంచిదికాదు.అలాగే ఆటో కట్ఆఫ్ ఉన్న గీజర్లను ఎంచుకోవాలి. పొరపాటున గీజర్ ఆన్ చేసి మర్చిపోతే, పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. గీజర్లను తడి తగలకుండా ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. గీజర్కు గోడకు మధ్య ఖాళీ ఉండాలి.గీజర్లో ప్రెషర్ ఎక్కువ అయితే ఆ ఒత్తిడిని విడుదల చేయడానికి గీజర్లో వాల్వ్ ఉంచారో లేదో చెక్ చేసుకోవాలి. వాల్వ్లో ఏదైనా లోపం ఉందేమో ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. -
16గంటల.. సుదీర్ఘరాత్రి
తిరుపతి సిటీ: సాధారణంగా శీతాకాలంలో పగలు తక్కువగాను, రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది. ఏటా వేసవిలో భూమి సూర్యుడికి దగ్గరగా, శీతాకాలంలో భూమి సూర్యుడికి దూరంగా కక్ష్య దిశలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఏర్పడే ప్రక్రియనే వేసవి కాలపు అయనాంతం, శీతాకాలపు అయనాంతం అంటారు. ఈ ఏడాది శీతాకాలంలో డిసెంబర్ 21న వింత చూడబోతున్నాం. ఆ రోజు సుదీర్ఘమైన రాత్రి ఏర్పడనుంది. ఏకంగా 16 గంటల పాటు రాత్రి సమయం, 8గంటల పాటు పగలు సమయం మాత్రమే ఉంటుంది. ఇలా జరగడాన్ని శీతాకాల అయనాంతం (వింటర్ సోల్స్టైస్) అంటారు. సూర్యుడికి సుదూరంగా భూమి శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజున భూమి సూర్యుడికి దూరంగా ఉంటుంది. ఆ రోజున భూమి ధ్రువం వద్ద 23.5 డిగ్రీల వంపులో ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగా 2024లో అత్యంత తక్కువ సమయం పగలు ఉంటుంది. దీంతో సూర్యకాంతి 8 గంటలు, చంద్రుడి కాంతి 16 గంటల వరకు ఉంటుంది. భూమి తన అక్ష్యం వైపు తిరిగే సమయంలో దక్షిణ అర్ధగోళంలో భూమి, సూర్యుడి మధ్య దూరం గరిష్టంగా ఉంటుంది. ఆ సమయంలో ఏర్పడే దానినే అయనాంతరం అంటారు. సూర్యుడు మధ్యాహ్న సమయంలో ఆకాశంలో అత్యధిక లేదా అత్యల్ప స్థానానికి చేరుకున్నప్పుడు సూర్యుని చుట్టూ భూమి కక్ష్యలో ఉండే రెండు బింధువులను అయనాంతం అంటారు. దీని ఫలితంగా సంవత్సరంలో పొడవైన రోజు (వేసవి కాలపు అయనాంతం), అతి తక్కువ రోజు (శీతాకాలపు అయనాంతం) వస్తుంది. ఇది ఏటా రెండుసార్లు జరిగే ఘట్టం. సంవత్సరం పొడవునా, ఉత్తర లేదా దక్షిణ అర్ధగోళం సూర్యుని వైపు వంగి ఉంటుంది. వేసవి కాలపు అయనాంతం అనేది అత్యంత పొడవైన రోజు. అయనాంతంపై ప్రగాఢ నమ్మకాలు శీతాకాలంలో ఏర్పడే అయనాంతంపై పలు దేశాలలో పలురకాల నమ్మకాలను ప్రజలు పాటిస్తుంటారు. చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలలో బౌద్ధమతంలోని యన్, యాంగ్ శాఖకు చెందిన ప్రజలు ఐక్యత, శ్రేయస్సుకు ప్రతీకగా నమ్ముతూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్తర భారత్లో శ్రీకృష్ణునికి నైవేద్యం సమర్పించి, గీతాపారాయణం చేస్తారు. రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో పుష్య మాస పండుగను ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడి ఉత్తరాయణ ప్రక్రియ శీతాకాలపు అయనాంతం నుంచి మొదలవుతుంది. అందుకే మన దేశంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇదో వింత అనుభూతి భూ భ్రమణంలో భాగంగా సూర్యుడు, భూమి మధ్య దూరం ఏడాదిలో ఒక్కసారి పెరగడం, తగ్గడం జరుగుతుంటుంది. వేసవిలో సూర్యుడికి దగ్గరగానూ, శీతాకాలంలో సూర్యుడికి దూరంగా భూభ్రమణం జరుగుతుంటుంది. భూమి సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు వేసవి అయనాంతంగానూ, సూర్యుడికి సుదూరంగా భూభ్రమణం జరిగినప్పుడు శీతాకాలపు అయనాంతంగా పేర్కొంటారు. – నెహ్రూ, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, రీజినల్ సైన్స్ సెంటర్21న తగ్గనున్న ఉష్ణోగ్రతలు శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజు, తేదీ ఏటా మారుతూ ఉంటుంది. అయితే, కచి్చతంగా డిసెంబర్ 20 నుంచి 23 తేదీలలోపు మాత్రమే వస్తుంటుంది. ఈ ఏడాది 21వ తేదీన ఈ అరుదైన ఘట్టం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో సూర్యకిరణాలు అలస్యంగా భూమికి చేరుతాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతలలో మార్పులు సంభవించి, దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. -
6 జిల్లాల్లో శీతల గాలులు: పంటలను ఇలా రక్షించుకుందాం!
తెలంగాణా రాష్ట్రంలో వచ్చే రెండు రోజు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, ఉదయపు వేళల్లో దట్టంగా పొగమంచు ఆవరించే అవకాశం ఉందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయ వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా. పి. లీలారాణి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వివిధ పంటలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రైతులు ఈ కింది సూచనలు పాటించాలని డా. పి. లీలారాణి సూచించారు.వరి: తెలంగాణా జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాలలో 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. చలి ప్రభావంతో యాసంగి నారుమడుల్లో నారు ఎదగక పోవచ్చు. ఆకులు పసుపు, ఎరుపు రంగుల్లోకి మారవచ్చు. కొన్నిసార్లు నారు చనిపోవచ్చు. అందువల్ల రైతులు కొన్ని రక్షణ చర్యలు చేపట్టాలి. నారుమళ్ళపై ఇనుప చువ్వలు లేదా వెదురు కర్రలతో ఊతమిచ్చి పైన పలుచని పాలిథిన్ షీట్ లేదా ఖాళీ యూరియా బస్తాలతో తయారు చేసిన పట్టాలతో సాయంత్రం పూట కప్పి, మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి. రాత్రి వేళల్లో నారుమడిలో నీరు నిండుగా ఉంచి తెల్లవారుజామున తీసివేసి, కొత్త నీరు పెట్టాలి. ∙200 చదరపు మీటరు విస్తీర్ణం గల నారుమడికి ఆఖరి దుక్కిలో 2 క్వింటాళ్లు బాగా చివికిన కోళ్ళు లేదా గొర్రెల ఎరువు వేయాలి. విత్తే సమయంలో 1 కిలో నత్రజని, 1కిలో భాస్వరం, 1 కిలో పొటాషియం ఇచ్చే రసాయనిక ఎరువులు వేయాలి. వరి నారుమళ్ళలో జింక్ ధాతువు లోపం నివారణకు 2 గ్రా. జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.వరుసగా వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి లేదా ప్రతి యాసంగిలో దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ వేయాలి. చలి వాతావరణం, పొగమంచు వరిని అగ్గి తెగులు ఆశించటానికి అనుకూలం. పొలంలో, పొలంగట్లపైన ఉండే గడ్డి కలుపు మొక్కలు అగ్గి తెగులను వ్యాప్తి చేస్తాయి. కాబట్టి, పొలం గట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి. వరి నారుమళ్ళలో అగ్గి తెగులు గమనిస్తే, నివారణకు 0.5 గ్రా. ట్రైసైక్లాజోల్ లేదా 1.5 మి.లీ. ఐసోప్రొథైయోలిన్ లేదా 2.5 మి.లీ. కాసుగామైసిన్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్న: చలి వల్ల మొక్కజొన్నలో భాస్వరం లోపించి ఆకులు ఊదా రంగులోకి మారుతాయి. భాస్వరం లోప లక్షణాలు గమనించినట్లైతే నివారణకు 10 గ్రా. 19–19–19 లేదా డి.ఎ.పి మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.మిరప : ప్రస్తుత చలి వాతావరణం మిరపను బూడిద తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు, 3గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 1 మి.లీ. అజాక్సిస్ట్రోబిన్ లేదా 2.5గ్రా. టేబుకొనజోల్ + గంధకం లేదా 1.5గ్రా. కార్బండజిమ్ + మాంకోజేబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.మామిడి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో తేనెమంచు పురుగు, బూడిద తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు, 0.3గ్రా. డైనోటేఫురాన్ + 1గ్రా. కార్బండజిమ్ + 2.5 మి.లీ. వేపనూనె లేదా 0.5 గ్రా. థయోమిథాక్సామ్ + 2 మి.లీ. హెక్సాకొనజోల్ + 2.5 మి.లి వేప నూనె మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కుసుమ: నవంబర్లో విత్తుకున్న కుసుమ పంటకు పేనుబంక ఆశించే అవకాశం ఉంది. నివారణకు 2 మి.లీ. డైమిథోయెట్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
గరిటెడైనను చాలు.. గాడిద పాలు
సాక్షి, అమరావతి: ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’ అనే వేమన పద్యం ఇప్పుడు ‘గరిటెడైనను చాలు.. గాడిద పాలు’ అని రూపుమార్చుకుంది. ప్రస్తుత తరుణంలో కొన్ని వస్తువులకు, ఆహార పదార్థాలకు ఆదరణ అనూహ్యంగా పెరిగింది. అందులో భాగంగానే గాడిద పాలకు డిమాండ్ ఏర్పడింది. అయితే, గాడిద పాలు దొరకడం కష్టం. ఎక్కడోగానీ.. ఎవరికో గానీ గాడిదలు అందుబాటులో ఉండవు. ఈ పరిస్థితుల్లో ఇటీవల వీధుల్లోకి అప్పుడప్పుడు గాడిదల్ని తీసుకొచ్చి మన కళ్లముందే గాడిద పాలు పితికి ఇస్తున్నారు.తెలంగాణ నుంచి వచ్చి..తెలంగాణ నుంచి గాడిదలను కొన్ని కుటుంబాల వారు ఏపీకి తీసుకువస్తున్నారు. జూలైలోనే ఇక్కడికి జనవరి వరకూ ఇళ్లను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇక్కడే గాడిదలను పెంచుతున్నారు. శీతాకాలం వచ్చేసరికి గాడిదలు పిల్లల్ని కంటాయి. ఈ కాలంలోనే పాలనూ ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. తెలంగాణ నుంచి వచ్చిన వారంతా పాడి గాడిదను ఊరంతా తిప్పుతూ ఇంటింటికీ పాలను విక్రయిస్తుంటారు. రోజుకి మూడు కప్పులు చొప్పున మూడు రోజుల పాటు గాడిద పాలు తాగితే ఆరోగ్య సమస్యలు తొలిగిపోతాయని వీరు ప్రచారం చేస్తున్నారు.15 మిల్లీలీటర్లు.. రూ.100కేవలం 15 మిల్లీలీటర్లు (అర టీ కప్పు) గాడిద పాల ధర రూ.100 పలుకుతోంది. ఇళ్ల వద్దకు వచ్చే పాల విక్రయదారులు ముందుగా రూ.300 వరకూ ధర చెబుతున్నారు. బేరమాడితే రూ.100 నుంచి రూ.200 వరకూ తగ్గించి ఇస్తున్నారు. ఈ లెక్కన లీటరు గాడిద పాల ధర కనీసం రూ.7 వేలు వరకూ ఉంటోంది. అయితే ఇందుకోసం ఒక గాడిదను, దూడను పోషించడానికి ఏటా రూ.80 వేలు ఖర్చవుతుందని పెంపెకందారులు చెబుతున్నారు.ఎందుకంత డిమాండ్ఒక గాడిద రోజుకు అర లీటర్ నుంచి 1.30 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. తల్లి పాలలో ఉన్నట్టుగానే గాడిద పాలలోనూ పుష్కలంగా విటమిన్లు (ఏ, బీ1, బీ5, బీ6, బీ12, ఫోలిక్ ఆమ్లం) ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. చర్మ సౌందర్యానికి, శిశు పోషణ కోసం పూర్వం నుంచీ గాడిద పాలను వాడటమేనేది ఉంది. ఊపిరితిత్తుల్లో నిమ్ము, ఆయాసం, కఫం, జలుబు వంటి వాటికి గాడిద పాలు ఔషధంగా పనిచేస్తాయని నమ్ముతుంటారు. దీంతో గాడిద పాల వ్యాపారం బాగా జరుగుతోంది.రోజుకి రూ.2 వేల సంపాదన మాది తెలంగాణలోని మంచిర్యాల. మా తాత ముత్తాతల నుంచీ గాడిదలను పెంచడం, పాలను విక్రయించడం మా వృత్తి. 10 కుటుంబాల వాళ్లం ఏటా పిల్లాపాపలతో కలిసి గాడిదలను తీసుకుని ఏపీకి వస్తాం. స్థానికంగా ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటాం. ఇక్కడి ప్రధాన నగరాలు, పట్టణాల్లో గాడిద పాలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. బొంబాయ్ కాలనీలో ఉంటూ విజయవాడ వీధుల్లో పాలు విక్రయిస్తున్నాం. రోజుకి ఒక్కో గాడిద పాల ద్వారా రూ.2 వేల వరకూ ఆదాయం వస్తుంది. పిల్లలు పాఠశాలలకు వెళ్లే సమయానికంటే ముందే ఇళ్లకే వెళ్లి పాలు విక్రయిస్తుంటాం. అప్పుడే వ్యాపారం బాగుంటుంది. – జె.మహేష్, గాడిద పాల వ్యాపారి -
శీతాకాలంలో ఈ సూపర్ ఫుడ్తో అనేక సమస్యలకు చెక్
చలి కాలంలో శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. అందుకే ఈ సీజన్కు తగినట్టుగా మన ఆహార అలవాట్లు మార్చుకోవాలి. చలికాలంలో బాడీని వేడిగా ఉంచుకోవడంతోపాటు, కొవ్వులేని ఆహార పదార్థాలను తీసుకోవాలి. వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందించే చియా గింజలను వింటర్ సూపర్ ఫుడ్గా చెబుతారు ఆహార నిపుణులు. వీటిల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ముఖ్యంగా ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA)లో పుష్కలంగా లభిస్తాయంటున్నారు నిపుణులు. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె, మెదడు పనితీరును మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి.చియా సీడ్స్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు , మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని పలు రకాలుగా మన ఆహారంలో చేర్చుకోవచ్చు. ముఖ్యంగా చియా వాటర్, స్మూతీస్, యోగర్ట్స్, లలాడ్స్, పుడ్డింగ్ రూపంలో తీసుకోవచ్చు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి, మంటను తగ్గించడానికి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.చియా గింజల్లో ఎక్కువగా లభించే డైటరీ ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మంచి శక్తి నిస్తుంది.యాంటీఆక్సిడెంట్లతో నిండిన చియా విత్తనాలు పర్యావరణ కారకాలు, కాలానుగుణ హెచ్చుతగ్గుల వల్ల కలిగే సమస్యల్ని ఎదుర్కోవడంలో సహాయపడతాయి, రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలనుంచి ఉపశమనానికి తోడ్పడతాయి.అలాగే చలికాలంలో నీళ్లు ఎక్కువగా తాగుతాం కాబట్టి చియా గింజల వాటర్ తీసుకోవడం మంచిది. చియా విత్తనాలు హైడ్రోఫిలిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఫలితంగా శీతాకాలంలో శరీరంలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. చియా విత్తనాలు చర్మం తేమను కోల్పోకుండా కాపాడుతాయి. చర్మ సమస్యలను దూరం చేస్తాయి.హెర్బల్ టీ లేదా హాట్ చాక్లెట్ వంటి వేడి పానీయాలకు చియా సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు.ఒక గ్లాస్ నీటిలో, కొద్దిగా చియా గింజలు వేసి, రాత్రంతా నానబెట్టాలి. ఆ నీటిని ఉదయం పరగడుపునే తాగితే, రోజంతా హైడ్రేటెడ్గా ఉంటుంది. పీచు పదార్థం పుష్కలంగా అందుతుంది. తద్వారా జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మలబద్ధకం నుంచీ ఉపశమనం లభిస్తుంది.చియా గింజల్లో యాంటి ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడంలో సాయపడతాయి. ఇందులోని యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు కేన్సర్ లక్షణాలను తగ్గిస్తాయి. చియా పుడ్డింగ్: పాలలో (బాదం లేదా కొబ్బరి పాలతో కూడా) చియా గింజలను నానబెట్టి రాత్రంతా రిఫ్రిజిరేటర్లో ఉంచి, నచ్చిన మరికొన్ని పండ్ల ముక్కలను కలుపుకొని చియా సీడ్ పుడ్డింగ్ను చేసుకోవచ్చు. సౌందర్య పోషణలోనూ, జుట్టు సంరక్షణలో కూడా చియా గింజలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. -
చలికాలంలో బరువు పెరుగుతారెందుకు? అదుపులో ఉండేందుకు ఏం చేయాలి?
చలి వాతావరణంలో మన ఆహారపు అలవాట్లు మారుతుంటాయి. శీతాకాలంలో మనం వేడిగా ఉండే ఆహారపదార్థాలను అధికంగా తీసుకుంటుంటాం. ఫలితంగా శరీర బరువు పెరగడం మొదలవుతుంది. ఇది కొందరిలో ఆందోళనకు దారితీస్తుంది. అయితే చలికాలంలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం, నియమాలను పాటించడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. చలికాలంలో బరువు పెరగడానికి కారణాలేమిటో, ఏ విధంగా బరువును అదుపులో ఉంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.అదనపు కేలరీల తీసుకోవడంచలికాలంలో మనం ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటుంటాం. అతిగా టీ, కాఫీలు తాగడం, తీపి పదార్థాలు ఎక్కువగా తినడం మొదలైనవన్నీ బరువు పెరగడానికి కారణంగా నిలుస్తాయి. శీతాకాలంలో శరీరంలోని జీవక్రియ మందగిస్తుంది. ఫలితంగొ కొద్ది కేలరీలు మాత్రమే బర్న్ అవుతాయి.వ్యాయామం చేయకపోవడంచలికాలంలో చాలామంది వెచ్చగా పడుకోవాలని అనుకుంటారు. దీంతో రోజువారీ వ్యాయామాన్ని ఆపివేస్తారు. ఫలితంగా బరువు పెరగడం ప్రారంభమవుతుంది. దీనిని నివారించేందుకు వ్యాయామంపై దృష్టి పెట్టాలి.ప్రోటీన్ తీసుకోవడం ముఖ్యంఆహారంలో ప్రోటీన్ ఉండటం ముఖ్యం. ప్రొటీన్ వినియోగం జీవక్రియను పెంచుతుంది. కండరాలను నిర్మించడంలో కూడా సహాయపడుతుంది. పప్పులు, చేపలు, గుడ్లు, జున్ను ఇలా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.చక్కెర- ఉప్పు తగ్గించండిచలికాలంలో తీపిని ఎక్కువగా తినడం కూడా బరువు పెరగడానికి కారణంగా నిలుస్తుంది. అదనంగా తీసుకునే ఉప్పు కూడా బరువు పెరగడానికి కారణంగా నిలుస్తుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీరు చేరి బరువు పెరుగుతారు.ఫైబర్ కలిగిన ఆహారం ఉత్తమంపండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మొదలైన ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను శీతాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి. ఫలితంగా కడుపు చాలా కాలం పాటు నిండుగా ఉంటుంది. బరువు పెరిగేందుకు అవకాశమివ్వదు.తాగునీరు- సూప్చలికాలంలో నీరు ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల జీవక్రియ పెరుగుతుంది. ఆకలి తగ్గుతుంది. అలాగే చలికాలంలో వేడి వేడి సూప్ తాగడం మంచిది. తక్కువ కేలరీలు కలిగిన కూరగాయల సూప్ లేదా చికెన్ సూప్ తీసుకోవచ్చు.వ్యాయామం చేయండిచలికాలంలో వ్యాయామంపై తగిన శ్రద్ధ వహించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కేలరీలను బర్న్ చేయవచ్చు. బరువు తగ్గవచ్చు.ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు శీతాకాలంలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు తీసుకోవాలి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. ఈ తరహా కొవ్వులు అసంతృప్తమైనవి. ఫలితంగా గుండెకు కూడా మేలు కలుగుతుంది. ఆలివ్ ఆయిల్, అవకాడో, గింజధాన్యాలను తీసుకోవడం ఉత్తమం.ఇది కూడా చదవండి: నేడు గీతా జయంతి: రూపాయికే భగవద్గీతను అందిస్తూ.. గీతాప్రెస్ వందేళ్ల ఘన చరిత్ర -
చలికాలంలోనూ ‘ఎండలు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలికాలం కొనసాగుతున్నప్పటికీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే స్వల్పంగా పెరిగాయి. ఇటీవలి తుపానుతోపాటు బంగాళాఖాతంలో నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో రాష్ట్ర వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. వాతావరణంలో తేమ శాతం కూడా వేగంగా పెరిగింది. దీంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలోని చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ఖమ్మంలో అత్యధికంగా 33.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైంది. ఇది సాధారణం కంటే 4.5 డిగ్రీలు అధికం. అలాగే భద్రాచలం, హనుమకొండ, హైదరాబాద్, నిజామాబాద్లలో రెండు డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇక కనిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే రామగుండం, మెదక్, దుండిగల్లలో సాధారణం కంటే 7 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవడం గమనార్హం. మిగిలిన చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల నుంచి 7 డిగ్రీల వరకు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మరో మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
కిడ్స్పై కోల్డ్ వార్! 'పొడి' చెయ్యనియ్యొద్దు
చలికాలంలో చిన్నారుల చర్మాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. వాళ్లు చిన్నపిల్లలు కావడంతో తమ చర్మం గురించి ఎరుక, శ్రద్ధ వాళ్లలో ఉండదు. కానీ పిల్లల్లో ముఖం, పెదవులు పగలడం, కాళ్ల దగ్గరా పగుళ్లు రావడం వంటి అంశాలతో తల్లిదండ్రులు వారికోసం ఆందోళన పడుతుంటారు. ఇది చలికాలం కావడంతో టీనేజీ లోపు చిన్నారులకు వచ్చే చర్మ సమస్యల గురించి అవగాహన కోసం ఈ కథనం.చలికాలంలో చర్మం పొడిబారడం, పగుళ్లూ పిల్లలందరిలోనూ... ఆ మాటకొస్తే చాలామంది పెద్దవాళ్లలోనూ కనిపించేదే. కొందరు పిల్లల్లో జన్యుపరంగానే కొన్ని ప్రోటీన్లలోపం వల్ల చర్మం పొడిబారడం, ఎర్రబారడమన్నది ఎక్కువగా జరుగుతుంటుంది. మామూలుగా చర్మం బయటి కాలుష్యాలూ, వాతావరణం ప్రభావం, రాపిడి వంటి వాటి నుంచి రక్షణ కల్పిస్తుందన్నది తెలిసిందే. అయితే ఇలా పొడిబారి, ఎర్రగా మారడంతో.. కల్పించాల్సినంత రక్షణ కల్పించలేదు. ఇలా జరగడాన్ని ‘అటోపిక్ డర్మటైటిస్’గా చెబుతారు. అయితే ఈ సమస్య తీవ్రత అందరిలోనూ ఒకేలా ఉండక... చిన్నారి చిన్నారికి మారుతుంది. పిల్లల్లో సాధారణంగా కనిపించే ఈ చర్మ సమస్య, పరిష్కారాలు తెలుసుకుందాం. ఇటీవల వాతావరణంలో కాలుష్యాలు బాగా పెరగడం, పిల్లలు గతంలోలా ఆరుబయట మట్టిలో ఆడక΄ోవడం, అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడటం, తల్లిపాలకు బదులు డబ్బాపాలపై ఆధారపడటం, పిల్లలు సిజేరియన్ ప్రక్రియతో పుట్టడం వంటి కారణాలతో చిన్నారుల్లో వ్యాధి నిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) సరైనవిధంగా నియంత్రితం కావడం లేదు. దాంతో డాక్టర్లు పిల్లల్లో అటోపిక్ డర్మటైటిస్ను ఎక్కువగా చూస్తున్నారు.ఈ సమస్యలో మొదట చర్మం పొడిబారి, ఎర్రగా మారి దురద వస్తుంటుంది. పిల్లలు పదే పదే గీరుతుండటంతో చర్మం కాస్త మందంగా మారుతుంది. ఆ తర్వాత దురద మరింతగా పెరుగుతుంది. ఈ రెండు ప్రక్రియలూ ఒక సైకిల్ (ఇచ్–స్క్రాచ్ సైకిల్)లా నడుస్తుంటాయి. ఈ అటోపిక్ డర్మటైటిస్ అన్నది నెలల పిల్లలు మొదలుకొని, ఏడాది వయసు వారి వరకు కనిపించవచ్చుపిల్లల్లో 12 నెలల వయసు వరకు... ప్రభావితమయ్యే భాగాలుచర్మం ఎర్రబారడమన్నది ముఖంపై కనిపిస్తుంటుంది గాని నిజానికి చర్మంపై శరీరంలోని ఏ భాగంలోనైనా ఇలా జరగవచ్చు.΄పాకే పిల్లల్లో సాధారణంగా వాళ్ల మోకాళ్లు నేలతో ఒరుసుకు΄ోతుంటాయి కాబట్టి వీళ్లలో మోకాళ్ల వద్ద ఎటోపిక్ డర్మటైటిస్ కనిపిస్తుంటుంది.ఏడాదీ రెండేళ్ల పిల్లల్లో... ఈ వయసు పిల్లల్లో చర్మం ప్రభావితం కావడంమన్నది చర్మం ముడుతలు పడే ్ర΄ాంతాల్లో ఎక్కువ. రెండు నుంచి ఆరేళ్ల పిల్లల్లో...ఈ వయసు పొడిబారడం మోకాళ్ల కిందనున్న చర్మంలో చాలా ఎక్కువ. ముఖం మీద చర్మం పెద్దగా పగలదు. పెదవులు చీలినట్లుగా కావడం, కంటి చుట్టూ నల్లటి ముడతలు, మెడ మురికిపట్టినట్లుగా నల్లగా కనిపించడం, కాళ్ల వేళ్లకింద పగుళ్లు (ఫిషర్స్), చేతి గీతలు కాస్త ప్రస్ఫుటంగా కనిపించడం, వెంట్రుకలు ఉన్నచోట బొబ్బల్లా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఏడు నుంచి పద్నాలుగేళ్ల పిల్లల్లో...ఏడు కంటే తక్కువ వయసు పిల్లలతో పోలిస్తే ఏడు నుంచి పధ్నాలుగేళ్ల వారిలో అటోపిక్ డర్మటైటిస్ లక్షణాల తీవ్రత తగ్గే అవకాశముంది. ఈ సమస్య ఉన్నవారిలో చర్మం పగిలి ఉండటంతో తరచూ వైరల్ ఇన్ఫెక్షన్లు... ఉదాహరణకు హెర్పిస్ సింప్లెక్స్ వంటివి; అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉదాహరణకు స్టెఫాలోకోకల్ వంటివి కనిపించవచ్చు. నివారణ / మేనేజ్మెంట్ అండ్ చికిత్స స్నానం చేయించే వ్యవధి ఎంత తక్కువైతే అంత మంచిది. గోరు వెచ్చని నీళ్లతోనే స్నానం చేయించాలిస్నానం చేసిన వెంటనే పూర్తిగా తుడవకుండా టవల్తో అద్దుతూ ఆ తేమ మీదనే మాయిశ్చరైజర్ పట్టించాలి కాళ్లూ, చేతులు ఎక్కువగా పొడిబారతాయి కాబట్టి మాయిశ్చరైజర్ను రోజుకు రెండు మూడుసార్లయినా పట్టించడం మంచిది ఉలెన్ దుస్తుల వల్ల పిల్లలకు ఇరిటేషన్ ఎక్కువగా వస్తుంటుంది. అందుకే వాటికి బదులు కాటన్ దుస్తులు ధరింపజేయడం మేలు దోమల వల్ల కూడా పిల్లల చర్మంపై దుష్ప్రభావం పడే అవకాశముంది. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి స్కూలుకు వెళ్లే వయసు పిల్లలకు షూజ్తో కాటన్ సాక్స్ వాడటం, గట్టి చెప్పులకు బదులు కాస్త మెత్తటి పాదరక్షలు వాడితే కాళ్ల పగుళ్ల వల్ల కలిగే బాధలు తగ్గుతాయి సమస్య మరింత తీవ్రమైతే డర్మటాలజిస్టులను కలవాలి. సమస్య తీవ్రతను బట్టి వారు తగిన చికిత్స అందిస్తారు.(చదవండి: కంటికి ‘మంట’ పెట్టేస్తది.. సిగరెట్ అంటించకండి!) -
చలికాలంలో మేకప్, ఈ జాగ్రత్తలు తప్పదు.. లేదంటే!
చలికాలం ఉక్కపోత ఉండదు, మేకప్ చెదిరిపోదు, బాగుంటుంది అనుకుంటారు. అయితే, ప్రతి సీజన్కి బ్యూటీ చాలెంజెస్ ఉంటాయి. చలికాలంలో చేయించుకోదగిన ఫేషియల్స్, మేకప్, ఫుడ్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వివాహ వేడుకలకు మేకప్ చేయించుకునేవారు ఈ జాగ్రత్తలు పాటిస్తే, సరైన ప్రయోజనాలను పొందుతారు. పొడిగా ఉన్నా, జిడ్డుగా ఉన్నా చలి కాలం మేకప్ చేసేముందు హైడ్రేటెడ్ మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. లేదంటే, మేకప్ కూడా డ్రైగా కనిపిస్తుంది. అవసరాన్ని బట్టి ప్రైమరీ లోషన్ వాడుకోవచ్చు.మెరిసే చర్మానికి..చర్మం మెరుస్తున్నట్టుగా ఆరోగ్యంగా కనిపించాలంటే నూనె శాతం ఎక్కువ ఉండే మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. హైలురానిక్ యాసిడ్స్ ఉన్న సీరమ్ని ముందు ఉపయోగిస్తే మాయిశ్చరైజర్ని స్కిన్ మీద పట్టి ఉంచుతుంది. దీని వల్ల మేకప్ డ్రైగా కనిపించదు. బడ్జెట్ని బట్టి సీరమ్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిలో చర్మానికి అవసరమయ్యే గుణాలు ఏవి ఉన్నాయో అవి చెక్ చేసుకోవాలి. సాధారణంగా చర్మం సహజ ఆయిల్స్ను ఉత్పత్తి చేస్తుంది. కానీ, వయసు పెరుగుతున్నకొద్దీ సహజ నూనెల ఉత్పత్తి ఆగి΄ోతుంది. దాంతో చర్మం ΄÷డిబారుతుంది. చలికాలం పెళ్లిళ్లు ఉన్న బ్రైడల్స్ అయితే కనీసం నెల ముందు నుంచి స్కిన్ కేర్ తీసుకోవాలి.హెల్తీ స్కిన్కి పోషకాహారంస్కిన్ కేర్ తీసుకోకుండా పెళ్లిరోజు మేకప్ చేయించుకుంటే హెల్తీగా కనిపించదు. నెల రోజుల ముందు నుంచి హైలురానిక్ యాసిడ్స్ ఉన్న సీరమ్స్ ఉపయోగించాలి. ΄ోషకాహారం, ΄ానీయాల మీద దృష్టి పెట్టాలి. జంక్ ఫుడ్, మాంసాహారం కాకుండా పండ్లు, కూరగాయలు, జ్యూసులను ఆహారంలో ఎక్కువ చేర్చుకోవాలి. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.మేకప్కి ముందుమేకప్కి ముందు ఎంజైమ్ స్క్రబ్ ఉపయోగిస్తారు. తర్వాత సీరమ్స్, అవసరమైతే షీట్ మాస్క్లు, అండర్ ఐ ప్యాచెస్ వాడుతారు. దీని వల్ల మేకప్ ప్యాచ్లుగా కనిపించదు.మేకప్ తీయడానికి తప్పనిసరిరిమూవర్స్ ఉపయోగించుకోవచ్చు. లేదంటే కొబ్బరినూనె, బాదం నూనె, బేబీ ఆయిల్ ను ఉపయోగించి మేకప్ను పూర్తిగా తీసేయాలి. తర్వాత ఫేస్వాష్తో శుభ్రపరుచుకొని, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అలసి΄ోయామనో, మరుసటి రోజు చూడచ్చులే అనో మేకప్ తీసేయకుండా అలాగే పడుకుంటే స్కిన్ బాగా దెబ్బతింటుంది. చర్మం ఇంకా పొడిబారడం, యాక్నె వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. మేలైన ఫేషియల్స్చలికాలంలో రొటీన్ ఫేషియల్స్ కాకుండా హైడ్రా ఫేషియల్ చేయించుకోవడం మంచిది. దీని వల్ల చర్మం నిగారింపు కోల్పోదు. వీటితో పాటు కొన్ని కెమికల్ పీల్స్ ఉంటాయి. అయితే, వీటిని పెళ్లికి పది రోజుల ముందు చేయించుకోవాలి. కెమికల్ పీల్ని బ్యూటీపార్లర్లో కాకుండా చర్మనిపుణుల సమక్షంలో చేయించుకోవడం మంచిది. – విమలారెడ్డి పొన్నాల, సెలబ్రిటీ అండ్ బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ -
వింటర్లో వ్యాధులు : మిరియాలతో చాలా మేలు!
లేదు..రాలేదు అనుకుంటూ ఉండగానే చలి పులి పరుగెత్తుకొచ్చేసింది. మరోవైవు ఫంగెల్ ప్రభావం, వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశంఉంది. చలికాలంలో వచ్చే కొన్ని అనారోగ్యసమస్యల నుంచి తప్పించుకోవాలంటే కొన్ని వంటింటి చిట్కాలను పాటించాల్సిందే. ఇంట్లోనే లభించే నల్ల మిరియాలతో చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు మొదలైన సమస్యలు రాకుండా మనల్ని కాపాడుతాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. నల్ల మిరియాల్లో ఎన్నో ఔషధగుణాలుంటాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉన్నాయి. ఉంటాయి. ఇవి అంటువ్యాలులు సోకకుండా కాపాడతాయి. అలాగే నొప్పులనుంచి ఉపశమనం కలిగిస్తాయి. నల్ల మిరియాల్లోని విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా మెగ్నీషియం, రాగి, ఇనుము, కాల్షియం, భాస్వరం, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలకు మంచి మూలం. ఇందులో విటమిన్లు ఎ, కె, ఇ బి విటమిన్ కూడా ఉన్నాయి. ఇందులోని పైపెరిన్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ప్రేగులను శుభ్రం చేస్తుంది.మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా నల్ల మిరియాలను సేవిస్తే మలబద్ధకం సమస్య తీరుతుంది.రక్త ప్రసరణను మెరుగుపరచడంలో చక్కగా పనిచేస్తాయి.అంతేకాదుబరువు తగ్గడంలో కూడా మిరియాలు బాగా పనిచేస్తాయి. ఇందులో లభించే ఫైటో న్యూట్రియెంట్స్ అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతాయి. జీవక్రియను వేగవంతం చేస్తాయి.అలాగే చలికాలంలో కీళ్లు,ఎముకల నొప్పులు బాగా వేధిస్తాయి. ఈ బాధలనుంచి ఉపశమనం కలిగించే ఔషధ గుణాలు మిరియాల్లో ఉన్నాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులకు కూడా ఇవి మేలు చేస్తాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ను నియంత్రణలో ఉంచుతాయి. నల్ల మిరియాలు శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడతాయి. క్యాన్సర్ను నివారణలోనూ ఉపయోగపడ తాయంటున్నారు నిపుణులుమనకున్న అనారోగ్య సమస్యను బట్టి తులసి ఆకులు, పసుపు మిరియాలతో చేసిన కషాయం, మిరియాల పాలు,మిరియాలు తేనె, మిరియాలు, తమలపాకు రసం కలుపుకొని తాగవచ్చు.గ్రీన్ టీకి చిటికెడు నల్ల మిరియాలు కలుపుకోవచ్చు.కూరలు, సలాడ్లలో మిరియాల పొడి జల్లు కోవచ్చు. మిరియాలు ,యూకలిప్టస్ నూనె వేసి మరిగించిన నీళ్లో ఆవిరి పట్టవచ్చు. నోట్: ఇది అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే. మిరియాలు అందరికి ఒకేలా పనిచేయవు. శరీర తత్వాన్ని బట్టి, నిపుణుల సలహామేరకు తీసుకోవాలి. మిరియాలను ఎక్కువగా తీసుకుంటే కొన్ని నష్టాలు కూడా ఉంటాయనేది గమనించాలి. -
డిసెంబరు 21.. రాత్రి 16 గంటలు.. పగలు 8 గంటలు
శీతాకాలం.. పగటి కాలం తక్కువ..రాత్రి పొద్దు ఎక్కువ అంటారు. అయితే డిసెంబర్ 21 రాత్రిపూట మనం ఒక వింతను చూడబోతున్నాం. ఆరోజు సుదీర్ఘమైన రాత్రి కాలం రానుంది. ఆరోజు ఏకంగా 16 గంటపాటు రాత్రి సమయం ఉండనుంది. అయితే పగటి వేళ 8 గంటలు మాత్రమే ఉంటుంది. ఇలా జరగడాన్ని శీతాకాలపు అయనాంతం(వింటర్ సోల్స్టైస్) అంటారు.శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజున సూర్యుని నుండి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ కాలం ఉంటుంది. శీతాకాలపు అయనాంతం ఏర్పడిన రోజున భూమి దాని ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగా 2024, డిసెంబరు 21న ఈ ఏడాదిలో అత్యంత తక్కువ పగలు, సుదీర్ఘమైన రాత్రి ఏర్పడుతుంది. భూమి దాని అక్షం మీద తిరిగే సమయంలో దక్షిణ అర్ధగోళంలో భూమి నుండి సూర్యుడి దూరం గరిష్టంగా ఉన్న రోజున అయనాంతం వస్తుంది. ఇది శీతాకాలంలో ఏర్పడుతున్నందున దీనిని శీతాకాలపు అయనాంతం అని అంటారు.శీతాకాలపు అయనాంతం ఏర్పడే తేదీ ప్రతీయేటా మారుతుంటుంది. అయితే అది డిసెంబర్ 20- 23 తేదీల మధ్యనే వస్తుంటుంది. డిసెంబర్ 21న భూమికి సూర్యునికి గరిష్ట దూరం ఉండటం వల్ల సూర్యకిరణాలు ఆలస్యంగా భూమిని చేరుతాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల కూడా కనిపిస్తుంది. వివిధ దేశాల్లో శీతాకాలపు అయనాంతం(వింటర్ సోల్స్టైస్) రోజున ఉత్సవాలు జరుపుకుంటారు. చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలలో, బౌద్ధమతంలోని యిన్, యాంగ్ శాఖకు చెందిన ప్రజలు శీతాకాలపు అయనాంతం ఐక్యత, శ్రేయస్సును అందించే రోజుగా భావిస్తారు.శీతాకాలపు అయనాంతంపై వివిధ దేశాల్లో వేర్వేరు నమ్మకాలున్నాయి. శీతాకాలపు అయనాంతం వచ్చినప్పుడు ఉత్తర భారతదేశంలో శ్రీ కృష్ణునికి నైవేద్యం సమర్పించి, గీతా పారాయణం చేస్తారు. రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలలో పుష్యమాస పండుగ ను జరుపుకుంటారు. సూర్యుని ఉత్తరాయణం ప్రక్రియ శీతాకాలపు అయనాంతం నుండి మొదలవుతుంది. అందుకే భారతదేశంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.ఇది కూడా చదవండి: బిష్ణోయ్ గ్యాంగ్లో మేడం మాయ.. చేసే పని ఇదే.. -
పెరుగుతోన్న చలి తీవ్రత.. రోగాల బారిన పడకుండా ఉండాలంటే..
చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చల్లటి గాలులు కూడా వణికిస్తున్నాయి. అయితే చలిగాలులు అనేక రకాల వ్యాధులను కూడా మోసుకొస్తున్నాయి. ఈ సీజన్లో ప్రజల్లో వ్యాధి నిరోధకశక్తి తగ్గుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చలిగాలులు శరీరంలోకి వెళ్లడంతో వైరస్లు మరింత వృద్ధి చెందే ప్రమాదం ఉందని అంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది చలితీవ్రత పెరిగిందని వాతావరణ నిపుణులు కూడా పేర్కొంటున్నారు.సమస్యలు.. ఫ్లూ, సైనసైటిస్, ఊపిరితిత్తుల్లో వైరల్ ఇన్ఫెక్షన్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి(సీవోపీడీ), ఆస్తమా వంటి సమస్యలు తలెత్తుతాయి. హైపోథెర్మియా, చర్మం లోపలి కణజాలం గడ్డ కట్టి గాయాలు కావటం, పెర్నియో, ఇమ్మర్షన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.లక్షణాలు.. దగ్గు, జలుబు, గొంతునొప్పి, తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఆయాసం, న్యూమోనియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. జాగ్రత్తలు.. చలి ఎక్కువగా ఉన్న సమయాల్లో మాస్కులు ధరించాలి. దీంతో వైరస్ సోకదు. వేరేవారికి సోకకుండా ఉంటుంది. ఎవరైనా వాతావరణాన్ని అంచనా వేసుకుని బయటకు రావాలి. మరీ చలితీవ్రత అధికంగా ఉంటే బయటకు రాకుండా ఉంటే మంచిది. ము ఖ్యంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడేవారు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇన్హేలర్లను వాడుతుండాలి.ఎవరికి ఇబ్బంది.. చలి తీవ్రత నేపథ్యంలో ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు, గర్భిణులు, బాలింతలు, మహిళలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. వృద్ధులు వేడివేడిగా సరైన ఆహారం తీసుకోవాలి. పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రాలను ధరించాలి. చలిగాలులు ఉన్నప్పుడు చిన్నారులను బయట తిప్పకూడదు. ఎక్కువరోజులు జలుబు, ఫ్లూ, ముక్కు నుంచి రక్తం రావటం వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. చలిగాలుల్లో ఆరు బయట పనిచేసే కార్మికులు, వీధుల్లో గడిపే నిరాశ్రయులు జాగ్రత్తగా ఉండాలి.చదవండి: ఈ డివైజ్తో మొటిమలలు, మచ్చలు ఇట్టే మాయం..!కారణాలు.. ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల వైరస్కు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. దీంతో శరీరంలో వైరస్ కణాలు వేగంగా వృద్ధి చెందుతాయి. ఈ వాతావరణంలో ఒకరి నుంచి మరొకరికి వేగంగా ఫ్లూ వ్యాప్తి చెందుతుంది.వ్యాధి నిరోధకశక్తి పెంచుకోవాలి.. చలికాలంలో వ్యాధి నిరోధకత తక్కువగా ఉంటుంది. దీంతో పౌష్టికాహారం తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన ఉసిరి, నిమ్మకాయల రసం తీసుకోవాలి. ఎక్కువగా నీటిని తాగాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడం మరింత మంచిది. విపరీతమైన చలికి జాగ్రత్తలు తీసుకోకపోతే, అవయవాల్లో గాయాలై మరణాలు సంభవించవచ్చు. – డాక్టర్ ఎం.రాజీవ్, పల్మనాలజిస్ట్, టీజీఎంఎస్ సభ్యుడు -
వింటర్లో ట్రెండీ వేర్ ఏదో తెలుసా? (ఫోటోలు)
-
వింటర్ వేర్ : గ్రాండ్ వెల్వెట్, ట్రెండీ వెల్వెట్
వింటర్ టైమ్ బ్రైట్గా వెలిగిపోవాలన్నాప్రిన్సెస్లా హుందాగా మెరిసిపోవాలన్నావణికించే చలి నుంచి నైస్గా తప్పించుకోవాలన్నాఈ సీజన్కి బెస్ట్ ఎంపికగా వెల్వెట్ డిజైనరీ డ్రెస్సులు గ్రాండ్గా మదిని దోచేస్తున్నాయి. వెల్వెట్నే మనం మఖ్మల్ క్లాత్ అని కూడా అంటాం. మందంగా, మృదువైన పట్టులా ఉండే ఈ క్లాత్ నేత పని, వాడే మిశ్రమాల వల్ల చాలా ఖరీదైనదిగా కూడా పేరుంది. సంపన్నులు ధరించే వస్త్రంగా పేరొందిన వెల్వెట్కు ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. ఇప్పుడు ఈ క్లాత్ తయారీలో ఎన్నో మార్పులు చోటు చేసుకొని, అందరికీ అందుబాటులోకి వచ్చింది. ధరలను బట్టి క్లాత్ నాణ్యతలో మార్పులు ఉంటున్నాయి. దాదాపు డిజైనర్లందరూ వెల్వెట్తో డ్రెస్ డిజైనింగ్లో ప్రయోగాలు చేస్తుంటారు. లాంగ్ అండ్ షార్ట్ గౌన్లు, కుర్తీలు, లాంగ్ ఓవర్కోట్స్, శారీస్, బ్లౌజ్లను డిజైన్ చేయించుకోవచ్చు. ప్లెయిన్ వెల్వెట్ డ్రెస్లో వెస్ట్రన్ ఔట్ఫిట్స్ను డిజైన్ చేస్తుంటారు. ఇవి, వింటర్ సీజన్లో ఈవెనింగ్ పార్టీలకు స్పెషల్గా రెడీ అవుతున్నాయి. వీటిలో షార్ట్ గౌన్స్, ఓవర్ కోట్స్ ఎక్కువ.ఎంబ్రాయిడరీ వెల్వెట్ క్లాత్పైన మరింత అందంగా కనిపిస్తుంది. దీనివల్ల డ్రెస్కి అదనపు ఆకర్షణ చేకూరుతుంది. సంప్రదాయ వేడుకల్లోనూ డిజైనర్ శారీతో హుందాగా ఆకట్టుకుంటుంది. లెహంగా, చోలీ డిజైన్లలో గ్రాండ్గా వెలిగిపోతుంది. వెల్వెట్ అనేది వంకాయ రంగులోనే కాదు పచ్చ, పసుపు, పింక్.. వివిధ రంగులలో షిమ్మర్తో మెరిసిపోయేవీ ఉన్నాయి. -
మాయిశ్చరైజర్లు వాడుతున్నారా..!
చలికాలంలో చర్మం పొడిబారే సమస్య దాదాపుగా అందరూ ఎదుర్కొనేదే. ఎన్ని క్రీములు రాసినా ఏమాత్రం ఉపయోగం లేదని చాలామంది వాపోతుంటారు. ఈ సమస్యలకు పరిష్కారం కావాలంటే ముందు మన చర్మ తత్త్వాన్ని తెలుసుకోవాలి. కొందరికి ఆయిల్ స్కిన్ ఉంటుంది. వీరికి సమస్య పెద్దగా ఉండకపోవచ్చు. కానీ, ఈ కాలంలో పొడి చర్మం గల వారికి పెద్ద సమస్యగా ఉంటుంది. వారి చర్మతత్వాన్ని బట్టి మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. గోరువెచ్చని నీళ్లుఫుల్క్రీమ్ లేదా అయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్లు వాడాలి. స్నానం చేశాక కనీసం పది నిమిషాల్లోపు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. చలిని తట్టుకోవడానికి చాలామంది వేడినీళ్లతో స్నానం చేస్తుంటారు. దీనివల్ల చర్మంపై సహజ నూనెలను కోల్పోతాం. అందుకని, స్నానానికి గోరువెచ్చని నీళ్లు వాడాలి. నిమ్మ, చందనంతో తయారైనవి కాకుండా గ్లిజరిన్, అలోవెరా, ఓట్మిల్క్ బేస్డ్ సోప్స్ స్నానానికి ఎంచుకోవాలి. వింటర్లోనూ సన్స్క్రీన్ను ఉపయోగించాలి.రుద్దకూడదు..డ్రై స్కిన్ ఉన్నవాళ్లు క్లెన్సింగ్ మిల్క్ని రోజుకు ఒకసారైనా ఉపయోగించాలి. స్క్రబ్స్ వంటివి ఎక్కువ ఉపయోగించకూడదు. కొందరు స్నానానికి మైత్తటి కాయిర్ను వాడుతుంటారు. ఈ కాలం దానిని వాడక΄ోవడం ఉత్తమం. పాదాలను రాత్రివేళ శుభ్రపరుచుకొని, ఫుట్ క్రీమ్ లేదా పెట్రోలియమ్ జెల్లీ రాసుకోవాలి. కాలి పగుళ్ల సమస్య ఉన్నవారు సాక్సులు వేసుకోవాలి. కొందరు సీరమ్స్ వాడుతుంటారు. వీటిలో యాసిడ్ కంటెంట్ చాలా తక్కువగా ఉన్నవి ఎంచుకోవాలి.ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్లు జెల్ లేదా లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్లు ఉపయోగించుకోవాలి. సోరియాసిస్, వంటి చర్మ సమస్యలు ఉన్నవారు ముందుగానే వైద్యులను సంప్రదించి మందులు తీసుకోవాలి.మేకప్కి ముందు మాయిశ్చరైజర్ మేకప్ చే సుకోవడానికి ముందు క్లెన్సింగ్ మిల్క్ ఉపయోగించి, తర్వాత మాయిశ్చరైజర్ వాడాలి. మేకప్ తీసేసాక మళ్లీ క్లెన్సింగ్ మిల్క్ను ఉపయోగించాలి. డ్రైస్కిన్ వాళ్లు ఆయిల్ బేస్డ్ ఫౌండేషన్స్ వాడాలి. సూప్లు, జ్యూస్లు..ఆకుకూరలు, కూరగాయలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. నట్స్, నువ్వులు వంటివి ఈ కాలంలో ఆహారంలో చేర్చుకోవడం, ఉపయోగించడం మంచిది. సాధారణంగా చలికాలంలో చాలామంది తక్కువ నీళ్లు తాగుతారు. కానీ, మన శరీరానికి 3–4 లీటర్ల నీళ్లు అవసరం. నీళ్లు తాగలేక΄ోయినా సూప్లు, జ్యూస్ల రూపంగా తీసుకోవచ్చు. – డా. స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్ -
పెసర పిండితో బ్యూటీ ప్యాక్స్ : మెరిసే మోము
శీతాకాలంలో చర్మం, ముఖం సౌందర్య పట్ల మరింత జాగ్రత్త తీసుకోవాలి. రసాయనాలులేని సహజ పదార్థాలతోనే చర్మ సౌందర్యాన్నిమెరుగు పర్చు కోవడానికి ప్రయత్నించాలి. చర్మాన్ని మృదువుగా చేయడంలోనూ, చర్మానికి మెరుపును ఇవ్వడంలోనూ, చక్కటి రంగు తేలేలా చేయడంలోనూ పెసలు చక్కగా పని చేస్తాయి. ఈ నేపథ్యంలో పెసర పిండితో కొన్ని చిట్కాలను ఇపుడు చూద్దాం! టీ స్పూన్ పెసరపిండిలో పచ్చిపాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్లా వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మాన్ని ఈ మాస్క్ మృదువుగా మారుస్తుంది.పెసరపిండిలో కొద్దిగా పెరుగు, కొబ్బరి నూనె కలిపి చేతులకు రాయాలి. సున్నితంగా రబ్ చేసి, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పెసరపిండి, పెరుగు, కొబ్బరి నూనె చర్మాన్ని మరింత మృదువుగా మారుస్తాయి.టేబుల్ స్పూన్ పెసర్లు, ఐదు బాదంపప్పులు రాత్రి నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని పేస్ట్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం పొడిబారడం సమస్యే దరిచేరదు. -
శీతాకాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే..?
శీతాకాలం అనంగానే అందరికి ఎందురయ్యే ప్రధాన సమస్య చర్య పొడిబారడం. దీని వల్ల దద్దుర్లు, ఒక విధమైన దురద మంట వస్తాయి. అలాగే చర్మం కూడా అసహ్యంగా మారిపోతుంది. తాకినప్పుడుల్లా గరుకుదనంతో మంటగా ఉంటుంది. అలాంటి సమస్యకు ఇంట్లో దొరికే వాటితో ఈజీగా చెక్ పెట్టొచ్చు . అదెలాగో చూద్దామా..!.టీ స్పూన్ పెసరపిండిలో పచ్చిపాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్లా వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మాన్ని ఈ మాస్క్ మృదువుగా మారుస్తుంది.పెసరపిండిలో కొద్దిగా పెరుగు, కొబ్బరి నూనె కలిపి చేతులకు రాయాలి. సున్నితంగా రబ్ చేసి, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పెసరపిండి, పెరుగు, కొబ్బరి నూనె చర్మాన్ని మరింత మృదువుగా మారుస్తాయి.టేబుల్ స్పూన్ పెసర్లు, ఐదు బాదంపప్పులు రాత్రి నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని పేస్ట్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం పొడిబారడం సమస్యే దరిచేరదు. (చదవండి: పెదవులు గులాబీ రంగులో మెరవాలంటే ఆపిల్, అరటిపండ్లతో ఇలా చేయండి..!) -
పెదవులు గులాబీ రంగులో మెరవాలంటే ..!
చలికాలంలో పెదాలు పొడిబారినట్లుగా అయిపోయవడమే గాక ముఖం, చర్మం కాంతి విహీనంగా మారుతుంది. ఓపక్క పని ఒత్తిడి వల్ల కళ్లకింద నలుపు, ముఖంంపై ముడతలతో అందవిహీనంగా కనిపిస్తుంది. ఇలాంటి వాటిని ఆరోగ్యం కోసం తినే ఫ్రూట్స్తో చెక్పెడదాం. అదెలాగో చూద్దామా..కీరదోసకాయని చక్రాల్లా కోసుకుని కళ్ళమీద పెట్టుకుంటే కంటి అలసట తగ్గుతుంది. రెండు స్పూన్ల చల్లని పాలలో కాటన్ బాల్స్ని ముంచి కళ్ళ చుట్టూ వలయాకారంగా మర్ధించి 20 నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే కంటి కింద నలుపు తగ్గి అందంగా ఉంటాయి. మెడ మురికి పట్టేసినట్లు నల్లగా ఉంటే... నాలుగు టీ స్పూన్ల పుల్లటి పెరుగులో రెండు స్పూన్ల బియ్యప్పిండి కలిపి మెడకు పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మానికి పట్టిన నలుపుతోనాటు ముడతలుపోతాయి.టీ స్పూన్ అరటిపండు గుజ్జులో టీస్పూన్ తేనె కలిపిన మిశ్రమాన్ని పెదవులకు రాసి మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే నల్లని పెదవులు గులాబీ రంగులోకి మారతాయి.టీస్పూన్ పాల మీగడ, అయిదారు గులాబి రేకులు తీసుకుని పేస్ట్ చేసిన మిశ్రమాన్ని పెదవులకు రాసుకుంటే పెదవులు పొడిబారకుండా మృదువుగా ఉంటాయి. చలికాలంలో లిప్స్టిక్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. లిప్ గార్డ్, మీగడ, వెన్న, నెయ్యి వంటివి రాసుకుంటూ ఉంటే పెదవులు పొడిబారకుండా అందంగా ఉంటాయి. టీ స్పూన్ ఆపిల్ గుజ్జులో టీ స్పూన్ అరటిపండు గుజ్జు, అయిదారు చుక్కల తేనె వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్లా వేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై ఏర్పడ్డ ముడతలు, జిడ్డు తగ్గి ముఖం మెరుస్తూ కాంతివంతంగా ఉంటుంది. (చదవండి: ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం'లో మెరిసిన ఆ చిన్నది ఎవరు?) -
రాష్ట్రానికి చలిజ్వరం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చలిజ్వరం పట్టుకుంది. విషజ్వరాలతోపాటు దగ్గు, జలుబు, ఇతర శ్వాస సంబంధ సమస్యలతో జనం సతమతం అవుతున్నారు. వాతావరణంలో మార్పులు, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. హైదరాబాద్ మొదలు ఏజెన్సీ ప్రాంతాల దాకా ఇదే పరిస్థితి. ఏ ఆస్పత్రిలో చూసినా పెద్ద సంఖ్యలో ఔట్ పేషెంట్లు కనిపిస్తున్నారు. ఇన్ పేషెంట్లుగా చేరి చికిత్స పొందాల్సిన వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. కిక్కిరిసిపోతున్న పెద్దాస్పత్రులు ⇒ హైదరాబాద్లోని ఒక్క ఫీవర్ ఆస్పత్రికి ఈ నెలలో ఇప్పటివరకు వచ్చిన జ్వరాల బాధితులు 12,080 మందికావడం ఆందోళనకరం. నాలుగైదు రోజులుగా రోజూ 800 వరకు ఔట్ పేషెంట్లుగా నమోదవుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వివిధ జ్వర సంబంధ సమస్యలతో సుమారు 700 మంది ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. ⇒ ఇక చిన్నపిల్లల ఆస్పత్రి నిలోఫర్కు సోమవారం 1,600 మంది ఔట్ పేషెంట్లుగా నమోదుకాగా.. ఇందులో చలి కారణంగా ‘న్యుమోనియా’వంటి శ్వాస సంబంధ సమస్యలతో వచ్చిన పిల్లలే ఎక్కువగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ ఇన్ పేషెంట్లుగా 1,300 మంది వరకు చికిత్స పొందుతున్నారు. ⇒ ఉస్మానియా ఆస్పత్రిలో సోమవారం జనరల్ మెడిసిన్ కింద వైద్యం కోసం వచ్చిన ఔట్పేషెంట్లు 290, ఇక గాంధీ ఆస్పత్రిలో ఈ నెలలో సోమవారం నాటికి వచ్చిన ఔట్ పేషెంట్ల సంఖ్య 35,547. అంటే సగటున ప్రతీరోజు 1,500 మంది వస్తున్నారు. ఇందులో జ్వర సంబంధిత సమస్యలతో వచ్చేవారు ప్రతీరోజు 300 నుంచి 500 మంది వరకు ఉంటారని సిబ్బంది చెబుతున్నారు. ⇒ ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని పిల్లల వార్డులో ప్రతీరోజు 50కి తక్కువ కాకుండా విషజ్వరాల కేసులు నమోదవుతున్నట్లు ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఉట్నూరు ఐటీడీఏ, ములుగు, భూపాలపల్లి, అచ్చంపేట మన్ననూరు, కొత్తగూడెం పరిధిలోని పలు ఏజెన్సీ మండలాల్లో కూడా జ్వరాల బాధితుల సంఖ్య పెరుగుతోంది. కానీ చాలా మంది గిరిజనులు ఆస్పత్రులకు వెళ్లకుండా ఇళ్ల దగ్గరే సొంత వైద్యం చేసుకుంటున్నట్టు ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. తగ్గిన డెంగీ, చికున్గున్యా... ఈ ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు రాష్ట్రాన్ని వణికించిన డెంగీ, మలేరియా, చికున్గున్యా కేసులు.. నవంబర్ నెలలో తగ్గుముఖం పట్టినట్లు వైద్యారోగ్యశాఖ చెబుతోంది. డెంగ్యూ కేసులు సెప్టెంబర్, అక్టోబర్లతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,500కు పైగా డెంగీ కేసులు నమోదవగా..సెపె్టంబర్లో 1,542, అక్టోబర్లో 854 కేసులు ఉన్నాయి. ఈ నెలలో 22వ తేదీ వరకు 168 కేసులే వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఇక చికున్గున్యా కేసులు సెప్టెంబర్లో 183, అక్టోబర్లో 13 నమోదవగా, ఈనెలలో ఇప్పటివరకు 13 కేసులే వచ్చాయని వివరిస్తున్నారు. మలేరియా కేసులు కూడా తగ్గాయని అంటున్నారు. పెరిగిన శ్వాస సంబంధ సమస్యలు ఈ నెల మొదటి వారం నుంచి పెరుగుతూ వచ్చిన చలి... కార్తీక పౌర్ణమి మరింత తీవ్రమైంది. దీని కారణంగా న్యుమోనియా వంటి శ్వాస సంబంధ సమస్యలు పెరిగి జనం తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో తీవ్ర చలి కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి ఇబ్బందిపడుతున్న వారు అధికంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది కూడా. చలితో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు, గొంతు నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయని అందులో పేర్కొన్నట్టు తెలిసింది.ఈ చిత్రంలోని తల్లీకొడుకులు ములుగు జిల్లా మంగపేట మండలం బాలన్న గూడెం గ్రామానికి చెందినవారు. తల్లి మిరియాల రాజమ్మకు వారం రోజుల నుంచి తీవ్ర జ్వరం, కుమారుడు అనుపాల్కు టైఫాయిడ్. ఇద్దరూ ఇప్పుడు ఏటూరు నాగారం సామాజిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చలి పెరగడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.చలిజ్వరంతో బాధపడుతున్నా..చలి, తీవ్ర జ్వరం, కడుపునొప్పి రావడంతో రెండు రోజుల క్రితం జిల్లా దవాఖానాకు వచ్చిన. డాక్టర్లు పరీక్షించి వార్డులో చేర్చుకున్నారు. పొద్దున, సాయంత్రం వచ్చి చూస్తున్నారు. కొంచెం నయమైంది. – తూడి సోమక్క, వనపర్తి, లింగాల గణపురంశ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. వారం రోజుల్లో వివిధ ఆరోగ్య సమస్యలతో 2,350 మంది ఔట్ పేషెంట్ (ఓపీ) విభాగానికి వచ్చారు. అందులో 80 మంది జ్వరాలతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధుల టెస్టులు చేయడానికి ఎక్స్రే, ఈసీజీ, ట్రెడ్మిల్, టూడీ ఈకో టెస్టులు అందుబాటులో ఉన్నాయి. సరిపడా టెక్నీíÙయన్స్ లేక అన్ని టెస్టులు ఒక్కరే చేస్తున్నారు. సరిపడా మందులు ఉన్నాయి. ఎమ్మారై, సీటీ స్కాన్లు తీయడం లేదు. – డాక్టర్ గోపాలరావు, జిల్లా వైద్యాధికారి, ములుగుసీజనల్ వ్యాధులతో జాగ్రత్త శీతాకాలం ప్రారంభం కావడంతో వాతావరణంలో మార్పులు వచ్చి, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. జ్వరం, జలుబు, దగ్గు, ఆస్తమా సమస్యలు తలెత్తుతాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తే సీజనల్ వ్యాధుల బారినపడకుండా ఉండొచ్చు. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో చలి గాలిలో తిరగవద్దు. బయటికి వెళ్లినప్పుడు మాసు్కలు ధరించడం మంచిది. వెచ్చగా ఉండే దుస్తులను ధరించాలి. రోగ నిరోధక శక్తి పెరిగే ఆహారం తీసుకోవాలి. – డాక్టర్ మధుసూదన్,జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, జయశంకర్ భూపాలపల్లి -
మీ చేతి ఉన్నివస్త్రం
‘తపాలా బండి గంటల చప్పుడుకు ఏ పడుచు పిల్లయినా నిద్ర లేచినా మళ్లీ అటు తిరిగి పడుకుని తియ్యటి కలలు కంటుంది’ అని ఉంటుంది చెహోవ్ రాసిన ‘ఒక చలి రాత్రి’ కథలో! ఊహించండి. దట్టమైన చలికాలం. రాత్రి మూడు గంటల సమయం. ఏ వెధవ ప్రాణమైనా ముడుక్కుని పడుకుని కాసింత సుఖాన్ని అనుభవించే వేళ. ఒడలు మరిచే వేళ. వెచ్చదనమూ భోగమే అని భావించే వేళ. పొట్టకూటి కోసం, రోజూ చేయాల్సిన పని కోసం తపాలా మూటలను బగ్గీలో వేసుకుని స్టేషనుకు చేర్చక తప్పని మెయిల్మేన్ మనసులో ఎలా ఉంటుంది? నిశ్శబ్దాన్ని కప్పుకొని గాఢ సుషుప్తిలో ఉన్న ఊరి వీధుల గుండా అతడొక్కడే చలికి వణుకుతూ, కన్ను పొడుచుకున్నా కానరాని చీకటిలో వెళుతూ ఉంటే అతడి అంతరంగ జగాన ఏముంటుందో ఆ సమయాన ఇళ్లల్లోని గదుల్లో రగ్గుల చాటున శయనిస్తున్న మనుషులకు తెలుస్తుందా?శ్రీమంతులు కూడా భలే వాళ్లులే! చలి రాత్రుళ్లలో వారికి మజాలు చేయాలనిపిస్తుంది. అతిథులను పిలవాలనిపిస్తుంది. పార్టీలూ గీర్టీలూ. పనివాళ్లను తొందరగా ఇళ్లకు పోండి అంటారా ఏమి? లేటు అవర్సు వరకూ పని చేయాల్సిందే! బయట చలి ఉంటుంది. పాకల్లో పసిపిల్లలు ‘కప్పుకోవడానికి ఇవాళైనా దుప్పటి కొనుక్కుని రా నాన్నా’ అని కోరడం గుర్తుకొస్తూ ఉంటుంది. ఒంటి మీదున్న ఈ కనాకష్టం బట్టలతో ఇంతరాత్రి చలిలో ఇంటికి ఎలా చేరాలనే భీతి ఉంటుంది. వెచ్చటి ద్రవాలు గొంతులో ఒంపుకునే శ్రీమంతులు ‘ఒరే... ఆ రగ్గు పట్టుకుపో’ అంటారా? ‘ఈ పాత స్వెటరు నీ కొడుక్కు తొడుగు’ అని దయతో పారేస్తారా? ఆ సోయి ఉంటే కొందరు ఎప్పటికీ శ్రీమంతులు కాలేరు. పాపం పనివాడు రంగడు పార్టీలో యజమాని ఉండగా ఆ అర్ధరాత్రి రగ్గు దొంగిలిస్తాడు. పేదవాణ్ణి దొంగను చేసింది లోపలి పెద్దమనిషా... బయటి చలా? డి.వెంకట్రామయ్య ‘చలి’ కథ ఇది.దర్శకుడు బి.నరసింగరావు కథలు కూడా రాశారు. ‘చలి’ అనే కథ. నగరానికి వచ్చిన వెంటనే మొగుడు పారిపోతే ఆ వలస కూలీ చంకన బిడ్డతో వీధుల్లో తిరుగుతూ చలిరాత్రి ఎక్కడ తల దాచుకోవాలా అని అంగలారుస్తుంటుంది. అక్కడ నిలబడితే ఎవరో కసురుతారు. ఇక్కడ నిలబడితే ఎవరో తరుముతారు. నోరూ వాయి లేని చెట్టు ‘పిచ్చిదానా... నిలుచుంటే నిలుచో. నీకేం వెచ్చదనం ఇవ్వలేను’ అని చిన్నబోతూ చూస్తుంది. చెట్టు కింద తల్లీబిడ్డా వణుకుతుంటారు. చలి. చెట్టు కింద తల్లీ బిడ్డా కొంకర్లు పోతూ ఉంటారు. శీతలం. చెట్టు సమీపంలోని చాటు అటుగా వచ్చి ఆగిన కారులోని యువతీ యువకులకు మంచి ఏకాంతం కల్పిస్తుంది. బయట చలి మరి. ఒకే తావు. చెట్టు కింద చావుకు దగ్గరపడుతూ తల్లీబిడ్డ. అదే తావులో ఏమీ పట్టని వెచ్చని సరస సల్లాపం. చలి ఒకటే! బహు అర్థాల మానవులు.శతకోటి బీదలకు అనంతకోటి ఉపాయాలు. పేదవాడు బతకాలంటే నోరు పెంచాలి. లేదా కండ పెంచాలి. కండ పెంచిన మల్లయ్య రైల్వేస్టేషన్ దగ్గర సగం కట్టి వదిలేసిన ఇంటి వసారాను ఆక్రమించుకుంటాడు. తక్కిన కాలాల్లో దాని వల్ల లాభం లేదు. చలికాలం వస్తే మాత్రం రాత్రిళ్లు తల దాచుకోవడానికి అలగా జనాలు ఆ వసారా దగ్గరికి వస్తారు. తలకు ఒక్కరూపాయి ఇస్తే వెచ్చగా పడుకునేందుకు చోటు. కొందరి దగ్గర ఆ రూపాయి కూడా ఉండదు. దీనులు. పేదవాడు మల్లయ్య దయ తలుస్తాడా? తరిమి కొడతాడు. లేచిన ప్రతి ఆకాశహర్మ్యం నా ప్రమేయం ఏముందని నంగనాచి ముఖం పెట్టొచ్చుగాని అది ఎవడో ఒక పేదవాడిలో మంచిని చంపి రాక్షసత్వం నింపుతుంది. వి. రాజా రామమోహనరావు ‘చలి వ్యాపారం’ కథ ఇది.చలిరాత్రి ఎప్పటికీ అయిపోదు. అది పేదవాళ్లకు తామెంత నగ్నంగా జీవిస్తున్నారో గుర్తు చేయడానికే వస్తుంది. చలికి వణికే కన్నబిడ్డల్ని చూపి బాధ పెట్టడానికే వస్తుంది. మనందరం మధ్యతరగతి వాళ్లమే. ఇంటి పనిమనిషిని అడుగుదామా ‘అమ్మా... నీ ఇంట ఒక గొంగళన్నా ఉందా... పిల్లలకు ఉన్ని వస్త్రమైనా ఉందా?’.... ‘చలికి వ్యక్తి మృతి’ అని వార్త. మనిషి చలికి ఎందుకు చనిపోతాడు? ప్రభుత్వం అతనికి ఇస్తానన్న ఇల్లు ఇవ్వకపోతే, ఇల్లు ఏర్పాటు చేసుకునేంత ఉపాధి చూపకపోతే, నీ దిక్కులేని బతుకును ఇక్కడ వెళ్లదీయమని వింటర్ షెల్టరైనా చూపకపోతే, తన నిర్లక్ష్యాన్ని తోడు చేసుకుని చలి హత్యలు చేయగలదని గ్రహించకపోతే అప్పుడు ఆ వ్యక్తి ‘చలికి చనిపోయిన వ్యక్తి’గా వార్తలో తేలుతాడు. విలియమ్ సారోయాన్ అనే రచయిత రాస్తాడు– చలి నుంచి కాపాడటానికి కనీసం శవాల మీదున్న వస్త్రాలనైనా తీసివ్వండ్రా అని! అతని కథలో ఒక యువకుడు ఆకలికి తాళలేక ఓవర్కోట్ అమ్మి చలితో చచ్చిపోతాడు.పగిలిన గాజుపెంకుతో కోసినట్టుగా ఉంటుందట చలి. అదంత తీవ్రంగా ఉండేది మను షుల్లో నిర్దయను పెంచడానికా? కాదు! దయను పదింతలు చేయడానికి! పాతదుప్పట్లో, పిల్లలు వాడక వదిలేసిన స్వెటర్లో, నాలుగు కంబళ్లు కొనేంత డబ్బు లేకపోలేదులే అని కొత్తవి కొనో వాటిని స్కూటర్లో, కారులో పడేసి ఆఫీసు నుంచి వచ్చేప్పుడు ఒక్కరంటే ఒక్కరికి ఇచ్చి వస్తే ఎలా ఉంటుందో ఈ చలికాలంలో చూడొద్దా? ఉబ్బెత్తు బ్రాండెడ్ బొంతలో నిద్రపోయే వేళ మన చేతి ఉన్నివస్త్రంతో ఒక్కరైనా నిద్ర పోతున్నారన్న భావన పొందవద్దా? అదిగో... అర్థమైందిలే... మీరు అందుకేగా లేచారు! -
Andhra Pradesh: ఏజెన్సీ గజగజ
ఏజెన్సీ ప్రాంతంలో సాయంత్రం 4గంటల నుంచే చలిగాలులు విజృంభిస్తున్నాయి. పాడేరు ఘాట్లో చలితీవ్రత మరింత ఎక్కువైంది. శనివారం పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 10 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 14డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీబోర్డులో 14.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీవ్యాప్తంగా ఉదయం 10గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. సాయంత్రం నుంచే అన్ని వర్గాల ప్రజలు చలిమంటలను ఆశ్రయించారు. ఘాట్ ప్రాంతాల్లో చలి మరింత ఇబ్బంది పెడుతోంది.– సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) -
కోహీర్ గజగజ
యెర్భల్ శ్రీనివాస్రెడ్డి / జహీరాబాద్: అక్కడ ఉదయం తొమ్మిది అయినా ఎక్కడా జనం కనిపించరు.. సాయంత్రం ఆరు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యం.. ఉదయం, రాత్రే కాదు.. మధ్యాహ్నం పూట కూడా స్వెట్టర్లు వేసుకోనిదే బయటికి వెళ్లలేని పరిస్థితి. ఇది ఎక్కడో మంచు ప్రాంతాల్లోనో, పర్వతాలున్న చోటనో కాదు.. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండల కేంద్రంలో పరిస్థితి ఇది. ఏటా చలికాలం వచ్చిందంటే ఇక్కడి జనం గజగజ వణికిపోతుంటారు.ఆ ప్రాంతంలోని నేలలు.. చుట్టూరా పచ్చదనం.. చెరువులు, ఇతర జల వనరులు గణనీయంగా ఉండటం వంటివి ఈ పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు. కోహీర్ గ్రామ శివార్లలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీజీడీపీఎస్) ఆధ్వర్యంలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ను ఏర్పాటు చేసి.. వాతావరణ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు.నల్లరేగడి నేలలు, పెద్ద సంఖ్యలో చెట్లతో..కోహీర్ గ్రామ పరిధిలో 7 వేల ఎకరాల మేర వ్యవసాయ భూములు ఉన్నాయి. అందులో 5 వేల ఎకరాల మేర నల్ల రేగడి భూములు, 500 ఎకరాలు పడావ్పడ్డ భూములున్నాయి. ఈ నేలల్లో నీటి నిల్వ మిగతా వాటితో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. ఇక గ్రామం చుట్టూరా పెద్ద సంఖ్యలో చెట్లు ఉన్నాయి. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోటిగార్పల్లిలో 1,500 ఎకరాల్లో, బడంపేట, పర్శపల్లిలో వెయ్యి ఎకరాల చొప్పున అడవులు ఉన్నాయి. గోటిగార్పల్లికి సరిహద్దుగా ఉన్న కర్ణాటకలోని కుంచవరం, బోనస్పూర్, శివరాంపూర్ ప్రాంతాల్లో సుమారు 5 వేల ఎకరాలకుపైగా అడవి ఉంది.చుట్టూ నీటి వనరులే..కోహీర్కు ఎగువన ఐదు కిలోమీటర్ల దూరంలోని బడంపేటలో రెండు చెరువులు, పక్కనే ఉన్న గొటిగార్పల్లిలో 1,100 ఎకరాలకు నీరందించే పెద్దవాగు ప్రాజెక్టు ఉంది. 6 కిలోమీటర్ల దూరంలోని పర్శపల్లిలో తైదల, రాముని చెరువులు ఉన్నాయి. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పైడిగుమ్మల్లో మైసమ్మ చెరువు, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సజ్జాపూర్లో చిన్న చెరువు ఉంది. కోహీర్లో భూగర్భ జలమట్టం 10 అడుగులలోపే. పలుచోట్ల బావుల్లో నీళ్లు బిందెలతో ముంచుకునేంత పైవరకు ఉంటాయి. కొన్ని బోర్లలో నుంచి నీళ్లు పైకి ఉబికి వస్తుంటాయి. దీనికితోడు కోహీర్ ప్రాంతం సముద్ర మట్టానికి 629 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ అంశాలన్నీ కలసి ఇక్కడ అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. రెండేళ్ల కింద 6.2 డిగ్రీలకు.. కోహీర్ ప్రాంతంలో 2022 సంవత్సరంలో 6.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత ఏడాది 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈసారి చలికాలం ప్రారంభంలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు 9 డిగ్రీల వరకు తగ్గాయి. ఈ నెల 19న 9.5 డిగ్రీలు, 20న 9.0 డిగ్రీలు, 21న 12 డిగ్రీలు, 22న 10.9 డిగ్రీలు, 23న 10.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక డిసెంబర్, జనవరిలలో ఉష్ణోగ్రతలు ఇంకెంత తగ్గుతాయోనని స్థానికులు పేర్కొంటున్నారు.ఐదింటికే ఇంటి ముఖం చలి తీవ్రత అధికంగా ఉండటంతో కోహీర్లో రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతర పనులకు వెళ్లేవారు సాయంత్రం ఐదు గంటలకే ఇళ్లకు తిరిగి వస్తున్నారు. సాయంత్రం ఆరు గంటలకే ప్రధాన కూడళ్లు, రోడ్లు జన సంచారం లేక వెలవెలబోతున్నాయి. ఉదయం 8, 9 గంటల వరకు ఎవరూ బయటికి రావడం లేదు.గ్రీనరీ, జల వనరులు కారణంకొన్నిరోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. పొగ మంచు కురుస్తోంది. కోహీర్లో నేల స్వభావం, చెట్లు అధికంగా ఉండటం, చుట్టుపక్కల అడవులు ఉండటం, జల వనరులు ఉండటం వంటివి అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి కారణం. నీటి పారుదల ప్రాజెక్టులు, పెద్ద చెరువులు వంటివి ఉన్నచోట చలి తీవ్రత పెరుగుతుంది. – వెంకటరమణ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీజీడీపీఎస్, హైదరాబాద్ -
జమ్ముకశ్మీర్లో సున్నా డిగ్రీల దిగువకు ఉష్ణోగ్రతలు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి చేరుకున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సున్నాకు దిగువగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి మరింతగా పెరవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.శ్రీనగర్లో గురువారం కనిష్ట ఉష్ణోగ్రత -0.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. నవంబర్ 23 వరకు కశ్మీర్లో వాతావరణం సాధారణంగానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 24న వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉందని, లోయలోని ఎత్తయిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా తేలికపాటి మంచు కురిసే అవకాశం ఉంది. కాశ్మీర్లోని ఖాజిగుండ్లో కనిష్ట ఉష్ణోగ్రత -2.0 డిగ్రీల సెల్సియస్గా నమోదు కాగా, పహల్గామ్లో -3.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. షోపియాన్లో-3.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.గుల్మార్గ్లో ఉష్ణోగ్రత 0.0 డిగ్రీల సెల్సియస్, కుప్వారాలో -0.9 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యింది. కోకర్నాగ్లో కనిష్ట ఉష్ణోగ్రత 0.7 డిగ్రీల సెల్సియస్గా ఉంది. బందిపొరలో -2.4 డిగ్రీల సెల్సియస్, బారాముల్లా -0.4 డిగ్రీల సెల్సియస్, బుద్గామ్ -2.1 డిగ్రీల సెల్సియస్, కుల్గామ్ -2.6 డిగ్రీల సెల్సియస్, లార్నులో -3.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఇది కూడా చదవండి: దేశంలో తగ్గిన సంతానోత్పత్తి రేటు.. ప్రయోజనమా? ప్రతికూలమా? -
ఉక్రెయిన్ పవర్గ్రిడ్పై రష్యా దాడులు.. టార్గెట్ అదేనా..?
కీవ్:ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై ఆదివారం(నవంబర్ 17) రష్యా భారీ దాడులు చేసింది. శీతాకాలం వస్తుండడంతో ఉక్రెయిన్కు కీలకమైన పవర్ గ్రిడ్ను లక్ష్యంగా చేసుకొని క్షిపణులతో దాడులు చేసింది. ఉక్రెయిన్పై ఆగస్టు నుంచి ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. ఈ దాడిలో ఉక్రెయిన్ పవర్గ్రిడ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. దీంతో కీవ్ సహా పలు జిల్లాలు,నగరాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దేశ విద్యుత్తు సరఫరా,ఉత్పత్తి వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ ఎనర్జీ మంత్రి గెర్మన్ వెల్లడించారు. మరోవైపు రాజధాని కీవ్లో భారీగా పేలుళ్లు జరిగాయి.ఇక్కడి సిటీ సెంటర్ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఆస్తి ప్రాణ నష్ట వివరాలు ఇంకా తెలియరాలేదు. చాలా రోజుల తర్వాత రష్యా తాజాగా ఉక్రెయిన్పై భారీ దాడులకు దిగడంతో సరిహద్దుల్లోని పోలండ్ పూర్తిగా అప్రమత్తమైంది. రష్యా, ఉక్రెయిన్లలో శీతాకాలం అత్యంత తీవ్రంగా ఉంటుంది.ఈ సీజన్లో ఇళ్లలో వేడి కోసం విద్యుత్తు,గ్యాస్ వంటి వాటిని వాడతారు.విద్యుత్ సరఫరాలో గనుక అంతరాయం ఏర్పడితే చలికి తట్టుకోలేక ఉక్రెయిన్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే రష్యా పవర్గ్రిడ్ను లక్ష్యంగా చేసుకుందనే అనుమానాలున్నాయి. -
శీతాకాలంలో గుండె ఆరోగ్యం కోసం..!
శీతాకాలంలో శారీరక శ్రమ తగ్గడం, కాలానుగుణ మార్పులు తదితరాల కారణంగా అధిక రక్తపోటు, కొలస్ట్రాల్ స్థాయిలు పెరగడం జరుగుతుంది. ఈ కాలంలో హృదయనాళం పనితీరుకు అనుగుణమైన ఆహారపదార్థాలు తీసుకుంటే గుండె సంబంధిత ప్రమాదాలను నివారించొచ్చని చెబతున్నారు నిపుణులు. ఈ కాలంలో ఎక్కువగాయాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉన్నవి తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఈ వణికించే చలిలో రక్తపోటుని నిర్వహించి, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వడం మేలని చెబుతున్నారు. అవేంటో చూద్దామా..ఆకు కూరలుపాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరల్లో విటమిన్ ఏ, సీ, కే, ఫైబర్ తోపాటు ఫోలేట్ వంటివి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ ఆకుకూరలు నైట్రేట్లను కలిగి ఉంటాయి. అందువల్ల రక్తపోటును తగ్గించి, ధమనుల పనితీరును మెరుగ్గా ఉంచడంలో కీలకంగా ఉంటాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు గుండెకు హాని కలిగించే ఆక్సీకరణ ఒత్తిడిని కూడా నివారిస్తాయి.నారింజదీనిలో విటమిన్ సీ, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. నారింజలోని పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడగా, ఫైబర్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇక విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నట్స్:ముఖ్యంగా వాల్నట్లు, బాదంపప్పులలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, మెగ్నీషియం తదితరాలు గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఒమేగా -3లు వాపును తగ్గిస్తాయి, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తాయి. అయితే మెగ్నీషియం ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇవి రోజూ కొద్దికొద్దిగా తీసుకుంటే.. ఎలాంటి హృదయ సంబంధ సమస్యలు తలెత్తవు.దానిమ్మ..దానిమ్మపండులో పాలీఫెనాల్స్ అని పిలువబడే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ధమనులలో ఫలకం ఏర్పడటాన్ని తగ్గిస్తాయి. దానిమ్మ రసం త్రాగడం లేదా విత్తనాలు తినడం రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లివెల్లుల్లిలో రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే సామర్థ్యం ఉంటుంది. అందువల్ల ఇది గుండె-ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో అత్యంత కీలకమైనదిగా చెప్పొచ్చు. ఈ చలికాలంలో దీన్ని జోడించటం వల్ల రక్తనాళాల్లో ఎలాంటి బ్లాక్లు ఏర్పడే అవకాశం ఉండదు, గుండె పనితీరు కూడా బాగుంటుంది. క్యారెట్లుక్యారెట్లో బీటా కెరోటిన్, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ను, రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యానికి దోహదడతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంటను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తాయి. క్యారెట్లు పచ్చిగా, ఆవిరిలో ఉడికించి లేదా సూప్లాగా తీసుకోవచ్చు.బీట్రూట్లుబీట్రూట్లలో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని శరీరం నైట్రిక్ ఆక్సైడ్గా మారుస్తుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్లు, పీచుపదార్థాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ సాఫీగా ఉండేలా చేసి గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. ఇవన్నీ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ శీతాకాలంలో వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడమే గాక సమతుల్యమైన ఆహారం శరీరానికి అందించగలుగుతాం. గమనించి: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి అనుసరించడం మంచిది. (చదవండి: సోరియాసిస్ను తగ్గించే సహజసిద్ధమైన ఆయిల్..) -
చలి పులి వచ్చేస్తోంది నెమ్మదిగా...ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
నెమ్మదిగా చలి ముదురుతోంది. వెచ్చని దుప్పట్టు, చలిమంటలు కాస్త ఊరటనిచ్చినా ఇంకా అనేక సమస్యలు మనల్ని వేధిస్తుంటాయి. ముఖ్యంగా శీతగాలులకు శ్వాసకోశ వ్యాధులు, చర్మ సమస్యలు బాగా కనిపిస్తాయి. మరి ఈ సీజన్లో చర్మం పొడిబారకుండా, పగలకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఇదిగో మీ కోసం ఈ చిట్కాలు.పొడి బారే చర్మానికి మాయిశ్చరైజర్లు పదే పదే రాయాల్సి వస్తుంది. ఆ అవసరం లేకుండా, చర్మం మృదుత్వం కోల్పోకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి.పాల మీగడలో తేనె కలిపి ముఖానికి, చేతులకు పట్టించి, మృదువుగా మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.చలికాలం రోజూ ఈ విధంగా చేస్తుంటే చర్మకాంతి కూడా పెరుగుతుంది. చర్మానికి సరైన పోషణ లేక లేకపోతే జీవ కళ కోల్పోతుంది. పాలు, బాగా మగ్గిన అరటిపండు గుజ్జు కలిపి మిశ్రమం తయారుచేసుకొని ప్యాక్ వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. జిడ్డుచర్మం గలవారు పాలు–రోజ్వాటర్ కలిపి రాసుకోవచ్చు. తర్వాత వెచ్చని నీటితో కడిగేయాలి. చర్మంపై ఎక్కువ మృతకణాలు కనిపిస్తే కలబంద రసంలో పది చుక్కల బాదం నూనె, నువ్వుల నూనె కలిపి ముఖానికి, చేతులకు రాయాలి. వృత్తాకారంలో రాస్తూ మర్దన చేయాలి.రాత్రంతా అలాగే వదిలేసి, మరుసటి రోజు ఉదయం వెచ్చని నీటితో కడిగేయాలి.శీతాకాలంలో శరీరాన్ని తేమగా ఉంచుకోవాలి. చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకుంటేనే మెరుస్తూ ఉంటుంది. అలా ఉండాలంటే తగినన్ని నీళ్లు తాగాలి. (నో జిమ్.. నో డైటింగ్ : ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది!)ఫ్యాటీఫుడ్స్కు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తాజా ఆకుకూరలు, సీ విటమిన్ లభించే పండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒత్తిడికి దూరంగా ఉంటూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. రోజూ వాకింగ్, యోగా లాంటి వ్యాయామం చేస్తే శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో మన ముఖంలో చర్మకాంతిలో చక్కటి గ్లో వస్తుంది. -
మంచు కురిసే వేళలో మనాలి విహారం
మనాలి, కులులోయ... ఈ రెండు పర్యాటక ప్రదేశాలను విడిగా చెప్పుకోవడం మనకు అలవాటు లేదు. కులూమనాలిగా కలిపేస్తాం. ఎందుకంటే ఈ రెండింటినీ ఒకే ట్రిప్ల కవర్ చేయవచ్చు. మనాలి పక్కనే ఉన్న లోయ ప్రాంతం కులు. ఈ శీతల ప్రదేశాల పర్యటనకు వేసవి ఒక ఆప్షన్. స్నో ఫాల్ని కళ్లారా చూడాలంటే నవంబర్ రెండవ వారం నుంచి టూర్ ప్లాన్ చేసుకోవాలి. నవంబర్ నుంచి మంచు కురవడం మొదలవుతుంది. డిసెంబర్లో పతాకస్థాయికి చేరుతుంది. చెట్ల ఆకులు మంచుతో బరువుగా వంగిపోతాయి. నేల కనిపించనంత దట్టంగా ఉంటుంది. మనాలి నుంచి కేబుల్కార్లో విహరిస్తూ కులు లోయను చూడవచ్చు. తెల్లటి హిమాలయాలను ఆస్వాదించడానికి ఇదే సరైన సమయం. ఇంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రదేశాన్ని వ్యాలీ ఆఫ్ ద గాడ్స్ అంటారు. ఇక్కడ మనువు గుడి ఉంది. మనువు ఆలయం అనే పేరు మీదనే దీనికి మనాలి అనే పేరు వచ్చింది. ఇదీ చదవండి: చలికాలంలో చుండ్రు బాధ, ఒళ్లు పగులుతుంది ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే! -
చలికాలంలో చుండ్రు బాధ, ఒళ్లు పగులుతుంది ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే!
ఈ ఏడాది నవంబరు మాసం వచ్చినా కూడా సాధారణంగా ఉండేంత చలి వణికించకపోయినా, మిగతా సీజన్లతో పోలిస్తే చలి కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. చలిగాలులు సోకకుండా ఉన్ని,ఊలు దుస్తులను ధరించడంతోపాటు, రోగనిరోధక శక్తిని కాపాడుకునేలా ఆహారం విషయంలో జాగ్రత్తపడాలి.చలికాలంలో శ్వాసకోస వాధులు, ఇన్ఫెక్షన్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత అ ప్రమత్తంగా ఉండాలి. శరీరం వేడిగా ఉండేలా జాగ్రత్తలు పాటించాలి. స్వెట్లర్లు, సాక్సులు, మంకీ క్యాప్లు విధింగా ధరించేలా చూడాలి. లేదంటే జలుబు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. తాజా పండ్లు, ఆకుకూరలతో పాటు, తృణధాన్యాలతో కూడిన పోషకాహారాన్ని మన ఆహారంలో చేర్చుకోవాలి. నిల్వచేసిన, ఫ్రిజ్లో ఉంచిన ఆహారానికి బదులుగా ఎప్పటికప్పుడు వేడిగా తినడం మంచిది. అలాగే చలిగా ఉంది కదా అని మరీ వేడి నీటితో స్నానం చేయకూడదు. తల స్నానానికి కూడా గోరు వెచ్చని నీరు అయితే మంచిది. చుండ్రు సమస్య రాకుండా ఉండాలంటే, చలికాలంలో జుట్టును శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. మైల్డ్ షాంపూ వాడాలి. చలికాలంలో వేడి నీళ్లు తాగితే జీర్ణ సమస్యలు ఉండవు. గొంతు నొప్పి లాంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.ముఖ్యంగా విటమిన్ సీ, ఏ, లభించేలా చూసుకోవాలి. అలాగే చలికాలంలో ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి విటమిన్ డీ అందేలా చూసుకోవాలి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఇలా అనేక రకాల సీజనల్ వ్యాధులను, ఇన్ఫెక్షన్ల ప్రమాదం నుంచి ఇది కాపాడతాయి. కొవ్వు చేపలు, కోడిగుడ్డు,మష్రూమ్స్, సోయా మిల్క్ వంటి వాటిలో డీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది.రోగనిరోధక శక్తిని పెంచేలా విటమిన్ సీ లభించే సిట్రస్ పండ్లను తీసుకోవాలి. నిమ్మ, నారింజ, బ్రోకలీ, బెర్రీ, వివిధ రకాల సిట్రస్ పండ్లపై దృష్టిపెట్టాలి. నట్స్, సీడ్స్, కోడిగుడ్లు, గుమ్మడి గింజలు, చేపలు వంటివి తీసుకోవాలి.విటమిన్ ఏ ఎక్కువగా లభించే క్యారెట్లు, చిలగడ దుంపలు, పాలకూర, పాలు, చీజ్ బీఫ్ లివర్, క్యాప్సికం, గుమ్మడి కాయ కూరగాయలను తీసుకోవాలి. విటమిన్ ఏ చర్మానికి, కంటి ఆరోగ్యానికి మంచిది. వీటితోపాటు, శరీరానికి అవసరమయ్యే అత్యంత ముఖ్యమైన బీ 12,బీ6ను తీసుకోవాలి. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులనుంచి రక్షిస్తాయి. సాల్మన్ చేపలు, టునా ఫిష్, చికెన్, కోడిగుడ్లు, పాలు వంటి పదార్థాల్లో విటమిన్ బి 12 లభిస్తుంది. చలికాలంలో చర్మంపై కూడా చాలా ప్రభావం ఉంటుంది. పగలడం, ఎండిపోయినట్టు అవ్వడం చాలా సాధారణంగా కనిపించే సమస్యు. అందుకే దాహంగా అనిపించకపోయినా, సాధ్యమైనన్ని నీళ్లను తాగుతూ ఉండాలి. దీంతో శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా, తేమగా ఉంటుంది. రాగుల జావ, తాజా పండ్ల రసాలు తీసుకోవాలి.డ్రై స్కిన్ ఉన్న వారికి చిట పటలాడం, మంట పెట్టడం, దురద పెట్టడం లాంటి ఇబ్బందులు మరీ ఎక్కువగా వస్తాయి. అలాంటి వారు ఖ వింటర్ సీజన్ లో మాయిశ్చ రైజింగ్ క్రీములు వాడాలి. చర్మ సంరక్షణ కోసం రసాయన సబ్బులకు బదులుగా ప్రకృతిసిద్ధంగా లభించే వాటితో తయారు చేసుకున్న సున్ని పిండి వాడితే ఉత్తమం. లేదా ఆయుర్వేద, లేదా ఇంట్లోనే తయారు చేసుకున్న సబ్బులను వినియోగించాలి. లేదంటే గ్లిసరిన్ సబ్బులను ఎంచుకోవాలి. విటమిన్ ఇ లభించే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. -
నేడు గంగోత్రి.. రేపు యమునోత్రి మూసివేత
డెహ్రాడూన్: భక్తిశ్రద్ధలతో కొనసాగున్న చార్ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంటోంది. శీతాకాలం రాకతో నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేయనున్నారు. అనంతరం ముఖ్బాలోని గంగా ఆలయంలో గంగోత్రి మాత దర్శనం కొనసాగుతుంది. ఇదేవిధంగా ఆదివారం మధ్యాహ్నం 12.05 గంటలకు యమునోత్రి ధామ్ తలుపులు మూసివేయనున్నారు.దీపోత్సవంతో గంగోత్రి ధామం తలుపులు మూసివేసే ప్రక్రియను ప్రారంభించినట్లు పంచ గంగోత్రి ఆలయ కమిటీ కార్యదర్శి సురేష్ సెమ్వాల్ తెలిపారు. అనంతరం గంగామాత ఉత్సవ విగ్రహంతో డోలి యాత్ర నిర్వహిస్తూ శీతాకాలపు విడిదికి తీసుకువస్తామని చెప్పారు. మరోవైపు యమునోత్రి ధామ్ తలుపులు మూసివేసేందుకు సన్నాహాలు కూడా ప్రారంభించారు. ఆదివారం యమునోత్రి ధామ్ మూసివేసిన తర్వాత, యమునా తల్లి ఉత్సవ విగ్రహాన్ని ఖర్సాలీలోని ఆలయానికి తీసుకువస్తారు. ఈ యాత్రా కాలంలో శుక్రవారం సాయంత్రం వరకు 15 లక్షల 21 వేల 752 మంది యాత్రికులు ఈ రెండు ధామాలను సందర్శించుకున్నారు.ఇది కూడా చదవండి: మొబైల్ డేటా ట్రాఫిక్.. అగ్రగామిగా జియో -
ఢిల్లీలో పెరిగిన కాలుష్యం
న్యూఢిల్లీ:నైరుతి రుతుపవనాలు వెళ్లిపోవడంతో దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.గురువారం(అక్టోబర్3)ఢిల్లీలో కాలుష్యం పెరిగినట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) సూచించింది.ఢిల్లీ-గజియాబాద్ బోర్డర్లోని ఆనంద్ విహార్లో ఏక్యూఏ ఏకంగా 389గా నమోదైంది.దీంతో ఢిల్లీలో అత్యంత కాలుష్య ప్రాంతంగా ఆనంద్విహార్ రికార్డులకెక్కింది.ఆనంద్ విహార్ తర్వాత ముండ్కా,ద్వారకా, వాజీపూర్లలోనూ కాలుష్యం ఏక్యూఐపై 200 పాయింట్లుగా నమోదైంది.అయితే గురుగ్రామ్,ఫరీదాబాద్లలో మాత్రం కాలుష్యం ఏక్యూఐపై అత్యంత తక్కువగా 58,85గా రికార్డయింది.ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గించడానికి పంజాబ్,హర్యానా ప్రభుత్వాలు కేవలం సమావేశాలు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గురువారమే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యంపై చర్యలేవి: సుప్రీంకోర్టు ఆగ్రహం -
మంగోలియాలో చలి పులి పంజా
ప్రకృతి వైపరీత్యం ‘జడ్’మంగోలియాను ముంచెత్తుతోంది. అతి శీతల చలికాలంతో మంగోలియా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రకృతి ప్రకోపం వల్ల ఇక్కడ కనీసం పచ్చగడ్డి కూడా మొలవకపోవడంతో లక్షల సంఖ్యలో పశువులు మృత్యువాత పడుతున్నాయి. అయితే.. గతంలో దశాబ్దానికి ఒకసారి వచ్చిన జడ్.. ఇప్పుడు తరచూ వస్తుండటంతో మంగోలియా ప్రజల ఇబ్బందులు మరింత తీవ్రమయ్యాయి.తూర్పు ఆసియా దేశమైన మంగోలియాలో తీవ్ర అనావృష్టి తరవాత అతి శీతల చలికాలం వస్తే దాన్ని జడ్ అంటారు. ఈ వాతావరణ వైపరీత్యంలో పచ్చగడ్డి కూడా మొలవక పశువులు పెద్ద సంఖ్యలో చనిపోతాయి. ప్రస్తుతం మంగోలియాలో జరుగుతున్నది ఇదే. జడ్ వల్ల ఈ ఏడాది ఒక్క ఫిబ్రవరిలోనే 21 లక్షల పశువులు, గొర్రెలు, మేకలు చనిపోగా మే నెల కల్లా ఆ సంఖ్య 71 లక్షలకు చేరింది. వాటిలో 80 శాతాన్ని, అంటే 56 లక్షల జీవాలను పాతిపెట్టారు. లేదంటే అంటు వ్యాధులు ప్రబలుతాయని మంగోలియా ప్రభుత్వం పశువులను పాతిపెట్టింది. దేశంలో జడ్ వల్ల మున్ముందు మొత్తం కోటీ 49 లక్షల జీవాలు చనిపోవచ్చునని, ఇది మంగోలియా పశుసంపదలో 24 శాతానికి సమానమని ఉప ప్రధాని ఎస్.అమార్ సైఖాన్ చెప్పారు. మంగోలియా జనాభా 33 లక్షలైతే వారికి 6.5 కోట్ల పశువులు, యాక్లు, గొర్రెలు, మేకలు, గుర్రాలు ఉన్నాయి. వీటిని జాతీయ సంపదగా ఆ దేశ రాజ్యాంగం ప్రకటించింది. మంగోలియా ఎగుమతుల్లో గనుల నుంచి తవ్వి తీసిన ఖనిజాల తరవాత మాంసం, ఇతర జంతు ఉత్పత్తులదే రెండో స్థానం. వ్యవసాయంలో 80 శాతం వాటా పశుపాలన, మేకలు, గొర్రెల పెంపకానిదే. దీనివల్ల మంగోలియా జీడీపీలో 11 శాతం లభిస్తోంది.ప్రసుత్తం జడ్ వల్ల మంగోలియా ఆర్థికవ్యవస్థ అస్థిరతకు లోనవుతోంది. ప్రధాన వృత్తి అయిన పశుపాలన దెబ్బతినడంతో ప్రజలు దేశ రాజధాని ఉలాన్ బటోర్కు, ఇతర పట్టణాలకు వలస పోతున్నారు. కానీ, అక్కడ వారందరికీ సరిపడా పనులు లేవు. గతంలో దశాబ్దానికి ఒకసారి వచ్చిన జడ్ ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల మరింత తరచుగా వచ్చిపడుతోంది.ప్రస్తుత జడ్ గడచిన పదేళ్లలో ఆరోది, మహా తీవ్రమైనది. జనానికి తీవ్ర ఆహార కొరత ఎదురవుతోంది. మంగోలియాను ఆదుకోవడానికి 60 లక్షల డాలర్ల విరాళాలను సేకరించాలని అంతర్జాతీయ సంస్థలు తలపెట్టినా మార్చి మధ్యనాటికి అందులో 20 శాతాన్ని కూడా సేకరించలేకపోయాయి. ఉక్రెయిన్, గాజా యుద్ధాలపై ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. -
ఈ నెస్ట్ ట్యూబ్స్తో వేసవిలో ఇల్లు పచ్చగా.. చల్లగా..
వేసవిలో ఇల్లు పచ్చగా.. చల్లగా.. ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటాం. అందుకు ఇంట్లో ప్లేస్ని బట్టి కొన్ని ఇండోర్ ప్లాంట్స్ను ప్లాన్ చేసుకుంటాం. అయితే ఆ ప్లాన్లో కుండీల కన్నా ఈ నెస్ట్ ట్యూబ్స్ని ప్లేస్ చేసుకోండి. పచ్చదనం.. చల్లదనంతోపాటు వాల్ డెకర్గా ఇంటికి కొత్త కళనూ తీసుకొస్తాయి. ఇంట్లో మొక్కలు ఉంటే దోమలు వస్తాయనుకునేవారు హెర్బల్ ప్లాంట్స్ని పెంచుకోవచ్చు ఈ నెస్ట్ ట్యూబ్స్లో. వాటిని ఇదిగో ఇలా వుడెన్ స్టాండ్స్లో సెట్ చేస్తే మీ ఇంటికి కూల్ లుక్ వచ్చేస్తుంది. నెస్ట్ ట్యూబ్స్ నెస్ట్ ట్యూబ్స్తో ఉన్న రెడీమేడ్ వుడెన్ వాల్ స్టాండ్స్.. హ్యాంగింగ్స్.. వెరైటీ డిజైన్స్తో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మార్కెట్స్లో లభ్యమవుతున్నాయి. ఆసక్తి ఉంటే ఇంట్లోనూ తయారుచేసుకోవచ్చు. గ్లాస్ ట్యూబ్స్, వుడెన్ స్టాండ్స్, గ్లూ లేదా స్టికర్స్.. ఉంటే చాలు. గ్లాస్ ట్యూబ్స్ లేకపోతే చిన్న చిన్న వాటర్ బాటిల్స్ను ఉపయోగించవచ్చు. అయితే, అన్నీ ఒకే సైజ్లో ఉండేలా చూసుకోవాలి. ఈ ఎండాకాలంలో ట్రై చేసి చూడండి.. మీ ఇంటి అందం రెట్టింపు అవడం గ్యారంటీ! ఇవి చదవండి: నీ సంబడం సంతకెళ్లి పోను -
పొద్దుపొద్దునే ప్రయాణాలొద్దు!
సాక్షి, హైదరాబాద్: ఈ చలికాలంలో పొగ మంచు ముప్పు పొంచి ఉంటోంది. దట్టమైన పొగమంచు ఎదుటి వాహనాలను కానరాకుండా చేసి వాహనదారులను కాటికి పంపుతోంది. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తెల్లవారుజాము సమయంలో పొగ మంచు తీవ్రంగా కురియడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది. దాంతో వీలైనంత వరకు తెల్లవారుజాము నుంచి ఉదయం 7 గంటల వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే ఉత్తమమని రోడ్డు భద్రత నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి వస్తే.. తప్పకుండా రోడ్డు భద్రత నియమాలు, జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేస్తున్నారు. పొగ మంచు వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాలు ♦ ఈనెల 5న(శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ) రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుద్బుల్లాపూర్ గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు కుతాడి కుమార్, ప్రదీప్ బైక్పై వస్తుండగా పాపయ్యగూడ చౌరస్తా వద్ద టిప్పర్ లారీ ఢీకొట్టడంతో మృతి చెందారు. పొగమంచు కారణంగా రోడ్డు మసకబారడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ♦ 25 డిసెంబర్, 2023న నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు వద్ద రాత్రి 10 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 ఏండ్ల యువకుడు రమావత్ శివనాయక్ ద్విచక్రవాహనంతో 55 ఏండ్ల బల్లూరి సైదులు అనే వ్యక్తిని ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న మృతుడు శివ నాయక్ బంధువులు టాటాఏస్ వాహనంలో ప్ర మాద ఘటన స్థలానికి బయలుదేరారు. తెల్లవా రుజామున 3 గంటల సమయంలో వారు ప్ర యాణిస్తున్న టాటాఏస్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ నిడమనూరు మండలం 3వ నంబర్ కెనాల్ వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. దట్టమైన పొగమంచు కారణంగానే ఈ వరుస ప్ర మాదాలు జరిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. ♦ డిసెంబర్ 31న తెల్లవారుజామున జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్సు, డీసీఎం ఎదురెదురుగా వస్తూ ఢీకొన్న ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ చనిపోగా, ఆర్టీసీ బస్ డ్రైవర్తోపాటు ఆ బస్సులోని మరో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పొగమంచుతో రోడ్డు సరిగా కనిపించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలిపారు. ♦ డిసెంబర్ 25న హైదరాబాద్ నుంచి వికారాబాద్ జిల్లా అనంతగిరి ఔటింగ్కు వెళ్లి తిరిగి వస్తున్న మిత్రుల బృందం కారు పొగమంచు కారణంగా రోడ్డు పక్కన ఉన్న శివారెడ్డిపేట్ చెరువులోకి దూ సుకెళ్లింది. కారులో ఉన్న ఒకరు గల్లంతు కాగా, మిగిలిన నలుగురిని స్థానికులు కాపాడారు. ప్రయాణం తప్పనిసరైతే ఇవి మరవొద్దు ♦ పొగమంచు కురుస్తున్నప్పుడు మీకు కేటాయించిన లేన్లోనే వాహనం నడపాలి. వీలైనంత వరకు ఓవర్టేక్ చేయకపోవడమే ఉత్తమం. ♦ సింగిల్ రోడ్డులో వాహనం నడపాల్సి వస్తే.. వీలైనంత వరకు మీ వాహనం ఎడమవైపు ఉండేలా చూసుకోవాలి. ♦ డ్రైవింగ్ సమయంలో ఏ సంశయం ఉన్నా..రోడ్డు పూర్తిగా కనిపించకపోయినా మీ వాహనాన్ని రోడ్డు పక్కకు నిలపడమే ఉత్తమం. మీరు వాహనాన్ని పార్క్ చేసినట్టుగా సూచిస్తూ పార్కింగ్ లైట్లు వేయాలి. ♦ పొగమంచు వాతావరణం ఉన్నప్పుడు వాహన వేగాన్ని వీలైనంత వరకు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎదుటి వాహనం కనిపించని పరిస్థితుల్లో వేగంగా వెళితే వాహనాన్ని కంట్రోల్ చేయడం కష్టం. అదేవిధంగా ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. ♦ పొగమంచు కురుస్తున్నప్పడు డ్రైవర్లు సాధారణంగా హైబీంలో లైట్లు పెడతారు. ఇలా చేయడం వల్ల రిప్లెక్షన్ వల్ల డ్రైవర్కు సరిగా కనిపించదు. విజిబిలిటి 100 మీటర్లలోపు ఉన్నట్లయితే హెడ్లైట్లు లోబీంలో ఉంచాలి. మీ వాహనానికి ఫాగ్ ల్యాంప్లు ఉంటే వాటిని తప్పక ఆన్ చేయాలి. ఎదుటి వాహనదారుడిని అప్రమత్తం చేసేలా మీ వాహనానికి ఇండికేటర్లు వేసు కుని వెళ్లడం ఉత్తమం. మీ వాహన అద్దాలు వీలైనంత వరకు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మీ కారులోని డీఫాగర్ను ఆన్ చేసుకోవాలి. ♦ వీలైనంత వరకు ఎదురుగా ఉన్న రోడ్డు స్పష్టంగా కనిపించేలా అవసరం మేరకు డ్రైవింగ్ సీట్ను సర్దుబాటు చేసుకోవాలి. ♦ పొగమంచు ఉన్నప్పుడు వాహనం ఒక్క క్షణం అదుపు తప్పి పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రైవింగ్పైనే దృష్టి పెట్టాలి. నిద్రమత్తు లేకుండా జాగ్రత్త పడాలి. ♦ వాహనం పూర్తి కండీషన్లో ఉండేలా చూసుకోవాలి. టైర్లు, బ్రేక్లు ముందుగానే చెక్ చేసుకోవాలి. మీ కారులోని హీటర్ ఆన్ చేయాలి. దీనివల్ల బయటి పొగమంచుతో అద్దంపై ప్రభావం లేకుండా ఉంటుంది. ♦ లేన్ మారుతున్నప్పుడు, మూల మలుపుల వద్ద తప్పకుండా హారన్ మోగించాలి. ♦ మొబైల్ ఫోన్ వాడడం, రేడియోలో ఎఫ్ఎం వినడం, పాటలు వింటూ డ్రైవింగ్ చేయవద్దు. -
ఆ రాష్ట్రంలోని పాఠశాలలకు సెలవులు
ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో తీవ్రమైన చలి వాతావరణం నెలకొనడంతో పాటు ఉదయం, సాయంత్రం వేళ్లల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ఫలితంగా విద్యార్థులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని పాఠశాలలకు శీతాకాల సెలవులు ప్రకటించారు. పెరుగుతున్న చలి దృష్ట్యా ఈనెల 14 వరకూ ఘజియాబాద్లోని అన్ని పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. జలౌన్లో జనవరి 6 వరకు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలను మూసివేయాలని జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ప్రయాగ్రాజ్లోనూ చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని పాఠశాలలను ఈ నెల 6 వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర, గుర్తింపు పొందిన పాఠశాలలు మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారణాసిలో నిరంతరం పెరుగుతున్న చలి, దట్టమైన పొగమంచు దృష్ట్యా పాఠశాల సమయాలను మార్చారు. జిల్లా మేజిస్ట్రేట్ ఎస్. రాజలింగం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జనవరి 2 నుంచి 6వ తేదీ వరకు ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు మాత్రమే పాఠశాలలను నిర్వహించనున్నారు. -
వింటర్లో ముఖం తేటగా ఉండాలంటే వెంటనే ఇలా చేయండి!
'చలికాలంలో ముఖం పొడిబారిపోవడమూ, పెదవులు పగలడం, ముఖంపై ముడతలు రావడం చాలా సాధారణం. అందరికీ తెలిసిన చిట్కా వ్యాజలైన్ రాయడంతో పాటు ఈ కాలంలోనూ ముఖం తేటగా, ఆరోగ్యంగా ఉంచేందుకు పాటించాల్సిన చిట్కాలివి..' చలికాలంలో ఉదయం, సాయంత్రం మంచుకురుస్తున్నా.. మధ్యాహ్నపు ఎండ తీక్షణంగా గుచ్చుతున్నట్టుగా ఉంటుంది. ఈ మంచుకూ, మధ్యాహ్నపు ఎండకూ నేరుగా ముఖచర్మం ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఈకాలంలో ఉండే మంచు, పొగ కలిసిన కాలుష్యం.. స్మాగ్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. తేలికపాటి వ్యాయామం వల్ల ముఖానికి తగినంత రక్తప్రసరణ జరిగి ముఖం తేటగా మారుతుంది. రోజుకి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్రతో ముఖం తేటబారుతుంది. ఆహార పరంగా.. అన్ని రకాల పోషకాలు అందే సమతులాహారాన్ని రోజూ తీసుకోవాలి. అయితే చలి వాతావరణం కారణంగా నీళ్లు తక్కువగా తాగుతుంటారు. ఇది సరికాదు. రోజూ తప్పనిసరిగా మూడు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలి. ఆకుకూరలు, కూరగాయలూ, ములగకాడల వంటి తాజా కూరలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ సీజన్లో దొరికే పండ్లను తప్పక తీసుకోవాలి. ఇందులోని నీటిమోతాదులూ, పోషకాలూ, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచి ముఖాన్ని తేటగా కనిపించేలా చేస్తాయి. డ్రైఫ్రూట్స్ పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. అందులో జీడిపప్పు వంటి కొవ్వులు ఎక్కువగా ఉండే నట్స్ కంటే బాదం పప్పు వంటి కొవ్వులు తక్కువగా ఉండే నట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇవి చదవండి: గుడిలో తీర్థం, ప్రసాదాలు ఎందుకు ఇస్తారో తెలుసా? కారణమిదే! -
శీతాకాలం ముఖానికి కొబ్బరి నూనె రాస్తున్నారా?
శీతకాలంలో ముఖం డ్రైగా మారి గరుకుగా ఉంటుంది. స్కిన్ కూడా తెల్లతెల్లగా పాలిపోయినట్లు అయిపోతుంది. మన ముఖాన్ని టచ్ చేస్తేనే మనకే ఇరిటేషన్గా ఉంటుంది. దీంతో ఇంట్లో ఉండే కొబ్బరి నూనెనే గబుక్కున రాసేస్తుంటాం. అందరికీ అందుబాటులోనూ చవకగా ఉంటుంది కూడా. చిన్నప్పటి నుంచి చర్మంపై దురద వచ్చినా, కందినా కూడా కొబ్బరి నూనెనే రాసేవాళ్లం. అయితే ఇలా రాయడం మంచిదేనా? రాస్తే ఏమవుతుంది తదితరాల గురించే ఈ కథనం!. ఏం జరుగుతుందంటే.. ముఖానికి కొబ్బరి నూనె రాయడం చాలా మంచిదే గానీ దాన్ని సరైన విధంగా ముఖానికి అప్లై చేస్తేనే ఫలితం ఉంటుందని సౌందర్య నిపుణలు అంటున్నారు. రాత్రిపూట ముఖానికి కొబ్బరి నూనెతో సున్నితంగా మసాజ్ చేస్తే రాత్రంత ముఖం తేమగా, కోమలంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ మసాజ్ వల్ల ముఖం అంతా రక్తప్రసరణ జరిగి తాజాగా ఉండటమే గాక ముఖ చర్మం చాలా కాంతివంతంగా మారుతుంది పొడి చర్మం ఉన్నవారికి ఈ కొబ్బరి నూనె మంచి మాయిశ్చరైజషన్గా ఉంటుంది. ఇందులో ఎలాంటి కృత్రిమ రసాయనాలు ఉండవు కాబట్టి దుష్ప్రభావాలు ఉండవని చెబుతున్నారు దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమల వల్ల వచ్చే వాపులను తగ్గిస్తుంది. అలాగే కళ్ల కింద వాపులను కూడా నయం చేస్తుంది. మొటిమలు, వాటి తాలుకా మచ్చలను తగ్గిచడంలో కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బ్లాక్హెడ్స్, వైట్ హెడ్స్ వంటి వాటిని కూడా తగ్గిస్తుంది. అతినీలలోహిత కిరణాలను నిరోధించే శక్తి ఈ కొబ్బరి నూనెకు ఉంది. అందువల్ల ఇది మంచి యాంటీ ఏజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. దీన్ని సహజ మేకప్ రిమూవర్గా కూడా ఉపయోగించొచ్చు. చెప్పాలంటే.. మేకప్ని తొలగించి చర్మాన్ని శుభ్రపరిచే క్లెన్సర్గా పనిచేస్తుంది. (చదవండి: బరువు తగ్గడంలో పనీర్ హెల్ప్ అవుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే..?) -
‘రాత్రుళ్లు ఎవరూ బయట నిద్రించకుండా చూడండి’
చలిగా ఉన్న రాత్రివేళల్లో ఎవరూ బహిరంగ ప్రదేశాల్లో నిద్రించకుండా చూడాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా రాత్రివేళ రోడ్డు పక్కన బహిరంగ ప్రదేశంలో నిద్రిస్తున్నట్లయితే వారిని నైట్ షెల్టర్లకు తరలించాలని ఆయన అధికారులకు సూచించారు. మకర సంక్రాంతి రోజున గోరఖ్నాథ్ ఆలయంలో నిర్వహించే ఖిచ్డీ జాతరకు వచ్చే భక్తులకు కూడా నైట్ షెల్టర్లలో వసతి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గోరఖ్నాథ్ ఆలయంలో జనతా దర్శన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం అనంతరం పౌర సదుపాయాలు, ఖిచ్డీ జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాత్రిపూట గస్తీ నిర్వహించాలని పోలీసులకు సూచించారు. ఎవరైనా బహిరంగ ప్రదేశంలో నిద్రిస్తున్నట్లు కనిపిస్తే, వారిని గౌరవప్రదంగా సమీపంలోని నైట్ షెల్టర్కు తీసుకెళ్లాలని అన్నారు. అనాథలైన వారు చలిలో రోడ్డుపై వణుకుతున్నట్లు కనిపించకుండా చూడాలన్నారు. ఎవరైనా మానసిక వ్యాధితో బాధపడుతూ ఆరుబయట పడుకుంటే వారిని మానసిక వికలాంగుల ఆశ్రయాలకు తరలించి వైద్యం చేయించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని నైట్ షెల్టర్లలో తగిన సంఖ్యలో పడకలు, దుప్పట్లు ఏర్పాటు చేయాలని, పరిశుభ్రతపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైనవారికి ఆహారం అందించాలని అధికారులకు సూచించారు. డిసెంబర్ 31 నాటికి ఖిచ్డీ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. జనవరి ఒకటి నుంచి భక్తులు రాక మొదలవుతుందన్నారు. ఈ జాతరకు వచ్చే భక్తుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో మేయర్ డాక్టర్ మంగ్లేష్ శ్రీవాస్తవ, జోన్ ఏడీజీ అఖిల్ కుమార్, డివిజనల్ కమిషనర్ అనిల్ ధింగ్రా తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చూడండి: దుకాణాల్లోకి దూసుకెళ్లిన ట్రాలీ.. నలుగురు మృతి! -
నులివెచ్చని చలికాలాలు
ఇదివరకటి చలికాలాలు వజవజ వణికించేవి. జనాలను చలిమంటలు వేసుకునేలా పురిగొల్పేవి. ఏడాదంతా బీరువాల్లో మగ్గిన స్వెట్టర్లు, మఫ్లర్లు, శాలువాలు ఒంటి మీదకు వచ్చేవి. ఏటా అక్టోబర్లో శరన్నవరాత్రులు మొదలయ్యే నాటికే వాతావరణంలో తేడా స్పష్టంగా తెలిసేది. గాలి పొడిబారడం, సాయంత్రం అయ్యేసరికి చిరుచలి ప్రారంభం కావడం జరిగేది. చలికాలం దుస్తులను అమ్మే దుకాణాలు ఊరూరా వీథుల్లో వెలిసేవి. ఆ దుకాణాలు జనాలతో కళకళలాడేవి. ఇక డిసెంబరు వచ్చిందంటే రాత్రంతా దుప్పట్లో ముసుగుతన్ని పడుకున్న మనుషులు ఉదయాన్నే లేచి బయటకు రావడానికి వెనుకాడే పరిస్థితులు ఉండేవి. కొన్నేళ్లుగా చలికాలాలు బాగా మారిపోయాయి. క్రమంగా నులివెచ్చదనాన్ని సంతరించుకుంటున్నాయి. చలికాలాలు మనుషులను వజవజ వణికించడం అటుంచితే, ఇప్పుడవి చిరుచెమటలు పట్టిస్తున్నాయి. చలికాలం దుస్తులను అమ్మే దుకాణాలు గిరాకీల్లేక వెలవెలబోతున్నాయి. చలికాలాలు కాలక్రమేణా వెచ్చబడుతుండటం మన దేశంలోని చాలా ప్రాంతాలకు చెందిన ప్రజలకు గత కొద్ది సంవత్సరాలుగా అనుభవపూర్వకంగా తెలుసు. చలికాలాల్లో హిమపాతంతో వణికిపోయే చాలా దేశాల్లో కొద్ది సంవత్సరాలుగా చలి తీవ్రత తగ్గుముఖం పడుతూ వస్తోంది. భూతాపం పెరుగుతుండటం వల్లనే ప్రపంచవ్యాప్తంగా శీతకాలాల్లో చలితీవ్రతలు తగ్గుముఖం పడుతుండటం, వేసవుల్లో ఉష్ణోగ్రతలు ఇదివరకటి కంటే గణనీయంగా పెరుగుతుండటం సంభవిస్తున్నట్లు పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గడచిన యాభయ్యేళ్లుగా వేసవులు వేడెక్కుతుండటంతో పోల్చి చూస్తే, చలికాలాలు ఎక్కువగా వెచ్చబడుతూ వస్తున్నాయని అమెరికాలోని నేషనల్ సెంటర్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ డికీ ఆరంట్ వెల్లడించడం విశేషం. పారిశ్రామిక విప్లవం తర్వాతి నుంచి ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నాయి. అమెరికన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు చెందిన ‘గాడాడ్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ సైన్స్’ లెక్కల ప్రకారం 1880 నుంచి చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు కనీసంగా 1.1 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరిగాయి. ఈ పెరుగుదలలో దాదాపు మూడొంతులు 1975 తర్వాతి నుంచే నమోదవుతూ వస్తోంది. చలికాలాలు వెచ్చబడుతుండటం మన భారత్ వంటి ఉష్ణమండల దేశాలకు మాత్రమే పరిమితమైన పరిణామం కాదు, హిమపాతంతో వణికిపోయే చలి దేశాల్లోనూ ఈ దిశగా మార్పులు కనిపిస్తున్నాయి. హిమపాతం పరిమాణంలో గణనీయమైన తగ్గుదల నమోదవుతోంది. ఇందుకు ఒక చిన్న ఉదాహరణ: చలి దేశాల్లో హిమపాతం పరిమాణం ►136 ఏళ్ల సగటు హిమపాతంలో తగ్గుదల 6.9 అంగుళాలు ►50 ఏళ్ల సగటు హిమపాతంలో తగ్గుదల 5.7 అంగుళాలు ►10 ఏళ్ల సగటు హిమపాతంలో తగ్గుదల 4.1 అంగుళాలు భూతాపం పెరుగుదలే కారణం భూతాపం పెరుగుదల కారణంగానే చలికాలాల్లో చలి తీవ్రత క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఉష్ణమండల దేశాల్లోనైతే, కొన్ని ప్రాంతాల్లో చలికాలంలో కూడా చిరుచెమటలు పట్టే పరిస్థితులు నెలకొంటున్నాయి. గడచిన యాభయ్యేళ్లుగా భూతాపం పెరుగుదల ప్రస్ఫుటంగా కనిపిస్తున్నా, పద్దెనిమిదో శతాబ్ది చివర్లో పారిశ్రామిక విప్లవం మొదలయ్యాక యంత్రాల వినియోగం పెరగడం వల్ల 1830–50 నాటికే భూతాపం పెరుగుదలలో తొలి సూచనలు కనిపించసాగాయి. జనాభా పెరుగుదల, పారిశ్రామిక విప్లవం ఫలితంగా అడవుల నరికివేత, వ్యవసాయం సహా రకరకాల అవసరాల కోసం పశుపోషణ పెరగడం, మోటారు వాహనాల ఉత్పత్తి, వినియోగం పెరగడం వల్ల పెట్రో ఉత్పత్తుల వినియోగంలో పెరుగుదల, వీటన్నింటి ఫలితంగా వాతావరణంలోకి కర్బన ఉద్గారాల పెరుగుదల భూతాపాన్ని గణనీయంగా పెంచుతున్నాయి. ఉత్తరార్ధ గోళంలోని ఉష్ణమండల ప్రాంతాల్లో భూతాపం పెరుగుదల కొన్ని దశాబ్దాలుగా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1880 నాటికి 13.6 డిగ్రీల సెల్సియస్ ఉండగా, 1960 నాటికి 13.9 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. ఇప్పుడిది 14.8 డిగ్రీల సెల్సియస్కు పెరిగింది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలలో 1970 తర్వాతి నుంచి మరింతగా దిగజారింది. 1970 నుంచి 2000 వరకు ప్రతి దశాబ్దికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల్లో 1.5 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల నమోదవుతూ రాగా, 2000 తర్వాతి నుంచి ఇప్పటి వరకు ఈ పెరుగుదల ప్రతి దశాబ్దికి సగటున 2.07 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. వెచ్చని చలికాలాలతో వెతలుతప్పవు చలికాలాల్లో ఉష్ణోగ్రతలు ఎప్పటి మాదిరిగా పడిపోకుండా, కొంత వెచ్చగా ఉంటే చలి బాధలు లేకుండా బాగానే అనిపించవచ్చు. అయితే, ఈ పరిస్థితి ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వెచ్చని చలికాలాల్లో వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. ఫలితంగా ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తాయి. ఈ వ్యాధులు కొందరికి ప్రాణాంతకం కూడా కావచ్చు. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం ఎక్కువై, అలెర్జీల వంటి బాధలు కూడా పెరుగుతాయి. కొన్నిరకాల వృక్షజాతులు గాలిలోకి పుప్పొడి వెదజల్లే కాలం మరింతగా పెరగడం వల్ల కంటి జబ్బులు, చర్మంపై దద్దుర్లు, రకరకాల శ్వాసకోశ వ్యాధులు ఎక్కువవుతాయి. దీనివల్ల పిల్లలు బడులకు, పెద్దలు పనులకు వెళ్లలేని రోజులు పెరుగుతాయి. విలువైన పనిదినాలు వ్యర్థమవుతాయి. నులివెచ్చని చలికాలాలు ఆరోగ్యంపై నేరుగాను, ఆర్థిక వ్యవస్థలపై పరోక్షంగాను దుష్ప్రభావం చూపుతాయి. చలికాలాలు వెచ్చబడటం వల్ల హిమాలయాలు సహా ప్రపంచంలోని పలు మంచు పర్వతాలపై పేరుకునే మంచు మందం తగ్గిపోతుంది. పర్వతాలపై మందంగా పేరుకునే మంచు వేసవికాలంలో నదుల్లోని నీటికి ఆధారం. మంచు మందం తగ్గిపోవడం వల్ల నదుల్లోకి నీటి ప్రవాహం కూడా ఆ మేరకు తగ్గిపోతుంది. ఫలితంగా పలు ప్రాంతాల్లో తాగునీటికి, సాగునీటికి కటకట ఏర్పడి, కరవు కాటకాలు తలెత్తుతాయి. నేలలోని తేమ ఇంకిపోయి సున్నితమైన పలు వృక్షజాతులు అంతరించిపోతాయి. అంతేకాదు, ఈ పరిస్థితుల వల్ల కార్చిచ్చులు కూడా పెరుగుతాయి. వెచ్చని చలికాలాలు వేసవి తీవ్రతను మరింతగా పెంచుతాయి. వేసవి రోజులను కూడా మరింత పెంచుతాయి. ఇప్పటికైనా భూతాపాన్ని అరికట్టలేకపోతే, 2050–2100 మధ్య కాలానికి పరిస్థితులు మరింతగా దిగజారి, వేసవి బాధలు మూడురెట్లు పెరుగుతాయని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో పరిస్థితి మన దేశంలో ఈసారి చలికాలం చలి తీవ్రత తక్కువగానే ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. మన దేశంలో దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలోను, ఈశాన్య రాష్ట్రాల్లోను చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈసారి ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో సైతం చలి తీవ్రత తక్కువగానే ఉంటుందని, కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇదివరకటి స్థాయిలో పడిపోయే పరిస్థితులు లేవని ఐఎండీ అంచనా. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఫిబ్రవరి వరకు దేశవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలతో పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగానే నమోదవుతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్రో ప్రకటించారు. మంచు ప్రదేశాల మీదుగా వీచే పడమటి గాలుల తీవ్రత తగ్గడమే కాకుండా, మరోవైపు ‘లా నినా’ పరిస్థితి నెలకొనడం వల్లనే ఈసారి చలికాలంలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని, ఈ చలికాలం వెచ్చగానే ఉంటుందని ఆయన వెల్లడించారు. మన దేశంలో 1901 నుంచి రికార్డులను చూసుకుంటే, తొలిసారిగా 1912–13 చలికాలంలో సాధారణం కంటే 0.69 సెల్సియస్ ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే, 1926లో సాధారణం కంటే 0.70 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ శతాబ్దిలో 2009 శీతాకాలంలో సాధారణం కంటే ఏకంగా 1.25 డిగ్రీల సెల్సియస్ మేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. స్థూలంగా చూసుకుంటే, 1901–2018 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా వార్షిక సగటు ఉష్ణోగ్రతలు 2.4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగాయి. గంగా నది పరివాహక ప్రాంతంలోని నగరాల్లో పరిశ్రమల పెరుగుదల, దేశవ్యాప్తంగా మోటారు వాహనాల వినియోగంలో పెరుగుదల తదితర అంశాలు మన దేశంలో సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఫలితంగా చలికాలాలు ఏడాదికేడాది వెచ్చబడుతూ వస్తున్నాయి. వాతావరణ మార్పులు శరవేగంగా చోటు చేసుకుంటున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలుస్తోంది. ఈ జాబితాలో చైనా, అమెరికా మొదటి రెండు స్థానాల్లో నిలుస్తున్నాయి. ఉష్ణోగ్రతల్లో నమోదవుతున్న పెరుగుదలను అరికట్టేందుకు ఇప్పటికైనా చర్యలు తీసుకోకుంటే ఈ దేశాల్లో 2050 నాటికి అత్యంత విపత్కర పరిస్థితులు తప్పవని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జల వనరులకూ చేటు చలికాలాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా జలవనరులకూ చేటు తప్పదు. వెచ్చని చలికాలాలు గాలిలో తేమను పెంచుతాయి. ఫలితంగా మంచు కురిసే ప్రాంతాల్లో హిమపాతం తగ్గుతుంది. తీర ప్రాంతాల్లో అకాల వర్షాలు, తుఫానులు పెరుగుతాయి. సముద్ర తీరానికి సుదూరంగా ఉండే ప్రాంతాల్లో అనావృష్టి పరిస్థితులు ఏర్పడతాయి. తీర ప్రాంతాల్లో అతివృష్టి కారణంగా నదులు, సరస్సుల్లోకి నీటి ప్రవాహం ఉధృతమవుతుంది. ‘యూఎస్ గ్లోబల్ చేంజ్ రీసెర్చ్ ప్రోగ్రామ్’ వాతావరణ మార్పులపై విడుదల చేసిన మూడో నివేదిక ప్రకారం... భూగర్భజలాల్లో అవసరమైన పోషకాలు తగ్గిపోయి, నాణ్యత లోపిస్తుంది. సముద్రాల్లో నీటిమట్టం పెరుగుతుంది. నదుల్లోని మంచినీటిని మానవ అవసరాల కోసం మళ్లించడం వల్ల నదుల్లో తగ్గిన నీటిమట్టాన్ని భర్తీ చేయడానికి సముద్రపు నీరు వచ్చి చేరుతుంది. చెరువులు, సరస్సులు, నదుల్లో ఆక్సిజన్ పరిమాణం గణనీయంగా తగ్గిపోయి ‘హైపోక్సియా’ పరిస్థితి నెలకొంటుంది. ఫలితంగా జలవనరులను ఆశ్రయించుకుని పెరిగే చేపలు, రొయ్యలు, పీతలు వంటి జలచరాల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. సముద్రాల్లో నీటిమట్టాలు పెరగడం, తరచు తుఫానులు, వరదలు ముంచెత్తడం వల్ల వ్యవసాయ క్షేత్రాల్లో మట్టి కోతకు గురవుతుంది. ఆహార ధాన్యాల పంటలకు విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. జలవనరులు కలుషితమై వ్యాధులు విజృంభిస్తాయి. నీటి లభ్యత, నీటి నాణ్యత క్షీణించడం వల్ల వ్యవసాయానికే కాకుండా, విద్యుదుత్పాదన రంగానికి, ఇతర మౌలిక రంగాలకు కూడా నష్టం వాటిల్లుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత, ప్రజారోగ్యం గడ్డు సమస్యలుగా పరిణమిస్తాయి. వ్యవసాయానికీ నష్టాలు వెచ్చని చలికాలాలు వరుసగా వస్తుంటే వ్యవసాయానికి కూడా నష్టాలు తప్పవు. ఉత్తరార్ధ గోళంలోని దేశాల్లో నవంబరు నెలాఖరు లేదా డిసెంబరు మొదటి వారానికల్లా చలి తీవ్రత స్పష్టంగా పెరగడం సహజం. అందుకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లయితే, పంట దిగుబడుల్లో దాదాపు 25 శాతానికి పైగా నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయని బ్రిటన్కు చెందిన జాన్ ఇనిస్ సెంటర్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో తేలింది. చలికాలంలో ఉండాల్సినంత చలి లేకుంటే, పంటల పెరుగుదల నెమ్మదించి, దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయని, ముఖ్యంగా చల్లని వాతావరణంలో త్వరగా పెరిగే నూనెగింజల పంటలకు మరింతగా నష్టం వాటిల్లుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చలికాలంలో ఉండాల్సినంత చలి లేకుంటే, పొలాల్లో నాటిన మొక్కలు చురుకుదనాన్ని కోల్పోతాయి. ఫలితంగా వ్యవసాయ పంటల దిగుబడి చేతికి రావాల్సిన కాలం పెరుగుతుంది. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో పంటలకు చీడపీడలను తట్టుకునే శక్తి గణనీయంగా క్షీణిస్తుంది. దోమలు, నల్లులు వంటి కీటకాల బెడద ఎక్కువవుతుంది. ఈ పరిస్థితులు రైతులు, వ్యవసాయ కార్మికులతో పాటు పాడి పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వెచ్చని చలికాలాల వల్ల కార్చిచ్చుల ముప్పు పెరిగి పంట భూములకు, గడ్డి భూములకు తీరని నష్టం వాటిల్లుతుంది. ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా చలికాలంలోని ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా పెరిగినా, ఆ ప్రాంతంలో పంటల దిగుబడి కనీసం 6 శాతం వరకు పడిపోతుందని, ఈ పరిస్థితి ఆహార భద్రతకు చేటు కలిగిస్తుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) చెబుతోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, రానున్న రెండు మూడు దశాబ్దాలలో పంట దిగుబడులకు వాటిల్లే నష్టం 12 శాతం వరకు పెరగవచ్చని, ఈ శతాబ్ది చివరి నాటికి ఈ నష్టం 25 శాతానికి చేరుకోగలదని ఎఫ్ఏఓ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎఫ్ఏఓ అంచనాల ప్రకారం చలికాలాలు వెచ్చబడుతుండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆహార పంటలైన మొక్కజొన్న, గోధుమలు, వరి, బంగాళదుంపలు, అరటి దిగుబడులు ఏడాదికేడాది తగ్గిపోయే పరిస్థితులు తలెత్తుతాయి. చలికాలంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదైతే, వరి దిగుబడులు 5.5 శాతం, గోధుమ దిగుబడులు 3 శాతం, మొక్కజొన్న దిగుబడులు 3 శాతం, బంగాళదుంపల దిగుబడులు 6 శాతం, అరటి దిగుబడులు 15 శాతం మేరకు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చలికాలం దుస్తుల దుకాణాలు వెలవెల మన దేశంలో ఏటా దసరా రోజులు పూర్తి కాగానే నగరాల్లోను, పట్టణాల్లోనూ వీథుల పక్కన చలికాలం ధరించే స్వెటర్లు, మఫ్లర్లు, శాలువలు, మంకీ క్యాప్లు, రగ్గులు, రజాయిలు వంటి చలికాలం దుస్తులు విక్రయించే తాత్కాలిక దుకాణాలు వెలుస్తాయి. ఇదివరకు ఈ దుకాణాలు నవంబర్ ప్రారంభంలోనే జనాలతో కళకళలాడేవి. అమ్మకాలు ఇబ్బడిముబ్బడిగా సాగేవి. గడచిన దశాబ్దకాలంలో చలికాలాల్లో ఉండాల్సినంత చలి లేకపోతుండటంతో జనాలు చలికాలం దుస్తుల కొనుగోళ్లను తగ్గించుకున్నారు. ఫలితంగా చలికాలం దుస్తుల తాత్కాలిక దుకాణాలు బేరాలు లేక వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో సైతం స్వెటర్లు, మఫ్లర్లు, శాలువలు, వింటర్ కోట్లు వంటి వాటి అమ్మకాలు దాదాపుగా జరగడం లేదు. మాల్స్లో ఈ దుస్తులు ఏళ్ల తరబడి అలాగే పేరుకుపోయి కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి మన దేశంలోనే కాదు, కొద్ది సంవత్సరాలుగా మన దేశంలో కంటే చలి ఎక్కువగా ఉండే అమెరికాలోను, పలు యూరోప్ దేశాల్లోనూ కనిపిస్తోంది. ‘కొద్ది సంవత్సరాలుగా మా స్టోర్స్లో స్వెటర్లు, వింటర్ జాకెట్లు, కోట్లు వంటివి పేరుకుపోయి ఉన్నాయి. వీటిని వదిలించుకోవడానికి డిస్కౌంట్లు భారీగానే ప్రకటించాం. అయినా, వీటి అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు’ అని అమెరికాలోని హెచ్ అండ్ ఎం స్టోర్స్ సీఈవో హెలీనా హెల్మర్సన్ మీడియా వద్ద వాపోవడం వెచ్చని చలికాలాల పరిస్థితికి అద్దంపడుతోంది. -
రాబోయే రోజుల్లో... దేశంలోని వాతావరణం ఇలా..
దేశంలో వాతావరణ పరిస్థితులు నిరంతరం మారుతూ ఉంటాయి. ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు నెలకొనివుంది. దక్షిణ భారతదేశంలో వర్షాకాలం కొనసాగుతోంది. హిమాచల్లోని కొండ ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. జమ్మూకశ్మీర్లో ఎముకలు కొరికే చలి వ్యాపించింది. శుక్రవారం రాత్రి శ్రీనగర్లో ఈ సీజన్లో అత్యంత చలి వాతావరణం ఏర్పడింది. నగరంలో ఉష్ణోగ్రత -4.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాల ప్రకారం రానున్న రెండు రోజుల్లో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజుల్లో వాయువ్య, మధ్య, తూర్పు భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకూ తగ్గే అవకాశం ఉంది. #WATCH | Tamil Nadu: Heavy rain lashes parts of Coimbatore city early morning pic.twitter.com/2b9NmFCStR — ANI (@ANI) December 9, 2023 తమిళనాడులోని కోయంబత్తూరులో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం దేశంలోని జార్ఖండ్, బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ , అండమాన్, నికోబార్ దీవులలో వర్షాలు కురుస్తాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశం ఉంది. తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 12న పశ్చిమ బెంగాల్, సిక్కింలో వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 10న దక్షిణ భారతదేశంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాజస్థాన్లోనూ చలి ప్రభావం పెరుగుతున్నదని వాతావరణ శాఖ తెలిపింది. ⛈️ Weather Alert! Possibility of scattered rain in parts of #Karnataka and #Kerala! 🌧️ #RainyDay #KarnatakaWeather #KeralaRain pic.twitter.com/2zg3lu1P3U — Weather & Radar India (@WeatherRadar_IN) December 9, 2023 ఇక ఢిల్లీ-ఎన్సీఆర్ విషయానికి వస్తే శనివారం ఉదయం చల్లగాలులు వీచాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ-ఎన్సీఆర్లో డిసెంబర్ 15 తర్వాత చలి గణనీయంగా పెరగనుంది. కనిష్ట ఉష్ణోగ్రత ఆరు డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకోవచ్చు. ఇది కూడా చదవండి: కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి! -
విద్యార్థులకు శీతాకాలపు సెలవులు తగ్గింపు
దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలలకు శీతాకాలపు సెలవులకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. ఈసారి పాఠశాలలకు శీతాకాలపు సెలవులు 6 రోజులు మాత్రమే ఉండనున్నాయి. గతంలో జనవరి ఒకటి నుండి జనవరి 15 వరకు పాఠశాలకు సెలవులు ఇచ్చేవారు. అయితే ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం పాఠశాలలు జనవరి ఒకటి నుండి జనవరి ఆరు వరకు మాత్రమే మూసివేయనున్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత తక్కువగా ఉన్నందున ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే నవంబర్ 9 నుండి నవంబర్ 18 వరకు అన్ని పాఠశాలలకు సెలవులు ఇచ్చింది. అందుకే పిల్లల చదువులను దృష్టిలో ఉంచుకుని ఈసారి శీతాకాలపు సెలవులను తగ్గించాలని నిర్ణయించారు. ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్లో.. 2023-24 అకడమిక్ సెషన్లో శీతాకాలపు సెలవులు జనవరి ఒకటి నుండి జనవరి ఆరు వరకు ఉండనున్నాయని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: గర్బా నృత్యానికి యునెస్కో గుర్తింపు -
హాట్ వింటర్పై ఐఎండీ కీలక అప్డేట్ !
న్యూఢిల్లీ : గ్లోబల్ వార్మింగ్తో వాతావరణ మార్పులు కళ్ల ముందు కనిపిస్తునే ఉన్నాయి. ఓ పక్క సీజన్తో సంబంధం లేకుండా వర్షాలు దంచి కొడుతున్నాయి. మరో పక్క శీతాకాలంలోనూ మధ్యాహ్నం వేళల్లో ఎండలు వేడెక్కిస్తున్నాయి. ఉక్కపోత కూడా ఎక్కువగానే ఉంటోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ (ఐఎమ్డీ) ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. దేశంలో ఈ శీతాకాలంలో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సాధారణంగా కంటే వేడి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ‘దేశంలో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పీక్ వింటర్గా పరిగణిస్తారు. అయితే ఈ టైమ్లో ఈ ఏడాది దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణంగా కంటే కనీస, గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదవుతాయి. మధ్య, ఉత్తర భారతాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి’అని ఐఎండీ డైరెక్టర్ మహాపాత్ర తెలిపారు. ఇప్పటికే నవంబర్ నెలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఐఎండీ ఉష్ణోగ్రతలు రికార్డు చేయడం ప్రారంభించిన 1901 నుంచి గణాంకాలు తీసుకుంటే ఈ ఏడాది నవంబర్లో మూడోసారి కనీస, గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయి కొత్త రికార్డు సృష్టించాయి. ఇదీచదవండి.. రిసార్టులకు పండగే! ఎగ్జిట్పోల్స్తో సోషల్ మీడియాలో వెల్లువెత్తిన మీమ్స్ -
శీతకాలంలో వేదించే పొడిచర్మ సమస్యకు ఇది బెస్ట్ క్రీమ్!
శీతకాలంలో చర్మం పొడిబారి ఇబ్బంది పెడుతుంటుంది. కాళ్లు, చేతులు కూడా శీతకాలంలో పొడిబారినట్లు అయిపోయి పగళ్లు వంటి సమస్యలు తలెత్తుతాయి. మార్కెట్లో లభించే ఎన్ని రకాల క్రీమ్లు రాసినా అంత ప్రయోజనం ఉండదు. దీనికి బెస్ట్ క్రీం ఆయుర్వేదంలో ఉంది. ఐదేవేల ఏళ్ల నాటి చరక సంహితలో ఆ క్రీమ్ గురించి సవివరంగా చెప్పారు. దీన్ని మంచి మాయిశ్చరైజింగ్ క్రీం అనే చెప్పాలి. ఇంతకీ ఏంటా క్రీమ్ అంటే.. దీని పేరు 'శత ధౌత ఘృత క్రీమ్'. ఏంటీ పేరు ఇలా ఉందనిపిస్తుందా?..ఆ పేరులో క్రీమ్ అంటే ఏంటో చెబుతుంది. శత అంటే వంద. ధౌత అంటే కడగడం. ఘృత అంటే నెయ్యిం. మొత్తం కలిపితే వందసార్లు కడిగిన నెయ్యి అని అర్థం. నెయ్యిని వందసార్లు కడగడం ఏంటీ?. ఇదేంక్రీం అని ముఖం చిట్లించకండి. ఇది చర్మ సౌందర్యానికి అద్భుతమైన క్రీమ్ అని నిపుణులు చెబుతున్నారు. చర్మ ఆరోగ్యానికే కాకుండా వృధ్యాప్య ఛాయలను కూడా తగ్గించి మంచి నిగారింపునిస్తుంది ఈ క్రీమ్. ఎందుకు నెయ్యిని ఇలా వందసార్లు కడగాలంటే..నేరుగా నెయ్యిని ముఖానికి అప్లై చేస్తే దానిలో ఉండే పీహెచ్ చర్మానికి అనుకూలంగా ఉండదు. అదే నెయ్యిని వందసార్లు నీటితో కడగితే దానిలో ఉండే పీహెచ్ స్థాయిలు తటస్థంగా మారిపోతాయి. అప్పుడూ ముఖానికి అప్లై చేస్తే చర్మంలోని లోతైన పొరల్లోకి చొచ్చుకుని పోయి మృతకణాలకు లేకుండా చేస్తుంది. పైగా ముఖం అత్యంత కోమలంగా ఉంటుంది. అంతేగాదు ఇది ఇరిటేషన్, సోరియస్, ఎగ్జిమా వంటి చర్మ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ క్రీమ్ చాల బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు.ఐతే కొంచెం శ్రమతో కూడిన పని. ఈ క్రీం తయారీ కోసం మీకు కావల్సిందల్లా మంచి ఆవునెయ్యి, స్వచ్ఛమైన నీరు. నీటితో ఇలా వందసార్లు నెయ్యిని కడగటానికి సుమారు రెండు గంటల సమయం పడుతుందని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం ఈ సహజసిద్ధమైన క్రీమ్ని తయారు చేసుకుని మీ మేనుని కాంతివంతంగా మార్చుకోండి!. అంతేకాదండోయ్! మార్కెట్లో కూడా లభిస్తుంది. (చదవండి: కళ్లకింద ముడతలు, నల్లటి వలయాలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా చెక్పెట్టండి!) -
మన్యం గజగజ..!
సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజుజిల్లా): చలికాలం ప్రారంభంలోనే మన్యం ప్రాంతంలో చలిగాలులు ఉధృతంగా వీస్తున్నాయి. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. శుక్రవారం చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 12.5డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీబోర్డు వద్ద 13.9డిగ్రీలు, పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 14డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ కారణంగా సాయంత్రం నాలుగు గంటల నుంచే చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో చలి మరింత వణికిస్తోంది. గిరిజన గ్రామాలు, మండల కేంద్రాలు, ప్రధాన జంక్షన్లలో చలిమంటలు కనబడుతున్నాయి. స్వెట్టర్ల వినియోగం క్రమేణా పెరుగుతోంది. అమ్మకాలు కూడా ఊపందుకుంటున్నాయి. ఇక అర్ధర్రాతి అయితే దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ఘాట్ ప్రాంతంలో దీని తీవ్రత ఉధృతంగా ఉంటోంది. ఉదయం 9 గంటల వరకు ఏజెన్సీ ప్రాంతంలో మంచు తెరలు వీడడం లేదు. ప్రజలు హెడ్లైట్ల వెలుగులో రాకపోకలు సాగిస్తున్నారు. వ్యవసాయ పనులు, వారపు సంతలకు వెళ్లే గిరిజనులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు చలితో ఇబ్బందులు పడుతున్నారు. -
చలికాలం చర్మం పెళుసుబారకుండా ఉండాలంటే..!
వేకువ జాముకు చలి తొంగిచూస్తోంది. కిటికీలో నుంచి దొంగలా గదిలో దూరుతోంది. చల్లగా ఒంటికి హాయినిస్తుంది. కానీ చర్మాన్ని పెళుసుబారుస్తుంది కూడా. అందుకే ఆలస్యంగా చర్మసంరక్షణ మొదలవ్వాలి. రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత బాదం నూనె లేదా ఆలివ్ ఆయిల్ రాయాలి. గోరువెచ్చటి నీటిని దోసిట్లోకి తీసుకుని ముఖాన్ని నీటిలో మునిగేటట్లు ఉంచాలి. ఇది హాట్థెరపీ. రోజుకొకసారి ఉదయం స్నానం చేయడానికి ముందు కానీ రాత్రి పడుకునే ముందుకానీ చేయవచ్చు. ఒక కోడిగుడ్డు సొనలో, టీ స్పూన్ కమలారసం, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, నాలుగైదు చుక్కల పన్నీరు, అంతే మోతాదులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది పొడిచర్మానికి వేయాల్సిన ప్యాక్. బాగా మగ్గిన అరటిపండును మెత్తగా చిదిమి ముఖానికి, మెడకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడగాలి. ఇది పొడిచర్మానికి మాయిశ్చరైజర్గా పని చేస్తుంది, మెడ నలుపు కూడా వదులుతుంది. పొడిచర్మాన్ని మృదువుగా మార్చడంలో గ్రేప్సీడ్ ఆయిల్ బాగా పని చేస్తుంది. ఆయిల్ను ఒంటికి రాసి మర్దన చేయాలి. ఫేస్ప్యాక్లకు బదులుగా స్వచ్ఛమైన ఆముదం ఒంటికి రాసి మర్దన చేసుకోవాలి. ఆముదం వల్ల చర్మం మృదువుగా మారడంతోపాటు అనేక చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. (చదవండి: అలసిన కళ్లకు రిలీఫే ఈ ఐ మసాజర్!) -
చలికాలంలో భగభగలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భగభగమంటున్నాయి. సాధారణంగా చలికాలంలో క్రమంగా తగ్గాల్సిన ఉష్ణోగ్రతలు వేసవి కాలం మాదిరి నమోదవుతున్నాయి. ప్రస్తుతం నైరుతి సీజన్ ముగిసి, ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలిస్తుంటాయి. ఇంకా ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనప్పటికీ సాధారణంగా ఈపాటికి వాతావరణం చల్లబడుతుంది. కానీ రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలను మించిపోతున్నాయి. సగటున 3–5 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటంతో రాష్ట్రంలో వాతావరణం వేసవి సీజన్ను తలపిస్తోంది. వాతావరణంలో తేమ తగ్గడంతో ఉక్కపోత పెరుగుతుండగా.. ఆకాశం మేఘాలు లేకుండా నిర్మలంగా ఉంటుండటంతో ఉష్ణోగ్రతలు సైతం అధికంగా నమోదవుతున్నాయి. మరో వారం ఇంతే... రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసినప్పటికీ... తిరోగమన ప్రక్రియ చివరి దశలో ఉంది. మరో మూడు రోజుల్లో రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో నిష్క్రమించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత వారం రోజులకు ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో వాతావరణంలో మార్పులు ఉంటాయని, దీంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. గురువారం రాష్ట్రంలో నమోదైన ఉషోగ్రతలను పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 36.2 డిగ్రీ సెల్సియస్ నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత అత్యల్పంగా మెదక్లో 18.3 డిగ్రీలుగా నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు చాలాచోట్ల సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా నమోదవుతోంది. ఖమ్మం జిల్లాలో సాధారణం కంటే 4.6 డిగ్రీలు అధికంగా నమోదు కాగా, భద్రాచలంలో 3.5 డిగ్రీలు, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, హనుమకొండలో 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఎక్కడా వర్షపాతం నమోదు కాలేదు. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో పొడివాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. -
ఎట్టకేలకు జాకెట్ ధరించిన రాహుల్..తిట్టిపోస్తున్న ప్రతిపక్షాలు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పటి వరకు 125 రోజుల ప్రయాణంలో సుమారు 3,400 కిలోమీటర్లు చేసిన పాద యాత్రలో కేవలం తెల్లటి టీషర్ట్ మాత్రమే ధరించి అందర్నీ ఆశ్చర్యచకితులను చేశారు. చలికాలం సమీపించి గజగజలాడిస్తున్న ఆయన తెల్లటి టీ షర్ట్ మాత్రమే ధరించడం అందరిలో ఒకటే ఉత్సుకతను రేకెత్తించాయి. చివరికి మీడియా ముందుకు వచ్చి రాహుల్ని ఈవిషయమై ప్రశ్నించగా..పేదవాళ్లను, కార్మికులను ఈ ప్రశ్న ఎందుకు వేయరు అని ఎదురు ప్రశ్నించారు. తాను ముగ్గురు చిన్నారులన చూశానని వారు చలికి వణకుతూ కనిపించారే గానీ స్వెటర్లు ధరించలేదని, వారే తనకు ఆదర్శం అని చెప్పుకొచ్చారు. అంతేగాదు వారికి చలి అనిపించేంత వరకు తాను ధరించనని, అప్పటి వరకు తనకు కూడా చలిగా అనిపించదంటూ పెద్దపెద్ద మాటలు చెప్పారు. కానీ చివరికి జమ్మూలో యాత్ర ప్రవేశించగానే రాహుల్కి జాకెట్ ధరించక తప్పలేదు. ఈ మేరకు గురువారం రాహుల్ భారత్ జోడో యాత్ర పంజాబ్ నుంచి జమ్మూలోకి ప్రవేశించింది. చలికాలంలో సైతం టీషర్టు ధరించి ఉత్తర భారతదేశం గుండా దిగ్విజయంగా పాదయాత్ర చేసి అందర్నీ షాక్ గురిచేసిన ఆయన ఈరోజు యాత్రలో తోలిసారిగా జాకెట్లో కనిపించారు. ఉదయం నుంచి జమ్మూలోని పలు ప్రాంతాల్లో చినుకులు కురుస్తుండటం వల్ల గాంధీ చివరకు రక్షణ దుస్తులు ధరించక తప్పింది కాదు. దీంతో ఇక ఇదే అవకాశంగా ప్రతిపక్షాలు రాహుల్పై వ్యంగోక్తులు విసరడం, చురకలింటించడం, ప్రారంభించాయి. ఇదిలా ఉండగా, రాహుల్ జనవరి 25న జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలోని బనిహాల్లో జాతీయ జెండాను ఎగరువేస్తారు. ఆ తర్వాత రెండురోజలు అనంతరం జనవరి 27న అనంత్నాగ్ మీదుగా శ్రీనగర్లో ప్రవేశించనున్నారు. అదీగాక భారత్ జోడో యాత్ర సందర్భంగా కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలలో నడవవద్దని భద్రతా సంస్థలు గాంధీకి సూచించినట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ జమ్మూలో ప్రవేశించగానే అక్కడి అగ్రనేత నేషనల్కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా ఘన స్వాగతం పలికారు. పైగా చివరి దశకు చేరుకున్న ఈ యాత్రలో పాల్గొనడానికి వందలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ యాత్ర జనవరి 30న శ్రీనగర్లో గ్రాండ్ ఫినాలేతో ముగుస్తుంది. (చదవండి: యూత్ ఐకాన్గా రాహుల్ గాంధీ.. ఆ సత్తా ఉంది: శత్రుఘ్న సిన్హా) -
గడ్డకట్టిన జలపాతం.. ఎక్కడో కాదు మన దగ్గరే..!
సిమ్లా: కొద్ది రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉత్తర భారత్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొగమంచు దట్టంగా కురవడంతో రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలకు ఆటంకం ఏర్పడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం అత్యల్పంగా 3.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో నీరు గడ్డకట్టుకుపోతోంది. హిమాలయాలకు సమీపంలోని హిమాచల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతుండటంతో నీళ్లు గడ్డకట్టుకుపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు.. హిమాచల్ కులూలోని ఓ జలపాతం గడ్డకట్టుకుపోయింది. అతి శీతల వాతావరణంతో గడ్డకట్టి మంచుతో చెక్కిన శిల్పాలుగా ఆకట్టుకుంటోంది. గడ్డకట్టిన జలపాతం అందాలను చూసేందుకు పర్యటకులు తరలివస్తున్నారు. On #Udaipur - #Tindi road... Near Bhim bagh 🥶 7th January 2023#Lahaul , #HimachalPradesh@SkymetWeather @jnmet @Mpalawat @JATINSKYMET pic.twitter.com/IqLve8xh1I — Gaurav kochar (@gaurav_kochar) January 7, 2023 హిమాచల్ప్రదేశ్లోని కులూలో అతి శీతల వాతావరణంతో గడ్డకట్టిన జలపాతం ఇదీ చదవండి: Joshimath: కుంగుతున్నా వదలట్లేదు -
AP Cold Waves: విశాఖ ఏజెన్సీ చరిత్రలో తొలిసారి!
దేశం వ్యాప్తంగా కోల్డ్వేవ్ ప్రభావం కనిపిస్తోంది. చలి దెబ్బకు తెలుగు రాష్ట్రాలు గజగజలాడిపోతున్నాయి. ఏపీలోనూ చలి పంజా విసురుతోంది. మొదటిసారిగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో మునుపెన్నడూ లేనంత అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. మరో 3 రోజులు ఇదే తీవ్రతతో పరిస్థితి కొనసాగవచ్చని, చిన్నపిల్లలు.. వృద్ధులు.. శ్వాసకోశ సంబంధిత సమస్యలున్న వాళ్లు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా) : చలి పులి పంజాకు రాష్ట్రం గజగజా వణికిపోతోంది. కోల్డ్ వేవ్ ప్రభావం రాష్ట్రాన్ని తాకడంతో మునుపెన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి గాలుల తీవ్రత పెరిగింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోయాయి. అక్కడ సాధారణం కంటె 3 నుంచి 5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆంధ్రా కశ్మీర్గా అభివర్ణించే ‘చింతపల్లి’తో పాటు హుకుంపేట, జి.మాడుగుల మండలం కుంతలం, గూడెం కొత్తవీధి మండలం జీకే వీధిలో అత్యల్పంగా 1.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతకు ముందు ఆ రికార్డు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్గా ఉండేది!. డుంబ్రిగూడ మండల కేంద్రం, పెదబయలు మండలం గంపరాయిలో 2.6, హుకుంపేట మండలం కొక్కిసలో 2.7, ముంచంగిపుట్టు మండలం గొర్రెలమెట్టలో 2.8, పెదబయలులో 2.9, పాడేరులో 3.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఇక్కడ అత్యల్పంగా 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తొలిసారిగా ఇప్పుడు 1.5 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు, పర్యాటకులు ఆశ్చర్యపోతున్నారు. బయటకు రావడానికే బెంబేలెత్తిపోతున్నారు. అరకు తదితర ప్రాంతాల్లోనూ పలుచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. విజయవాడలో ఆదివారం ఉదయం 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రాన్నీ కోల్డ్వేవ్ తాకినట్టే.. ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఛత్తీస్ఘడ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో కోల్డ్ వేవ్ ప్రభావం ఉంటుందని ప్రకటించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటె 5 నుంచి 6 డిగ్రీలు పడిపోతే కోల్డ్ వేవ్గా పరిగణిస్తారు. ఆంధ్రా ఊటీగా పేరున్న అరకు ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో 3 నుంచి 5 డిగ్రీలు పడిపోయాయి. దీంతో కోల్డ్ వేవ్ మన రాష్ట్రాన్ని తాకినట్లే వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. బంగ్లాదేశ్లో ఉన్న అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్(వాతావరణంలోని ఎత్తయిన ప్రదేశాల్లో వీచే గాలులు), పశ్చిమ గాలుల ప్రభావంతో కోల్డ్వేవ్ కొనసాగుతోంది. మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. మరీ ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. -
చలితో గజ గజ! ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ: ఉత్తర భారతంలో చలి తీవ్రత ఉధృతమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ చలికి గజ గజ వణుకుతోంది. ఆదివారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేసింది. వెలుతురులేమి కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలోని సఫ్తార్జంగ్ ప్రాంతంలో అత్యల్పంగా 1.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితులు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 20 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు.. సఫ్తార్జంగ్ (1.9), పాలమ్(5.2), లోథిరోడ్ (2.8), రిడ్జ్(2.2), అయా నగర్(2.6) డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు.. గాలి నాణ్యత సైతం ప్రమాదకరస్థాయిలోనే ఉంది. గాలినాణ్యత సూచీ 359గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్న క్రమంలో నిరాశ్రయుల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది ఢిల్లీ ప్రభుత్వం. తమ ప్రాంతాల్లోని శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మరోవైపు.. పంజాబ్లోని అమృత్సర్, పాటియాలా, అంబాలా, చండీగఢ్, రాజస్థాన్లోని గంగానగర్లో చలి తీవ్రత అధికంగా ఉంది. పొగమంచు కారణంగా వెలుతురులేమితో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. Delhi | Severe cold wave and fog conditions continue to prevail in the national capital. Visuals from Kartavya Path pic.twitter.com/hpahVIAtXY — ANI (@ANI) January 8, 2023 ఇదీ చదవండి: స్తోమత లేక బడి మానేసి బీడీలు.. ఇప్పుడు అమెరికాలో జడ్జీగా తీర్పులు -
Fashion: అలాంటి వారికి ఈ ఉలెన్ కుర్తీలు బెస్ట్ ఆప్షన్!
కొంచెం కూల్.. కొంచెం హాట్.. అన్నట్టుగా ఉంటోంది ఈ వెదర్. దీంతో సందర్భాన్ని బట్టి స్పెషల్గా రెడీ అవడం కుదరడం లేదు అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్గా నిలుస్తున్నాయి ఈ ఉలెన్ కుర్తీలు. పార్టీలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి . చలికి స్వెట్టర్ అవసరం లేకుండా కాజువల్ వేర్ గానూ ఆకట్టుకుంటున్నాయి. ఎనీ వేర్ ఎనీ టైం అన్నట్టుగా కుర్తీ అన్ని వయసుల వారి తప్పనిసరి డ్రెస్గా నిలిచిపోయింది. సీజన్కి తగిన విధంగా, స్టైలిష్ వేర్గా పేరొందిన కుర్తీ మరింత స్పెషల్ గా అట్రాక్ట్ చేస్తోంది. చదవండి: Meenakshi Chaudhary: ఆరెంజ్ కలర్ శారీలో మీనాక్షి తళుకులు! చీర, నగల ధర ఎంతంటే! -
Hyderabad: హైదరాబాద్లో వర్షం
సాక్షి, హైదరాబాద్: అన్సీజన్లో నగరాన్ని వరుణుడు పలకరించాడు. గురువారం అర్ధరాత్రి తర్వాత నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరు జల్లులు కురియగా, శుక్రవారం వేకువఝామునే మరోసారి చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు దాకా వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, పంజాగుట్ట, ఆర్టీసీ క్రాస్రోడ్, చింతల్, బాలానగర్, సుచిత్ర, కుత్బుల్లాపూర్, బేగంపేట.. ఇంకా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్నిచోట్ల చిరు జల్లులు కురియగా, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం గట్టిగానే దంచికొట్టింది. ఒకవైపు గత రెండు మూడు రోజులుగా నగరంలో చలి విజృంభణతో నగరవాసులు వణికిపోతుండగా, ఇప్పుడు వర్ష ప్రభావంతో చలి తీవ్రత మరింత పెరగొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. Earlier morning unexpected moderate #rainfall with thunderstorm accompanied by gusty winds on Friday. @ind2day #Hyderabad #oldcity pic.twitter.com/DNdShMsZbU — Mohd Lateef Babla (@lateefbabla) January 6, 2023 -
Bomb Cyclone: శతాబ్దంలోనే అత్యంత తీవ్రమైన మంచు తుపాన్.. కోలుకోని అమెరికా (ఫొటోలు)
-
అమెరికాపై " స్నో బాంబు "
-
IndiGo Special offer: రూ.2వేలకే విమాన టికెట్!!
గురుగ్రామ్: ఇండిగో ఎయిర్లైన్స్.. మూడురోజుల వింటర్ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్ను ప్రయాణికులకు అందించబోతోంది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తగ్గింపు ధరకు టికెట్లు అందించనున్నట్లు ప్రకటించింది. దేశీయ ప్రయాణానికి రూ.2,023, అంతర్జాతీయ ప్రయాణాలకు రూ.4,999 నుంచి ప్రారంభ టికెట్ల ధరగా నిర్ణయించింది. 2023 జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 మధ్య ప్రయాణానికి సంబంధించిన టికెట్లకు, అదీ టికెట్లు అందుబాటులో ఉన్నంతవరకు మాత్రమే ఈ వింటర్ సేల్ ఆఫర్ వర్తిస్తుందని ఇండిగో స్పష్టం చేసింది. టికెట్లు నాన్ స్టాప్ విమానాల మీదే మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని తెలిపింది. ఏ ఆఫర్లు, ప్రమోషన్స్, స్కీమ్స్.. వీటికి వర్తించవు. భారతీయులు హెచ్ఎస్బీసీ కస్టమర్లైతే.. అదనంగా క్యాష్బ్యాక్ పొందొచ్చు. ఇండిగోకు మొత్తం 290 విమానాలు ఉండగా.. రోజుకు 1600 విమాన సర్వీసులను నడుపుతుండగా.. ఇందులో 76 దేశీయ, 26 అంతర్జాతీయ గమ్యస్థానాలు ఉన్నాయి. విమానయాన రంగం మునుపటి కంటే పుంజుకుందని, దీన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా ఈ ఆఫర్ను తీసుకొచ్చినట్లు ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా తెలిపారు. -
చలి కాచే కోటు..
చలికాలంలో ఒక్కోసారి స్వెట్టర్లు వేసుకున్నా, చలి తగ్గినట్లుగా అనిపించదు. అలాంటి ఇబ్బందేమీ లేకుండా నిమిషాల్లోనే ఒళ్లంతా వెచ్చబరచే అరకోటు అందుబాటులోకి వచ్చింది. వేడిని నిల్వచేసుకునే కెమికల్ జెల్ నింపి రూపొందించిన ఈ వస్త్రవిశేషం ‘ఎంట్రోపీ వెస్ట్’. టీషర్ట్ లేదా చొక్కా మీదుగా దీనిని అరకోటు ధరించినట్లే సులువుగా ధరించవచ్చు. దీనికి ఎలాంటి బ్యాటరీలతోను, విద్యుత్తుతోను పనిలేదు. దీనిని యాక్టివేట్ చేసుకుంటే చాలు, నిమిషాల్లోనే 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను అందిస్తుంది. నడుస్తున్నా, కదులుతూ పనులు చేసుకుంటూ ఉన్నా, క్రమంగా వేడి తగ్గి, శరీర ఉష్ణోగ్రత వద్ద స్థిరపడుతుంది. దీని ఉష్ణోగ్రత పూర్తిగా తగ్గినట్లు అనిపిస్తే, ఉడుకు నీళ్లలో కాసేపు నానబెట్టి, ఆ తర్వాత ఆరవేసుకుంటే చాలు. యథాతథంగా పనిచేస్తుంది. ఉడుకు నీళ్లలోని ఉష్ణోగ్రతను ఈ వస్త్రంలోని జెల్ గ్రహించి, నిల్వ చేసుకుంటుంది. లండన్లోని ‘పెటిట్ ప్లీ’కి చెందిన శాస్త్రవేత్తలు ఈ సరికొత్త చలివస్త్రానికి రూపకల్పన చేశారు. దీని ధర 500 పౌండ్లు (రూ.50,104). చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
ఘోరమైన వేడి-చల్లదనం.. ఈ ఏడాది అట్లుంది మరి!
లండన్: మునుపెన్నడూ లేనంతంగా వాతావరణంలో విపరీతమైన మార్పులను యూకే చవిచూస్తోంది. ఈ ఏడాదిలోనే యూకే చరిత్రలోనే అత్యంత వేసవి పరిస్థితులను చవిచూసింది. వేడికి ఏకంగా రైలు పట్టాలే కాలి కరిగిపోయి.. సర్వీసులను నిలిపి వేయాల్సి వచ్చింది. వేల మంది మృత్యువాత పడ్డారు. ఇక ఇప్పుడు చలి వంతు వచ్చింది. మైనస్ 10 నుంచి 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో బ్రిటన్ గజగజ వణికిపోతోంది. ఈ సీజన్లో ఐస్ల్యాండ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలిపులి పంజా విసురుతోంది. విపరీతంగా కురుస్తున్న మంచుతో రోడ్లపై ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకదానికొకటి ఢీకొంటున్నాయి. ముందున్న వాహనం కూడా కనిపించని పరిస్థితి. వాహనాలతో రోడ్లపైకి రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రయాణాలు మానుకోవాలని చెప్పారు. చాలాచోట్ల యజమానులు తమ కార్లను రహదారుల పక్కన వదిలేసి వెళ్లిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాట్స్వాల్డ్, బ్రిస్టల్, సౌత్ వేల్స్, హియర్ఫోర్డ్షైర్, కాంబ్రియా, షెఫీల్డ్ తదితర ప్రాంతాల్లో మంచు పెద్ద ఎత్తున పేరుకుపోయింది. కొన్నిచోట్ల పట్టాలపై మంచు కప్పేయడంతో రైళ్లను పాకిక్షంగా రద్దు చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఇక లండన్లోని హిత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం ఏకంగా 48 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. కొన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయి. హిత్రూ ఎయిర్పోర్ట్లో జనం బారులు తీరారు. కెంట్, ఎస్సెక్స్, లండన్లో భారీగా మంచు కురిసే అవకా శం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. లండన్ సహా సౌత్, సెంట్రల్ ఇంగ్లాండ్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. స్కాట్లాండ్లో మైనస్ 15 డిగ్రీలు నమోదైంది. దీనికి ఆర్కిటిక్ బ్లాస్టే కారణమని నిపుణులు చెబుతున్నారు. ‘‘ధ్రువాల వద్ద తక్కువ పీడనం వల్ల ఇలా జరుగుతుంది. వాతావరణంలో తీవ్ర మార్పులు, ఉష్ణోగ్రతలు హఠాత్తుగా పడిపోవడం ఆర్కిటిక్ బ్లాస్ట్ ప్రభావమే’’ అంటున్నారు. ఇదీ చదవండి: ఆంక్షలను ఎత్తేయడంతో.. అల్లకల్లోలంగా తయారైంది -
‘క్రోమా’ వింటర్ సీజన్ సేల్..బంపర్ ఆఫర్లు
హైదరాబాద్: టాటా గ్రూపు ఎలక్ట్రానిక్స్ రిటైల్ కంపెనీ ‘క్రోమా’ వింటర్ సీజన్ ఆఫర్లను ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, బ్లూటూత్ స్పీకర్లు, ఏసీలు, పవర్ బ్యాంక్లు, ఎయిర్ ప్యూరిఫయర్లపై ఆకర్షణీయమైన డీల్స్ను అందిస్తున్నట్టు తెలిపింది. అన్ని క్రోమా స్టోర్లు, క్రోమా ఆన్లైన్ పోర్టల్లో కొనుగోళ్లపై ఈ ఆఫర్లను పొందొచ్చని పేర్కొంది. బ్యాక్ ప్యాక్లపై 70 శాతం వరకు, ఇయర్ ఫోన్లపై 80 శాతం వరకు రాయితీ, నెక్ పిల్లో, ఐమాస్కస్, ట్రావెల్ బ్యాగ్ వంటి ట్రావెల్ యాక్సెసరీలపై 5 శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనంగా 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుందని తెలిపింది. (గుడ్న్యూస్..ఈ ఐటీ కంపెనీలో కొలువులే కొలువులు) రూం హీటర్లు కేవలం 699తో ప్రారంభం. ఇన్స్టంట్ గీజర్లు ధరలు 799 నుండి ప్రారంభం. ఫిలిప్స్ ఎయిర్ఫ్రైయర్స్, కెటిల్స్ , కన్వెక్షన్ మైక్రోవేవ్ తదితర వింటర్ సీజన్కు సంబంధించిన ఉత్పత్తులపై ఆఫర్లను అందిస్తోంది. -
Winter: వేడినీటి బుగ్గల్లో స్నానాలు.. ముల్లంగి, తామరతూళ్లు తింటే..!
Funday Cover Story- Worldwide Winter Festivals: శీతకాలం చిరుచలితో మొదలై, గజగజ వణికించే స్థాయికి చేరుతుంది. చలిపంజా దెబ్బకు జనాలు రాత్రివేళ ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టేందుకే వెనుకాడుతారు. శీతకాలం రాగానే, అప్పటివరకు అలమరాల అట్టడుగున పడివున్న చలిదుస్తులు ఒంటిమీదకు వస్తాయి. వీథుల్లో చలిమంటల సందడి మొదలవుతుంది. చలితీవ్రత పెరిగే కొద్ది, మనుషులకు వణుకూ పెరుగుతుంది. చలిలో ఆరుబయటకు వచ్చేవాళ్లు ఒద్దికగా చేతులు కట్టుకుని చలిని కాచుకుంటారు. చలికాలంలో కొన్నిచోట్ల తెరిపిలేని హిమపాతంతో నేలంతా మంచుతో నిండిపోతుంది. శీతకాలం మొదలయ్యే వేళ దీపావళి, శీతకాలం తారస్థాయిలో ఉండేటప్పుడు మకరసంక్రాంతి వేడుకలను మనం జరుపుకొంటాం. శీతకాలంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలు వారి వారి సంప్రదాయ వేడుకలను జరుపుకొంటారు. వ్యవసాయ పనులు ముగిసి, కాస్త తీరిక దొరికే కాలం కావడంతో సంబరాలు చేసుకుంటారు. కాలానికి తగినట్లుగా ప్రత్యేకమైన వంటకాలను ఆగరిస్తారు. ఆరుబయటకు చేరి ఆట పాటలతో శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. వివిధ దేశాల్లో జరుపుకొనే శీతకాల సంబరాలను, వాటి విశేషాలను తెలుసుకుందాం... షెట్లాండ్ వైకింగ్ ఫెస్టివల్ స్కాట్లాండ్లోని షెట్లాండ్ ప్రాంతంలో క్రిస్మస్ వేడుకలు ముగిసినప్పటి నుంచి మూడునెలల వరకు సుదీర్ఘంగా కొనసాగే చలిమంటల వేడుక ‘షెట్లాండ్ వైకింగ్ ఫెస్టివల్’. స్థానికంగా ఈ వేడుకలను ‘అప్ హెలీ ఆ’ అంటారు. షెట్లాండ్ రాజధాని లెర్విక్లో ఈ వేడుకల్లో భాగంగా జనవరి మూడో మంగళవారం రోజున జనాల ఆట పాటలతో వాద్యాల హోరుతో భారీ ఊరేగింపు జరుగుతుంది. వైకింగ్ల పొడవాటి పడవలను అనుకరిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులు ధరించి, మేళతాళాలతో ఈ ఊరేగింపులో పాల్గొంటారు. తొలినాళ్లలో తారుపీపాలకు నిప్పుపెట్టి స్లెడ్జిబళ్ల మీద మంచునిండిన వీథుల్లోకి లాక్కొచ్చేవారు. ఇటీవలికాలంలో తారుపీపాలకు నిప్పుపెట్టడం వంటి పనులు మానేసి, ఎక్కడికక్కడ చలిమంటలు వేసుకుని, వేడుకలు జరుపుకొంటున్నారు. వెనిస్ కార్నివాల్ ఇటలీలోని వెనిస్ నగరంలో శీతకాలం ముగుస్తూ ఉండే సమయంలో జరిగే ఉత్సవం ఇది. క్రైస్తవుల ఉపవాస దినాలైన ‘లెంట్’ రోజుల్లోని ‘యాష్ వెన్స్డే’ నుంచి మొదలయ్యే వెనిస్ కార్నివాల్ ‘ష్రోవ్ ట్యూస్డే’ వరకు మూడువారాల పాటు జరిగే ఈ వేడుకల్లో భారీ ఎత్తున జనాలు పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి సుమారు ముప్పయి లక్షలకు పైగా జనాలు వెనిస్ వీథుల్లో జరిగే ఊరేగింపుల్లో చిత్రవిచిత్ర వేషధారణలతో రకరకాల మాస్కులు ధరించి తిరుగుతూ సందడి చేస్తారు. ఈ వేడుకల్లో భాగంగా వెనిస్ కూడళ్లలో ఏర్పాటు చేసే బహిరంగ వేదికలపై సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ముఖాలకు మాస్కులు ధరించడాన్ని రోమన్ చక్రవర్తి 1797లో నిషేధించడంతో చాలాకాలం ఈ వేడుకలు కనుమరుగయ్యాయి. ఇటలీ ప్రభుత్వం సాంస్కృతిక పునరుద్ధరణలో భాగంగా 1979 నుంచి పునఃప్రారంభించడంతో వెనిస్ కార్నివాల్ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే స్థాయికి చేరుకుంది. లా ఫాలాస్ వాలెన్షియా స్పెయిన్లోని వాలెన్షియా నగరంలోను, చుట్టుపక్కల పట్టణాలు, గ్రామాల్లోను ఈ వేడుకలు ఏటా మార్చి 1 నుంచి 19 వరకు జరుగుతాయి. ఈ వేడుకల్లో మార్చి 15 నుంచి 19 వరకు ఐదురోజుల పాటు సెయింట్ జోసెఫ్ స్మారకార్థం ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీథుల్లో చలిమంటలను వెలిగించి ఆటపాటలతో జనాలు కాలక్షేపం చేస్తారు. మార్చిలో శీతకాల సంబరాలేమిటా అనుకోకండి. అక్కడ మార్చిలోనూ మంచు కురుస్తూనే ఉంటుంది. చలిమంటల ముందు సేదదీరుతూ విందు వినోదాలు, గానా భజానాలతో జనం ఉల్లాసంగా గడుపుతారు. ఈ రోజుల్లో ప్రత్యేకంగా తయారు చేసే బిర్యానీ మాదిరి ‘ప్యేలా’ అనే వంటకాన్ని సామూహిక విందుల్లో వడ్డిస్తారు. దీని తయారీలో బియ్యం, మేక, గొర్రె, కుందేలు, కోడి, చేపలు, ప్రత్యేక సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తారు. లా ఫాలెస్ వాలెన్షియాను ‘యునెస్కో’ వారసత్వ వేడుకగా గుర్తించింది. నయాగరా వింటర్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ నయాగరా జలపాతం మామూలుగా చూస్తేనే కళ్లకు మిరుమిట్లు గొలుపుతుంది. ఇక శీతకాలంలో రాత్రివేళ ఈ జలపాతం వద్ద ఆరుబయట చేసే విద్యుద్దీపాలంకరణలు చూస్తే, రంగు రంగుల నక్షత్రాలు కళ్లముందే కదలాడినట్లుంటుంది. నయాగరా జలపాతం వద్ద కెనడాలో ఏటా శీతకాలం పొడవునా ‘వింటర్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్’ వేడుకలను దేదీప్యమానంగా నిర్వహిస్తారు. ఈసారి నవంబర్ 12న మొదలైన ఈ వేడుకలు ఫిబ్రవరి 20 వరకు కొనసాగనున్నాయి. విద్యుద్దీప కాంతుల వెలుగులో ధగధగలాడే నయాగరా అందాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు చేరుకుంటారు. ఈ సందర్భంగా పలు వినోద కార్యక్రమాలు, బాణసంచా ప్రదర్శనలు కూడా జరుగుతాయి. హార్బిన్ ఐస్ అండ్ స్నో స్కల్ప్చర్ ఫెస్టివల్ చైనాలో ఏటా శీతకాలంలో జరిగే అంతర్జాతీయ హిమశిల్పకళా వేడుకలు ఇవి. హీలోంగ్జియాంగ్ ప్రావిన్స్లోని హార్బిన్ నగరంలో జరిగే ఈ వేడుకలను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి దాదాపు రెండుకోట్ల మంది వరకు వస్తారు. ప్రపంచంలోనే అత్యంత భారీ హిమశిల్పాలు ఈ ఉత్సవాల్లో కొలువుదీరుతాయి. హార్బిన్ నగరంలోని కూడళ్లలోను, నగరం మీదుగా ప్రవహించే సోంఘువా నదీ తీరంలోను భారీ ఎత్తున హిమశిల్పాలను ఏర్పాటు చేస్తారు. సైబీరియా మీదుగా వీచే చలిగాలుల వల్ల సోంఘువా నదిలోని నీళ్లు గడ్డకట్టిపోతాయి. నదిలో నుంచి వెలికితీసిన భారీ మంచుదిమ్మలతోనే స్థానిక కళాకారులు శిల్పాలను చెక్కి, ప్రదర్శనకు ఉంచుతారు. చైనాలో ఈ వేడుకలు 1963 నుంచి జరుగుతూ వస్తున్నాయి. ఏటా డిసెంబర్ చివరి వారం నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు జరిగే ఈ వేడుకల ద్వారా చైనా ప్రభుత్వానికి పర్యాటక ఆదాయం దండిగానే లభిస్తుంది. టోజి మత్సురి జపాన్లో జరుపుకొనే శీతకాల వేడుకలు ‘టోజి మత్సురి’. ఈ వేడుకలనే ‘టోజిసాయి’ అని కూడా అంటారు. మంచు కురిసే ప్రాంతాల్లో ఆరుబయట గుడారాలు వేసుకుని, వాటి ముందు చలిమంటలు వేసుకుని, ఆటపాటలతో గడుపుతారు. ‘ఓన్సెన్’ అనే వేడినీటి బుగ్గల్లో స్నానాలు చేస్తారు. నిజానికి ఈ వేడినీటి బుగ్గల్లో ఏడాది పొడవునా స్నానాలు చేస్తుంటారు గాని, శీతకాలం తప్పనిసరిగా వీటిలో స్నానం చేయడం ఆరోగ్యకరమని జపానీయులు నమ్ముతారు. గతించిన పెద్దలను తలచుకుంటూ చెరువుల్లో దీపాలను విడిచిపెడతారు. శీతకాలంలో గుమ్మడి, క్యారెట్, ముల్లంగి, తామరతూళ్లు తినడం శుభప్రదమనే నమ్ముతారు. ముఖ్యంగా తామరతూళ్లతో తయారుచేసే రెన్కాన్ చిప్స్ను చిన్నాపెద్దా ఇష్టంగా తింటారు. రేక్జావిక్ వింటర్ లైట్స్ ఫెస్టివల్ ఐస్లాండ్లోని రేక్జావిక్ నగరంలో ఏటా శీతకాలంలో వింటర్ లైట్స్ ఫెస్టివల్ వేడుకలు జరుగుతాయి. నగరంలోని చారిత్రిక కట్టడాలు, మ్యూజియమ్లు, పార్కులు, ఈతకొలనులు, మైదానాలు వంటివాటిని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. నగరంలోని వేడినీటి బుగ్గలలో జనాలు ఈతలు కొడతారు. వేడుకలు జరిగేంత కాలం రాత్రివేళల్లో మ్యూజియమ్లన్నీ సందర్శకుల కోసం తెరిచే ఉంచుతారు. కూడళ్లలో ఏర్పాటు చేసే తాత్కాలిక వేదికలపైనా, నగరంలోని రంగస్థలాలపైన సంగీత, నృత్య, వినోద కార్యక్రమాలు కోలాహలంగా సాగుతాయి. హ్వాషియోన్ సాన్షియోనియో ఐస్ ఫెస్టివల్ దక్షిణ కొరియాలోని గాంగ్వన్ డో ప్రావిన్స్లో ఏటా శీతకాలంలో ఐస్ ఫెస్టివల్ వేడుకలు జరుగుతాయి. హ్వాషియోన్ నగరంలో గడ్డకట్టిన నదిపై రకరకాల క్రీడలు, వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. నది ఎగువ ప్రాంతంలోని సాన్షియోనియో వద్ద మంచుదిమ్మల మీద ఏర్పడిన రంధ్రాల గుండా చేపలను పట్టే పోటీలను నిర్వహిస్తారు. భారీస్థాయి మంచుశిల్పాలను తీర్చిదిద్ది ప్రదర్శిస్తారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు కొరియన్ ప్రభుత్వం ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఏటా జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరిగే ఈ వేడుకలు తిలకించేందుకు దేశ విదేశాల నుంచి 15 లక్షల మందికి పైగా పర్యాటకులు వస్తుంటారు. డ్రాగన్ కార్నివాల్ స్లోవేనియా రాజధాని ల్యూబ్లీయానలో ఏటా శీతకాలంలో జరిగే సంప్రదాయ వేడుక డ్రాగన్ కార్నివాల్. పురాతన పేగన్ సంస్కృతికి ఆనవాలుగా కొనసాగే ఈ వేడుకల్లో భారీ ఊరేగింపులు నిర్వహిస్తారు. వేలాది మంది చిత్రవిచిత్రమైన మాస్కులు, రంగు రంగుల దుస్తులు ధరించి పాల్గొంటారు. భారీసైజులోని ఆకుపచ్చని డ్రాగన్ బొమ్మను మోసుకుంటూ ఊరేగిస్తారు. సంప్రదాయ వాద్యపరికరాలను మోగిస్తూ, నాట్యం చేస్తూ నగర వీథుల్లో సందడి చేస్తారు. పదమూడో శతాబ్దిలో పేగన్, క్రైస్తవ సంస్కృతులు పరస్పరం కలగలసిపోయిన నాటి నుంచి డ్రాగన్ కార్నివాల్ జరుగుతూ వస్తోందని చెబుతారు. నలభైరోజుల లెంట్ ఉపవాస దినాలకు ముందుగా, జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సంబరాన్ని నిర్వహిస్తారు. కలోన్ వింటర్ కార్నివాల్ జర్మనీలోని కలోన్ నగరంలో ఏటా వింటర్ కార్నివాల్ వేడుకలు భారీ స్థాయిలో జరుగుతాయి. పదకొండో నెల పదకొండో తేదీన– అంటే, ఏటా నవంబర్ 11న ఉదయం 11.11 గంటల నుంచి ‘కార్నివాల్’ సీజన్ మొదలవుతుంది. వీథుల్లో చిత్రవిచిత్ర వేషధారణలతో నిర్వహించే ఊరేగింపులతో ఈ వేడుకలు జనవరి 6 వరకు కొనసాగుతాయి. ఈ రోజుల్లో ‘ఫ్యాట్ థర్స్డే’ నుంచి ‘యాష్ వెన్స్డే’ వరకు వారం రోజులను ‘క్రేజీ డేస్’ అంటారు. ఈ వారం రోజుల్లోనూ మరింత భారీ స్థాయిలో వేడుకలు జరుగుతాయి. పిల్లలూ పెద్దలూ వీథుల్లోకి చేరి, ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. వివిధ దేశాల నుంచి వచ్చే బ్యాండ్ బృందాలు, నృత్యబృందాలు ఊరేగింపుల్లో పాల్గొంటాయి. కలోన్ కార్నివాల్లో పాల్గొనేందుకు ముఖ్యంగా యూరోప్ నలుమూలల నుంచి జనాలు పెద్దసంఖ్యలో వస్తారు. సప్పోరో స్నో ఫెస్టివల్ జపాన్లోని సప్పోరో నగరంలో ఏటా ఫిబ్రవరిలో జరిగే వేడుక ఇది. మంచుగడ్డ కట్టే పరిస్థితుల్లో మంచుతో శిల్పాలను తీర్చిదిద్ది ప్రదర్శిస్తారు. ఈసారి 2023 ఫిబ్రవరి 4 నుంచి 11 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. సప్పోరో నగరంలోని ఓడోరి పార్క్, సుసుకినో, సుడోమ్ సహా పలు ప్రదేశాలు ఈ వేడుకల్లో హిమశిల్ప ప్రదర్శనలకు వేదికలుగా నిలుస్తాయి. ఓడోరి పార్క్లో హిమశిల్పాల పోటీలు కూడా జరుగుతాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలలకు చెందిన కళాకారులు వందలాదిగా ఇక్కడకు వస్తుంటారు. సప్పోరో స్నో ఫెస్టివల్ 1950లో తొలిసారిగా ఒకరోజు కార్యక్రమంగా మొదలైంది. అప్పట్లో ఆరుగురు హైస్కూల్ విద్యార్థులు ఓడోరి పార్క్లో చేరి, మంచుతో శిల్పాలు మలచి సందర్శకులను ఆకట్టుకున్నారు. జపాన్ సైనిక దళాలు కూడా 1955 నుంచి ఈ వేడుకల్లో పాల్గొనడం ప్రారంభించడంతో ఇవి వారంరోజుల వేడుకలుగా మారాయి. అనతికాలంలోనే ఈ వేడుకలు అంతర్జాతీయ ప్రాచుర్యం పొందాయి. ఇక్కడి హిమశిల్పాలను తిలకించడానికి దేశవిదేశాల నుంచి ఏటా దాదాపు పాతిక లక్షల మంది వరకు పర్యాటకులు వస్తుంటారు. సెయింట్ పాల్ వింటర్ కార్నివాల్ అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్ర రాజధాని సెయింట్ పాల్లో ఏటా శీతకాలంలో భారీ కార్నివాల్ జరుగుతుంది. ఈ కార్నివాల్ వెనుక ఒక కథ ఉంది. న్యూయార్క్కు చెందిన ఒక పాత్రికేయుడు సెయింట్ పాల్ను ‘మరో సైబీరియా’గా పోలుస్తూ కథనం రాశాడు. శీతకాలంలో ఇక్కడ మనుషులు బతకలేరని అతను రాశాడు. ఈ కథనం స్థానికులకు కోపం తెప్పించింది. శీతకాలంలో కూడా సెయింట్ పాల్లో మనుషులు బతుకుతారని, అంతేకాదు, ఉల్లాసంగా ఉత్సాహంగా వేడుకలూ జరుపుకొంటారని రుజువు చేసేందుకు 1885లో మాంట్రియల్ సరిహద్దుల్లో ఒక మంచుసౌధాన్ని నిర్మించి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు 1937 వరకు ఒక క్రమం లేకుండా జరుగుతూ వచ్చాయి. తిరిగి 1946 నుంచి ఏటా క్రమపద్ధతిలో నిర్వహించడం ప్రారంభమైంది. ఈ వేడుకల కోసం భారీ హిమసౌధాన్ని సిద్ధం చేస్తారు. వీథుల్లో పరేడ్లు, రాత్రివేళల్లో కాగడాల ఊరేగింపులు, సంగీత నృత్య కార్యక్రమాలు, హిమశిల్పాల తయారీ పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్యూబెక్ వింటర్ కార్నివాల్ కెనడాలోని క్యూబెక్ నగరంలో ఏటా ఫిబ్రవరిలో పదిరోజుల పాటు వింటర్ కార్నివాల్ జరుగుతుంది. ఈసారి ఫిబ్రవరి 3 నుంచి 12 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. క్యూబెక్లో 1893 నుంచి జరుగుతూ వస్తున్న ఈ కార్నివాల్లో పాల్గొనేందుకు కెనడా, అమెరికా, యూరోప్ల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. నగరంలో పగలూ రాత్రీ కూడా కోలాహలంగా ఊరేగింపులు జరుగుతాయి. వాద్యపరికరాలను మోగిస్తూ, విచిత్రవేషధారణలతో వేలాది మంది ఈ ఊరేగింపుల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా మంచుశిల్పాల ప్రదర్శనలు, క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. Funday Cover Story: అత్యధిక దూరం వలసపోయే పక్షి ఏదో తెలుసా? -
Telangana: ఇగం.. ఆగమాగం!
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత.. తీవ్రంగా వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం.. దీనికి తోడు తుపాన్ ప్రభావంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. గత వారం రోజులుగా వణికిస్తున్న చలి.. ఇవాళ(గురువారం) ఉదయం మరింత ప్రభావం చూపెట్టింది. వాతావరణ ప్రభావంతో.. మధ్యాహ్నం సమయంలోనూ ఎండ ప్రభావం కనిపించడం లేదు. సాయంత్రం 5 గంటల నుంచే చలి క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో చలి ప్రభావం మరింత తీవ్రంగా ఉంటోంది. రాజధానిలోనూ అదే పరిస్థితి. ఉదయం వేళలో ప్రధాన రహదారులను పొగమంచు కప్పేస్తోంది. మంగళ, బుధవారాలతో పోలిస్తే.. గురువారం ఉదయం ఉష్ణోగ్రతలు కనీస స్థాయికి పడిపోయాయి. హైదరాబాదులో నమోదైన టెంపరేచర్ .. సాధారణ స్థాయికంటే తక్కువగా నమోదైంది. మరోవైపు మాండూస్ తుపాన్ ప్రభావంతో.. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో హైదరాబాదులోనూ వానలు పడొచ్చని భావిస్తోంది. ఇక ఉత్తర తెలంగాణలో చలి ప్రభావం అధికంగా ఉంటోంది. ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, కామారెడ్డిల్లో చలి తీవ్రత రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. వృద్ధులు, చిన్న పిల్లలు, ఆస్తమా పేషెంట్లు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున్న అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో వారం పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉమ్మడి ఆదిలాబాద్ లో ఉష్ణోగ్రతలు.. అదిలాబాదు జిల్లా నేరడి గోండలో 10.3. డిగ్రీలు, కుమ్రంబీమ్ జిల్లా సిర్పూర్ యులో 10.6 డిగ్రీలు, కెరిమెరిలో 10.7డిగ్రీలు, ఉట్నూర్ లో 10.8 డిగ్రీలు, బోరజ్ 11.1 డిగ్రీలు, కుమ్రంబీమ్ జిల్లా తిర్యాని 11.2 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా జన్నారం11.2 డిగ్రీలు నమోదు అయ్యాయి. ఇదీ చదవండి: ముంచుకొస్తున్న మాండూస్.. ఏపీలో భారీ వర్షాలు! -
ఎఫ్ఎంసీజీ కంపెనీలకు ‘వింటర్’ దన్ను
న్యూఢిల్లీ: చలి పెరగడంతో చర్మ, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లు పెరిగాయి. ఈ సీజన్తో అయినా గ్రామీణ ప్రాంతాల్లో తమ ఉత్పత్తుల అమ్మకాలు పుంజు కుంటాయని ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు అంచనా వేసుకుంటున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టనుండడంతో వినియోగం మరింత పెరుగు తుందని, గ్రామీణ ప్రాంతాల నుంచి వృద్ధి రికవరీ ఉంటుందని భావిస్తున్నాయి. డాబర్, ఇమామీ, మారికో కంపెనీలకు సంబంధించి చర్మ సంరక్షణ, రోగ నిరోధక శక్తిని పెంచే (చ్యవన్ప్రాశ్) ఉత్పత్తుల అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల్లో, ఈ కామర్స్ వేదికలపై పెరిగాయి. ఈ ఏడాది సాగు బలంగా ఉండడం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నందున, రానున్న త్రైమాసికాల్లో గ్రామీణ ప్రాంత అమ్మకాలు బలపడతాయన్న అంచనాలు కంపెనీల్లో ఉన్నాయి. 50 శాతం మేర వృద్ధి తమ ఉత్పత్తుల్లో బాడీ లోషన్, సఫోలా ఇమ్యూనివేద శ్రేణి తదితర అమ్మకాలకు శీతాకాలం కీలకమని మారికో ఇండియా బిజినెస్ సీవోవో సంజయ్ మిశ్రా తెలిపారు. ఈ ఏడాది కూడా అమ్మకాలు బలంగా ఉంటాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే హెయిర్ ఆయిల్ అమ్మకాలు పెరిగాయని తెలిపారు. గత కొన్ని నెలలుగా చూస్తే బాడీ లోషన్ అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రెండంకెల స్థాయిలో పెరిగాయన్నారు. కనుక అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే బాడీలోషన్ అమ్మకాల్లో 50 శాతానికి పైనే వృద్ధి నమోదు చేయగలమని భావిస్తున్నట్టు మిశ్రా చెప్పారు. మంచి డిమాండ్.. ఈ ఏడాది పండుగల సీజన్ తమకు రికవరీపై ఆశలు కలిగించినట్టు డాబర్ ఇండియా సీవోవో ఆదర్శ్ శర్మ తెలిపారు. డాబర్ చ్యవన్ ప్రాశ్, డాబర్ హనీ, గులాబరితోపాటు, చర్మ సంరక్షణ ఉత్పత్పత్తులతో వింటర్ పోర్ట్ఫోలియోను రూపొందించామని చెప్పారు. ప్రస్తుతం శీతాకాలం ప్రారంభంలో ఉన్నామని, తమ ఉత్పత్తులకు డిమాండ్ కనిపిస్తోందని చెబుతూ.. ఈ ఏడాది మంచి వృద్ధి నమోదు అయితే, తదుపరి డిమాండ్కు ఊతంగా నిలుస్తుందన్నారు. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ తక్కువగా ఉందన్నారు. ఈ ఏడాది సాగు మంచిగా ఉండడంతో వచ్చే త్రైమాసికంలో అమ్మకాలు పుంజుకుంటాయన్న అంచనాను వ్యక్తీకరించారు. ఈ ఏడాది వింటర్ ఉత్పత్తులకు డిమాండ్ కనిపిస్తున్నట్టు ఇమామీ సేల్స్ ప్రెసిడెంట్ వినోద్ రావు తెలిపారు. ద్రవ్యోల్బణం ఉన్నప్పుటికీ శీతాకాలంలో వినియోగించే ఉత్పత్తులకు గ్రామీణ ప్రాంతాల్లో మంచి రికవరీ కనిపిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హెచ్యూఎల్, డాబర్, ఇబామీ చర్మ సంరక్షణ విభాగంలో అధిక వాటాను ఆక్రమిస్తున్నాయని, ఇటీవల పామాయిల్, ముడి చమురు ధరలు తగ్గడం వల్ల తయారీ వ్యయాల పరంగా ఇవి లాభపడతాయని నువమా గ్రూపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబనీష్ రాయ్ అంచనా వేశారు. క్రమంగా పెరుగుతున్న -
చన్నీటి స్నానం.. చిన్నారుల దైన్యం
అసలే చలికాలం. వేకువజామున మంచు కురుస్తూ గజగజ వణికిస్తోంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రత రోజురోజుకూ పడిపోతోంది. ఇంతటి చలిలోనూ విద్యార్థులు చన్నీటి స్నానం చేస్తూ అవస్థలు పడుతున్నారు. జిల్లా కేంద్రం ఆదిలాబాద్లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గిరిజన సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో ఒకే నల్లా ఉంది. ఈ నల్లా వద్ద శుక్రవారం ఉదయం పదుల సంఖ్యలో విద్యార్థులు చలిలో స్నానాలు చేస్తూ కనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
నీ పర్సు ఎవడిక్కావాలి! చలికి చస్తున్నా.. నీ స్వెటర్ ఇచ్చేయ్!
నీ పర్సు ఎవడిక్కావాలి! చలికి చస్తున్నా.. నీ స్వెటర్ ఇచ్చేయ్! -
‘లైట్’ తీస్కోవద్దు.. హెడ్ లైట్లు, వెనక లైట్లు వేసుకోని వెళ్లండి
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట రహదారులు రక్తమోడుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో, ప్రత్యేకంగా హైవేలపై ఇటీవల జరిగిన ప్రమాదాల్లో కనీసం పలువురు మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయాలపాలయ్యారు. ఉదయం పూట మంచు కురిసే వేళలో సరైన జాగ్రత్తలు పాటించకుండా వాహనాలు నడపడంతోనే తెల్లవారుజామున ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు రహదారి భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు కారును ఢీకొన్న ఉదంతంలోనూ పొగమంచే ప్రధాన కారణమని రవాణాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పుడే చలికాలం మొదలైంది. మరో రెండు మూడు నెలల పాటు చలి తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. దీంతో పాటే దట్టమైన పొగ మంచు కూడా కమ్ముకొనే అవకాశం ఉంది. ఈ క్రమంలో హైవేలపై వాహనాలను నడిపేటప్పుడు రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. లైట్ ఆర్పితే అంతే సంగతులు.. ►దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉన్న సమయంలో వాహనాలను నడిపేటప్పుడు కచ్చితంగా హెడ్లైట్లు వెలుగుతూనే ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఎదురుగా వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదం ఉంది. ►ప్రధాన రహదారులపై డివైడర్ల వల్ల ఎదురెదురు వాహనాలు ఢీకొనే అవకాశం తక్కువగానే ఉండొచ్చు. కానీ సరైన వెలుతురు లేకపోవడం వల్ల డివైడర్లే మృత్యు ఘంటికలు మోగించే ప్రమాదం ఉంది. పొగమంచు కమ్ముకొని ఉన్నప్పుడు లైట్లు ఆర్పినా, కాంతి తక్కువగా ఉన్నా డివైడర్లను గుర్తించడం కష్టమవుతోంది. ►సాధారణంగా హైవేలపై కార్లు, ఇతర వాహనాలు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 8 గంటల వరకు 50 నుంచి 60 కి.మీ వేగం మించకుండా వాహనాలను నడపాలని ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నారు. వెనక లైట్లూ వెలగాలి.. ►రోడ్డు పక్కన బండి నిలిపి ఉంచినప్పుడు హెడ్ లైట్లతో పాటు, వెనుక లైట్లు కూడా వెలుగుతూ ఉండాలి. దీనివల్ల ఇతర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిలిపి ఉంచిన వాహనం ఉనికిని ఈజీగా గుర్తించేందుకు అవకాశం లభిస్తుంది. దీంతో ప్రమాదాలను నివారించవచ్చు. ►వాహనం చుట్టూ రేడియం టేప్ తప్పనిసరి. దీనివల్ల మంచు కురిసే సమయంలోనూ వాహనం ఉనికి తెలుస్తుంది. చాలా వరకు వాహనదారులు ఈ చిన్న నిబంధనను పాటించకపోవడంతోనూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయాలు శ్రేయస్కరం.. చలికాలంలో పొగమంచు కారణంగా రహదారులపై ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. మంచు కారణంగా ఎదుటి వాహనాలు కనిపించక వాహనాలు ఢీకొట్టుకోవటం, రోడ్డు సరిగా కనిపించక వాహనాలు దారితప్పడం వంటివి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస రావు వాహనదారులకు పలు సూచనలు చేశారు. రాత్రి 10.30 లోపు, ఉదయం 6 గంటల తర్వాత మాత్రమే ప్రయాణించాలన్నారు. రెండేళ్ల కాలంలో 50 మంది మృత్యువాత.. గత రెండేళ్లలో శీతాకాలంలో రోడ్డు ప్రమాదాల డేటాను ఆయన విశ్లేషించారు. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో సుమారు 50 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల వెంబడి కుటుంబ సబ్యులతో వాహనాల్లో ప్రయాణించడం ఇబ్బందికర విషయమన్నారు. తప్పనిసరి పరిస్థితులలో ప్రయాణం చేయాల్సి వస్తే.. సొంత డ్రైవింగ్ కాకుండా నైపుణ్యం ఉన్న డ్రైవర్ను వెంట తీసుకెళ్లడం ఉత్తమం. అది కూడా డ్రైవర్కు తగినంత విశ్రాంతి ఇచ్చిన తర్వాతే ప్రయాణం మొదలుపెట్టాలని సూచించారు. ‘బే’లలోనే పార్కింగ్.. ట్రక్లు, ఇతరత్రా పెద్ద వాహనదారులు శీతాకాలంలో ఓఆర్ఆర్, హైవేలపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలుపకూడదు. రాత్రి సమయంలో విశ్రాంతి కోసం తప్పనిసరి పరిస్థితులలో వాహనాలను నిలపాల్సి వస్తే... రోడ్డు నుంచి పూర్తిగా ఎడమ వైపు తీసుకొని వాహనాలను పార్కింగ్ చేయాలి. ఓఆర్ఆర్, హైవేలపై కేటాయించిన పార్కింగ్ బే, లైన్లలోనే ఆయా వాహనాలను నిలిపివేయాలి. లేకపోతే పొంగమంచుతో ప్రయాణిస్తున్న చిన్న వాహనాలు పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను ఢీకొట్టే ప్రమాదం ఉంది. నిద్ర మత్తు వీడాలి.. ► తెల్లవారుజామున జరిగే ప్రమాదాల్లో డ్రైవర్లు నిద్ర మత్తులో ఉండడం కూడా మరో కారణం. సాధ్యమైంత వరకు ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు వానాలను నడపకపోవడమే మంచిది. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే డ్రైవర్ పూర్తిగా ఆరోగ్యంగా ఎలాంటి నిద్రమత్తు లేకుండా ఉండాలి. ► రెప్పపాటు క్షణంలోనే ప్రమాదాలు జరుగుతాయి. ఒకవైపు మంచు కురుస్తుండగా, మరోవైపు నిద్రమత్తుతో బండి నడిపితే రోడ్డు ప్రమాదాలకు మరింత ఊతమిచ్చినట్లవుతుందని డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ హెచ్చరించారు. -
తెలంగాణలో చలి పెరుగుతోంది.. మెదక్లో అత్యల్పం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఆదివారం రాష్ట్రంలో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 32.2 డిగ్రీల సెల్సియస్ కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 12 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు సగటున 20 డిగ్రీల కంటే తక్కువగా నమోదు కావడం గమనార్హం. సాధారణంగా నమోదు కావాల్సిన కనిష్ట ఉష్ణోగ్రతల కంటే మరింత తక్కువగా నమోదవుతున్నాయి. మెదక్లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 6.1 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. హన్మకొండలో 4.8 డిగ్రీల సెల్సియస్, రామగుండంలో 3.3 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈశాన్య రుతుపవనాల రాక నేపథ్యంతో పాటు ఈశాన్య/ తూర్పు దిశల నుంచి రాష్ట్రానికి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత మరింత పెరిగినట్లు వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. -
గజగజ మొదలైంది! రాష్ట్రంలో ఒక్కసారిగా పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాత్రిపూట బయటికి రావాలంటే గజగజ వణికే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఈనెల ప్రారంభం నుంచి శీతాకాలం ప్రారంభమైనప్పటికీ వరుస వర్షాలతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదయ్యాయి. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పడుతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోపగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవుతుండగా.. రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం ఒక్కసారిగా పడిపోయి చలి తీవ్రత పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు ఒకట్రెండు చోట్ల మినహా మిగతా ప్రాంతాల్లో 20 డిగ్రీల సెల్సియస్లోపే నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజులు కూడా ఇదే తరహాలో వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణం కంటే తక్కువగా... బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 13.6 డిగ్రీల సెల్సియస్గా ఉంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రధాన కేంద్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రతలకు ఒక డిగ్రీ అటుఇటుగా నమోదుకాగా, కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే భారీగా తగ్గాయి. హనుమకొండలో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 4.2 డిగ్రీ సెల్సియస్ తక్కువగా నమోదైంది. హైదరాబాద్లో 5.6, మెదక్లో 5.4. నల్లగొండలో 3.6 డిగ్రీ సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. 29 నుంచి ‘ఈశాన్య’ వర్షాలు నైరుతి రుతుపవనాలు దాదాపు దేశమంతటా ఉపసంహరణ అయినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాలు రెండు మూడు రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఈనెల 29న బంగాళాఖాతం మీద, దక్షిణ ద్వీపకల్ప భారతదేశం మీదుగా ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భావిస్తోంది. వీటి ప్రభావంతో ఆగ్నేయ ద్వీపకల్ప భారతంలో ఈనెల 29 నుంచి ఈశాన్య రుతుపవన వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రానికి ఈశాన్య, తూర్పు దిశల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కడా తేలికపాటి వర్షాలు తప్ప ఎలాంటి హెచ్చరికలు లేవని చెప్పింది. -
చలికాలంలో చుండ్రు బాధా? జుట్టు మెరవాలంటే ఏం చేయాలి?
చలికాలంలో గాలిలోని తేమ తక్కువ. ఈ కారణంగా మనకు అనేక సమస్యలు వస్తుంటాయి. మరీ ఎక్కువ ఇబ్బందిపెట్టే సమస్య జుట్టు రాలడం సమస్య . విపరీతైమన చుండ్రుతో జుట్టు రాలిపోతుంది. హెయిర్ అంతా పొడబారి నిర్జీవంగా కాంతి విహీనంగా మారిపోతుంది. సో... ఈ వింటర్లో జుట్టుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల జుట్టుకు హాని కలుగుతుంది తెలుసా? మరి జుట్టు పట్టుకుచ్చులా ఆరోగ్యంగా, ఒత్తుగా ఉండాలంటే ఏం చేయాలి? వింటర్లో అందరినీ వేధించే సమస్య హెయిర్లాస్, విపరీతమైన చుండ్రు. దీంతోపాటు జుట్టుచిట్టిపోవడం, పొడిగా ఉండటం చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కనుక చలికాలంలో జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలసిందే. చర్మంగానీ, జుట్టుకానీ డీహైడ్రేషన్ బారిన పడకుండా తగినంత ద్రవ పదార్థాలు తీసుకోవాలి. కానీ చలికాలంలో చాలా తక్కువ నీటిని తాగుతాం ఈ కారణంగా సమస్యలు మరింత విజృంభిస్తాయి. తల పొడిబారిపోతుంది. తేమలేక జుట్టు రాలి పోతుంటుంది. చుండ్రు చేరుతుంది. ఆ ఇరిటేషన్, దురద బాగా వేధిస్తుంది. మరి చుండ్రును ఎదుర్కోవాలంటే జుట్టును శుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. అలాగే పోషకాహారంతో పాటు, తాజా కూరలు, పండ్లు, తీసుకోవాలి. వీటన్నింటికంటే చాలా ప్రధానమైనవి విటమిన్ డి, విటమిన్ బి, విటమిన్ ఇ అండ్ విటమిన్ సి. అంతేకాదు తరచుగా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా తగినంత న్యూటియంట్స్ శరీరానికి అందవు. ఫలితంగా జుట్టు పొడిబారి నిర్జీవంగా తయారవుతుంది. దీంతో సహజమైన, మెరుపును కోల్పోవడంతో పాటు జుట్టు రాలిపోవడం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో కచ్చితంగా జంక్ ఫుడ్కి నో చెప్పాలి. ఆరోగ్యకరమైన జుట్టు కోసం విటమిన్ డీ, నూట్రిషనల్ ఈస్ట్, బ్రస్సెల్ మొలకలు, బయోటిన్, అవకాడో, సీఫుడ్ ద్వారా లభించే సిలీనియం, జింక్, ఐరన్, మాంగనీస్ ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ చాలా అవసరం. విటమిటన్ డీ ఎంత పుష్కలంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు. విటమిన్ డీ ని డైరెక్టు సన్ ద్వారా గానీ, సప్లిమెంట్ రూపంలో గానీ, ఆహార పదార్థాల ద్వారా గానీ తీసుకోవాలి. మరోవైపు జుట్టు, చర్మం కాంతివంతంగా ఉండటంలో విటమిన్ డి- బయోటిన్ ది కీలకమైన పాత్ర. కార్బోహైడ్రేట్, లిపిడ్ జీవక్రియలో ప్రత్యేక పాత్ర విటమిన్ హెచ్ లేదా బయోటిన్ది అని చెప్పొచ్చు. బయోటిన్ లోపిస్తే జుట్టు, గోర్లు, చర్మం కాంతి విహీనంగా మారిపోతాయి. జుట్టు పెళుసుగా మారుతుంది, గోర్లు ఎక్స్ఫోలియేట్ అవుతాయి. చలికి తట్టుకోలేక వేడి వేడి నీళ్లతో తల స్నానం చేస్తుంటాం. నిజానికి ఇది చాలా పెద్దపొరపాటు. వేడి నీటితో జుట్టు మరింత డ్రై అవుతుంది. అలాగే జుట్టు తడిగా ఉన్నప్పుడు హడావిడిగా దువ్వుకూడదు. తడిగా ఉన్నజుట్టు బలహీనంగా ఉండి, సులువుగా ఊడిపోతుంది. అలాగే హెయిర్ ఫాల్ సమస్య ఉన్నవాళ్లు హెయిర్ డ్రయ్యర్ అస్సలు వాడకూడదు. పల్చటి, మెత్తటి కాటన్ క్లాత్తో జుట్టును ఆర బెట్టుకోవడం మంచిది. దీంతోపాటు ఇంట్లోనే తయారుచేసిన హెయిర్ మాస్క్, ఆయిల్ మసాజ్, రైస్ వాటర్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. తల స్నానానికిముందు శుద్ధమైన కొబ్బరినూనెతో మసాజ్ చేసుకుంటే కుదుళ్లు గట్టిపడతాయి. ఇంకా ఆలివ్ ఆయిల్, నిమ్మకాయ మిశ్రమం, అలోవేరా, ఉల్లిపాయ రసం, కరివేపాకులు వేసి మరగించిన నూనె, బియ్యం గంజి, మందార ఆకుల మిశ్రమాన్ని స్కాల్ఫ్కి పట్టేలా మర్దన చేసి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్తో పోలిస్తే ఈజీగా దొరికే రైస్ వాటర్లో అమినో యాసిడ్స్, విటమిన్ బి, విటమిన్ ఇ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి చిట్కాలు జుట్టుకు మంచి టానిక్లా పనిచేస్తాయి. ఎక్కువ స్ట్రాంగ్ ఉండే షాంపూలకు దూరంగా ఉండండి. ఆర్గానిక్, లేదా హెర్బల్ షాంపూలను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. -
ఫీలింగ్ గజగజ..
-
మంచు దుప్పటి
సాక్షి, విశాఖపట్నం/బి.కొత్తకోట: రాష్ట్రంపై చలి పులి పంజా విసురుతోంది. వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ కలవరపెడుతున్నాయి. అన్నిచోట్లా సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీనికి తోడు ఏపీ తీరం వెంబడి ఉత్తర గాలులు, రాయలసీమ మీదుగా తూర్పు గాలులు తక్కువ ఎత్తున వీస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలు మినహా రాష్ట్రంలో అన్నిచోట్లా సగటు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. రాయలసీమలోనూ చలి తీవ్రత పెరుగుతోంది. శీతల గాలులు వీస్తుండటంతో ఇళ్ల నుంచి బయటికి రావాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ మన్యంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చింతపల్లిలో సోమవారం ఉదయం 5 గంటలకు 3.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదై ఎముకలు కొరికేలా చలి పెరిగిపోయింది. ఉదయం 5 గంటల సమయంలో జి.మాడుగులలో 4.7, అరకులో 5.3, ముంచంగిపుట్టులో 5.8, పాడేరులో 6.1, మారేడుమిల్లిలో 9.6, మడకశిరలో 10, తిరుమల, పెదబయలులో 10.2, హుకుంపేట, కునుర్పి, రొద్దాంలో 10.7, ఆలూరులో 11.3, మదనపల్లెలో 11.7, మంత్రాలయంలో 11.9, ఓబులదేవర చెరువులో 12, వై.రామవరంలో 12.1, గుమ్మగుట్టలో 12.4, బేతంచెర్ల, గుత్తిలో 12.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హార్సిలీ హిల్స్పై తిరుమల కంటే తక్కువగా.. రాయలసీమలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలో సోమవారం నమోదయ్యాయి. బి.కొత్తకోట మండలంలో సముద్ర మట్టానికి 4,141 అడుగుల ఎత్తులో గల హార్సిలీ హిల్స్పై కనిష్ట ఉష్ణోగ్రత 6.6 డిగ్రీలుగా నమోదైంది. హార్సిలీ హిల్స్ కంటే తిరుమల కొండలు తక్కువ ఎత్తు కావడంతో ఇక్కడ 10.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
శీతాకాలం వచ్చేసింది.. వాహనదారులు వీటిని తప్పక పాటించాలి.. లేదంటే..
సాక్షి,సీతంపేట(శ్రీకాకుళం): శీతాకాలం ప్రారంభంతోనే పొగమంచు దట్టంగా కరుస్తోంది. దీంతో వాహన చోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచులో వాహ నం నడపడం సాహసంతో కూడుకున్నదే. ఎదురుగా వస్తున్న వాహనం దగ్గరకు వచ్చేవరకూ గుర్తించలేం. అలాంటి సమయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాలా బారిన పడేందుకు అవకాశం ఉంది. వాతావరణ ఎలా ఉన్నా ప్రజలు తమ పనుల నిమిత్తం ప్రయాణించక తప్పదు. ఈ నేపథ్యంలో ఉదయాన్నే పొగమంచులో ప్రయాణించేవారు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాటించాల్సిన జాగ్రత్తలు ► పొగమంచు కురిసే సమయంలో వీలైనంత వరకు వాహనాలను నడపకపోడం మంచిది ► రహదారిపై మంచు తీవ్రత పెరిగితే సురక్షితమైన ప్రాంతాల్లో పార్కింగ్ చేయాలి ► కార్లు, ద్విచక్రవాహనాలపై సాధ్యమైనంత తక్కువ దూరం ప్రయాణం చేయాలి ► పొగమంచు కమ్ముకున్నపుడు వాహన వేగం తగ్గించాలి ► ఎదురెదురుగా వస్తున్న వారు గమనించేలా హెడ్లైట్స్ ఆన్చేసి ఉంచాలి. కొత్త వాహనాలకు ఆ సమస్య లేదు. ఎల్లపుడు హెడ్లైట్స్ వెలిగే ఉంటాయి ► వాహనాలకు వైపర్స్ పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి ► డ్రైవర్ పక్కన కూర్చునే వారు డ్రైవింగ్ తీరును ఎప్పటికపుడు పర్యవేక్షించాలి ► వాహనం వెనుక.. ముందు రేడియం స్టిక్కర్లు విధిగా అతికించాలి ► వాహనానికి అమర్చిన రెడ్సిగ్నల్స్, బ్రేక్ సిగ్నల్స్ పనితీరు సరిచూసుకోవాలి ► పొగమంచు ఉన్నపుడు ఎదురుగా వెళ్లున్న వాహనాన్ని అధిగమించే ప్రయత్నం మానుకోవాలి ప్రమాదాలకు ఆస్కారం.. ► రహదారుల పక్కనే వాహనాలు నిలపడం, మలుపులతో కూడిన రహదారులు ఉండడం ► పరిమితం కంటే అధికవేగంతో వాహనాలు నడపడం ► దట్టంగా ఉన్న మంచు వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడం ► రహదారి వెంబడి ఉన్న డివైడర్లను ఢీకోవడం వంటి కారణంగా ఈ సీజన్లో ప్రమాదాలకు ఆస్కారం ఉంది చదవండి: మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రేసులో సిక్కోలు మహిళ -
Winter Fashion: డ్రెస్ ఏదైనా వాటి మీదకు లాంగ్ ష్రగ్ ఒకటి ధరిస్తే చాలు!
Winter Fashion: డ్రెస్సింగ్ స్టయిల్గా ఉండాలి... పార్టీలో గ్రాండ్గా కనిపించాలి... అదే సమయంలో కాలానికి తగినట్టు ఉండాలి. ఈ సీజన్ మోసుకొచ్చే చలితో పాటు ఈవెనింగ్ పార్టీలకు కూడా ఆహ్వానం పలుకుతుంది. సందర్భానికి తగినవిధంగా కుర్తా, పలాజో, లాంగ్ గౌన్, శారీ.. ధరించే డ్రెస్ ఏదైనా వాటి మీదకు లాంగ్ ష్రగ్ ఒకటి ధరిస్తే చాలు చలిని తట్టుకుంటూ పార్టీలను ఎంజాయ్ చేయచ్చు. గ్రాండ్గానూ, ఫ్యాషనబుల్గానూ ఆకట్టుకోవచ్చు. కుర్తా, పైజామా మీదకు ఎంబ్రాయిడరీ చేసిన లాంగ్ ష్రగ్ లేదా ఓవర్కోట్ నైట్ పార్టీలలో మరింత సౌకర్యంగా ఉంటుంది. రిసెప్షన్, బర్త్డే పార్టీలు సాధారణంగా ఈవెనింగ్ సమయాల్లోనే జరుగుతుంటాయి. ఈ పార్టీలో స్టయిల్గా కనిపించాలంటే జార్జెట్ పలాజో, టాప్విత్ లాంగ్ ష్రగ్ ఒకే కలర్ ఉన్నవి ధరిస్తే చాలు. ఇన్బిల్ట్ ష్రగ్ పలాజో రెడీమేడ్ డ్రెస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి కాలానుగుణంగా వెలిగిపోవచ్చు. చీర మీదకు డిజైనర్ ష్రగ్ లేదా లాంగ్ కోట్ ధరిస్తే చాలు పార్టీలో ఎక్కడున్నా స్టయిలిష్ లుక్తో ఆకట్టుకోవచ్చు. ప్లెయిన్ లాంగ్ గౌన్ మీదకు కాంట్రాస్ట్ బెనారస్ లాంగ్ ష్రగ్ లేదా జాకెట్ ధరిస్తే చాలు పెళ్లి వేడుక కూడా గ్రాండ్గా మారి పోతుంది. క్యాజువల్, గెట్ టు గెదర్ పార్టీలకు హాజరవ్వాలంటే జీన్స్ ట్యునిక్ మీదకు ఇలా ఒక మందపాటి లాంగ్ ష్రగ్ వేసుకుంటే చాలు. వణికించే చలిలోనూ కులాసాగా ఫ్యాషనబుల్ మార్కులు కొట్టేయచ్చు. చదవండి: Christmas 2021: ఆర్నమెంట్ స్పాంజ్ బాల్స్, క్యాండీబాల్స్తో అందంగా.. -
తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా.. గజగజ వణుకుతున్న జనం
-
వలస విహంగాల సందడి
సూళ్లూరుపేట: విదేశీ వలస విహంగాల సందడితో.. ప్రకృతి అందాలకు హరివిల్లుగా పేరుగాంచిన పులికాట్ సరస్సు మరింత శోభను సంతరించుకుంటుంది. సుదూర ప్రాంతాల నుంచి శీతాకాలంలో మాత్రమే ఈ ప్రాంతానికి విచ్చేసే విదేశీ వలస పక్షులు నేలపట్టు, వెదురుపట్టు, శ్రీహరికోట తదితర ప్రాంతాల్లోని చెట్లపై గూళ్లు కట్టుకుని సంతానోత్పత్తి చేసుకుని తిరిగి వెళుతుంటాయి. అక్టోబర్ నుంచి మార్చి దాకా ఈ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని నేలపట్టును బ్రీడింగ్ సెంటర్గా, పులికాట్ సరస్సును ఫీడింగ్ సెంటర్గా ఉపయోగించుకుని వెళుతుంటాయి. సంతానోత్పత్తి నేలపట్టులో, ఆహారం కోసం పులికాట్ సరస్సులో ఉంటూ.. పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. శ్రీహరికోట–సూళ్లూరుపేట రోడ్డుకు పక్కన వలస విహంగాలు వేల సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. ఈ సారి సరస్సులో నీళ్లు సమృద్ధిగా ఉండడంతో వేల సంఖ్యలో ఫ్లెమింగోలు, ఫెలికాన్స్, పెయింటెడ్ స్టార్క్స్, ఇతర కొంగజాతులు గుంపులు గుంపులుగా చేరుకుంటున్నాయి. -
శీతకాల విడిది.. హైదరాబాద్కు రానున్న రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతకాల విడిది కోసం హైదరాబాద్ రానున్నారు. డిసెంబర్ మూడు లేదా నాలుగో వారంలో ఈ పర్యటన ఉండబోతోంది. బొల్లారంలో 90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. నిరుడు కోవిడ్ కారణంగా రాష్ట్రపతి శీతాకాల విడిదికి రాలేదు. ఈ సారి రాష్ట్రపతి దక్షిణాది విడిదికి వస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్రపతిభవన్ వర్గాలు సమాచారం అందించారు. ఈ విడిదిలో భాగంగా నాలుగైదు రోజులపాటు ఇక్కడి రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు. -
విశాఖ ఏజెన్సీలో చలి పులి
పాడేరు: విశాఖ ఏజెన్సీలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో పాటు అర్ధరాత్రి నుంచే పొగ మంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు వీడడం లేదు. నాలుగు రోజుల నుంచి ఏజెన్సీ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతున్నాయి. గురువారం చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 10.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత. పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 11 డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో 14.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం వేళల్లో కూడా 24 నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే నమోదవుతోంది. సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు అధికమవుతున్నాయి. ఏజెన్సీలోని అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, పాడేరు, చింతపల్లి, సీలేరు ప్రాంతాలను సందర్శిస్తున్న పర్యాటకులంతా ఏజెన్సీలోని శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. -
ఆమెను కొత్త స్వెటర్ కొనుక్కోనిద్దాం..
చలికాలం పిల్లలు నిద్ర లేవరు. వారికి ఆ హక్కు ఉందట. భర్త గారు ‘కాసేపు నిద్రపోనీ’ అంటుంటారు. ఆయనగారిని ఏం అనగలం. కాని స్త్రీలు లేవాల్సిందే. వంట చేయాల్సిందే. అన్నీ సిద్ధం చేయాల్సిందే. వారెప్పుడు రుతువులను ఎంజాయ్ చేయాలి? భార్యకు కొత్త స్వెటర్ కొనివ్వాలంటే టైమ్ ఉండదు. పోనీ ఆమెను కొనుక్కోనివ్వము. అమ్మకు చెవులకు స్కార్ఫ్ ఎప్పుడూ పాతదే. చలికి ఆడవాళ్ల పాదాలకు సాక్సులు అవసరం అని కూడా అనుకోము. ఈ కాలంలో స్త్రీలకు ఏం కావాలో వారిని తెచ్చుకోనివ్వండి. పని ఒత్తిడి తగ్గించండి. టీ తాగుతూ చలిని వారినీ ఆస్వాదించనివ్వండి. చలికాలం బద్దకం కాలం. వెచ్చగా ముసుగుతన్నమని చెప్పేకాలం. కాని ఆ లగ్జరీ ఇంటి మగవారికి, పిల్లలకి ఉన్నట్టుగా ఆడవారికి ఉండదు. బయట ఎంత చలి ఉన్నా తెల్లారే ఆరుకు వాళ్లు లేవాల్సిందే. బయట ఎంత మంచు కురుస్తున్నా తొంగి చూడక వంట గదిలో దూరాల్సిందే. వరండాలోనో, బాల్కనీలోనో, ముంగిలి లోనో కుర్చీ వేసుకుని కాఫీ తాగుతూ మంచుతో తడిసిన బంతిపూల మొక్కను చూడాలని వారికీ ఉంటుంది. కాని వారికి కాఫీ తెచ్చిచ్చేవారు ఎవరూ ఉండరు. వారి కాఫీ వాళ్లే పెట్టుకోవాలి. చలికాలమైనా హిమ ఉదయమైనా. ఇంకా ద్వితీయశ్రేణి పౌరులేనా? చలికాలం వస్తే భర్త బజారు నుంచి వస్తూ వస్తూ రోడ్డు మీద అమ్మే ఒక జర్కిన్నో, స్వెటర్నో కొనుక్కుంటాడు. బండి నడుపుతాడు కదా మంకీ క్యాప్ కొనుక్కుంటాడు. పిల్లలు చలికి ఎక్స్పోజ్ అయితే ఎలా? వారి కోసం తప్పక స్వెటర్లు కొంటాడు. కాని భార్యకు ఎందుకనో వెంటనే కొనడు. కొనాలన్నా ఉంది కదా అనిపిస్తుంది. ఆమే కొనుక్కుంటుందిలే మన సెలక్షన్ నచ్చదు అనుకుంటాడు. ఆమె కొనుక్కునేది లేదు. ఆమెకు ఆ వీలూ చిక్కదు. చాలా ఇళ్లల్లో స్త్రీలు పాతబడిన స్వెటర్లతోనే తిరుగుతూ ఉంటారు ఈ సీజన్లలో. స్త్రీలకు రకరకాల స్వెటర్లు అమ్ముతారు. హాఫ్ స్వెటర్లు ఇంట్లో వేసుకోవచ్చు. ఫుల్స్వెటర్లు బయటకు వెళ్లేప్పుడు. కొనే స్తోమత ఉన్నా ‘ఇన్ని ఎందుకు’ అనే ప్రశ్న ఆమెకు ఎదురవుతుంది. స్త్రీలు సౌందర్య ప్రియులు అని తెలుసు. ఈ శీతాకాలం రెండు మూడు నెలలు ఒకే ఒక్క స్వెటర్తో వాళ్లు ఎందుకు గడిపేయాలి. అక్కర్లేదు అని వారూ అనుకోరు. ఇంటి మగవారూ చెప్పరు. అమ్మ సంగతి ఏమిటి? ఇంట్లో అమ్మ ఉంటే శీతాకాలం ఆమెకై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆమెకు బడ్జెట్ కేటాయించాలి. ఒక మంచి షాల్ కప్పుకుని ఆమె కూచుంటే ఎంత బాగుంటుంది. ఆమెకు నచ్చిన రంగుల్లో రెండు మూడు స్కార్ఫులు ఉంటే ఎంత బాగుంటుంది. నేలకు పాదాలు తాకి జిల్లు మనకుండా ఇంట్లో తిరగడానికి మంచి స్లిప్పర్లు, సాక్సులు ఆమెకు తప్పనిసరి. ఒక కొత్త రగ్గు కొని ఇస్తే ఆ ఉత్సాహమే వేరు. అమ్మ ఆ ఇంట్లో కొడుకు, కోడలు మీద ఆధారితమైతే ఆమెను చిన్నబుచ్చకుండా ఇవన్నీ లేదా వీటిలో కొన్నయినా ఈ శీతాకాలపు ప్రారంభంలోనే ఆమెకు కొనిస్తే నోరు తెరిచి అడగాల్సిన అవస్థ తప్పుతుంది. ఇవాళ వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి. ఆ డబ్బును చాలా ఇళ్లల్లో ఆ అమ్మలు, అత్తలు కొడుకు చేతుల్లోనో కోడలు చేతుల్లోనో పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ‘ఈ నెల డబ్బు మీ కోసం మీ చలికాలపు అవసరాల కోసం ఉంచుకోండి’ అని చెప్పలేమా? వంట బాధ రోజూ ఉదయాన్నే టిఫిన్ చేస్తున్నా ఒక్కపూట బజారు నుంచి తెచ్చుకోండి అంటే ‘బజారు టిఫినా’ అని విసుక్కుని రోజు మూడ్ని పాడు చేసే భర్తలు ఉంటారు. రోజూ టిఫిన్ చేసే బాధ వేరే ఏ కాలంలో అయినా ఓకే కాని చలికాలం చాలా కష్టం. చలికి పని చేయబుద్ధి కాదు. ఎవరైనా చేసిపెడితే బాగుండు అని భర్తలకు సదా అనిపించినట్టే భార్యలకు అప్పుడప్పుడైనా అనిపిస్తుంది. భోజనం తిప్పలు ఎలాగూ తప్పవు కాబట్టి బ్రేక్ఫాస్ట్ సమస్యను ఎలా పరిష్కరించవచ్చో ఎలా ఆ శ్రమ కాస్తంత తగ్గించవచ్చో ప్రతి ఇంటి పురుషులు, పిల్లలు ఆలోచించాలి. ప్రత్యామ్నాయ టిఫిన్లు, ఇన్స్టంట్ టిఫిన్లు, ఆమె చేయకపోయినా మనం చేసుకు తినగలిగే అల్పాహారాలు ఎన్నో మార్కెట్లో ఉన్నాయి. యూట్యూబ్లో కొడితే వందలాది వీడియోలు ఉన్నాయి. మనం ఇల్లు కదలకపోయినా తెచ్చిపెట్టే స్విగ్గి, జొమాటోలు ఉన్నాయి. వారంలో ఒకటి రెండు రోజులైనా ఈ శీతాకాలంలో ఉదయపు వంట చెర నుంచి ఆమెను విముక్తి చేస్తే ఆమెకు కలిగే సంతోషం ఆలోచించారా ఎవరైనా? ఆమె సౌందర్యం అవును. చక్కగా ఉండే హక్కు, సౌందర్యాన్ని కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. మగవాళ్లు దీనిని లెక్క చేయొచ్చు చేయకపోవచ్చు. కాని శీతాకాలంలో స్త్రీలు తమ శరీరం గురించి ఆలోచన చేస్తారు. చర్మాన్ని, శిరోజాల్ని కాపాడుకోవడానికి వారికి కొన్ని వస్తువులు అవసరం. క్రీములు, నూనెలు, సబ్బులు... అదనపు ఖర్చే. ఆ ఖర్చు వారు సంపాదించే దాని నుంచైనా భర్త సంపాదన నుంచైనా చేసే వాతావరణం ఇంట్లో ఉండాలి. చర్మ సమస్యలు కొందరిలో రావచ్చు. వాటిని చిట్కాలతో సరిపుచ్చుతూ బాధపడాల్సిన పని లేదు. వైద్యుల దగ్గరకు వెళ్లాలి. ఇక ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే వారికి చలికాలం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారిని రోజువారీ చాకిరీ నుంచి దాదాపుగా తప్పించాలి. ఈ కాలంలో జలుబు, త్రోట్ ఇన్ఫెక్షన్లు సహజం. వాటి నుంచి కాపాడేలా ఆమెను వెచ్చని వాతావరణంలో విశ్రాంతంగా ఉంచడం కోసం ఏం చేయొచ్చో ఆలోచించాలి. నిజానికి ఇవన్నీ రాసి చెప్పాలా అనిపించవచ్చు. రాసి చెప్తే కాని స్త్రీలకు ఎంత పని ఉందో దాని నుంచి ఎలా తప్పించవచ్చో తెలియనంతగా ఆ పని స్త్రీల నెత్తి మీద ఉంది. చలికాలం వారికి పని తేలిక చేద్దాం. చలికాలాన్ని ఎంజాయ్ చేసేలా చూద్దాం. హ్యాపీ వింటర్. నిజానికి ఇవన్నీ రాసి చెప్పాలా అనిపించవచ్చు. రాసి చెప్తే కాని స్త్రీలకు ఎంత పని ఉందో దాని నుంచి ఎలా తప్పించవచ్చో తెలియనంతగా ఆ పని స్త్రీల నెత్తి మీద ఉంది. చలికాలం వారికి పని తేలిక చేద్దాం. -
తీవ్రంగా పెరిగిన చలి
-
ఓహ్రీస్లో 'వింటర్' కేక్..
-
వెల్లుల్లి.. వింటర్లోనే ఎక్కువ ఎందుకు..
సీజన్ మారిన ప్రతిసారి ఏదో ఒక ఆరోగ్య సమస్య మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇందుకు వింటర్ (చలికాలం) మినహాయింపు కాదు. వింటర్ చల్లదనాన్ని ఎటువంటి అనారోగ్యాలకు గురికాకుండా ఎంజాయ్ చేయాలంటే వెల్లుల్లి (గార్లిక్)ని డైలీ ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిదట. మన భారతీయ వంటకాలకు వెల్లుల్లితో విడదీయరాని బంధం ఉంది. దాదాపుగా వండే అన్ని కూరల్లో వెల్లుల్లి వాడుతుంటారు. అంతేగాక సంప్రదాయ సనాతన ఔషధాలలో కూడా యాక్టివ్ ఇంగ్రీడియంట్గా వెల్లుల్లి వినియోగిస్తున్నారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. వెల్లుల్లి మన శరీరంలో ఉన్న ట్రై గ్లిసరైడ్స్ని నియంత్రణలో ఉంచి గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచడం, రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో వెల్లుల్లి పాత్ర అమోఘం. అయితే ఇన్ని సుగుణాలు ఉన్న వెల్లుల్లిని సరైన పద్ధతిలో తీసుకోకపోతే శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. వింటర్లోనే ఎందుకు.. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ ర్యాడికల్స్ కారణంగా మన శరీరంలో పాడయ్యే కణాలను బాగుచేయడానికి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఫాస్పరస్, క్యాల్షియం, పొటాషియం, ఐరన్, కాపర్ వంటి ఖనిజాలు దీనిలో అధికంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ సి, విటమిన్ బి6(పైరిడాక్సిన్) కూడా ఉంటాయి. సి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు తోడ్పడుతుంది. రోజువారి ఆహారంలో వెల్లుల్లిని తీసుకుంటే శరీర ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత అంతగా బాధించదు. ఉదయాన్నే పరగడుపున (ఖాళీకడుపు) పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుతాయి. అంతేగాకుండా ధమనుల లో ఎటువంటి బ్లాకేజ్ లేకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పచ్చి వెల్లుల్లిలో అల్లిసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రణలో ఉంచుతుంది. వెల్లుల్లిని ఉడికించినప్పుడు ఈ అల్లిసిన్ స్థాయులు తగ్గిపోతాయి. అందువల్ల పచ్చిది తింటే ఎంతో మంచిది. అయితే పచ్చి వెల్లుల్లి తినేటప్పుడు దానిని కొంచెం చితక్కొట్టి కాసేపు గడిచాక తింటే మంచిది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే ఒక గ్లాసు నీటిలో వెల్లుల్లి రసాన్ని కలిపి నిత్యం తీసుకోవాలి. గార్లిక్ టీ.. అయితే పచ్చి వెల్లుల్లి తీసుకోవాలంటే కొంతమందికి ఇబ్బందిగానే ఉంటుంది. అటువంటి వారు వెల్లుల్లి టీ చేసుకుని తాగితే సరిపోతుంది. నాలుగు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి ఒక కప్పు మరిగే నీటిలో వేయాలి. నీరు బాగా మరిగాక అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి వేయాలి. దీన్ని మరో రెండు నిమిషాలు మరిగించి స్టవ్ ఆపేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక కప్లో పోసుకుని దానిలో ఒక టీ స్పూన్ తేనె, అరటీస్పూన్ నిమ్మరసం వేయాలి. దీనిని బాగా కలుపుకుని తాగితే గార్లిక్ టీ ఫ్లేవర్స్ను ఎంజాయ్ చేయవచ్చు. గార్లిక్ స్టీవ్.. వెల్లుల్లి ఏ కూరలో వేసినా దాని రుచి మరింత పెరుగుతుంది. ఈ కోవకు చెందినదే గార్లిక్ స్టీవ్. ఇది రుచితోపాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చికెన్తో చేసే ఈ రెసిపీలో చాలా పోషకాలు ఉంటాయి. ఒక చికెన్ బ్రెస్ట్ పీస్ను తీసుకుని దానిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు ప్రెషర్ కుక్కర్లో వేసి దానిలో ఒక టీస్పూన్ బటర్, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, నాలుగు మిరియాలు, ఒక టేబుల్స్పూన్ పార్సెల్లీ, ఒక అంగుళం ముక్క అల్లం పేస్టు చేసి వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తరువాత మూడు కప్పుల నీళ్లు పోసి సన్నని మంట మీద 3–4విజిల్స్ వచ్చేంతవరకు ఉంచాలి. తరువాత కుకర్ మూత తీసి కాస్త కొత్తిమీర చల్లి వడ్డిస్తే హెల్తీ అండ్ టేస్టీ గార్లిక్ స్టీవ్ రెడీ అయినట్లే. ప్రోటీన్తో నిండిన చికెన్, వెల్లుల్లి సుగుణాలు కలగలిసి గార్లిక్ స్టీవ్ ఎంతో రుచిగా ఉంటుంది. ఇన్ని పోషకాలతో నిండి ఉన్న వెల్లుల్లిని రోజువారి ఆహారంలో తీసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో కదా..! ఇంకెందుకాలస్యం? వీటిలో ఏదో ఒక దానిని మీ ఆహారంలో భాగం చేసుకోని ఆరోగ్యంగా జీవించండి. -
చలితో వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు
సాక్షి, విశాఖపట్నం: మధ్య భారతదేశం నుంచి వస్తున్న చలిగాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. విశాఖ మన్యంలో చలిపులి పంజా విసురుతుంది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో గిరిజనులు గజగజ వణుకుతున్నారు. మంగళవారం చింతపల్లిలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం ఉదయం పదిగంటలకు కూడా పొగమంచు వీడలేదు. ఉపరితలంపై ఏర్పడిన అధికపీడనంతో పాటు ఈశాన్యగాలులు తక్కువ ఎత్తులో వీస్తున్న కారణంగా చలితీవ్రత క్రమంగా పెరుగుతోంది. మరోవైపు సముద్రతీరం నుంచి వీస్తున్న వెచ్చటి గాలుల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతున్నా రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం పడిపోతున్నాయి. నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లిటిలో 4.3 డిగ్రీలు నమోదు అయ్యాయి. కుమ్రంబీమ్ జిల్లా గిన్నేదరిలో 4.4,డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో చలికి ప్రజలు వణికిపోతున్నారు. చదవండి: బైబై.. డీలక్స్ బస్సుకు సెలవు! ముఖ్యంగా రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణాజిల్లాల్లో 10 నుంచి 11 డిగ్రీల వరకు, విశాఖ ఏజెన్సీలో 1 నుంచి 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఏజెన్సీలో వీస్తున్న గాలుల ప్రభావంతో విశాఖలో చలి పెరుగుతోంది. మంగళవారం రికార్డు స్థాయిలో సాధారణం కంటే 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత పడిపోయింది. క్రమంగా కోస్తాతీర ప్రాంతాల్లోనూ చలి తీవ్రత పెరుగుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో ప్రస్తుతం తుపాను కేంద్రీకృతమై ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇది క్రమంగా బలహీనపడుతూ బంగాళాఖాతం వైపు చేరుకుంటుందని, క్రమంగా శ్రీలంక తీరం వైపు కదలనుందని తెలిపారు. దీని కారణంగా ఈ నెలాఖరులో దక్షిణకోస్తా జిల్లాలో ఒకటి రెండు చోట్ల వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో మినుములూరులో 7, అరకులోయలో 10.4, నందిగామలో 12.2, విశాఖలో 13.8, కళింగపట్నం, అమరావతిలో 15.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చదవండి: తెలంగాణ గజగజ -
తెలంగాణ గజగజ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. సీజన్ మధ్యస్థానికి రావడం.. ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు నమోదు కావడంతో పాటు ఉత్తర, ఈశాన్య దిశల నుంచి గాలులు వీస్తుండటంతో చలి ప్రభావం పెరుగుతోంది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారిలో 4.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యల్పం. రాత్రి, ఉదయం పూట చలి తీవ్రత అధికంగా ఉంటోంది. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు ఖమ్మం జిల్లాలోని పమ్మి వద్ద 35 డిగ్రీలుగా నమోదైంది. సోమవారం ఉదయం 8.30 గంటల వరకు నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. ఆదిలాబాద్ జిల్లా అర్లీలో 4.6 డిగ్రీలు, తాంసీలో 4.9 డిగ్రీలు, వికారాబాద్లో 5 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. (చదవండి: రోజంతా గజగజ..) రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే.. 22 జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనిష్ట ఉష్ణోగ్రత బీహెచ్ఈఎల్లో 10 డిగ్రీలు నమోదైంది. రానున్న మూడ్రోజుల పాటు ఇదే తరహా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం నమోదవుతుందని వెల్లడించింది. -
‘మంచు’కొస్తోంది
సాక్షి, హైదరాబాద్: తెల్లవారుజాము...చల్లటి గాలులు...దట్టమైన పొగమంచు...నిర్మానుష్యమైన రహదారులు రోడ్డు ప్రమాదాలకు ‘దారి’తీస్తున్నాయి. వేగంగా వెళ్లే వాహనాలను పొగమంచు కమ్ముకుంటోంది. శీతాకాలంలో జరిగే రోడ్డు ప్రమాదాలకు వాహనాల వేగంతో పాటు దట్టంగా అలుముకొనే పొగమంచు కూడా ప్రధాన కారణమవుతోంది. నగర శివార్లు, హైవేలపైన, ఔటర్ రింగ్ రోడ్డు పైన తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు రహదారి భద్రత నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చలికాలం ప్రయాణాల్లో సరైన జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి ప్రమాదాలకు గురి కాకుండా క్షేమంగా గమ్యాన్ని చేరుకోవచ్చు. ఆహ్లాదం మాటున ప్రమాదం ... సాధారణంగా ఉదయం పూట ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అయితే ఈ సమయంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్మానుష్యంగా కనిపించే రహదారులపైన వేగం పెంచడం ఒక కారణమైతే పొగమంచు వల్ల రోడ్లు సరిగ్గా కనిపించకపోవడం మరో కారణం. ఉదయం 3 గంటల నుంచి 6 గంటల మధ్యే ఈ తరహా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసుల అంచనా. ఈ సమయంలో 380 నుంచి 400 కు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆర్టీఏ అధికారులు పేర్కొంటున్నారు. చలికాలం డ్రైవింగ్ పట్ల సరైన అవగాహన లేకపోవడం కూడా ఇందుకు కారణమని, వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా డ్రైవింగ్లో మెళకువలు పాటించాలని డిప్యూటీ రవాణా కమిషనర్, రహదారి భద్రతా నిపుణులు డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ తెలిపారు. అప్రమత్తతే రక్ష... ⇔ పొగమంచు కారణంగా ఉదయం, సాయంత్రం సమయంలో రోడ్లపై కంటితో చూడగలిగే దూరం తగ్గుతుంది. చెరువులు, లోతట్టు ప్రాంతాలు, ఎక్కువగా చెట్లు , తోటలు ఉన్న ప్రాంతాల్లో పొగమంచు మరింత ఎక్కువగా ఉంటోంది. ⇔ ఈ సమయంలో బండి నడిపేటప్పుడు ఇతరులకు స్పష్టంగా కనిపించేలా ఉండాలి. ఇందుకోసం వాహనం లైట్లను వేసుకోవాలి. ⇔ చూడదగిన దూరానికి అనుగుణంగా బైక్, కారు వేగం ఉండాలి. ఉదాహరణకు 50 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు 70 మీటర్ల దూరాన్ని స్పష్టంగా చూడగలగాలి. ⇔ హైవేలు, శివారు రహదారులపైన వాహనాల మధ్య కచ్చితమైన దూరం పాటించాలి. విండ్ స్క్రీన్పై ఎప్పటికప్పుడు మంచును శుభ్రం చేయాలి. ఇందుకోసం బండిలో డీఫ్రాస్టర్ వినియోగించాలి. ఇవీ చేయాల్సినవి ⇔ లోబీమ్ ఫాగ్ లైట్లు ఉండేలా చూసుకోవాలి. ⇔ పొగమంచు వల్ల రోడ్డు స్పష్టంగా కనిపించకపోతే సురక్షితమైన స్థలంలో వాహనం ఆపేయడం మంచిది. అది ఇతర వాహనదారులకు కనిపించే విధంగా ఉండాలి. లేన్ మరిచి పోవద్దు పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, రహదారిపై ఉన్న లేన్ను అనుసరించడం మంచిది. ఇది మీరు మీ లేనులోనే ఉన్నారని నిర్ధారించుకోవడానికి ఉత్తమ మార్గం. అంతేకాదు, మీరు జాగ్రత్తగా బండి నడుపుతున్నట్లు లెక్క. – డాక్టర్ పుప్పాల శ్రీనివాస్, డిప్యూటీ రవాణా కమిషనర్ -
‘కివి’తో రోగనిరోధక శక్తి ఖాయం..!
సాక్షి, న్యూఢిల్లీ: శీతాకాలంలో మంచి డైట్లో భాగంగా ఏదైనా తీసుకోవాలంటే కివియే అంటున్నారు నిపుణులు. చూడడానికి సపోటాలా కనిపించే ఈ కివి పండు శీతాకాలంలో మనం తినే ఆహారంలో కచ్చితంగా ఉండాల్సింది. కివి ఇప్పుడు మన దేశంలో విరివిగా దొరుకుతుంది. ఈ పండుని న్యూజిలాండ్లో ఎక్కువగా పండిస్తారు. అందుకే ఆ దేశ క్రికెటర్లను కివీస్ అంటుంటాం అనుకుంట.. ఈ పండు తినడం ద్వారా మనకు అనేక పోషక విలువలు, విటమిన్లు, రోగ నిరోధక శక్తి లభిస్తుంది. సి-విటమిన్ మనకు రోగ నిరోధక శక్తి పెంచుతుంది. కివి ఈ పండులో ఇది పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా కివి కాలరీ ఫ్రెండ్లీ ఫ్రూట్, అందుకే డైట్ ప్లాన్ ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. రోజూ మనం తినే బ్రేక్ ఫాస్ట్, సలాడ్స్, స్మూతీస్, షేక్స్లో వాడవచ్చు. కివి పండు ద్వారా మనకు దాదాపుగా 42 కేలరీలు పొందవచ్చును. మరి కివి ద్వారా మనకు ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం: జీర్ణక్రియ వేగవంతం: కివి పండులో మనకు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అది మన జీర్ణక్రియని వేగవంతం చేస్తుంది. అంతేకాకుండా యాంటిఆక్సిడెంట్స్ ఉండటంతో డయేరియా, నాసియా,గ్యాస్,మలబద్దకం వంటి మానసిక వ్వాధులకు నిరోధకంగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తి : సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. దాని ద్వారా మనకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సి విటమిన్ అవసరమైన మోతాదులో కావాలంటే దీన్ని డైట్లో భాగంగా తీసుకుంటే సరిపోతుంది. గుండెకు మేలు: కివి పండు గుండెకు ఎంతో మేలు. రక్తపోటును నియంత్రించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా పోషకాహారం కలిగి గుండె సంబంధిత వ్యాధులను ఎక్కువ రాకుండా నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ఆస్తమాకి మంచిది: ఆస్తమాతో భాదపడుతున్న వారు కివి పండు ద్వారా ప్రయోజనం పొందవచ్చు. యాంటీఆక్సిడెంట్స్, సి-విటమిన్ ఉండటంతో ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తి పెంచడం ద్వారా అలర్జీలను దగ్గర రానివ్వకుండా సమర్థవంతంగా పనిచేస్తుంది. కంటి చూపు పెంచుతుంది: రోజు డైట్లో కివి పండును తీసుకోవడం ద్వారా కంటిచూపు మందగించకుండా ఉపయోగపడుతుంది. కివిలో లుటిన్, జియాక్సంత్ ఉండటంతో ఆరోగ్యమైన కంటి చూపును పెంచడానికి ఉపయోగపడుతుంది. మీరు మీ రోగనిరోధక శక్తిని మెరుగుపర్చుకోవడాని ఆహారంలో తీసుకునే ఉత్తమ పండ్లలో కివి ఒకటి. శీతాకాలంలో శరీరం అలర్జీలు ,అనారోగ్యానికి గురయ్యేటప్పుడు, కివి వంటి పండ్లు మంచి ఎంపిక. -
చలి చంపేస్తోంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే... ఖమ్మంలో గరిష్టంగా 32.6 డిగ్రీ సెల్సియస్, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో కనిష్టంగా 7.1 డిగ్రీల సెల్సియస్ నమోద య్యాయి. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని 9 మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువగా నమోదైనట్లు వాతా వరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. చదవండి: సిద్దిపేటలో సామూహిక గృహ ప్రవేశాలు ప్రస్తుత సీజన్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే నమోదవుతున్న ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 2.6 డిగ్రీలు తక్కువ నమోదవుతుండగా.. గరిష్ట ఉష్ణోగ్రత 3.9డిగ్రీలు అధికంగా నమోదవుతోంది. జిల్లా కేంద్రాలవారీగా ఉష్ణోగ్రతల నమోదును పరిశీలిస్తే.. నల్లగొండ మినహాయించి అన్నిచోట్లా గరిష్ట ఉష్ణోగ్రతలు 30డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. అధికంగా ఖమ్మం 32.6 డిగ్రీలు, నిజామాబాద్ 32.4డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్లో 10.6 డిగ్రీలు, మెదక్లో 11.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
రోజంతా గజగజ..
సాక్షి, హైదరాబాద్: నివర్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. శుక్రవారం చల్లటి ఈదురుగాలులు ప్రజలను వణికించాయి. పలు చోట్ల ముసురు పట్టింది. రాత్రిపూట చలిగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చలికాలం కావడంతో రాత్రి ఉష్ణోగ్రతల్లో తగ్గుదల సాధారణమే అయినప్పటికీ.. పగటి ఉష్ణోగ్రతలు కూడా ఏకంగా 5.6 డిగ్రీల మేర పడిపోయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే రాష్ట్రంలో గరిష్టంగా మెదక్లో 29.2 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, అతి తక్కువగా భద్రాచలం, ఖమ్మం జిల్లాల్లో 24.6 డిగ్రీలు నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే దుండిగల్లో 17.4 డిగ్రీలు, భద్రాచలంలో 17.5 డిగ్రీలు, నల్లగొండలో 18 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముంది. హైదరాబాద్లో తీవ్రమైన చల్లటి ఈదురుగాలులతో ముసురు వాతావరణం నెలకొంది. పలు చోట్ల ఓ మోస్తరు వర్షం పడింది. కొనసాగుతున్న అల్పపీడనం దక్షిణ కోస్తా ఆంధ్ర, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపింది. మరోవైపు హిందూ మహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్ప డే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో శనివారం పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆదివారం పొడివాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, శుక్రవారం రాష్ట్రంలో సగటున 4.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 19.4 మిల్లీమీటర్లు, కొత్తగూడెంలో 15.6 మి.మీ., సూర్యాపేటలో 11.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. మరో పక్క జయశంకర్ జిల్లా మహదేవపూర్ మండలంలో అత్యధికంగా 3.18 సెంటీమీటర్ల వర్షం కురిసింది. -
చలి తీవ్రతతో కరోనా విజృంభణ
సాక్షి, హైదరాబాద్: చలి తీవ్రతతో కరోనా తీవ్రంగా విజృంభిస్తుందని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు హెచ్చరించారు. అందువల్ల వచ్చే మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విన్నవించారు. కరోనా టీకా సహా జనవరి, ఫిబ్రవరి నాటికి శాశ్వత వైద్య చికిత్స కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఢిల్లీలో రోజుకు 8 వేల నుంచి 9 వేల కరోనా కేసులు, 80 నుంచి 90 వరకు మరణాలు సంభవిస్తున్నాయన్నారు. వాయు కాలుష్యం, చలి వల్ల ఢిల్లీలో వైరస్ తీవ్రత ఉందని వెల్లడించారు. ‘అమెరికాలో 2 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. యూరప్లోనూ అదే పరిస్థితి నెలకొంది. బాధ్యతారహితంగా ఉన్నచోట వైరస్ ఉధృతి పెరుగుతోంది. 90 శాతం వైరస్ వ్యాప్తికి కారణం ముక్కు, నోరే.. కాబట్టి మాస్క్ను ఆ రెండూ కవరయ్యే లా చూడాలి. వాయు కాలుష్యం పెరిగితే గాలి కదలిక తగ్గుతుంది. ఇటువంటి సమయంలో వైరస్ వ్యాపిస్తుంది. దీపావళిని దీపాలతోనే కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలి. బాణసంచా కాల్చవద్దు. ప్రజల వద్దకే పరీక్షల కోసం 310 మొబైల్ టెస్టింగ్ వాహనాలను అందుబాటులోకి తెచ్చాం. వీటి ద్వారా జనసమ్మర్థమున్న ప్రాం తాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లోనూ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం. వివిధ రకాల వ్యాధులకు వచ్చిన టీకాలు ఏవీ కూడా తక్కువ సమయంలో రాలేదు. ఏళ్ల తరబడి ప్రయోగాల ఫలితంగా అవి వచ్చాయి. ఇప్పుడు రాబోయే కోవిడ్ టీకాలు కూడా ఏ మేరకు సమర్థంగా పనిచేస్తాయో స్పష్టత లేదు. కాబట్టి టీకా కోసం ఎదురుచూడకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు ఏర్పడతాయి..’అని ఆయన హెచ్చరించారు. ఫిబ్రవరి నాటికి వ్యాక్సిన్.. వ్యాక్సిన్ జనవరి, ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తుందని శ్రీనివాసరావు తెలి పారు. మొదటి విడతలో ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులకు ఇస్తారన్నారు. నర్సుల వెయిటేజీ పరిశీలన కమిటీ రద్దు.. ఇక స్టాఫ్ నర్సుల భర్తీ ప్రక్రియలో వెయిటేజీ కేటాయింపులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ప్రస్తుత వెయిటేజీ పరిశీలన కమిటీని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు రద్దు చేశారు. బాధ్యతల నుంచి తొలగించిన వారికి మరే బాధ్యతలు కూడా అప్పగించలేదు. ఈ కమిటీ స్థానంలో నూతన కమిటీని నియమిస్తూ వెనువెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త కమిటీలో సరోజినీదేవి ఆసుపత్రిలోని సహాయ సంచాలకుడు శ్రీహరి, ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలోని సహాయ సంచాలకుడు సత్యచంద్రిక, ఉస్మానియా కళాశాలలో సహాయ సంచాలకుడు సోమశేఖర్లను నియమించారు. నర్సుల నియామకాల వెయిటేజీ ప్రక్రియను నూతన కమిటీ సభ్యులు మొదట్నుంచి పరిశీలిస్తారు. -
కరోనా: పొంచి ఉన్న సెకండ్ వేవ్ ముప్పు
సాక్షి, ఖైరతాబాద్: కరోనా రెండోసారి విస్తరించే ప్రమాదం లేకపోలేదని, చలికాలంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రెండో దశ ఢిల్లీలో ప్రారంభమైనట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో జిల్లా వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రతి ఒక్కరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాల వద్ద కోవిడ్ 19 జాగ్రత్తలపై పోస్టర్లు అతికిస్తున్నారు. రెండో దశ ప్రారంభమైతే ఎదురయ్యే పరిస్థితులు, కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బంజారాహిల్స్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ షీమా రహా్మన్తో ‘సాక్షి’ ముఖాముఖి.. ప్ర: రెండో దశ మొదలైందా..? జ: కోవిడ్ 19 సెకండ్ వేవ్ ఢిల్లీలో మొదలైనటు తెలుస్తున్నది. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అయితే ఇంకా హైదరాబాద్లో మాత్రం ఆ దాఖలాలు లేవు. జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం చాలా కష్టం. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రచారం చేస్తున్నాం. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో పోస్టర్లను అతికిస్తున్నాం. ప్ర: రోజుకు ఎన్ని కరోనా పరీక్షలు చేస్తున్నారు..? జ: గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మా పరిధిలో 5,984 మందికి కరోనా పరీక్షలు చేయగా 523 మందికి పాజిటివ్ వచ్చింది. ఇందులో 99 శాతం మంది కోలుకున్నారు. ప్రతిరోజూ 50 కరోనా పరీక్షలు చేస్తున్నాం. తాజాగా గత నెల రోజుల నుంచి పాజిటివ్ కేసులు భారీగా తగ్గిపోయాయి. నెల రోజుల్లో 1500 మందికి పరీక్షలు నిర్వహిస్తే కేవలం అయిదు మందికి మాత్రమే పాజిటివ్గా తేలింది. ఆదివారం కూడా పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్ర: తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ? జ: కరోనా రెండో దశ విస్తృతం కాకుండా ఉండాలంటే మాస్క్ తప్పనిసరిగా వాడాలి. మాస్క్ మాత్రమే ప్రతి ఒక్కరిని కరోనా సోకకుండా కాపాడుతుంది. అలాగే భౌతికదూరం పాటించండం కూడా ప్రధానమే. ఇటీవల పెళ్లిళ్లతో సహా పలు కార్యక్రమాలు పెద్ద ఎత్తున అతిథులతో నిర్వహిస్తున్నారు. ఇది ఆందోళనకరం. వ్యాక్సిన్ వచ్చే వరకు ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే మేలు. ప్ర: జాగ్రత్తల విషయంలో ప్రజలు ఎలా ఉంటున్నారు ? జ: ఇటీవల గమనిస్తే బయటకు వచి్చనప్పుడు చాలా మంది మాస్్కలు ధరించడం లేదు. అంతే కాకుండా భౌతికదూరం కూడా పాటించడం లేదు. ఇది చాలా ప్రమాదకరం. ప్ర: ఏ లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలి ? జ: కరోనా విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం జలుబు, తుమ్ములు, గొంతు నొప్పి, జ్వరం, ఒళ్లునొప్పులు ఉన్నా వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి కరోనా టెస్టులు చేయించుకోవాలి. -
చీకటి పడితే గజగజ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై చలి పులి పంజా విసురుతోంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నప్పటికీ.. రాత్రిళ్లు మాత్రం చలి గజగజ వణికిస్తోంది. గత మూడ్రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతున్నాయి. ఇదే స్థాయిలో కొనసాగితే పగటి ఉష్ణోగ్రతలు సైతం తగ్గుతాయని వాతావరణ శాఖ అభిప్రాయపడుతోంది. గతేడాది ఇదే సమయంలో పగలు, రాత్రి సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. అయితే గత సంవత్సరం రాష్ట్రంలో సాధారణ వర్షాలే కురిశాయి. కానీ ఈసారి చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దాదాపు 18 జిల్లాల్లో అతిభారీ వర్షపాతం, 9 జిల్లాల్లో భారీ వర్షపాతం, మరో 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. భూగర్భ జలాలు సైతం భారీగా పెరిగాయి. ఈ పరిస్థితులతోనే ఉష్ణోగ్రతల నమోదులో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. 9 డిగ్రీలు పతనం.. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు చూస్తుంటే ఈసారి చలి తీవ్రత భారీగా ఉండే అవకాశముంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం దాదాపు 9 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గింది. రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆదిలాబాద్, మెదక్, హైదరాబాద్, నిజామాబాద్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ శాఖ 12 కేంద్రాల్లో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తోంది. ఇందులో ఖమ్మం మినహా మిగతా 11 కేంద్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల్లోపే నమోదు కావడం గమనార్హం. పగటి ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 30 డిగ్రీలకు పైబడి నమోదవుతున్నాయి. ఖమ్మంలో గరిష్టంగా 33.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్లో 32 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంగా నవంబర్ నెలాఖరులో చలి తీవ్రత పెరుగుతుంది. కానీ ఈనెల మొదటి వారంలోనే చలి పెరగడంతో ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. బేలలో 10.3 డిగ్రీలు.. రాష్ట్రంలో పలుచోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు శుక్రవారం నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో అత్యల్పంగా 10.3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా కుబీర్లో 10.6 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మోమిన్పేట్, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో 11.3 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 11.5 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా మథూర్లో 11.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా బోధన్, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 12 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి. -
చలికాలంలో వైరస్ వేగంగా విస్తరించే అవకాశం
-
చలికాలం.. కరోనాకు కలిసొచ్చే కాలం!
సాక్షి, అమరావతి: చలికాలం వచ్చేసింది.. కరోనా మరింతగా వ్యాప్తి చెందే కాలం ఇది.. అందుకే ఈ చలికాలమంతా అంటే ఫిబ్రవరి చివరి వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. పైగా పండుగల సీజన్ కావడంతో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఒకసారి కరోనా వచ్చి తగ్గిపోయి మళ్లీ వస్తే భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటిస్తే సమస్యను అధిగమించవచ్చంటున్నారు ప్రముఖ హృద్రోగ నిపుణుడు, కరోనా కంట్రోల్ సెంటర్ అధికారిగా పనిచేసిన డాక్టర్ ప్రభాకరరెడ్డి. రాష్ట్రంలో కరోనా మొదటి వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుతోందని, సెకండ్ వేవ్ వచ్చేసరికి సమయం పడుతుందని చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి చలికాలం దోహదపడే అవకాశం ఉన్నందున భౌతిక దూరం, మాస్క్ ధరించడం, శానిటైజేషన్ వంటివి విధిగా పాటించాల్సిందేనంటున్నారు. పట్టణాల్లో కొంతవరకూ హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందని, పల్లెల్లో రానందున పల్లె ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ ప్రభాకరరెడ్డి హెచ్చరిస్తున్నారు. -
ఊపిరి ఆడట్లేదు!
ఈ ఏడాది ఇప్పటివరకు 1,712 డెంగీ కేసులు, 694 మలేరియా కేసులు నమోదయ్యాయి. అలాగే 252 చికున్గున్యా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. న్యుమోనియా కేసులు 1,239, స్వైన్ఫ్లూ కేసులు 550 నమోదయ్యాయి. టైఫాయిడ్ జ్వరాలు వచ్చినవారు 8,206 ఉన్నారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 4,230 కేసులు నమోదు కావడం ఆందోళనకరం. ఇవిగాక ఈ ఏడాది ఇప్పటివరకు 1,14,167 డయేరియా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లో అత్యధికంగా 13,483 డయేరియా కేసులు వచ్చాయి. హైదరాబాద్లో వరదలు వచ్చినందున డయేరియా కేసులు మరిన్ని పెరిగే ప్రమాదం ఉందని వైద్యాధికారులు భావిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11,599 కేసులు, ఖమ్మంలో 6,365 కేసులు నమోదయ్యాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు నెలకొన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 2,02,001 మందికి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు వచ్చాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వీరు సరిగా ఊపిరి తీసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలున్న వారికి కరోనా ప్రమాదం కూడా ఎక్కువే. పైగా ఇప్పుడు చలికాలం ప్రారంభం కానుంది. ఈ కాలంలో శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటివరకు నమోదైన తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్లో 49,182 ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత వరంగల్ అర్బన్ జిల్లాలో 13,851, భూపాలపల్లి జిల్లాలో 13,602, ఆదిలాబాద్లో 11,817, నిజామాబాద్ జిల్లాలో 10,553 కేసులు నమోదయ్యాయి. లక్ష మందికి జ్వరాలు... తీవ్రమైన వర్షాలు కురిసి ఆగిపోవడంతో జ్వరం, అంటువ్యాధులు ప్రబలే పరిస్థితి నెలకొంది. కరోనాతో పాటు డెంగీ, మలేరియా, చికున్గున్యా కేసులు కలిసి వచ్చే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు 1,02,452 జ్వరం కేసులు నమోదయ్యాయి. వీటిని కారణాలు గుర్తించని జ్వరాలుగా పేర్కొంది. ఇక కరోనా అనుమానంతో వచ్చిన జ్వరం కేసులు 45,102 ఉంటాయని అంచనా వేశారు. మొత్తంగా చూసుకుంటే సాధారణ జ్వరాలు, కరోనా పాజిటివ్ వచ్చినవారిలో జ్వరాలు, నిర్దారణ పరీక్షల సందర్భంగా నెగెటివ్ వచ్చినవారికి జ్వరాలను కలుపుకుంటే దాదాపు 2 లక్షల జ్వరం కేసులు నమోదై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఒక్క నెలలోనే 15,201 జ్వరం కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇలా చేస్తే సరి... ♦ఇన్ఫ్లూయెంజా టీకాలు వేయించుకోవాలి ♦శీతాకాలం సమీపిస్తున్నందున ఫ్లూ కేసులు పెరుగుతాయి. కోవిడ్తో కలిపి ఇతరత్రా ఇన్ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ♦కోవిడ్ ఉన్నవారికి ఇతర అంటు వ్యాధులూ వస్తాయి. మైకోప్లాస్మా న్యుమోనియా, ప్యుడోమోనాస్ ఏరో జినోసా, హిమోఫిలస్ ఇన్ఫ్లూ యెంజా, క్లేబ్సిఎల్లా న్యుమోనియా వంటివి సాధారణంగా వచ్చే వ్యాధులు. ♦డెంగీ, మలేరియా, చికున్గున్యా తదితర వ్యాధులకు వైద్యం చేయడంతోపాటు కోవిడ్ కేసులను పర్యవేక్షణను అవసరమైన వైద్య వ్యవస్థలను బలోపేతం చేయాలి. ♦భౌతికదూరం, చేతులను శుభ్రం చేసుకోవడం, మాస్క్లు తప్పనిసరి. ♦డెంగీ, మలేరియా, చికున్గున్యాలను నియంత్రించడానికి దోమల నిర్మూలన చర్యలు చేపట్టాలి. ♦కాలానుగుణ ఇన్ఫ్లూయెంజా టీకాలు వేయడంలో వేగం పెంచాలి. -
గడ్డకట్టే చలిలో స్నానమంటే...
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో మానవులు నివసించే అత్యంత శీతల ప్రాంతం రష్యాకు సమీపంలోని సైబీరియా. అక్కడి ఉష్ణాగ్రతల గురించి తెలుసుకుంటేనే మనకు నిలువెల్లా వణకు పుట్టాల్సిందే! శీతల కాలంలో మైనస్ డిగ్రీలకు పడిపోయే అతి శీతల ప్రాంతాల్లో మానవులు ఆ కొద్దికాలం చలిని తట్టుకోవాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అదే ఎప్పుడూ మైనస్ డిగ్రీల సెల్సియెస్ అంటే, మైనస్ ఐదు నుంచి మైనస్ 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే సైబీరియా ప్రాంతంలో నివసించాలంటే నిత్య పోరాటమే. కానీ అది అక్కడి స్థానికులకు అంతగా వర్తించదు. అతిశీతలంగా ఉండే సైబీరియాలోని యకుటియా ప్రాంతంలో నివసిస్తున్నవారు అక్కడి వాతావరణానికి పూర్తిగా అలవాటు పడిపోయారు. అక్కడ వేడి నీళ్లలో చొక్కా, పైజామా ఉతికి ఆరేసే లోపే అవి గడ్డకట్టుకుపోయి మంచు విగ్రహాల్లా తయారవుతాయి. వేడి నీళ్లలోనూ ఆకాశంలోకి కుమ్మరిస్తే ఆకాశంలోనే గడ్డ కట్టుకుపోయి మంచులా కురుస్తుంది. వేడి వేడి న్యూడిల్స్ దింతామన్న లోపే అది గాలిలోనే గడ్డకుపోతాయి, కొన్ని వేడి వేడి తిను పదార్థాలైతే నోటిలోకి పోగానే గొంతులో గడ్డకట్టుకు పోతాయట. గత వారం ఓ పర్యాటక బృందం అక్కడికి వెళ్లినప్పుడు అక్కడ నిజంగా మైనస్ 59 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. అంతటి శీతల మంచు ప్రాంతంలో ఓ స్కూల్ టీచర్ గలైనా డావిడోవా, బట్టలుతికితే అవి ఎలా క్షణాల్లో గడ్డకట్టుకుపోతాయో చూపించారు. గ్లాసులో పోసిన వేడి వేడి నీళ్లు క్షణాల్లో ఎలా మంచుగా మారుతాయో చూపారు. అన్నింటికంటే దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే సమీపంలోని చురాప్చా కుగ్రామంలో మంచుతో కూడిన నీటి గుంటలో దాదాపు 80 ఏళ్ల వృద్ధుడు స్నానం చేయడం. అలాంటి నీళ్లలో స్నానం చేస్తే తప్పా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించదని ఆ వృద్ధుడు తెలిపారు. సైబీరియాలో కుగ్రామాలే కాదు, పెద్ద పెద్ద నగరాలు కూడా ఉన్నాయి. శీతాకాలంలో మాస్కో నగరంలో మంచు కురిసినట్లు అక్కడి గ్రామల్లో, నగరాల్లో ఎప్పుడూ మంచు కురుస్తూనే ఉంటోంది. మంచు నీటిలో, మంచులో దొరికే చేపలు అక్కడి ప్రజలకు ప్రధాన ఆహారం. చలిని తట్టుకునేందుకు వారు చలి కోట్లు, చలి ప్యాంట్లు, చలి టోపీలు ధరిస్తారు. -
చలి తగ్గింది..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చలి ప్రభావం క్రమంగా తగ్గుతోంది. పగటి, రాత్రివేళల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.ఆదివారం నగరంలో పగటిపూట 31.7 డిగ్రీలు, రాత్రివేళల్లో 19.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవి సాధారణ సగటు కంటే ఏకంగా నాలుగు డిగ్రీలు అధికం కావటంవిశేషం. ఇదిలా ఉంటే మాల్దీవులలో ఏర్పడ్డఉపరితల ఆవర్తనం కూడా ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపిందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. -
జనవరి నెలలో పశువుల యాజమాన్యం
చలికాలం ముసుగుపోయి జనవరి మధ్యలో ఎండలు వెల్లిగా మొదలవుతాయి. పశువుల యాజమాన్యం గురించి జనవరి నెలలో కొన్ని మెలకువలను పాటించవలసి ఉంది. ► వేసవి మొదలు కావడంతో ముందుగా మనకు కానవచ్చేది పచ్చిమేత కొరత వర్షాకాలంలో, శీతాకాలంలో ఎక్కువగా లభ్యమయ్యే పచ్చిమేతను సైలేజీ గడ్డిగాను, ‘హే’గాను తయారు చేసుకునే సమయమిది. పాతర గడ్డిని తయారు చేసుకొని వేసవి సమయంలో పశువులకు మేపుకోవచ్చు. ► పశువులను పొగమంచు నుంచి రక్షించుకోవాలి. లేకపోతే న్యూమోనియా వస్తుంది. ► పశువు శరీరంలో తగినంత వేడిని పుట్టించడానికి ప్రొటీన్ కేకులు, బెల్లం కలిపి పశువుకు మేపాలి. ► ఖనిజాల లోపం రాకుండా పశువుల కొట్టాల్లో ఖనిజలవణ మిశ్రమ ఇటుకలను వేలాడదీయాలి. ► జనవరి నెలలో తప్పనిసరిగా నట్టల మందు తాపించాలి. ► బాహ్య పరాన్న జీవుల బెడద నుంచి కాపాడుకోవడానికి కొట్టాల్లో తులసి, లెమన్గ్రాస్ లాంటి మొక్కలను వేలాడదీయాలి. ఆ వాసనకు కొన్ని పరాన్న జీవుల నియంత్రణ జరుగుతుంది. ► ఈగలు వాలకుండా వేపనూనె సంబంధిత ద్రావకాలను షెడ్లలో పిచికారీ చేయాలి. ∙జీవాల వలస సమయలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కిందటి వారం ‘సాగుబడి’ శీర్షికలో ప్రచురితమైంది. ► పశువుల్లో గాలికుంటు, పి.పి.ఆర్., చిటుక వ్యాధికి టీకా వేయించాలి. ► పండ్ల తోటలున్న వారు, వారి తోటల్లో స్టైలో హెమాటా లాంటి పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. – డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), ప్రొఫెసర్–అధిపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవ్ స్టాక్ ఫామ్ కాంప్లెక్స్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి -
ఒకప్పుడు ఇది పేదల వంటకం.. ప్రస్తుతం ఫేవరెట్ డిష్
ప్రపంచంలోనే విభిన్నవంటకాలకు హైదరాబాద్ నగరంప్రసిద్ధిగాంచింది. శతాబ్దాల ఘన చరిత ఇక్కడి రుచుల సొంతం. ఆహార ప్రియులకు ఇక్కడిహోటళ్లలో సీజన్కు అనుగుణంగా వంటలు లభిస్తాయి. వేసవిలో లస్సీ, ఫాలుదాతో పాటు పలు రకాల ఔషధాల జ్యూస్లు, వర్షాకాలంలో వేడి వేడి సమోసాలు, ఖజూర్లు, లుక్మి, పరాఠా, ఖీమాలు నోరూరిస్తుంటాయి. ఇక చలి కాలంలో శరీరానికి వేడినిచ్చే నహారీ, మరగ్, శేర్వాలుఅందుబాటులో ఉంటాయి. శీతాకాలంలోఇక్కడ లభించే నహారీ, మరగ్, శేర్వాలు, వాటి ప్రత్యేకతలపై కథనం. సాక్షి, సిటీబ్యూరో: చలికాలం వచ్చిందంటే చాలు పాత నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో పాయా, జబాన్, జబడా (తలకాయ కూర) తయారీ చేసే హోటళ్లు గుర్తుకొస్తాయి. చలికాలంలో నగర ప్రజలు ఉదయం సాయంత్రం పాయా శేర్వాతో పాటు మరగ్ కొనుగోలు చేసి తందూరీ, నహారీ కుల్చాతో ఆరగిస్తారు. పాయా శేర్వా, జబాన్, జబడా వంటకాలు శరీరానికి వేడినిస్తాయి. ప్రత్యేకంగా పాయా, మరగ్లో ఔషధ దినుసులు, మసాలాలతో తయారు చేస్తారు. దీంతో పాటు ప్రధానంగా మేక పొట్టేలు కాళ్లు, నాలుక, తలకాయ నహారీ, మరగ్ శేర్వాలో వినియోగిస్తారు. పేదవాళ్ల ప్రత్యేకం.. తొలి నాళ్లలో నహారీ శేర్వా ఎక్కువ శాతం పేదవాళ్లు తినేవారు. ఉదయం పూట శ్రామికులు, కింది స్థాయి ఉద్యోగులు ఆరగించేవారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో వంటలపై అనుభవం ఉన్న వ్యక్తులు ఉదయం, సాయంత్రం నహారీ శేర్వా తయారు చేసి విక్రయించేవారు. ప్రజలు పాత్రలు తీసుకొని వచ్చి నహారీ శేర్వా తీసుకెళ్లి ఇళ్లలో తినేవారు. నహారీ శేర్వా ఒక చోట, కుల్చా (నహారీతో తినేరొట్టె) మరోచోట లభించేది. ఉదయం పూట నహారీ శేర్వాతో పాటు కులచ్చారొట్టె తింటే సాయంకాలం దాకా ఆకలి వేయకుండా ఉంటుంది. ఎందుకంటే దీనిలో పోషక గుణాలుఉండటమే కారణం. నహారీ శేర్వా తయారీ ఇలా.. మేక లేదా పొట్టెలు కాళ్లు, తలకాయ, నాలుకను కొన్ని నీళ్లలో నహారీ, మరగ్ మసాలా (పొటిలికా మసాలా, నహారీ మసాలా) వేడి చేసి ఉడకబెడతారు. అవి మెత్తగా అయ్యేదాకా ఉడికిస్తారు. మరో పక్కజైఫల్, జోత్రి, గరంమసాలతో పాటు పలు ఔషధ దినుసులు మసాలాలు వేసి పాయా, జబడా, జబాన్ శేర్వా (సూప్) తయారు చేస్తారు. దీనికి దాదాపు ఆరు గంటల సమయం పడుతుంది. నహారీ, మరగ్ తయారీలో లవంగాలు, సాజీరా, మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, వేడినిచ్చే ఆకులతో పాటు పాలు, నెయ్యి ఉపయోగిస్తారు. వీటితో పాటు మరిన్ని ఔషధ దినుసులు కలిపి పాయా, మరగ్ శేర్వా తయారు చేస్తారు. నాటి నుంచి నేటి దాకా.. పాతబస్తీతో పాటు నగరంలోని పలు ప్రదేశాల్లో చలికాలంలో నహారీ శేర్వా, మరగ్ తయారు చేసి విక్రయిస్తున్నారు. శేర్వా, మరగ్ నగరం ఏర్పాటు నుంచి అందుబాటులో ఉంది. కుతుబ్ షాహీలు, ఆసీఫ్జాహీల పాలనా కాలంలో కూడా శుభకార్యాలు, ప్రభుత్వ వేడుకలు జరిగినప్పుడు శేర్వా, మరగ్లను తయారు చేసి వడ్డించేవారు. ఆరోజుల్లో వేడుకల్లో తయారు చేసే వంటకం నేడు నగరంలోని దాదాపు అన్ని ప్రధాన హోటళ్లో లభిస్తోంది. పలు హోటళ్లలో ఏడాది పాటు ఉదయం, సాయంత్రం నహారీ శేర్వా అందుబాటులో ఉంటుంది. కాగా.. కొన్ని హోటళ్లలో కేవలం చలికాలంలోనే శేర్వా తయారు చేస్తున్నారు. ఇప్పటికీ అదే పద్ధతిలో.. గతంలో నహారీ, పాయా మాత్రమే హోటళ్లలో తయారు చేసి విక్రయించేవారు. జబాన్, జబడా ఇళ్లలో తయారు చేసుకుని తినేవారు. మా నాన్న పాషా బాయి జబాన్, జబడాలు కూడా హోటళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. నేను గత ఐదేళ్ల నుంచి మరగ్ను తయారు చేసి ఆహార ప్రియులకు అందుబాటులో ఉంచుతున్నాను. నహారీ కొంచెం ఘాటుగా ఉంటుంది. నేటి తరానికి ఘాటు లేకుండా ఉండే విధంగా మరగ్ను మా హోటల్లోనే అందుబాటులో ఉంచాం. నిజాం కాలంలో తయారు చేసిన విధంగా మా హోటల్లో ఇప్పటికీ అదే పద్ధతిలో చేస్తున్నాం. – ఉమర్ ఆదిల్, షాదాబ్ హోటల్ యజమాని, మదీనా సర్కిల్ -
'మఫ్లర్'మ్యాన్కు ఏమైంది?
ఢిల్లీ: ఢిల్లీ కాపలాదారు, 'మఫ్లర్ మ్యాన్'గా సామాజిక మాధ్యమాల్లో పేరొందిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. తాను ఎక్కువగా ధరించడానికి ఇష్టపడే 'మఫ్లర్' ను ఇంకా ధరించకపోవడం అటు నెటిజన్లతో పాటు సాధారణ జనాన్ని ఒకింతా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 'మఫ్లర్ మ్యాన్ అని ట్రోల్ చేస్తున్నారు.. అందుకే మఫ్లర్ విడిచారా' అని ఒకరు ప్రశ్నించగా, 'శీతాకాలం ప్రారంభమైనా ఈసారి మఫ్లర్ ఇంకా బయటకు రాలేదు.. చలి కూడా ఎక్కువగానే ఉంది. ఏమైంది ప్రజలు ప్రశ్నిస్తున్నారు' అంటూ సోషల్మీడియాలో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఎట్టకేలకూ అరవింద్ కేజ్రీవాల్ వారి ట్వీట్లకు నవ్వుకుంటూ స్పందించారు. 'మఫ్లర్ ఎప్పుడో బయటికి వచ్చింది. మీరే గమనించలేదు. చలి తీవ్రత పెరిగింది. అందరూ జాగ్రత్తలు తీసుకొండి' అని ట్విటర్ ద్వారా తన అభిమానులకు, ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో చలి తీవ్రత ఎక్కువ కారణంగా జలబు, దగ్గు బారినపడకుండా రక్షణ కోసం అరవింద్ కేజ్రీవాల్ మఫ్లర్ ఎక్కువగా ధరిస్తారు. मफ़्लर बहुत पहले निकल चुका है। आप लोगों ने ध्यान नहीं दिया। ठंड बहुत ज़्यादा है। सब लोग अपना ख्याल रखें। 😊 https://t.co/XUEeZe7wt0 — Arvind Kejriwal (@ArvindKejriwal) December 25, 2019 -
ఈ ఏడాది డిసెంబర్లో చలి కాస్త తక్కువే..
సాక్షి, సిటీబ్యూరో: డిసెంబర్..ఒకప్పుడు తీవ్రమైన చలితో గజగజ వణికించేది. చలిగాలుల తీవ్రత, పొగ మంచుతో ఉక్కిరిబిక్కిరి చేసేది. ఈ ఏడాది డిసెంబర్ మాత్రం గతంతో పోలిస్తే కొంత మేర ఊరటనిచ్చింది. చలి ఉన్నా గత స్థాయిలో వణికించడం లేదు. ఈసీజన్లో ఇప్పటి వరకునగరంలో రాత్రి వేళల్లోసాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీనికి భిన్నంగా పగటి వేళల్లో సాధారణఉష్ణోగ్రతల కంటే తక్కువనమోదవుతుండడం విశేషం. కొద్ది రోజులుగా కోమోరిన్ ప్రాంతం నుండి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుండటం వల్లే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. గజగజ లేకుండానే నగరాన్ని గజగజ వణికించే డిసెంబర్ మాసంలో ఇప్పటి వరకు 15 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలే నమోదు కాలేదు. బుధవారమైతే ఏకంగా 19.6 డి డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణ సగటుతో పోలిస్తే ఏకంగా ఐదు డిగ్రీలు అధికం. అయితే గత చరిత్ర పరిశీలిస్తే వాతావరణ చరిత్రలో అత్యల్ప ఉష్ణోగ్రతలన్నీ డిసెంబర్ మాసంలోనే నమోదయ్యాయి. హైదరాబాద్ చరిత్రలో అత్యల్ప ఉష్ణోగ్రత 1966 డిసెంబర్ 14న 7.1 డిగ్రీలు నమోదైతే, గతేడాది డిసెంబర్ 31న 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఇదిలా ఉంటే ఉపరితల ద్రోణి తీవ్రత తగ్గితే నగరానికి తూర్పు దిశ నుండి గాలుల తీవ్రత పెరిగితే జనవరి మొదటి వారంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ఒక వేళ ద్రోణి తీవ్రత తగ్గకపోతే చలి తీవ్రత లేకుండానే శీతాకాలం ముగిసిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. -
అమ్మ ఒడే వెచ్చన..!
శీతాకాలం..మంచు కురిసే వేళలు, జివ్వు మనిపించే చల్లని పిల్ల గాలులు. కంటికిఅందంగా కనిపించే ప్రకృతి సోయగాలు. అంతవరకు బాగానే ఉంది. ఈ కాలంరోగాలకు కూడా నిలయమే. కాస్త ఏమరుపాటుగా ఉన్నా, అనారోగ్యానికి గురికావాల్సిందే. ఉన్నఫళంగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. దీంతో చలితీవ్రత పెరిగింది. ఫలితంగా శరీరంలోని ఉష్ణోగ్రతల్లో కూడా మార్పులు సంభవిస్తున్నాయి.ఈ వ్యత్యాసాల కారణంగా ప్రధానంగా చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.ఈ శీతాకాలంలో బాలలఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిఉంది. అందుకు సంబంధించి‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. కడప రూరల్: ఇటీవల వాతావరణం విచిత్రంగా మారుతోంది. మొన్నటి వరకు వర్షాలు కురిశాయి. అంతలోనే వేసవిని తలపించేలా ఎండలు కాశాయి. ఇప్పుడు ఉన్న ఫళంగా చలి తీవ్రత పెరిగింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కనిష్టం 19, గరిష్టం 31 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గాలిలో తేమ శాతం పెరగడంతో చలి తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆరు విభాగాలుగా బాలల దశ.. ♦ బాలల దశను 6 విభాగాలుగా చెప్పుకోవచ్చు. ఈ పరిణామ క్రమం అప్పుడే పుట్టిన బిడ్డల నుంచి 18 ఏళ్ల వరకు ఉంటుంది. ♦ అప్పుడే జన్మించి 28 రోజుల లోపు చిన్నారులను నుయో నెట (పురిటి బిడ్డ లేదా చంటి బిడ్డ) అంటారు. ♦ ఒక ఏడాదిలోపు పిల్లలను ఇన్ఫంట అని పిలుస్తారు. ♦ రెండు నుంచి మూడేళ్లలోపు వారిని టాగ్లర్ (తప్పటడుగులు వేసే దశ) అంటారు. ♦ మూడు నుంచి ఐదేళ్లలోపు బాలలను ప్రీ స్కూల్ (స్కూల్కు వెళ్లడం కంటే ముందు దశ) అంటారు. ♦ ఐదు సంవత్సరాలు పైబడిన చిన్నారులను స్కూల్ ఏజ్ (పాఠశాలకు వెళ్లడం) పిల్లలు అని పిలుస్తారు. ♦ 9 నుంచి 18 సంవత్సరాల లోపు వారిని అడలసెన్స్ (కౌమార) దశ అంటారు. శరీరంలో ఉష్ణోగ్రతలే కీలకం.. ఈ శీతాకాలంలో చల్లని వాతావరణం చిన్నారుల శరీరంలోని ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా శరీరంలో 36.5 నుంచి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉండాలి. ఈ చలి కాలంలో ఆ ఉష్ణోగ్రతలు తగ్గు ముఖ పట్టేంందుకు ఆస్కారం ఉంటుంది. ఉష్ణోగ్రతలు తగ్గు ముఖం పట్టినప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా ఈ ప్రభావం చంటి బిడ్డలపై పడుతుంది. వ్యాధుల లక్షణాలు... ♦ ఈ చలికాలంలో పలు రకాల వ్యా ధులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకు సంబంధించిన లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. ♦ పాలు తాగలేకపోవడం..ఆహారం తినకపోవడం ♦ చర్మం పొడిగా ఉండడం..పగుళ్లు ఏర్పడడం, శరీరంపై దద్దుర్లు ♦ జలుబు, దగ్గు, అలర్జీ, నిమోనియా, వైరస్లు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ♦ వైరస్తో వచ్చే కండ్లకలక, ముక్కు దిబ్బడ, చెవినొప్పి నివారణ మార్గాలు... ♦ శరీరంలో ఉష్ణోగ్రతలు నిలకడగా ఉండాలంటే చలిలో ఎక్కువగా తిరగకపోవడమే మంచిది. ♦ ఒక వేళ బయటకు వెళ్లాల్సి వస్తే చలి నియంత్రణ దుస్తులను ధరించాలి. కాళ్లకు సాక్స్లు. చేతులకు గ్లౌజ్లు తొడగాలి. ఆహార నియమాలు ఇలా... ♦ పురిటి బిడ్డలకు ఆరు నెలలు వచ్చే వరకు తల్లి పాలే శ్రేయస్కరం ♦ ఆరు నెలల తరువాత వైద్యులు సూచించిన ఆహారం అందించాలి ♦ ఇక చిన్నారులకు తాజా కూరగాయలు, తాజా పండ్లను తినిపించాలి ♦ వేడిగా ఉండే ఆహార పదార్థాలను ఇవ్వాలి ♦ గోరు వెచ్చని నీరు తాగాలి..అలాగే గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ♦ సొంత వైద్యం మంచిది కాదు..ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు తక్షణం వైద్యులను సంప్రదించాలి. ‘కంగారు మదర్కేర్’ విధానంతో.. చలికాలంలో చంటి బిడ్డలపై కనిష్ట ఉష్ణోగ్రతల ప్రభావం చూపడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. అంటే చలి తీవ్రతకు చిన్నారుల శరీరం తట్టుకోలేదు. ఫలితంగా శరీరంలోని ఉష్ణోగ్రతలు పడిపోవడం జరుగుతుంది. తద్వారా ఆ ముక్కుపచ్చలారని చిన్నారులు అనారోగ్యానికి గురవుతారు. ఇందుకు సహజసిద్ధంగా చేసే ప్రక్రియ ఒకటుంది. అదే ‘కంగారు మదర్ కేర్’ విధానం. ఆస్ట్రేలియాలోని జంతువులైన కంగారులు, ఒక దశకు వచ్చే వరకు తమ పిల్లలను శరీరంలోని తిత్తిలాంటి చిత్తిలో వేసుకొని సంరక్షిస్తాయి. తద్వారా తమ బిడ్డలకు తగిన ఉష్ణోగ్రతలను అందిస్తుంటాయి. ఆ విధానాన్నే కంగారు మదర్ కేర్ అంటారు. అంటే తల్లి తమ బిడ్డలను ఎదపై ఉంచుకోవడం ద్వారా ఉష్ణోగ్రతలు పడిపోకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించవచ్చు.ఇదే విధానాన్ని తండ్రి కూడా చేయవచ్చు. -
పశువుల్లో బాక్టీరియా వ్యాధులు
శీతాకాలంలో పశువులను వ్యాధుల బారి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గొంతువాపు: పాస్టురెల్లా మల్టోసైడా అనే బ్యాక్టీరియా వల్ల గొంతువాపు వస్తుంది. ఒక్కసారిగా జ్వరం రావడం, నోటి చొంగ, ఊపిరి కష్టంగా ఉండటం లాంటివి చూపిస్తుంది. 24 గంటల్లో పశువు చనిపోతుంది. చలికాలంలో పశువులు దగ్గర దగ్గరగా ఉంటుంటాయి. అందువల్ల చొంగ ద్వారా ఈ వ్యాధి త్వరగా వ్యాపించవచ్చు. ఇంతకుముందే టీకాలు వేయించుకొని ఉంటే గొంతువ్యాపు రాదు. ఇప్పుడు కూడా టీకా వేయించుకోవచ్చు. వైద్యము ఖరీదు కాబట్టి నివారణ మేలు. పింక్ ఐ: ఇన్ఫెచ్యువస్ బొవైన్ కెరెటో కంజెక్టువైటిస్ అనే వ్యాధికి పింక్ ఐ అని కూడా పేరు. దీని తీవ్రత వర్షాకాలంలో ఎక్కువైనప్పటికీ శీతాకాలంలోనూ వ్యాపిస్తుంది. మోరాక్సెల్లా బోవిస్ అనే బ్యాక్టీరియా వల్ల పింక్ ఐ సోకుతుంది. వ్యాధి బారిన పడి తేరుకున్న పశువుల ముక్కు రంధ్రాల ద్వారా ఈ బాక్టీరియా బయటకు వ్యాప్తి చెందుతుంది. త్వరగా వైద్యం మొదలు పెట్టడం, పశువైద్యుని సలహా మేరకు టెట్రాసైక్లిన్స్ గల ఆంటీబయోటిక్స్ని వాడాలి. ఫుట్ రాట్: దీనినే గొర్రెల్లో వాడుక భాషలో కుంట్లు అంటారు. గిట్టల మధ్య వాచి, నొప్పిగా ఉండి, పశువులు కుంటుతూ ఉంటాయి. ఫ్యూసోబ్యాక్టీరియమ్ నెక్రోఫోగమ్ అనే బ్యాక్టీరియా వలన కలుగుతుంది. చిత్తడి నేలల్లో పశువులను ఉంచినట్లయితే ఈ పరిస్థితి వస్తుంది. కాళ్ల మీద బరువు మోపలేకపోవడం, నొప్పి కనబరచడం, వాసన కలిగి ఉండడం, మేత మేయలేకపోవడం లాంటి లక్షణాలను పశువు చూపిస్తుంది. పశువులను పొడి నేలల్లో ఉండడం, పెన్సిలిన్, సెప్టియోఫర్, టెట్రాసైక్లిన్ లాంటి యాంటీ బయోటిక్స్ను వాడాలి. కాఫ్ దిప్తీరియా/లారిన్జైటిస్: ఇది కూడా ఫూసోబ్యాక్టీరియమ్ నెక్రోఫోరమ్ వల్లనే కలుగుతుంది. 3 నుంచి 18 నెలల వయసున్న దూడల్లో ఎక్కువగా కనబడుతుంది. జ్వరం, దగ్గు, రొప్పడం వంటి లక్షణాలు కనబడతాయి. పక్కపక్కనే ఉన్న పశువులకు సోకుతుంది. పశువైద్యుని సలహా మేరకు యాంటిబయోటిక్స్ను వాడాలి. కంటేజియస్ బొవైన్ ఫ్లూగో నిమోనియా: చలికాలంలో పశువుల ఊపిరితిత్తులు వాచి, 107 డిగ్రీల ఫారన్హీట్ వరకు జ్వరం రావడం, కళ్ల వెంబడి పుసులు రావడం, పశువు బాగా చిక్కిపోవడం, కష్టసాధ్యమైన ఊపిరి.. ఇవీ లక్షణాలు. పశువు 1–3 వారాల్లో చనిపోయే ప్రమాదం ఉంది. ఖచ్చితమైన పరిశుభ్రత పాటించాలి. టైలోసిస్ లాంటి యాంటిబయోటిక్స్ కొంత ఉపయోగకరం. – డా. ఎం.వి.ఎ.యన్. సూర్యనారాయణ (99485 90506), ప్రొఫెసర్ – అధిపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవ్స్టాక్ ఫామ్ కాంప్లెక్స్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి -
వింటర్కి విరుగుడు
చలికాలం కురుల సహజత్వాన్ని కాపాడుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. లేదంటే వెంట్రుకలు పొడిబారడం, చిట్లడం, చుండ్రు సమస్య తలెత్తడం వంటివి చూస్తుంటాం. వీటికి విరుగుడుగా.. అలొవెరాతో కండిషనర్ షాంపూలు, కాలుష్యం, గాలిలో తేమ తగ్గడం.. వంటి వాటి వల్ల ఈ కాలంలో వెంట్రుకలు త్వరగా పొడిబారడం, చిట్లడం వంటివి సహజంగా జరుగుతుంటాయి. వీటి వల్ల జుట్టు నిస్తేజంగా కనిపిస్తుంది. అలొవెరా ఆకులను పేస్ట్ చేసి, షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. 15–20 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. అలొవెరా రసం జుట్టు్టకు కావలసినంత కండిషన్ లభించేలా చేస్తుంది. దీంతో జుట్టు మెత్తగా, నిగ నిగలాడుతూ ఉంటుంది. అలోవెరా జెల్ను రాత్రి పడుకునే ముందు మాడుకు పట్టించి, మరుసటి రోజు శుభ్రపరుచుకోవాలి. ఇది జుట్టుకు మంచి మాయిశ్చరైజర్లా ఉపయోగపడుతుంది, చుండ్రు కూడా తగ్గుతుంది. ఉసిరితో మర్దన ఉసిరి, మందార పువ్వులు మరిగించిన కొబ్బరినూనెతో తలకు మసాజ్ చేసుకుని మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే వెంట్రుకలు చిట్లే సమస్య తగ్గుతుంది. కురుల మృదు త్వం పెరుగుతుంది. బీట్రూట్ థెరపీ బీట్రూట్ను పేస్ట్ చేసి, నీళ్లలో కలిపి మరిగించాలి. చల్లారిన తర్వాత వడకట్టిన నీటిని రాత్రి పడుకోబోయేముందు మాడుకు పట్టించి, వేళ్లతో మసాజ్ చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. -
‘స్వైన్ఫ్లూ’ కాలంతో జాగ్రత్త..
చలికాలం సమీపించడంతో జిల్లాలో స్వైన్ఫ్లూ వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే చలి పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. సాక్షి, నల్లగొండ టౌన్: చలికాలం సమీపించడంతో జిల్లాలో స్వైన్ఫ్లూ వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే చలి పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే మేలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో స్వైన్ఫ్లూ బారిన పడి మరణించిన సంఘటనలు లేనప్పటికీ చలికాలంలో వ్యాధి వ్యాప్తి చెందే అవకావం లేకపోలేదు. చలితీవ్రత లేని రోజుల్లో అంటే ఈ ఏడాది మార్చి నాటికే జిల్లాలో 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ, శాలిగౌరారం, మర్రిగూడ మండలాల్లో స్వైన్ఫ్లూ పాజిటివ్ కేసులను నమోదైన సంఘటనలు ఉన్నాయి. వారికి హైదరాబాద్లోని గాంధీ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొంది వ్యాధి నుంచి విముక్తులయ్యారు. అప్రమత్తంగా వైద్య ఆరోగ్యశాఖ.. చలికాలంలో గాలి ద్వారా ఒకరి నుంచి మరోకరికి ఇన్ఫ్లూయంజా ఏ వైరస్ వ్యాప్తి చెందుతుండడం, ఊపిరితిత్తుల అంతర భాగాలకు వ్యాధి సోకడం వల్ల ప్రమాదకారిగా మారి ప్రాణాపాయం సంబవించే అవకాశం ఉంటుం ది. స్వైన్ఫ్లూ లక్షణాలతో ఎవరైనా కనపడితే వెంటనే వారి రక్తనమూనాలను సేకరించి హైదరాదాద్లోని ఐపీఎం (ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రీవెంటీవ్ మెడిషిన్) ల్యాబ్కు పరీక్షల నిమిత్తం పంపించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో పది పడకలతో ప్రత్యేక స్ల్వైన్ఫ్లూ వార్డును ఏర్పాటు చేశారు. స్వైన్ఫ్లూ పాజిటివ్ అని ఐపీఎం నివేదికలో తేలితే వెంటనే వారికి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స అందించడానికి అవసరమైన మందులను కూడా అందుబాటులో ఉంచినట్లు జిల్లా వైద్య ఆరోగశాఖ అధికారులు పేర్కొంటుననారు. ప్రజలు వ్యాధిపై అవగాహనను పెంపొందించుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు. స్వైన్ఫ్లూ వ్యాధి లక్షణాలు.. దగ్గు, ముక్కుకారడం, ఆయాసం, దమ్మురావడం, ఊపిరిపీల్చడానికి కష్టపడడం, పిల్లికూతులు రావడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, గొంతులో గరగర, జ్వరం రావడం, వం టి నొప్పులు, కళ్ల నుంచి నీరుకారడం, చెవి నొ ప్పి, చెవి నుంచి చీము కారడం, చిన్న పిల్లలకు నిమ్ముచేయడం వంటి లక్షణాలు కనపడతాయి. స్వైన్ఫ్లూ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. బహిరంగ ప్రదేశాలు, ఏటీఎంలు, తలుపుల గొళ్లాలు, మొదలైన వాటిని వాడిన తరువాత, ప్రయాణాలను చేసిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కునే వరకు ముక్కు, కళ్లు, నోటిని ముట్టుకోవద్దు. చేతులను తరుచుగా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటికి, ముక్కకు చేతి రుమాలును అడ్డంగా పెట్టుకోవాలి. ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. చలికాలంలో మంచుపడుతున్న సమయంలో బయటకు రాకూడదు. ఉన్నిదుస్తులను ధరించాలి, వేడివేడి ఆహరం, గోరువెచ్చని నీ టిని తాగడం మంచిది. చిన్న పిల్లల శరీర ఉష్ణోగ్రతలు తగ్గకుండా ఉన్ని దుస్తులను వేయాలని, లక్షణాలు కనపడిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేం«ద్రంలోని డాక్టర్ను సంప్రదించాలి. ముందస్తు జాగ్రత్తలు చేపట్టాం చలి పెరుగుతుండడంతో స్వైన్ఫ్లూ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. స్వైన్ఫ్లూను ఎదుర్కొనేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం. స్వైన్ఫ్లూ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కడైనా అనుమానిత కేసులు నమోదైతే వెంటనే ప్రత్యేక వైద్య బృందం వెళ్లి వారిని పరీక్షించడంతో పాటు చుట్టూ ఉన్న యాబై ఇండ్లలోని వారికి కూడా పరీక్షలను చేయడానికి ఏర్పాట్లు చేశాం. – డాక్టర్ అన్నిమళ్ల కొండల్రావు, డీఎంహెచ్ఓ -
అతిథి ఆగయా
సాక్షి, హైదరాబాద్: సనత్నగర్ శీతాకాలం.. చలిపులిని వెంటబెట్టుకుని రావడమే కాదు.. ఖండాంతరాల్లో ఉన్న ప్రకృతి ప్రసాద విహంగాలకూ ఆహ్వానం పలుకుతుంది. వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చే ఎన్నో రకాల పక్షులకు నగరం ఆతిథ్యమిస్తుంది. చలి కాలం ప్రారంభమైందంటే చాలు.. ప్రతి ఏటా వర్ణశోభితమైన పక్షులు నగరంలోని పలు తటాకాల్లో సోయగాల సరాగాలు ఆలపిస్తుంటాయి. కిలకిలారావాలతో ప్రకృతి రమణీయతను ఇనుమడింపజేస్తుంటాయి. రంగురంగుల విహంగాలతో సరికొత్త ప్రపంచం ఆవిష్కృతమవుతుంది. ప్రస్తుతం నగర శివారులోని అమీన్పూర్, గండిపేట చెరువులకు విదేశీ వలస పక్షులు వస్తుండటంతో ఈ తటాకాలు నూతన శోభను సంతరించుకుంటున్నాయి. వెర్డిటెర్ ఫ్లై క్యాచర్ ఎక్కడెక్కడి నుంచో.. సైబీరియా నుంచి హైదరాబాద్కు సుమారు 20 వేల కి.మీ దూరం ఉంటుందని అంచనా. పక్షులు అంత దూరం నుంచి ప్రయాణించి నగరానికి వలస రావడం గమనార్హం. శీతాకాలంలో అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లోకి వెళ్లడం, తద్వారా వాటికి ఆహార సమస్య ఎదురవడం వంటి కారణాలతో అత్యంత సురక్షిత ప్రాంతంతో పాటు ఆహారం దొరికే ప్రాంతంగా హైదరాబాద్, శివారు ప్రాంతాలను వలస పక్షులు ఎంచుకుంటాయి. ఈ క్రమంలో ఇక్కడి ఆతిథ్యం కోసం నెలల పాటు ప్రయాణం చేసి వస్తుంటాయి. సైబీరియాతో పాటు యూరప్, దక్షిణ యూరేషియా, సెంట్రల్ ఏషియా, రష్యా, టర్కీ, ఆఫ్రికా, ట్రాన్స్– హిమాలయాల నుంచి వివిధ రకాల పక్షులు వలస వస్తుంటాయి. అవి వచ్చే క్రమంలో మధ్యమధ్యలో డే హాల్ట్ (పగలు) చేస్తూ రాత్రి వేళ తమ గమ్యం వైపు సాగిపోతాయి. ఉదాహరణకు సైబీరియా నుంచి వచ్చే పక్షులు చైనా భూభాగంలోని తిపత్, ఉత్తరప్రదేశ్, బిహార్, పంజాబ్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లోని చెరువుల వద్ద కొద్ది రోజులు బస చేసి మళ్లీ హైదరాబాద్ వైపు గమ్యం సాగిస్తుంటాయి. అలా దాదాపు నెల, రెండు నెలల పాటు తమ ప్రయాణం కొనసాగిస్తుంటాయి. ప్రతి పక్షి హిమాలయాలను టచ్ చేసి రావాల్సిందే. నగరంలో కొన్ని నెలల పాటు బస చేసి దిగువ ప్రాంతాలకు పయనమై తిరిగి వేసవి కాలం నాటికి స్వస్థలాలకు వెళ్తుంటాయి. ఎల్లో వాగ్టేల్ కచ్చిత గమ్యాన్ని ఎలా చేరుకుంటాయి..? పక్షులు కచ్చితమైన గమ్యాన్ని చేరుకునేందుకు ఎలాంటి పంథాను అనుసరిస్తాయనే సందేహం రావడం సహజం. మనుషులు మొదటిసారి కొత్త గమ్యానికి వెళ్లాలంటే తెలిసిన వారిని అంటిపెట్టుకుని వెళ్లడమో లేదా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జీపీఎస్ ఆధారంగానో వెళ్తుంటారు. ఒకసారి గమ్యాన్ని చేరుకున్నారంటే మరోసారి సులువుగా ఎవరి సహాయం అవసరం లేకుండా ఆ గమ్యాన్ని చేరుకోవచ్చు. అలాగే ఒకసారి దారిని కనిపెట్టిన పక్షులు మరోసారి అవలీలగా ఆ మార్గాన్ని అనుసరిస్తూ వస్తుంటాయి. ఈ క్రమంలో రాత్రివేళల్లో ఆకాశంలోని నక్షత్రాలను, చంద్రుడి దిశలను గుర్తుపెట్టుకుంటాయి. కాలానుగుణంగా నక్షత్రాలు, చంద్రుడి దిశలు ఫిక్స్డ్గా ఉంటాయి. ఈ నేపథ్యంలో శీతాకాలంలో ఎన్ని డిగ్రీల కోణంలో ప్రయాణం చేస్తే తమ గమ్యం చేరుకుంటామో పక్షుల మైండ్లో నిక్షిప్తమై ఉంటాయి. ఆ మేరకు నక్షత్రాలు, చంద్రుడిని అనుసరిస్తూ రాత్రివేళల్లోనే ఎక్కువగా పక్షులు ప్రయాణం చేస్తుంటాయి. నక్షత్రాలు, చంద్రుడి కిరణాల ప్రసరణతో పైకి ఎగురుకుంటూ వెళ్లే క్రమంలో కింద ఉన్న చెరువులు, కుంటలను కూడా స్పష్టంగా పసిగడతాయి. ఒకవేళ కొత్తగా వలస వచ్చే పక్షులైతే ఇంతకముందు వలస వచ్చిన పక్షులను అనుసరిస్తూ ఉంటాయి. అలా గ్రూపులు గ్రూపులుగా మధ్యమధ్యలో ఆగుతూ చివరకు నగరాన్ని చేరుకుంటాయి. కామన్ స్టోన్చాట్ నగరాన్నే ఎందుకు ఎంచుకుంటాయి..? చలికాలంలో పక్షులకు సురక్షితమైన ప్రాంతంగా హైదరాబాద్ ఉంటుంది. చలిని తట్టుకునే ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదు కావడంతో పాటు ఆహారానికి కూడా అనువుగా ఉంటాయి. సహజసిద్ధమైన వాతావరణం వలస పక్షులకు ఇక్కడ లభిస్తుంది. చెరువుల చుట్టూ భారీ చెట్లు ఉండటం వలస పక్షులకు అనుకూల అంశం. చెరువుల చెంతనే చెట్లపై గూళ్లు కట్టుకోవడానికి అనువైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. చెరువుల మధ్యలో అక్కడక్కడా రాతి శిలలతో పాటు కృత్రిమంగా ఏర్పాటు చేసిన స్టాండ్లు ఉండటం వల్ల ఫ్లెమింగో వంటి పక్షులు వాటిపై గంటల పాటు స్టే చేస్తూ చేపలను అన్వేషిస్తుంటాయి. ఇలా తమ ఆహారాన్ని సేకరించుకోవడానికి అనువుగా ఉంటుంది. చేపల జోలికి వెళ్లని కొన్ని రకాల పక్షులు చెరువు ఒడ్డు ప్రాంతంలో సంచరిస్తూ ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. పక్షులకు అనువైన వాతావరణంతో పాటు వనరులు ఇక్కడ పుష్కలంగా అందుబాటులో ఉండడంతో వలస పక్షులు ఏటా ఇక్కడ వచ్చి విడిది చేస్తుంటాయి. బ్లాక్–టేల్డ్ గాడ్విట్ పక్షి మొత్తం 380 రకాల పక్షి జాతుల్లో దాదాపు 70– 80 వలస పక్షులు ప్రతి ఏటా చలికాలంలో నగరాన్ని ముద్దాడుతుంటాయి. ఇందులో విదేశాలకు చెందిన 40– 45 రకాల పక్షులు విహారం చేస్తుంటాయి. ఇందులో ప్రధానంగా ఫ్లెమింగ్లోని పలు రకాల పక్షులు, వెర్డిటెర్ ఫ్లై క్యాచర్, కామన్ స్టోన్చాట్, నార్తరన్ షోవలర్, బ్లాక్ టెయిల్డ్ గాడ్విట్, ఎల్లో వాగ్టెయిల్, హారియర్స్లో పలు రకాల పక్షులు, 12 జాతులకు చెందిన డక్స్, ఈగల్స్, వాడర్స్, లిటిల్ టెర్న్ వంటి ఎన్నో రకాల రంగురంగుల వలస పక్షులను ఈ వింటర్ సీజన్లో చూడవచ్చు. పర్యావరణానికి సంకేతం.. పర్యావరణం ఎలా ఉందో వలస పక్షుల రాకను బట్టి చెప్పవచ్చు. ఇవి ఎక్కువగా వస్తున్నాయంటే ఇక్కడి వాతావరణం ఆమోదయోగ్యంగా ఉందనే భావించాలి. ఒకవేళ వలస పక్షుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయంటే అంతకుముందు కంటే పర్యావరణం దెబ్బతిందన్న సంకేతంగా చెప్పుకోవచ్చని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గత పదేళ్లతో పోలిస్తే వలస పక్షుల రాక కొంచెం తగ్గిందంటున్నారు. పర్యావరణానికి కాస్త విఘాతం కలిగి ఉండవచ్చు లేక వాటి ప్రయాణంలో అవాంతాలు ఎదురై ఉండవచ్చని భావిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లే క్రమంలో ఇటీవల రాజస్థాన్లో ఒక రకమైన బ్యాక్టీరియా కారణంగా కొన్ని వేల వలస పక్షులు చనిపోయాయి. అలాంటి సంఘటనలు జరగడం ద్వారా కూడా నగరానికి వలస వచ్చే పక్షుల సంఖ్య తగ్గి ఉండవచ్చని చెబుతున్నారు. ఏదేమైనా శీతాకాలం వలస పక్షులను నగరం మురిసిపోతుందనడంలో సందేహం లేదు. నార్తర్న్ షోవెలర్ చెరువులు కాలుష్యం కాకుండా చూడాలి.. వలస పక్షులపై విశ్లేషణ చేయడంతో పాటు ఫొటోలు తీసి ‘బర్డ్స్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్’ గ్రంథంలో ప్రస్తావించాను. ఇప్పటివరకు నేను 226 రకాల పక్షుల ఫొటోలను తీశాను. వీటిలో దాదాపు 80 రకాల వలస పక్షులు శీతాకాలంలో నగరానికి రావడం గమనించాను. పక్షులు విరివిగా రావాలంటే మన చెరువులను కాలుష్యం బారిన పడకుండా చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ మంగ,‘బర్డ్స్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్’ రచయిత వలస పక్షుల రాక తగ్గింది.. గత పదేళ్లుగా నగరానికి దాదాపు 50 శాతం మేర వలస పక్షులు రావడం తగ్గింది. అక్టోబర్ 15 నాటికి వలస పక్షులు రాక మొదలవుతుంది. వేసవికాలం ప్రారంభమయ్యే ముందు తిరిగి వెళతాయి. పక్షులకు అనువైన వాతావరణం కల్పించి తగిన ఆతిథ్యం ఇస్తే బాగుంటుం ది. పర్యావరణాన్ని కాపాడినవారమవుతాం. – చెల్మల శ్రీనివాస్, ఓయూ జంతుశాస్త్ర సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ -
అప్రమత్తతే రక్ష
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో చలి తీవ్రత నానాటికి పెరుగుతోంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులను శరీరం స్వీకరించలేకపోతోంది. చలికి వాహన, పారిశ్రామిక కాలుష్యం తోడవడంతో స్వైన్ఫ్లూ కారక వైరస్ మరింత విస్తరించే ప్రమాదం ఉంది. ఇప్పటికే శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతు న్న ఆస్తమా రోగులు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇక రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పసిపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు త్వరగా ఫ్లూ బారిన పడే ప్రమాదం ఉంది. చలి తీవ్రతకు కాళ్లు, చేతులు, పెదాలపై పగుళ్లు ఏర్పడటం, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎదురవుతాయి. బద్దకంతో వ్యాయామం చేయకపోవడం వల్ల పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోయి అధిక బరువుకు కారణమవుతుంది. ఇప్పటికే మధుమేహం, రక్తపోటు, హృద్రోగ సమస్యతో బాధపడు తున్న వారిలో సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. చలికాలంలో ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణుల సూచిస్తున్నారు. చిన్నారులకు ఫ్లూ ముప్పు చలికాలంలో చిన్నపిల్లలు ఎక్కువగా నిమోనియాతో బాధపడుతుంటారు. వాతావరణ కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చిన్నారులను తిప్పడం వల్ల శ్వాసనాళ సబంధ సమస్యలు వెలుగు చూస్తుంటాయి. చలికి శ్వాసనాళాలు మూసుకుపోయి స్వేచ్ఛగా ఊపిరి తీసుకోలేక పోతారు. తరచూ నిద్ర లేచి ఏడుస్తుంటారు. చలి తీవ్రతకు కాళ్లు, చేతులు, పెదాలపై పగుళ్లు ఏర్పడి మంట పుడుతుంది. ఇది మానసికంగా చిరాకు కలిగిస్తుంది. సాధ్యమైనంత వరకు కాళ్లు, చేతులను కప్పి ఉంచే ఉన్ని దుస్తులను ఎంపిక చేసుకోవాలి. వాతావరణంలో ఫ్లూ కారక వైరస్ మరింత బలపడుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, బాలింతలు, గర్భిణులు, వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆస్తమా బాధితులు విధిగా ముక్కుకు మాస్క్లు ధరించడం, రాత్రిపూట ఏసీ ఆఫ్ చేసి, తక్కువ స్పీడ్లో తిరిగే ఫ్యాను కిందే గడపడం, సిమెంటు, సున్నం, బొగ్గు, ఇతర రసాయన పదార్థాలకు దూరంగా ఉండటం, మంచు కురిసే సమయంలో ఆరుబయటికి వెళ్లక పోవడం మంచిది. తాత్కాలిక ఉపశమనం కోసం ఉదయం ‘నాడీ శోధన’ ప్రాక్టీస్ చేయడం ద్వారా శ్వాస నాళాల పని తీరును కొంత వరకు మెరుగు పర్చుకోవచ్చు. – డాక్టర్ రఫీ, ఫల్మొనాలజిస్ట్ చర్మ పగుళ్ల సమస్య ఉదయాన్నే చాలా మంది తమ పిల్లలను టూ వీలర్పై స్కూలు, కాలేజీలకు తీసుకెళ్తుంటారు. ఈ సమయంలో బయట మంచుతో పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మార్కెటింగ్ రంగంలో పని చేసే యువతీ యువకులు కూడా టూ వీలర్పై ప్రయాణిస్తుంటారు. ఎక్కువ సేపు చలిగాలిలో తిరగడం వల్ల కాళ్లు, చేతులు, పెదాలు, ఇతర శరీర భాగాల్లోని చర్మంపై పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఇలాంటి వారు రాత్రి శరీరానికి పాండ్స్, వాయిజ్లీన్ ఉత్పత్తులను అప్లయ్ చేసుకోవడం ద్వారా చలి బారి నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. పెదాలను ఉమ్మితో తడపకుండా రోజూ వాటిపై లిప్గార్డ్ను రుద్దడం చేయాలి. మంచి నీటిని ఎక్కువగా తాగాలి. సోరియాసిస్ బాధితులు స్నానానికి ముందు శరీరానికి ఆయిల్ అప్లయ్ చేసుకోవడం, గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం, వీలైనంత వరకు సాయంత్రం తర్వాత బయటికి వెళ్లకుండా చూసుకోవడం ద్వారా చర్మ సంబంధ సమస్యల నుంచి బయటపడవచ్చు. – డాక్టర్ మన్మోహన్, చర్మ వైద్యనిపుణుడు మెళకువలు పాటిస్తే చాలు చలికాలంలో వాకింగ్ వెళ్లాలని, జిమ్కు వెళ్లి భారీ కసరత్తులు చేయాలని చాలా మంది భావిస్తుంటారు. బద్దకం వల్ల కొంత మంది, సమయం లేక మరికొందరు దీనిని వాయిదా వేస్తుంటారు. నిజానికి వ్యాయామానికి ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. రోజువారి వృత్తి పనిలో చిన్న చిన్న మెళుకువలు పాటిస్తే సరిపోతుంది. ఎస్కలేటర్లు, లిఫ్టులు వాడకుండా మెట్లు ఎక్కడం, వీలున్నప్పుడు చిన్న చిన్న జంపింగ్లు చేయడం, అర నిమిషం పాటు వెనక్కి నడవడం, సైక్లింగ్ను రోజువారీ కార్యకలాపాల్లో ఓ భాగంగా చేసుకోవడం, శరీరంలోని నడుము కింది భాగాలకు ఎక్కువ శ్రమ కలగాలంటే సైకిల్పై ఎక్కువ సేపు నిలబడి ఉండటం, మెట్రోలో ప్రయాణించే ఉద్యోగులు రైలు ఎక్కి దిగేటప్పుడు ఎస్కిలేటర్, లిఫ్ట్కు బదులు మెట్లను ఉపయోగించడం వల్ల శరీ రానికి అవసరమైన వ్యాయామం పొందవచ్చు. తద్వారా శారీరకంగా ధృడంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. – వెంకట్, ప్రముఖ ఫిట్నెన్ నిపుణుడు -
చలికి పాలు
చలికాలంలో చర్మం పొడిబారడం సహజం. దీనిని నివారించడానికి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో భాగంగా పొడి చర్మంతో బాధపడేవారు అందుబాటులో లభించే సాధనాలతో, ఈ కింది మాస్క్ తయారుచేసుకుని ఉపయోగిస్తే చాలు... మెరిసే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. మిల్క్ మాస్క్: పాలపొడి – టీ స్పూన్; బాదం పేస్ట్ – టేబుల్ స్పూన్; అలోవెరా జెల్ –టేబుల్ స్పూన్; తేనె – టేబుల్ స్పూన్; ఎసెన్షియల్ ఆయిల్ – రెండు చుక్కలు. పై పదార్థాలన్నీ కలిపి పేస్ట్లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగెయ్యాలి. -
చలికాలపు ఇంటిపంటలు
చలికాలంలో ఇంటిపెరట్లో, మేడపైన సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసుకోదగిన ప్రత్యేక కూరగాయ రకాలు కొన్ని ఉన్నాయి. ఆకుకూరలను ఏడాదిలో ఎప్పుడైనా సాగు చేసుకోవచ్చు. వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆలూ/బీన్స్, క్యాబేజ్, క్యాలీ ఫ్లవర్, కాప్సికం, ఉల్లి, ముల్లంగి, వంగ, క్యారట్, టమాట, గోరుచిక్కుడు, పాలకూర, మెంతికూర వంటి రకాలను ఈ సీజన్లో నిక్షేపంగా సాగు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలం సుదీర్ఘంగా కొనసాగడం వల్ల శీతాకాలపు పంటలకు సంబంధించి ఇప్పుడు నారు పోసుకోవడం కన్నా.. దగ్గరల్లోని నర్సరీల నుంచో, సీనియర్ ఇంటిపంటల సాగుదారుల నుంచో మొక్కల నారును తెచ్చుకొని నాటుకోవడం మేలు. ఈ సీజన్లో కుండీలు, మడుల్లో మొక్కలకు నీరు అంత ఎక్కువగా అసవరం ఉండదు. తేమను బట్టి తగుమాత్రంగా నీటిని అందించుకోవడం అవసరమని ఇంటిపంటల సాగుదారులు గుర్తించాలి. -
చలికాలంలో చెమటలు.. అతన్ని పట్టించాయి
కశ్మీర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా అత్యాచార కేసులో కోర్టు ఆరుగురు నిందితులకు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. వీరిలో జీవిత ఖైదు పడిన సాంజి రామ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు అధికారులు. ఆర్కే జల్లా అనే అధికారి మాట్లాడుతూ.. కేసు విచారణ నిమిత్తం సాంజీ రామ్ ఇంటికి వెళ్లినప్పుడు అతని ప్రవర్తన చాలా విచిత్రంగా తోచింది. మా నుంచి ఏదో దాచడానికి ప్రయత్నించాడని తెలిపాడు. ‘అప్పటికే అతని మైనర్ అతని మేనల్లుడిని జువైనల్ హోమ్కు తరలించాం. సాంజీని,అతని కుమారుడు విశాల్ని విచారించే నిమిత్తం అతని ఇంటికి వెళ్లినప్పుడు మమ్మల్ని చూడగానే చాలా కంగారు పడ్డాడు. భయంతో కంపించిపోయాడు. దర్యాప్తులో భాగంగా అతన్ని ప్రశ్నిస్తుండగా.. పొంతన లేని సమాధానాలు చెప్పాడు’ అని గుర్తు చేసుకున్నాడు. ‘అతని కొడుకు గురించి ప్రశ్నించగా.. మీరట్లో చదువుతున్నాడని.. కావాలంటే తన కాల్ రికార్డ్ డాటా(సీఆర్డీ)ను పరిశీలించుకోవచ్చని తెలిపాడు. అప్పుడు నాకు రెండు విషయాలు ఆశ్చర్యం కలిగించాయి. ఒకటి సీఆర్డీ చెక్ చేసుకోమంటూ మాకే సలహా ఇవ్వడం.. రెండు చలి విపరీతంగా ఉండే జనవరిలో అతనికి చెమట పట్టడం. దాంతో మాకు ఆశ్చర్యంతో పాటు అనుమానం కూడా కలిగింది. అతని మీద బెనిఫిషరి ఆఫ్ డౌట్ కింద కేసు నమోదు చేసి.. తదుపరి విచారణను పూర్తి చేశామని వెల్లడించారు. సాంజీ తన కుమారున్ని కాపాడుకోవడానికి అన్నివిధాల ప్రయత్నం చేశాడని జల్లా పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో తమ మీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు రాలేదని జల్ల స్పష్టం చేశారు. సాక్ష్యాధారాలు సేకరించేందుకు తాము చేసిన కృషిని హై కోర్టు గుర్తించి ప్రశంసించిందని తెలిపారు. (చదవండి : సరైన తీర్పు) -
నునుపైన పాదాల కోసం
చలికాలం పాదాల పగుళ్ల సమస్య ఎక్కువ. చర్మం త్వరగా పొడిబారడం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య అధికం. పగుళ్ల వల్ల మడమల్లో నొప్పి కూడా వస్తుంటుంది. నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే సమస్య తీవ్రతను తగ్గించవచ్చు. టేబుల్ స్పూన్ ఉప్పు, రెండు టీ స్పూన్ల నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్, గోరువెచ్చని నీళ్లు, ప్యుమిక్ స్టోన్.. తీసుకోవాలి. ఒక వెడల్పాటి టబ్బు లేదా బేసిన్ లాంటిది తీసుకొని దానిని గోరువెచ్చని నీళ్లతో నింపాలి. దాంట్లో ఉప్పు, 4టీ స్పూన్ నిమ్మరసం, టేబుల్ స్పూన్ గ్లిజరిన్, టీ స్పూన్ రోజ్వాటర్ వేసి కలపాలి. ఈ నీళ్లలో పాదాలను 15 నిమిషాల సేపు ఉంచాలి. ప్యుమిక్స్టోన్ తీసుకొని పాదాల అడుగున, మడమలను రుద్దాలి.మరొకపాత్రలో టేబుల్ స్పూన్ గ్లిజరిన్, టీ స్పూన్ రోజ్వాటర్, టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. పడుకునేముందు పాదాలను తడి లేకుండా తుడిచి, తయారుచేసుకున్న మిశ్రమాన్ని రాయాలి. పాదాలకు సాక్స్ తొడగాలి. మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రంగా పాదాలను కడగాలి. వారంలో కనీసం మూడు రోజులైనా ఈ విధంగా చేస్తూ ఉంటే పాదాల పగుళ్ల సమస్య తగ్గిపోతుంది. -
పహిల్వాన్ డోలు
అది చలికాలం. చల్లని నల్లని అమావాస్య రాత్రి. మలేరియా, కలరా రోగాలతో ఆ ఊరంతా భయాక్రాంతుడైన బాలుడి మాదిరి వణికిపోతూ ఉంది. నశించిపోయిన పాత వెదురు బోద గుడిసెల్లో చీకటి– నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఒకటే చీకటి స్తబ్దత.చీకటి రాత్రి కన్నీరు కారుస్తోంది. స్తబ్దత కరుణతో కూడిన వెక్కిళ్లనూ దుఃఖాన్నీ బలవంతంగా తన హృదయంలో నొక్కి పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. భూమిపైన వెలుతురు అనే మాటే లేదు. ఆకాశంలో నుంచి ఊడబడాలని ఏ నక్షత్రమైనా అనుకున్నా దాని వెలుతురూ, శక్తి మార్గమధ్యంలోనే నశిస్తాయి. మిగతా నక్షత్రాలు దాని భావుకత, అసమర్థతను చూసి కిలకిలా నవ్వుకుంటాయి. నక్కల ఊళలు, గుడ్లగూబల భయంకరమైన కూతలు అప్పుడప్పుడూ నిశ్శబ్దాన్ని భంగపరుస్తున్నాయి. ఊరిలోని గుడిసెల నుంచి ఏడుపులు, వాంతులు చేసుకునే శబ్దాలు, ‘‘అయ్యో దేవుడా, ఓరి భగవంతుడా!’’ వంటి కేకలు మాత్రం వినపడుతున్నాయి. అమ్మా, అమ్మా అంటూ నీరసించిన గొంతులతో పిల్లల అరుపులు వినబడుతున్నాయి. కానీ వీటివల్ల రాత్రి స్తబ్దతలో ఎలాంటి మార్పులూ లేవు.పరిస్థితులను పసిగట్టే గొప్ప నేర్పు కుక్కలకుంటుంది. అవి పగలంతా గుట్టలపైన మూటల్లా ముడుచుకుని దిగులుగా పడి ఉంటాయి. రాత్రి వేళల్లో అన్నీ కలిసి ఏడుస్తుంటాయి. రాత్రిళ్లు ఈ విధంగా భయంకరంగా గడిచిపోతూ ఉంటే, దొమ్మరివాడి డోలు మాత్రం నిరంతరం మోగుతూ ఉండేది. సాయంత్రం అయినప్పటి నుంచి తెల్లారేదాకా ‘ఫట్.. థా గిడ్... థా.. ఫట్.. థా గిడ్.. థా.. ’ (అంటే.. రా, ఢీకొను రా, ఢీకొను) అనే శబ్దం ఒకే తాళగతిలో మోగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో ‘చటాక్ చట్థా.. చటాక్.. చట్ థా’ (అంటే ఎత్తి కింద పారేయి.. ఎత్తి కింద పారేయి) అనే శబ్దాలు వినిపిస్తాయి. మృత్యుముఖంలో ఉన్న ఆ ఊళ్లో ఆ డోలు శబ్దాలే సంజీవని శక్తిగా పనిచేసేవి.లుట్టన్ సింగ్ పహిల్వాన్ను హోల్ ఇండియా ప్రజలకు తెలుసునని అంటూ ఉంటాడు. కానీ అతని హోల్ ఇండియా హద్దు ఒక జిల్లా వరకు మాత్రమే. ఆ జిల్లాలోని ప్రజలకందరికీ అతను తెలుసు.లుట్టన్ తల్లిదండ్రులు అతని తొమ్మిదేళ్ల వయసప్పుడే అతన్ని అనాథగా మిగిల్చి చనిపోయారు. అదృష్టం కొద్దీ అప్పటికే అతనికి పెండ్లి అయింది. లేకపోతే తల్లిదండ్రులతో పాటు అతనూ గతించేవాడు. విధవరాలైన అత్త అతన్ని పెంచి పెద్ద చేసింది. బాల్యంలో ఆవులను మేపుతూ, వాటి పాలు తాగుతూ, కసరత్తు చేస్తూ గడిపేవాడు. పల్లె ప్రజలు అతని అత్తను నానా విధాలుగా బాధించేవారు. వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే అతని బుర్రలో కసరత్తు నేర్చుకోవాలనే బుద్ధి పుట్టింది. క్రమం తప్పకుండా కసరత్తు చేయడం వల్ల బాల్యావస్థలోనే అతని ఛాతీ, బాహువులు బలిష్టంగా తయారయ్యాయి. పుష్టికరమైన కండరాలు ఏర్పడ్డాయి. యవ్వనంలోకి అడుగుపెడుతూనే పల్లెలోకెల్లా మంచి పహిల్వాన్గా పేరు తెచ్చుకున్నాడు. ప్రజలు అతనికి భయపడేవారు తాను రెండు వైపులా చేతులను నలభై ఐదు డిగ్రీల కోణంలో చాపి– పహిల్వాన్ల మాదిరిగా నడిచేవాడు. అతను కుస్తీ కూడా పట్టేవాడుఒకనాడు అతడు కుస్తీ చూడ్డానికి శ్యామ్నగర్ జాతరకు వెళ్లాడు. పహిల్వాన్ల కుస్తీలో వాళ్ల పట్టు విడుపులు చూస్తూ ఊరకుండలేకపోయాడు. యవ్వనపు వేడి, మదం వల్ల డోలు శబ్దాలకు అతని రక్తనాళాలు వేడెక్కాయి. ముందు వెనుకా చూడకుండా కుస్తీలో ‘‘సింహం పిల్ల’’తో సవాలు చేశాడుఆ సింహంపిల్ల అసలు పేరు చాంద్ సింగ్. వాడు పంజాబ్ నుంచి తన గురువు బాదల్ సింగ్ వెంట తొలిసారి శ్యామ్నగర్ జాతరకు వచ్చాడు. అందమైన యువకుడు. వచ్చిన మూడు రోజుల్లోనే పంజాబ్–పఠాన్ల పహిల్వాన్ల దళంలోని తన సరిజోడు పహిల్వాన్లందరినీ నేల కరిపించి, ‘‘సింహంపిల్ల’’ అనే బిరుదు పొందగలిగాడు. అతను కుస్తీ మైదానంలో లంగోటా బిగించి చెంగు చెంగున విజయగర్వంతో హర్షధ్వనులు చేస్తూ గుర్రంపిల్ల మాదిరిగా ఎగురుతూ ఉండేవాడు. అతని దెబ్బకు అక్కడి యువ పహిల్వాన్లు అందరూ కుస్తీ మాటంటేనే భయపడేవారు. తన బిరుదును నిలుపుకొనేందుకు చాంద్ సింగ్ మధ్య మధ్యలో కుస్తీకి ఎవరైనా ఉంటే రమ్మని కాలు దువ్వేవాడు. వేటలూ, కుస్తీలంటే చెవి కోసుకునే శ్యామ్నగర్ వృద్ధ మహారాజా చాంద్సింగ్ను తన దర్బారులో పహిల్వాన్గా ఉంచుకోవాలని అనుకుంటుండగానే లుట్టన్ ఆ సింహంపిల్లతో పోటీ పడతానని సవాలు చేశాడు. బిరుదు పొందిన చాంద్ సింగ్.. లుట్టన్ సవాలు విని నవ్వుకున్నాడు. వెంటనే డేగ మాదిరి అతని మీదకు లంఘించాడు.నిశ్శబ్దంగా ఉన్న ప్రేక్షకుల గుంపులో కలకలం మొదలైంది. ‘‘పిచ్చోడు.. పిచ్చి ముండాకొడుకు... చచ్చచ్చ.. చచ్చ’’... ఓహో! గొప్పోడే. లుట్టన్ చాకచక్యంగా దాడిని తప్పించుకుని లేచి నిలబడ్డాడు. మహారాజా కుస్తీని ఆపు చేయించి, లుట్టన్ను తన వద్దకు పిలిపించుకుని సముదాయించాడు. అతని ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ పదిరూపాయల నోటు చేతికందించి ‘‘పో.. జాతర చూసి ఇంటికి పో..’’ అన్నాడు. ‘‘లేదు మహారాజా! కుస్తీ పడతాను. తమరు ఆజ్ఞాపించండి.’’‘‘పో.. పిచ్చోడా’’‘‘శరీరంలో శక్తి లేకపోయినా సింహంపిల్లతో కుస్తీ పట్టవచ్చావుటరా.. రాజావారు ఇంతగా నచ్చచెబుతున్నా కుస్తీ మానుకోకపోతే నీకు పుట్టగతులుండవు’’ అని మేనేజరు, భటులు అతన్ని బెదిరించారు.‘‘మీపై ఒట్టు దొరా! మీ ఆజ్ఞయే తరువాయి మహారాజా... కుస్తీ పట్టనివ్వండి దొరా. లేకపోతే ఇక్కడే ఈ రాతికి తల బద్దలుగొట్టుకుని చస్తాను’’ చేతులు జోడించి వేడుకున్నాడు. గుంపులో కలవరం మొదలైంది. పంజాబ్ పహిల్వాన్ల దళం కోపంతో లుట్టన్పై తిట్ల వర్షం కురిపించసాగింది. ప్రేక్షకుల్లో ఉత్సాహం పెరిగింది. వాళ్లల్లో కొందరు లుట్టన్ తరఫున కేకలు చేస్తూ అతన్ని కుస్తీ పట్టనివ్వండి అని అరిచారు. చాంద్ సింగ్ ఒక్కడే మైదానంలో నవ్వుకుంటూ నిలబడ్డాడు. మొదటి పట్టులోనే తన ప్రత్యర్థి శక్తి ఏమిటో అతనికి అర్థమైంది.రాజావారు గత్యంతరం లేక ఆజ్ఞ జారీ చేశారు. ‘‘సరే కుస్తీ పట్టండి.’’డోలు మోగటం మొదలైంది. ప్రేక్షకుల్లో మళ్లీ ఉత్సాహం పెరిగింది. గుంపులో కోలాహలం ప్రారంభమైంది. జాతరలోని దుకాణదారులందరూ దుకాణాలను మూసివేసి ‘‘చాంద్ సింగ్కి సమ ఉజ్జీ దొరికాడు. కుస్తీ జరుగుతూంది’’ అని పరుగెత్తుకుంటూ వచ్చారు.‘‘చట్ థా.. గిడ్ థా.. చట్ థా.. గిడ్ థా..’’ ఇంతవరకు మూగబోయిన డోలు పెద్ద శబ్దంతో మోగింది. ‘‘డాక్ డినా, డాక్డినా డాక్ డినా’’ (అంటే వాహా, భలే భలే) శబ్దం చేస్తూ డోలు మోగింది. చాంద్ సింగ్ లుట్టన్ సింగ్ను గట్టిగా నొక్కి పట్టాడు.‘‘అయిపోయే! లుట్టన్ సింగ్ బజ్జీ అయిపోయే! సింహంపిల్లతో ఢీకొనడం నవ్వులాటా మరి’’ అని ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. ‘చట్ గిడ్థా, చట్ గిడ్థా, థట్గిడ్థా’ (భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు) అంటూ డోలు మార్మోగింది. లుట్టన్ మెడపై మోచేతిని ఆనించి నేల పడేసే ప్రయత్నంలో చాంద్ సింగ్ ఉన్నాడు.‘అక్కడే పడెయ్యి’ అంటూ బాదల్ సింగ్ తన శిష్యుణ్ణి ఉత్సాహపరచాడు.లుట్టన్ కన్నులు బయటకొచ్చాయి. ఉఛ్ఛ్వాశ నిశ్వాసాలు ఎక్కువయ్యాయి. గుంపులోని ఎక్కువమంది జనం చాంద్సింగ్ పక్షం చేరి, అతన్ని ఉత్సాహపరుస్తున్నారు. లుట్టన్ పక్షాన డోలు మాత్రం మోగుతోంది. డోలు మోత ప్రకారం అతను తన ఉత్సాహాన్ని పెంపొందించుకుంటూ తలపడుతున్నాడు. ఉన్నట్టుండి డోలు నెమ్మదిగా మోగసాగింది.‘‘డక్ డినా– తిర్కిట్తినా, డక్డినా తిర్కిట్తినా’’ (అంటే పోటీ విరమించుకో, బయటకొచ్చేసేయి) అని లుట్టన్ సింగ్కు డోలు చేసిన ఈ శబ్దాలు వినపడ్డాయి. ఉన్నట్టుండి లుట్టన్ పట్టు నుంచి జారుకొని బయటకొచ్చి వెంటనే చాంద్సింగ్పైకి ఉరికి మెడ పట్టేశాడు. ‘‘శభాష్, భలే! మట్టిలో మాణిక్యానివిరా!’’‘‘సరే, ఆహా! బయటికొచ్చాడా?’’ అందువల్లనే కదా జనం లుట్టన్ వైపు మొగ్గారు.‘ఛటాక్ ఛట్ థా.. ఛటాక్ ఛట్ థా’ (ఎత్తి పడెయ్యి, ఎత్తి పడెయ్యి) అని గట్టిగా డోలు మోగింది. లుట్టన్ చాలా చలాకీగా ఎత్తుకు పై ఎత్తు వేసి చాంద్ సింగ్ను కింద పడేశాడు.‘థిగ్ థినా, థిగ్ థినా’ (వెల్లకిలా పడెయ్యి, వెల్లకిలా పడెయ్యి) అని డోలు మోగింది.లుట్టన్ సింగ్ శక్తినంతా బిగపట్టి చాంద్ సింగ్ను వెల్లకిలా పడేసి ఓడించాడు. ‘థాగిడ్ గిడ్, థాగిడ్ గిడ్, థాగిడ్ గిడ్’ (శభాష్ పహిల్వాన్, శభాష్ పహిల్వాన్, శభాష్ పహిల్వాన్) అని డోలు మోగింది.ప్రేక్షకులు ఎవరికి జేజేలు పలకాలో తెలియని స్థితిలో ఉన్నారు. వాళ్ల వాళ్ల ఇష్టానుసారం కొంతమంది ‘దుర్గా మాతకు జై’ అంటే మరికొందరు ‘మహావీరునికి జై’ పలికారు. మరికొందరు శ్యామానంద మహారాజుకు జై పలికారు. ఆఖరికి సామూహికంగా జేజేలతో ఆకాశం మార్మోగింది.విజయోత్సాహంతో లుట్టన్ ఎగురుతూ గంతులేస్తూ, తొడలు చరుస్తూ అందరి కంటే ముందు వాద్యగాళ్ల వద్దకు పరుగున వెళ్లి భక్తిపూర్వకంగా డోలుకు నమస్కరించాడు. తర్వాత పరుగున వెళ్లి రాజాగారిని పైకెత్తుకున్నాడు. రాజావారి విలువైన దుస్తులకు మట్టి అంటుకుంది. ‘అరె, అరే .. ఏమిటిది?’ మేనేజరుగారు మందలించారు. రాజావారు మాత్రం అతన్ని తన హృదయానికి హత్తుకొని ఆనంద పారవశ్యంతో ‘‘వర్ధిల్లు పహిల్వాన్ వర్ధిల్లు! నీవు ఈ రాజ్య గౌరవాన్ని నిలబెట్టావు’’ అన్నారు. పంజాబీ పహిల్వాన్లు చాంద్ సింగ్ కన్నీళ్లు తుడవసాగారు. రాజావారు లుట్టన్ సింగ్కు బహుమానాలు ఇవ్వటమేగాక అతన్ని ఆస్థానంలో నియమించుకున్నారు. అప్పటి నుంచి లుట్టన్ రాజాస్థానంలో పహిల్వాన్ అయ్యాడు. రాజావారు గౌరవంగా అతన్ని లుట్టన్ సింగ్ అని పిలువసాగారు. మిగతా ఆస్థాన పండితులకు అది నచ్చలేదు. ‘‘ప్రభూ! వీడి జాతి ఏమిటి? వీడిని సింగ్ అని పిలవడం బాగులేదు’ అన్నారు.మేనేజరు క్షత్రియుడు. తన క్లీన్షేవ్డ్ ముఖాన్ని చిట్లిస్తూ ముక్కులోని వెంట్రుకలను లాగసాగాడు. క్షణంలో ఒక వెంట్రుకను లాగేసి దాన్ని నలుపుకుంటూ ‘‘అవును మహాప్రభూ! ఇది అన్యాయమే’’ అన్నాడు.‘‘అతడు క్షత్రియుడు చేయవలసిన పనే చేశాడు’’ రాజావారు చిరునవ్వుతో అన్నారు. ఆ రోజు నుంచే లుట్టన్ సింగ్ పహిల్వాన్ కీర్తి ప్రతిష్ఠలు దూర తీరాలకు వ్యాపించాయి. కొద్ది సంవత్సరాల్లోనే అతడు పేరుగాంచిన పహిల్వాన్లను ఒక్కొక్కరినే మట్టికరిపించాడు. అప్పుడు కాలాఖాన్ అనే మరో పేరుపొందిన పహిల్వాన్ ఉండేవాడు. కాలాఖాన్ లంగోటీ బిగించి, ఆలే అని ప్రత్యర్థి పైకి ఉరికితే, ప్రత్యర్థికి వణుకు పుట్టేదని ప్రతీతి. లుట్టన్ సింగ్ అతన్ని కూడా ఓడించి వాళ్ల భ్రమలను తొలగించాడు.క్రమంగా అతను ప్రదర్శనశాలలో ఒక వస్తువుగా తయారయ్యాడు. జంతు ప్రదర్శనశాలలో ఇనుపబోను ఊపుతూ పులి గాండ్రించినట్లు అతను హా హూ.. హా హూ అని అరిచేవాడు. అతని అరుపులు విని, రాజావారి పులి అరుస్తోంది అనేవారు. జాతరలో అతను మోకాళ్ల వరకు అంగీ వేసుకుని, చిందరవందరగా తలపాగా కట్టి, మదించిన ఏనుగులా ఊగుతూ నడిచేవాడు. దుకాణదారులు తమ అంగడి వద్దకు పిలిచి, ‘‘పహిల్వాన్ గారూ! వేడి వేడి రసగుల్లాలు రెడీగా ఉన్నాయి.. నాలుగైదు ఆరగించండి’’ అని వేళాకోళం చేసేవారు.లుట్టన్సింగ్ పహిల్వాన్ చిన్నపిల్లాడి మాదిరి నవ్వుకుంటూ ‘అరే నాలుగైదు తింటే ఏమవుతుంది? తీసుకురా ఒకటి, రెండు శేర్లు’ అని అక్కడే కూర్చునేవాడు.రెండుశేర్ల రసగుల్లాలు తిని, పది పన్నెండు పాన్ చిలకల్ని నోట్లో కుక్కుకుని, గడ్డానికి పాన్ రసాన్ని కార్చుకుంటూ జాతరలో తిరిగేవాడు. జాతర నుంచి రాజ దర్బారుకి తిరిగొచ్చేటప్పటికి అతని ఆకృతే మారిపోయేది. కండ్లకు రంగుల అభ్రకపు కళ్లజోడు, చేతుల్లో నాట్యం చేసే బొమ్మ, నోట్లో ఇత్తడి పీకను ఊదుకుంటూ నవ్వుకుంటూ తిరిగొచ్చేవాడు. శారీరక వృద్ధి సామర్థ్యాలు పెంపొందుతున్నాయి గాని, బుద్ధి మాత్రం క్షీణిస్తూ చిన్నపిల్లల స్థాయికి చేరుకుంది. కుస్తీ మైదానంలో డోలు శబ్దం వింటూనే తన స్థూలకాయాన్ని ప్రదర్శించడం ప్రారంభించేవాడు. అతనికి సమ ఉజ్జీ దొరికేవాడే కాదు. ఒకవేళ ఎవరైనా అతనితో పోటీ పడాలంటే రాజావారు అనుమతించేవారు కాదు. అందువల్లే పాపం అతను నిరాశతో లంగోటీ బిగించి, దేహానికి మట్టి పూసుకుని, ఎగురుతూ గంతులేస్తూ ఉండేవాడు. తనను దున్నపోతు, ఆంబోతుగా నిరూపించుకుంటూ తిరిగేవాడు. ముసలివాడైన రాజు అతన్ని చూసి మురిసిపోయేవాడు.ఇలా పదిహేనేళ్లు గడిచిపోయాయి. పహిల్వాన్ మాత్రం అజేయుడిగా నిలిచిపోయాడు. కుస్తీ మైదానంలోకి లుట్టన్ సింగ్ తన ఇద్దరు కుమారులను తీసుకుని వచ్చేవాడు. పహిల్వాన్ అత్త ఎప్పుడో మరణించింది. ఇద్దరు పిల్ల పహిల్వాన్లకు జన్మనిచ్చిన కొద్ది రోజులకు అతని భార్య పరమపదించింది. ఇద్దరు పిల్లలూ తండ్రిని మించిన తనయులు అవుతారు అనేవారు.ఇద్దరినీ పిల్లవాళ్లుగా ఉన్నప్పుడే కాబోయే రాజ మల్లులుగా ప్రకటించారు రాజావారు. అందువల్ల వారి పోషణ భారమంతా రాజదర్బారే చూసేది. ప్రతిరోజూ ప్రాతఃకాలాన్నే పహిల్వాన్ స్వయంగా డోలు వాయిస్తూ పిల్లల చేత కసరత్తు చేయించేవాడు. మధ్యాహ్నంపూట విశ్రమిస్తూనే ఇద్దరికీ ప్రపంచజ్ఞానం బోధించేవాడు.‘‘డోలు ధ్వనులపై దృష్టి కేంద్రీకరించండి. నాకు గురువు ఎవ్వరూ లేరు. ఈ డోలే నా గురువు. ఈ డోలు ధ్వనుల ప్రభావం వల్లనే నేను పహిల్వాన్ కాగలిగాను. కుస్తీ మైదానంలోకి అడుగిడగానే డోలుకు నమస్కారం చేయాలి. తెలిసిందా.’’... ఈ మాదిరి ఎన్నో విషయాలు బోధించేవాడు. ఇవే కాకుండా రాజావారిని ఏవిధంగా సంతోషపరచాలి, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి మొదలైన విషయాలను వారికి బోధించేవాడు.కానీ ఏం లాభం? అతని బోధనలన్నీ వ్యర్థమయ్యాయి. రాజావారు స్వర్గస్తులయ్యారు. రాజ కుమారుడు విదేశాల నుంచి తిరిగొచ్చి రాజ్యపాలనా భారాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. నాన్నగారి కాలంలోని వైఫల్యాలన్నీ తొలగించి, కట్టుదిట్టాలు చేశాడు. కొన్ని కొత్త మార్పులు చేశాడు. ఆ మార్పుల కారణంగా పహిల్వాన్గిరీ ఊడిపోయింది. కుస్తీ మైదానాన్ని గుర్రపు పందేలా మైదానంగా మార్చారు.పహిల్వాన్లు కాబోయే రాజమల్లుల దినసరి భోజన ఖర్చు వివరాలు తెలియగానే ‘టెరిబుల్’ అన్నాడు కొత్త రాజు.రాజాస్థానంలో ఇంకెంత మాత్రం పహిల్వాన్ల అవసరం లేదని స్పష్టంగా హుకుం జారీ చేశాడు. పహిల్వాన్కు తన గోడు తెలుపుకునే అవకాశం సైతం దొరకలేదు.అదేరోజు డోలును మెడకు తగిలించుకుని కొడుకులను వెంట తీసుకుని పహిల్వాన్ తన ఊరు చేరుకున్నాడు. ఊరిలో ఒక మూల ఊరివారందరూ కలిసి ఒక గుడిసె వేయించి ఇచ్చారు. అక్కడే ఉంటూ ఊరి యువకులకు, పశువుల కాపర్లకు కుస్తీ నేర్పుతూ వచ్చాడు. తిండితిప్పలు ఊరిలో వాళ్లు చూసేవారు. ఉదయం, సాయంత్రం డోలు వాయిస్తూ శిష్యులకు, తన కొడుకులకు కుస్తీలోని పట్టు విడుపులు నేర్పేవాడు .ఆ ఊరిలోని రైతుల పిల్లలకూ, వ్యవసాయ కూలీల పిల్లలకూ సరైన తిండి లేదు. ఇక కుస్తీ ఎలా నేర్చుకోగలరు? క్రమక్రమంగా పహిల్వాన్ స్కూలు ఖాళీ అయింది. ఆఖరికి డోలు వాయిస్తూ తన ఇద్దరు కొడుకులకే కుస్తీలోని పట్టువిడుపులు నేర్పుతూ ఉండేవాడు. దినమంతా ఇద్దరు కొడుకులు కూలి నాలి చేసి సంపాదించిన సొమ్ముతోనే జీవితం గడిపేవాడు.ఉన్నట్టుండి ఆ ఊరికి ఆపద వచ్చిపడింది. అనావృష్టి. తిండి గింజల లేమి. ఆ తర్వాత మలేరియా, కలరా రెండూ కలసి పల్లెను సర్వనాశనం చేయసాగాయి.ఆ ఊరు ఒక విధంగా ఖాళీ అయింది. ఇండ్లకు ఇండ్లు ఖాళీ అయిపోయాయి. ప్రతిరోజూ ఇద్దరు ముగ్గురు శవాలుగా మారేవారు. పల్లెవాసుల్లో కలవరం మొదలైంది. రోజంతా కలవరం, వ్యాకులత, హృదయాన్ని కరిగించే ఏడుపులతో గడిచిపోగా, ప్రజల ముఖాల్లో సూర్యుని వెలుగుతో పాటు కొంచెం వెలుగు కనపడేది. సూర్యోదయం అవుతూనే ఏడుస్తూ, మొత్తుకుంటూ తమ ఇండ్ల నుంచి బయటికొచ్చి ఇరుగుపొరుగు వారితో, బంధువులతో కలసి పరస్పరం ధైర్యం చెప్పుకొనేవారు.‘‘ఇప్పుడు ఏడ్చి ఏమి లాభం కోడలా, పోయినవాడు పోయాడు. వాడు నీవాడు కాదనుకో. ముందు జరగవలసిన దానిని గురించి ఆలోచించుకో’’ అని..‘‘తమ్ముడూ! ఇంట్లో శవాన్ని పెట్టుకుని ఎంతకాలం ఏడుస్తావు? శవంపై కప్పేదానికి గుడ్డ కావాలంటావా, దాని అవసరం ఏమిటి? శవాన్ని నదిలో కలిపేసి రారాదా’’ అనే మాటలు ఊరంతా వినిపించేవి.సూర్యాస్తమయం అవుతూనే ఊరివారంతా తమ తమ గుడిసెల్లో దూరి నిశ్శబ్దంగా పడి ఉంటారు. అప్పుడు వాళ్లకు మాట్లాడే శక్తి కూడా ఉండదు. తల్లి పక్కనే ప్రాణాలు కోల్పోతున్న కొడుకును, కొడుకా అని పిలిచే ధైర్యం తల్లులకు ఉండదు.రాత్రి భీకర నీరవ స్తబ్దతను పహిల్వాన్ డోలు మాత్రమే గట్టిగా మోగుతూ సవాలు చేస్తుంది. సాయంకాలం నుంచి ఉదయం వరకు డోలు ఏదో విధంగా మోగుతూ ఆ పల్లెలో చావటానికి సిద్ధంగా ఉన్నవాళ్లకు, మందులూ మాకులూ లేక తిండితిప్పలు లేని మనుషులకు సంజీవని శక్తిగా పనికొచ్చేది. పిల్లల యువకుల వృద్ధుల శుష్క నేత్రాలలో అప్పుడప్పుడూ కుస్తీ మైదానంలోని దృశ్యాలు లీలగా తాండవిస్తాయి. స్పందన, శక్తి లేని నరాల్లో విద్యుత్తు ప్రవహిస్తుంది. ఆపే శక్తి లేకపోవచ్చు కాని, చనిపోయేవాళ్లు కళ్లు మూసే సమయంలో వాళ్లకు ఎలాంటి కష్టాన్నీ కలిగించకుండా, మృత్యుకూపంలోకి పోయేటప్పుడు ఎలాంటి భయం కలుగకుండా డోలు శబ్దాలు పనికొచ్చేవి. పహిల్వాన్ కొడుకులు యముని పాశంలో చిక్కుకొని భరించలేని బాధతో కొట్టుమిట్టాడుతూ ‘‘నాన్నా, ఎత్తిపడేయి’’ అన్న తాళాన్ని వాయించండి అన్నారు. ‘‘ఛటాక్– ఛట్థా, ఛటాక్– ఛట్థా’’ తాళాన్ని పహిల్వాన్ రాత్రంతా డోలుపై వాయిస్తూనే ఉన్నాడు. మధ్య మధ్యలో పహిల్వాన్ల భాషలో ‘వీరులారా! ప్రత్యర్థిని ఓడించండి’ అని ఉత్సాహపరుస్తున్నాడు.తెల్లవారేసరికి ఇద్దరు కొడుకులూ అపస్మారక స్థితిలో నేలపై పడి ఉండటం చూశాడు. ఇద్దరూ బోర్లా పడి ఉన్నారు. ఒకడు మట్టిలో కూరుకుపోయి ఉన్నాడు. దీర్ఘ ఉఛ్ఛ్వాశ తీసుకుని నవ్వే ప్రయత్నంలో పహిల్వాన్ ‘‘ఇద్దరు వీరులూ మట్టికరిచారా!’’ అన్నాడు.ఆ రోజు పహిల్వాన్ శ్యామానంద మహారాజా ఇచ్చిన పట్టు లంగోటా ధరించి ఉన్నాడు. శరీరమంతా మట్టి పులుముకొని కసరత్తు చేశాడు. తర్వాత ఇద్దరు కొడుకులను భుజాన వేసుకుని నదిలో పారేసి వచ్చాడు. ఈ విషయం విని పల్లెవాసులు ఆశ్చర్యచకితులయ్యారు. భయభ్రాంతులయ్యారు. ఇంత జరిగినప్పటికీ పహిల్వాన్ డోలు శబ్దాలు రోజూ మాదిరిగానే వినబడసాగాయి. ప్రజల్లో ధైర్యం పుంజుకోసాగింది. ‘‘ఇద్దరు కొడుకులు గతించారు. అయినప్పటికీ పహిల్వాన్ ధైర్యం చూడండి. అతని గుండెనిబ్బరం చూడండి’’ అని తమ సంతానాన్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు అనుకున్నారు.నాలుగైదు రోజుల తర్వాత ఒకనాటి రాత్రి డోలు శబ్దాలు వినబడలేదు. డోలు మూగబోయింది. రోగగ్రస్తులైన కొందరు శిష్యులు పోయి చూడగా, పహిల్వాన్ శవం వెల్లకిలా పడి ఉంది. రాత్రి నక్కలు బలిష్టమైన అతని ఎడమ తొడ మాంసం తినేశాయి. కడుపును కూడా చీల్చాయి.‘‘నేను చనిపోతే చితిపైన నన్ను వెల్లకిలా పడుకోబెట్టండి. నేను జీవితంలో ఎప్పుడూ బోర్లాపడలేదు. చితికి నిప్పంటించేటప్పుడు డోలు వాయించండి’’ అని అంటుండేవారు మన గురువుగారు అని కన్నీళ్లు తుడుచుకుంటూ అతని శిష్యుల్లో ఒకడన్నాడు.పక్కనే డోలు పడిఉంది. నక్కలు డోలును తినే వస్తువు కాదనుకొని దాని చర్మాన్ని చీల్చేశాయి. -
గజ.. గజ
పశ్చిమగోదావరి, దెందులూరు: జిల్లాలో చలితీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలిగాలులు పెరిగాయి. దీంతో ప్రజలు గజ.. గజ వణుకుతున్నారు. తెల్లవారుజాము నుంచే మంచు కురుస్తోంది. ఉదయం 8 గంటల వరకు మంచుతెరలు కమ్ముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు చలిమంటలు వేసుకుని చలిపులి నుంచి సంరక్షించుకుంటున్నారు. నాలుగు డిగ్రీలకు పైగా తగ్గిన ఉష్ణోగ్రతలు జిల్లాలో గత వారం రోజులుగా రాత్రిపూట 19 నుంచి 21 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతున్నాయి. పగటి పూట 25 నుంచి 26 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా కంటే దాదాపు నాలుగు డిగ్రీల మేర తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏటా సాధారణంగా డిసెం బర్ నుంచి చలితీవ్రత పెరుగుతూ వస్తుంది. అయితే ఈ ఏడాది అందుకు భిన్నంగా నవంబర్ నుంచే చలి విజృంభించింది. గతేడాదితో పోలిస్తే రెండు డిగ్రీల వరకు చలితీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీనికితోడు పెథాయ్ తుపాను కారణంగా వాతావరణం బాగా చల్లబడింది. అప్పటి నుంచి పగటి ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. చలితీవ్రతకు పగలు కూడా ప్రజలు స్వెట్టర్లు ధరించాల్సి వస్తోంది. రాత్రివేళ రాకపోకలను తగ్గించారు. స్వెట్టర్లు, రగ్గులు, బొంతలు, మాస్క్లు, మంకీ క్యాప్ల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. తగ్గిన విద్యుత్ వినియోగం చలి కారణంగా జిల్లాలో విద్యుత్ వినియోగం భారీగా తగ్గింది. ఏసీలు, కూలర్లు, లైట్లు, ఫ్యాన్ల వినియోగం జిల్లాలో గణనీయంగా తగ్గింది. చలి తీవ్రతకు ఉబ్బసం, ఆయాసం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, షుగర్ వ్యాధిగ్రస్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వీటికి తోడు చిన్నారులకు అంటువ్యాధులు త్వరితగతిన తగ్గకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచుతో రవాణా అస్తవ్యస్తం పొగమంచు కారణంగా రవాణాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు పొVýæ మంచు దట్టంగా కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారిలో ప్రయాణించే భారీ వాహనాలకు ఎదుట వెళ్లే వాహనాల జాడ తెలియడం లేదు. దీంతో పలుచోట్ల ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. వాహనం దగ్గరకు వచ్చే వరకు కనిపించకపోవడంతో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొVýæమంచు కారణంగా జిల్లాలో Výæత నాలుగు రోజుల్లో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. -
అన్నింటినీ రిఫ్రిజిరేటర్లో పెడితే అనర్థమే..
విజయనగరం మున్సిపాలిటీ: పోపులపెట్టె అంటే అందరికి తెలిసిందే... రిఫ్రిజిరేటర్ పరిస్థితి నేడలా తయారైంది. తినే వస్తువుంటే చాలు అందులో దాచేస్తున్నారు. దీని వల్ల జరిగే అనర్థాలను గుర్తించడం లేదు. నేటి తరం ప్రజల దైనందిన జీవితంలో రిఫ్రిజిరేటర్ వినియోగం ఒక భాగమైంది. జిల్లాలో సుమారు 13 లక్షల కుటుంబాలు ఉండగా 40 శాతం కుటుంబాల్లో రిఫ్రిజిరేటర్ల వినియోగం ఉందని అంచనా. వీరిలో 25 శాతానికి పైగా కుటుంబాలు పూర్తి మెలకువలు తెలియకుండానే వినియోగిస్తున్నారు. ప్రతి రోజు జిల్లాలో 100 నుంచి 300 రిఫ్రిజిరేటర్లు వరకు విక్రయాలు జరుగుతున్నాయి. వీటితో పాటు దుకాణాలు, హోటళ్లు, బార్లు తదితర వ్యాపార సంస్థల్లో, ఆహార పదార్థాల దుకాణాల్లో కూడా రిఫ్రిజిరేటర్లు వేల సంఖ్యలో వినియోగిస్తున్నారు. సరైన అవగాహన లేకుండా వీటి వినియోగం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. ఫ్రిజ్లున్న ప్రతి ఒక్కరూ ఆహార పదార్థాలను ఎక్కువ సమయం నిల్వ చేయడం, తరువాత వాటిని వాడడం సాధారణమైంది. ఈ పరిస్థితుల్లో రిఫ్రిజిరేటర్లలో ఏయే రకాల ఆహార పదార్ధాలు ఎలా నిల్వ చేసుకొవాలనే విషయంలో పోషకాహార నిపుణులు ఇస్తున్న సూచనలు పాటించాల్సిందే. ఏ పదార్ధాలు...ఎలా దాచుకోవాలి... కేకులను గాలి సోకని డబ్బాలో నిల్వ చేసుకుంటే ఉత్తమం. తాజా పదార్ధాలతో చేసినదైతేనే ఫ్రిజ్లో ఉంచుకోవచ్చు. లేదంటే వాటిని ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చిన కేక్ డబ్బాలలో నిల్వ చేసుకోవచ్చు. తేనెకు సహజ సిద్ధంగానే నిల్వ ఉండే గుణం ఉంటుంది. రిఫ్రిజిరేటర్లలో దాచి పెట్టాల్సిన అవసరం ఉండదు. చల్లని వాతావరణంలో నిల్వ ఉంచితే గట్టిపడి, సహజత్వం కోల్పోతుంది. రుచి కూడా మారిపోతుంది. ఉల్లిగడ్డ లాగానే వేరే పదార్ధాలకు వాసన కలిగించే వెల్లుల్లిని కూడా ఇందులో దాచుకోకూడదు. వాటిని పొడిగా, పరిశుభ్రంగా ఉండే ప్రదేశాల్లో నిల్వ ఉంచుకోవడమే మేలు. ఉల్లిగడ్డలను ఫ్రిజ్లో నిల్వ ఉంచుకోవడం వల్ల ఇతర పదార్థాల రుచి, వాసన మారిపోతుంది. పొడిగా, పరిశుభ్రంగా ఉండే చోట నిల్వ ఉంచుకోవడమే ఉత్తమం. రొట్టెలు రిఫ్రిజిరేటరులో పెడితే తొందరగా పాడైపోతాయి. బూజు పట్టే అవకాశం ఉంది. అందుకే రొట్టెలను డబ్బాలో కానీ, ప్రత్యేకంగా వీటి కోసం తయారు చేసిన సంచులలో కానీ పెట్టి ఫ్రిజ్లో దాచుకోవాలి. అరటిపండ్లు ఉష్ణ వాతావరణాన్ని తట్టుకునే శక్తితో ఉంటాయి. చల్లటి వాతావరణంలో అవి నిల్వ ఉండవు. ఇంకా పండని అరటి పండ్లను ఫ్రిజ్లో దాచుకుంటే చూడటానికి బాగానే కనిపించినా మెత్తగా, నల్లగా మారిపోతాయి. కాఫీ పొడి, గింజలకు పరిసరాల్లోని వాసనలను స్వీకరించే గుణం ఉంటుంది. అందుకే వాటిని ఫ్రిజ్లో ఉంచితే ఇతర పదార్థాల వాసనల్లోకి మారిపోతాయి. వాటిని బయట గాలి సోకని డబ్బాలో దాచుకోవడమే సరైనదని చెబుతున్నారు. సలాడ్లుగా ఉపయోగించుకునే చెర్రీలు, టమాటలు వంటి వాటిని చల్లగా, నాణ్యంగా ఉండాలని ఫ్రిజ్లో దాచుకుంటాం. నిపుణులు అది మంచిది కాదంటున్నారు. దీనివల్ల టమాటల లోపల పొరలు దెబ్బతిని, రుచి, సహజత్వం కోల్పోతాయని చెబుతున్నారు. ఫ్రిజ్లో ఉంటే వాటిలో నీటి శాతం పెరిగి రుచి కూడా తగ్గుతుంది. నీటితో ఉండే పుచ్చకాయలు, కర్బూజాలు వంటి వాటిని దాచుకునేందుకు వేసవిలో చల్లగా, రుచిగా ఉండేందుకు ఫ్రిజ్లో పెట్టుకుంటాం. కానీ ఆ పండ్లను కోయక ముందే ఫ్రిజ్లో పెట్టుకోవడం ఉత్తమం. కోసిన ముక్కలను ఫ్రిజ్లో దాచుకోవాల్సిన పరిస్థితి ఉంటే నేరుగా కాకుండా, తప్పనిసరిగా నాణ్యమైన కవర్లలో చుట్టి దాచుకోవాలి. బంగాళా దుంపలను ఫ్రిజ్లో పెట్టకూడదని గట్టిగా చెబుతున్నారు. ఆహార ప్రమాణాల సంస్థ నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగాళాదుంపలను ఫ్రిజ్లో దాచుకుని వాడితే వాటిలోని పిండి పదార్ధాలు ఉడికించినపుడు చక్కెరగా మారిపోతాయి. ఈ చక్కెరతో పాటు విడుదలయ్యే అమైనో ఆమ్లాలు, రసాయనాల వల్ల అత్యంత ప్రమాదకరం. సరైన జాగ్రత్తలతో... ఇప్పటి తరం ప్రజలు ఆధునికంగా ఉండాలని కోరుకుంటున్నారు. తీసుకునే ఆహారంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందని గ్రహించాలి. రిఫ్రిజిరేటర్లలో ఏ పదార్థాలు దాచుకోవాలో తెలియక అనారోగ్యాలను కొనితెచ్చుకుంటున్నారు. తీరిక లేని బాధ్యతలతో అనేక మంది ఎక్కువ సమయం నిల్వ ఉండాలనే ఉద్దేశంతో ఆహార వస్తువులు ఫ్రిజ్లో దాచుకుంటున్నారు. దీని వల్ల వాటి తాజాదనం, రుచి, నాణ్యత పాడైపోతాయి. రిఫ్రిజిరేటర్లలో పెడితే చెడిపోయే పదార్ధాలను సాద్యమైనంత వరకు నిల్వ ఉంచుకోవద్దు. శీతల పదార్ధాలు అనర్ధదాయకం శీతలం అన్ని సందర్భాల్లో ఉపయోగపడదు. ప్రధానంగా మానవ జీవితంలో ఇటీవల పెరిగిన శీతల పదార్ధాల వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అతి శీతల పదార్ధాలు ఆరగిస్తే æ జీర్ణవ్యవస్థ కుంటుపడుతుంది. అది అన్ని రోగాలకు, అనర్థాలకు మూలంగా తయారవుతుంది. ప్రత్యేకించి రిఫ్రిజిరేటర్లో వస్తువులన్నీ నిల్వ చేయకూడదు. అలా చేయడం ద్వారా వాటి స్వాభావిక లక్షణాన్ని కోల్పోయి తినేటపుడు సహజ రుచిని అందించలేవు. చల్లదనం ఎపుడూ హానికరమే. ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో మెటబాలిజం ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం. తాజాగా ఉన్న ఆహారం తీసుకోవడమే ఉత్తమం. – బి.నరేంద్ర, వైద్యులు, విజయనగరం చద్దన్నం ఆరోగ్యకరమన్నది పాతతరం వారి మాట. చద్ది ఆహారం అనారోగ్యం అన్నది నేటి తరం మాట. మారుతున్న కాలానికి, తరానికి అనుగుణంగా ఆహార అలవాట్లు, రుచులు మారుతున్నాయి. చద్ది అనే భావన రాకుండా రోజుల తరబడి రిఫ్రిజిరేటర్లలో ఆహారాన్ని నిల్వ చేస్తున్నారు. నిల్వ చేసుకునే కొన్ని ఆహార పదార్ధాలు అనర్థమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
వింటర్..డర్
వామ్మో చలి చంపేస్తోంది. వెచ్చగా దుప్పటి కప్పుకుని ఇంకో గంట కునుకు తీయాలనిపిస్తోంది.. ఇది జిల్లాలో ప్రస్తుత పరిస్థితి. పలు పట్టణాల్లో చలి పంజా విసురుతోంది. అడుగు బయట పెట్టాలంటేనే వణుకు పుడుతోంది. బారెడు పొద్దెక్కినా బెడ్ నుంచి కాలు కిందకు మోపాలంటే భయమేస్తోంది. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. చిన్నపాటి జాగ్రత్తలతో మన ఆరోగ్యం పదిలంగా కాపాడుకుందాం.. నెల్లూరు(బారకాసు): శీతాకాలంలో ఏర్పడే మంచుతెరలు కొందరితో కేరింతలు కొట్టిస్తే.. మరి కొందరికి వణుకు పుట్టిస్తాయి. సాయంత్రం వేళ వీచే చల్లటి గాలులు కొందరికి ఆహ్లాదంగా ఉండి హాయిని కలిగిస్తే.. మరికొందరికి గుండె దడ పుట్టిస్తాయి. సీజన్ మారగానే కొన్ని రకాల వ్యాధులు శరీరంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. చలికాలంలో తుమ్ములు, దగ్గు, ఆస్తమా, ఆయాసం, ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి. ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటే వృద్ధులు, పిల్లలు చలికి బయటకు రాలేక వణికిపోతారు. వచ్చినా వారికి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో వ్యాధులు ప్రబలే అవకాశం అధికం. చలికాలంలో వ్యాధులబారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం. హచ్..హచ్కి.. తూచ్ చెప్పేద్దాం.. శీతాకాలం కారణంగా రకరకాల వ్యాధులు విజృంభించే వీలుంది. ♦ ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస పీల్చుకోవడం క్లిష్టతరమవుతుంది. కొంత మందిలో ఆయాసం పెరుగుతుంది. శ్వాసకోస సంబంధిత కేసులు అధికంగా నమోదవుతున్నాయని వైద్యులు తెలిపారు. ♦ ఆస్తమా ఉన్నవారు చలిగాలుల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి నొప్పుల తీవ్రత అధికమవుతోంది. చలి తీవ్రతకు కాళ్లు ముడుచుకోవడం వల్ల మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ♦ ఆరు పదులు దాటినవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వారు ఉదయం వేళ నడకకు, వ్యాయామానికి దూరంగా ఉండాలి. ♦ చలి తీవ్రతకు కండరాలు బిగుసుకు పోయి రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. శ్వాసకోశ వ్యాధులతో పాటు జ్వరాలు వచ్చే వీలుంది. అంతేకాకుండా స్వైన్ఫ్లూ కూడా సోకే అవకాశం ఉంది. ♦ ధూమపానం చేసేవారిలో ఆయాసం లక్షణాలు కనిపిస్తాయి. ప్రతి ఆరుగురిలో ఇద్దరికి ఆస్తమా.. నగరంలో శ్వాసకోశ, ఆస్తమా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రులకు వస్తున్న పిల్లల్లో ప్రతి ఆరుగురిలో ఇద్దరు ఈ సమస్యతో సతమతమవుతున్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తగ్గడం, చలిగాలులతో పాటు పెరుగుతున్న వాతావరణ కాలుష్యం కారణంగా పెద్దలు, చిన్నారుల్లో శ్వాస సంబంధ వ్యాధులు ప్రబలుతున్నాయి. విపరీతమైన జనసాంద్రత, దోమల బెడద ఎక్కువగా ఉండటంతో మస్కిటో కాయిల్స్, లిక్విడ్స్ వాడటం వల్ల చలికాలంలో పిల్లలతో పాటు, పెద్ద వారిలో కూడా శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆస్తమా సోకిన చిన్నారులకు శ్వాస నాళాలు ముడుచుకుని వాటిలో కఫం చేరడం వలన శ్వాస తీసుకోవడం తీవ్ర ఇబ్బంది కరంగా మారుతోంది. దీంతో నిమోనియాకు దారితీయడంతో పాటు, ఒక్కో సమయంలో ప్రాణాంతకంగా మారుతోంది. గుండె జబ్బులు ఉన్న వారు చలికాలంలో బయటకు రాకూడదు. చలి అధికంగా ఉన్నప్పుడు హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. చిన్నారులకు చిక్కులు పసిపిల్లలకు చలిగాలుల కారణంగా మరిన్ని సమస్యలు వచ్చే వీలుంది. జలుబు, దగ్గు, వారిని వేధించడం పరిపాటి. కొంత మంది పిల్లల్లో నిమోనియా వచ్చే ప్రమాదం ఉంది. చర్మం కమిలిపోయి, బుగ్గలు, శరీరంపై కురుపులు వస్తాయి. చర్మం చిట్లిపోయి మంట, దురదలు ఇబ్బంది పెడతాయి. చర్మానికి శత్రువు.. చలి ♦ చలిగాలిలో తేమ బాగా తక్కువగా ఉంటుం ది. దాంతో చర్మం పొడిబారిపోతుంది. ♦ చర్మం చిట్లిపోయి పగులుతుంది. పెదవులు, ముఖం, అరికాళ్లు, పాదాలు, చేతులు పగిలిపోయి మంటపుడుతుంది. కొందరిలో రక్తం శ్రవిస్తుంది. మరికొందరిలో సోరియాస్ వ్యాధి తీవ్రతరమవుతుంది. చర్మం కమిలిపోయినట్లు ఉంటుంది. వృద్దుల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్లు అనేకం.. ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడంతో వ్యాధి కారక సూక్ష్మజీవులు శరవేగంగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్లు వేగంగా వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్లు అయిన స్వైన్ఫ్లూ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు అవసరం ♦ చలితీవ్రత అధికంగా ఉన్న సమయంలో, ముఖ్యంగా రాత్రి వేళ బయటకు రాకుండా ఉంటే ఎంతో మేలు. ♦ రాత్రిపూట విధి నిర్వహణకు వెళ్లేవారు శరీరమంతా కప్పుకునే విధంగా వస్త్రాలు ధరించాలి. ముఖానికి మాస్క్లు ధరించడం మంచిది. ♦ జలుబు, దగ్గు ఒకరి నుంచి మరొకరికి రాకుండా మాస్కులు ధరించాలి. ఉన్ని వస్త్రాలు చాలా ఉత్తమం. జలుబు, దగ్గు ఉన్న వారు చల్లని నీరు, ఐస్క్రీమ్ తీసుకోకూడదు. ♦ పిల్లలకు వేడి వేడి ఆహార పదార్థాలు ఇవ్వాలి. పిల్లలను ఉదయం పూట స్కూల్స్కి పంపే సమయంలో స్వెట్టర్లు వేయాలి. ముఖానికి మాస్క్లు వేసి పంపితే ఇంకా మంచింది. ♦ కాచి చల్లార్చిన నీటిని తాగించాలి. చల్లని నీరు అధికంగా తాగితే సైన్సైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. దీని ప్రభావం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముందు జాగ్రత్తలు తప్పనిసరి ఆస్తమాను సైతం చలికాలంలో ఎటువంటి దుష్ప్రభావం లేకుండా చూసుకోవచ్చు. అవగాహన కలిగి ఉండి మందు జాగ్రత్తలు తీసుకోవాలి. చలి అధికంగా ఉన్నప్పుడు ఆస్తమా తీవ్రత పెరిగితే నెబ్యులైజర్ చికిత్సతో పాటు, అవసరమైన సమయంలో ఇంజక్షన్లు ఇవ్వాలి. దీర్ఘకాలిక ఆస్తమాకు ఇన్హేలర్లు అత్యుత్తమం. ఇన్హేలర్లు ద్వారా ఇచ్చే మందులు డోసులు, నోటి ద్వారా, ఇంజక్షన్ల ద్వారా ఇచ్చే మందుల డోసుల కంటే చాలా తక్కువ. ప్రయోజనం ఎక్కువ.– డాక్టర్ సత్యప్రకాష్, అసిస్టెంట్ప్రొఫెసర్, పిడియాట్రిక్ విభాగం, జీజీహెచ్ -
చలిబారకుండా
ఎండ, వానల కన్నా చలికాలం చర్మం త్వరగా ముడతలు పడటం, నల్లబడటం చూస్తుంటాం. దీనికి కారణం చర్మం పొడిబారడమే. ఈ సమస్యకు విరుగుడుగా... స్నానానికి ముందు టీ స్పూన్ బాదం నూనె, అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసి, పాదాలకు మసాజ్ చేయాలి. అలాగే స్నానం చేసేముందు అర టీ స్పూన్ బాదం నూనె బకెట్ నీటిలో కలిపాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే చర్మం మృదుత్వాన్ని కోల్పోదు. అరటిపండు గుజ్జు, కప్పు పెరుగు, టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ ఓట్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడి చర్మానికి మంచి ప్యాక్ అవుతుంది. ముఖానికి, మేనికి పట్టించి పదిహేను నిమిషాలతర్వాత వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీంతో చర్మానికి జీవకళ వస్తుంది. చలికాలం నూనె శాతం ఉన్న మాయిశ్చరైజర్లు వాడాలి. ఆలివ్ ఆయిల్, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని చలికాలం మాయిశ్చరైజర్గా ఉపయోగించవచ్చు. చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. అలాగని చర్మాన్ని మరీ రబ్ చేయకూడదు. కార్న్ఫ్లేక్స్ని పొడి చేసి, అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్దన చేయాలి. మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది. టీ స్పూన్ శనగపిండిలో అర టీ స్పూన్ తేనె, పచ్చిపాలు, చిటికెడు గంధం పొడి కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటేæపొడిబారిన ముఖ చర్మం ముడతలు తగ్గుతాయి. -
తల్లి, కొడుకు అనుమానాస్పద మృతి
-
జూబ్లీహిల్స్లో విషాదం
సాక్షి, హైదరాబాద్: జూబ్లిహిల్స్లో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద పరిస్థితుల్లో తల్లి, కొడుకు మృతి చెందారు. చలి వేస్తుందని ఇంట్లో బొగ్గుల కుంపటి ఏర్పాటు చేసుకున్న తల్లీకుమారుడు ఇళ్లంతా పొగ నిండుకుని ఊపిరాడక మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలానికి చెందిన సత్యబాబు, అతని భార్య బుచ్చివేణి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25లోని ప్లాట్ నెంబర్ 306లో కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. పెథాయ్ తుపాను కారణంగా బాగా చలి గాలులు వీస్తుండటంతో వారు ఉండే గదిలో బుచ్చివేణి ఆమె కుమారుడు పద్మరాజు బొగ్గుల కుంపటి ఏర్పాటు పెట్టుకున్నారు. వేడిగా ఉండటానికి తలుపులు, కిటికీలు కూడా మూసేశారు. వారిద్దరూ నిద్రలోకి ఉపక్రమించిన తర్వాత ఇంట్లో పొగ కమ్ముకుని పడుకున్న చోటే మృతి చెందారు. బయటి నుంచి సత్యబాబు ఎంతసేపు తలుపుకొట్టినా తీయకపోవడంతో అనుమానంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా బుచ్చివేణి, పద్మరాజు నిర్జీవంగా పడివున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. యజమాని ఇంట్లో కుక్క కూడా బుధవారమే చనిపోయింది. ఈ విషయంపై ఏదైనా గొడవ జరిగి వారేమైనా ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో కూడా విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. బొగ్గుల కుంపటి కారణంగానే చనిపోయారా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనేది దర్యాప్తులో తేలుతుందని పోలీసులు స్పష్టం చేశారు. మృతుడు పద్మరాజు మృతురాలు బుచ్చివేణి -
ఈ చలేంట్రా బాబూ...
-
గజగజ
సాక్షి, సిటీబ్యూరో: పెథాయ్ తుపాను ప్రభావంతో గ్రేటర్ గజగజలాడుతోంది. సోమవారం రోజంతా చలితో సిటీజనులు వణికిపోయారు. పట్టపగలే ఆకాశంలో దట్టమైన మేఘాలు ఆవహించి కారుచీకట్లు కమ్ముకున్నాయి. కొన్నిచోట్ల తేలిక పాటి జల్లులు కురిశాయి. తేమతోకూడిన శీతలగాలులు అధికంగా వీయడంతో వృద్ధులు, చిన్నారులు, రోగులు విలవిల్లాడారు. మధ్యాహ్నం వేళలో సైతం శీతల గాలులు ఉక్కిరి బిక్కిరిచేశాయి. చలి తీవ్రత నుంచి శరీరాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ స్వెటర్లు, జర్కిన్లు, మంకీ క్యాపులు ధరించారు. చలి కారణంగా రహదారులు, పర్యాటక ప్రదేశాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు బోసిపోయి కన్పించాయి. సోమవారం నగరంలో 18 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు, గరిష్టంగా 27 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ..శీతల పవనాలవీస్తుండటం వల్ల చలితీవ్రత ఎక్కువగా నమోదైంది. రాగల 24 గంటల్లో నగరంలో వాతావరణంలో పెద్దగా మార్పులుండవని...అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్లోని వాతావరణ శాఖ తెలిపింది. రోగులూ తస్మాత్ జాగ్రత్త..! ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వృద్ధులు, హృద్రోగ, ఆస్తమా బాధితులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్త వహించినా అనారోగ్యం ముప్పు తప్పదు. చలితీవ్రతకు చర్మం పొడిబారి, కాళ్లు, చేతులు, ముఖంపై పగుళ్లు ఏర్పడుతున్నాయి. పెదాలు చిట్లిపోతున్నాయి. ముఖ్యంగా టూ వీలర్పై ప్రయాణించే వారు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఇక మార్కెట్లో రెడీమేడ్గా దొరికే ఉన్ని దుస్తులు, జర్కిన్లు, మంకీ క్యాపులు, మఫ్లర్లను జనం కొనుగోలు చేస్తున్నారు. ఒక్కసారిగా వీటికి డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు. పొంచిఉన్న ఫ్లూ ముప్పు.. ‘చలితీవ్రత వల్ల వాతావరణంలో స్వైన్ఫ్లూ మరిం త బలపడే ప్రమాదం ఉంది. ఇప్పటికే నగర వా తావరణంలో పదిహేను రకాల ఫ్లూ కారక వైరస్లు ఉన్న విషయం తెలిసిందే. తాజా పరిస్థితుల్లో ఇవి మరింత విజృంభించే ప్రమాదం ఉంది. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు ఎక్కువగా దీని బారినపడే అవకాశం ఉంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఇలా ఒకరి నుంచి మరోకరికి గాలిద్వారా వ్యాపిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వీరు సాధ్యమైనంత వరకు జన సమూహాంలోకి వెళ్లక పోవడమే ఉత్తమం’ అని జిల్లా స్వైన్ఫ్లూ విభాగం ఇన్చార్జి డాక్టర్ శ్రీహర్ష పేర్కొనారు. దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కన్పిస్తే..ఫ్లూగా భావించి చికిత్స కోసం వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సూర్యోదయం తర్వాత వాకింగ్ వెళ్లడమే మంచిది... ‘చలికాలంలో శరీరంలో ‘కార్టిసో’ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది రక్తనాళాల సైజును తగ్గించి, బ్లడ్క్లాట్కు కారణం అవుతుంది. వేసవి, వర్షాకాలంతో పోలిస్తే చలికాలంలో గుండె నొప్పికి అవకాశం ఎక్కువ. హృద్రోగ బాధితులు చలిలో తిరగకపోవడం మంచిది. వీరు సూర్యోదయం తర్వాతే వాకింగ్ చేయాలి. ఛాతి లో ఏ చిన్న నొప్పి ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి’ అని నిమ్స్కు చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ ఆర్వీకుమార్ సూచించారు. అంతేకాదు ‘చలితీవ్రత వల్ల ఆస్తమా బాధితుల్లో సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. వీరు ముక్కుకు మాస్క్లు ధరించాలి. రాత్రిపూట ఏసీ ఆఫ్ చేసి, తక్కువ స్పీడ్లో తిరిగే ఫ్యాను కిందే గడపాలి. సాధ్యమైనంత వరకు సిమెంటు, సున్నం, బొగ్గు, ఇతర రసాయన పదార్థాలకు దూరంగా ఉండటంతో పాటు మంచు కురిసే సమయంలో ఆరుబయట తిరగడం, వ్యాయామం చేయడం వంటివి చేయకూడదు. తాత్కాలిక ఉపశమనం కోసం ఉదయం ‘నాడిశోధన’ ప్రాక్టీస్ చేయాలి. ఊపిరి తీసుకోవడం మరీ కష్టంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంది’ అని కేర్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ రఫీ స్పష్టం చేశారు. -
పగటి పూట గజగజ
సాక్షి, హైదరాబాద్: పెథాయ్ తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై పడింది. రెండ్రోజులుగా రాష్ట్ర వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఏడు డిగ్రీల వరకు పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. తుపాన్ కారణంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. చలిగాలుల తీవ్రతకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 24 గంటల్లో హన్మకొండలో సాధారణం కంటే ఏడు డిగ్రీలు తక్కువగా 23 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలంలో ఆరు డిగ్రీలు తక్కువగా 24 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, నిజామాబాద్, రామగుండంలలో సాధారణం కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా 25–26 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలోనైతే పగటిపూట స్వెట్టర్లు, జర్కిన్లు లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. పలుచోట్ల భారీ వర్షాలు.. పెథాయ్ తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అశ్వారావుపేట, సత్తుపల్లిలలో 9 సెంటీమీటర్ల చొప్పున భారీ వర్షం కురిసింది. ముల్కలపల్లి, చంద్రుగొండ, ఏన్కూరులలో 8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డు అయింది. కొత్తగూడెం, జూలూరుపాడు, మణుగూరు, పాల్వంచ, బూర్గుంపాడులలో 7 సెంటీమీటర్ల చొప్పున.. తల్లాడ, టేకులపల్లి, భద్రాచలంలలో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. -
వేకువ పువ్వు
అది డిసెంబర్లో ఒక సాయంత్రం. ఒక చెట్టు కింద చినిగిన దుస్తులు కట్టుకుని ఉన్న ఒక అవ్వ చేతిలో సత్తుగిన్నెతో నిలుచుని ఉంది. ఎన్ని అనుభవాలో.. ఆ అవ్వ ముఖం మీద ముడతలై పరుచుకుని ఉన్నాయి. చలికాలం కావటం వల్ల అందరూ ఒంటినిండా వెచ్చటి చలికోట్లు. చేతుల్లో పెద్ద పెద్ద సంచుల్లో ప్లాస్టిక్ నక్షత్రాలు, చెట్లు, అలంకరణ సామగ్రితో నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతున్నారు. తన ముందు నుంచి వెళ్తున్న అందరి వంక ఆ అవ్వ తన సత్తుగిన్నెను చాపి ఆశగా చూస్తోంది. కొందరు ఆ చెట్టు కిందే ఆగి తాము చేసిన క్రిస్మస్ షాపింగ్ గురించి, క్రీస్తు పుట్టుక గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప ఆమె వంక కూడా చూడటం లేదు. అయితే అవ్వ మాత్రం వారి మాటలు ఆసక్తిగా వింటున్నట్టుగా చెవులు రిక్కిస్తోంది. ఇంతలో ఒక పెద్ద కారు అవ్వ ముందు ఆగింది. ఆమె కళ్ళలో ఆనందం! ఇక ఆ అవ్వ గిన్నెధనంతో నిండి పోతుంది అని.. చిన్న సంతోషం. కారు వెళ్లిపోయింది. ఆ అవ్వ గిన్నెలో ఒక్క పది రూపాయల నోటు కనిపించింది.. కారు పెద్దదే కానీ అందులో ఉన్నవారి హృదయాలు చిన్నవే అనుకుంటా! ఆ అవ్వ ఆ గిన్నెలో ఉన్న డబ్బులు లెక్క పెట్టుకుంటుంటే అవ్వకి సాయం చేయాలని నేను అటువైపు కదిలాను. ఇంతలో ఎక్కడ నుండి వచ్చిందో నక్షత్రం తెగిపడినట్టు ఉన్నపాటుగా వేకువపువ్వు పరిమళించినట్టుగా ఒక చిన్న పాప ఆ అవ్వ సత్తు గిన్నెలో వందరూపాయల కాగితం వేసి తన వంటిమీద ఉన్న శాలువాను అవ్వ మీద కప్పి అవ్వని ముద్దు పెట్టుకొని వెళ్లిపోయింది. అదంతా చూస్తున్న నాకు క్రీస్తు పుట్టింది ఆ పాప హృదయంలోనేనేమో అనిపించింది. కాసేపయ్యాక ఆ అవ్వ తన సత్తుగిన్నెలో ఉన్న పైసలు లెక్కపెట్టుకొని ఎదురుగా అడుక్కుంటున్న ఒక అంధుడి గిన్నెలో కొంత వేసింది. మెల్లిగా వెళ్లి ఆ అవ్వని అడిగాను – అవ్వా! నీకు వచ్చిందే తక్కువ కదా, మళ్ళీ అందులోనే అతనికి దానం చేసావేంటి అని. అప్పుడు ఆ అవ్వ నావైపు చూసి – అయ్యా! నేను మొత్తం ఇవ్వలేదు. నాకు కలిగిన దానిలో కొంత ఇచ్చాను. ఇవ్వమని నా ప్రభువు చెప్పాడు! అని అంది. అప్పుడు అర్థమైంది నాకు ఆ అవ్వ ఎంత ధనవంతురాలో..! – బెల్లంకొండ రవికాంత్ -
అమ్మో చలి!
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్పై చలి పంజా విసురుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఈ నెలారంభంలో 17 నుంచి 18 డిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి. వాతావరణంలో అల్పపీడన ప్రభావంతో ఈ నెల 10వ తేదీ నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చిరుజల్లులు కురియడంతో పాటు వాతావరణంలో మార్పులతో రెండు రోజులుగా విపరీతమైన చలి ప్రజలను వణికిస్తోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోవడంతో ప్రజలు భయపడుతున్నారు. గ్రేటర్ పరిధిలో కనిష్ఠంగా 15 డిగ్రీలు ఉండగా శనివారం రాత్రి ఈ ప్రభావం మరింత పెరిగింది. ఉదయం, రాత్రి వేళల్లో చలి గాలులు పెరుగుతుండడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల వరకు తీవ్రత తగ్గకపోవడంతో పాటు సాయంత్రం 5 గంటల నుంచే చలి ప్రభావం మొదలవుతోంది. దీంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పగటివేళల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతల తీరు కూడా తగ్గుతుండడం గమనార్హం. నగర వ్యాప్తంగా ఇదే పరిస్థితి గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరుగుతుండడంతో భాగ్యనగర ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వేకువజాము నుంచి ఉదయం 9 గంటల దాకా మంచు దుప్పటి కమ్మేయడంతో రింగ్రోడ్ సహా ఇతర మార్గాల్లో వెళ్లే వాహనాలు వేగం బాగా తగ్గిపోయింది. -
వణుకుతున్న ఇందూరు
ఇందూరు (నిజామాబాద్ అర్బన్): చలి పులి పంజా విసురుతోంది. ఐదు రోజులుగా జిల్లాలో మారుతున్న వాతావరణంతో అక్కడక్కడా వర్షాలు కురుస్తుండగా, చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. మంచు వాతావరణం ఏర్పడి రోజంతా చలి గాలులు వీస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా చలి గాలుల తీవ్రత పెరిగి జిల్లా వాసులను ఇబ్బందులు పెడుతున్నాయి. దీంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు కొలిచిన ఉష్ణోగ్రతను చూస్తే 17.5 డిగ్రీలు నమోదైంది. ఒక్క రోజు వ్యత్యాసంలోనే ఏకంగా ఒకటిన్నర డిగ్రీలు పడిపోయింది. ముఖ్యంగా పెరుగుతున్న చలి తీవ్రతకు చిన్న పిల్లలు, వృద్ధులు అనారోగ్యం భారిన పడుతున్నారు. పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరాలకు గురికావడంతో ఆస్పత్రులకు తాకిడి పెరిగింది. స్వెట్టర్లు వినియోగించినా అవి చలి నుంచి స్వల్వంగానే రక్షిస్తున్నాయి. రాత్రుల్లో నిద్రపోయే సమయంలో దుప్పట్లు ఒకటికి రెండు వినియోగించాల్సి పరిస్థితి ఏర్పడింది. ఫ్యాన్లకు ఏ మాత్రం పని చెప్పడం లేదు. ఇటు పనులపై, ఉద్యోగ రీత్యా ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు ముఖాలకు మాస్క్లు, చేతులకు గ్లౌజ్లు ధరించి అన్ని జాగ్రత చర్యలు తీసుకుంటున్నారు. స్కూల్కు వెళ్లే చిన్న పిల్లలు ఇబ్బందులు పడుతూ వెళ్తున్నారు. -
మేలైన కాంతి
చలికాలంలో చర్మం పొడిబారి, కళ తప్పి కనిపిస్తుంది. మృతకణాలు పెరుగుతాయి కాబట్టి వీటిని సరిగా శుభ్రం చేయకపోతే రంగు కాస్త తగ్గినట్టు కనిపిస్తారు. ఈ సమస్యకు పరిష్కారంగా..ఉదయం స్నానం చేయడానికి ముందు కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె మేనికి రాసుకోవాలి. మృదువుగా మర్దనా చేసి అరగంటసేపు ఆగాలి. తర్వాత మరీ వేడిగా అలాగని చల్లగా కాకుండా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. స్నానానికి సబ్బు ఉపయోగించేవారు క్రీమీగా ఉండేవాటిని చలికాలానికి ప్రత్యేకం అనేవాటిని ఎంచుకోవాలి. లేదంటే సొంతంగా తయారుచేసుకున్న సున్నిపిండిని వాడాలి.బాదంపప్పుల నూనె, అవిసెగింజల నూనె వంటివి మేనిపైకే కాదు లోపల కూడా కావాలి. అందుకని శరీరానికి మేలు చేసే బాదంపప్పులు, అవిసెగింజలు.. రోజూ కొన్ని తినాలి.ఈ కాలం ఉసిరికాయలు లభిస్తాయి. వీటిలో విటమిన్–సి సమృద్ధిగా లభిస్తుంది. ఏదో విధంగా రోజూ ఒక ఉసిరికాయ అయినా తినాలి. పొడిరూపంలోనూ ఉసిరిని తయారుచేసి, నిల్వచేసుకొని, కషాయం చేసుకొని సేవించవచ్చు. దీనివల్ల చర్మంలోపలి మలినాలు కూడా శుద్ధమవుతాయి.పెదవులపై చర్మం పొడిబారడం, పగుళ్లు బారి నలుపుగా అవడం వంటివి ఈ కాలంలో సహజంగా జరుగుతుంటాయి. రాత్రి పడుకునేముందు నెయ్యిని పెదవులపై రాసి, మృదువుగా మర్దన చేయాలి. పగలు కూడా రెండుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పొడిబారం సమస్య రాదు.చలికి చాలా మంది మంచినీళ్లు తాగడం బాగా తగ్గిస్తారు. దీని వల్ల కూడా చర్మం పొడిబారడం, ముడతలు పడటం జరుగుతుంటుంది. రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగేలా శ్రద్ధ పెట్టాలి. ఈ జాగ్రత్తలు చర్మకాంతినే కాదు ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తాయి. -
చలిలో వాన
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో వందేళ్ల విరామం తరువాత డిసెంబరు నెలలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. బేగంపేట్లోని వాతావరణ శాఖ రికార్డుల ప్రకారం 1918 డిసెంబరు ఒకటిన నగరంలో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రికార్డును అధిగమించి 2018 డిసెంబరు డిసెంబరు 13 అర్ధరాత్రి నుంచి డిసెంబరు 14(శుక్రవారం)ఉదయం 8.30 గంటల వరకు నగరంలో సరాసరిన 4.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదవడం విశేషం. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం కారణంగా గ్రేటర్పరిధిలోనూ ఆకాశం మేఘావృతమై పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. అత్యధికంగా బొల్లారంలో 7.7, పాశమైలారంలో 6.5, మల్కాజ్గిరిలో 6.4, కుత్బుల్లాపూర్లో 5.6, శ్రీనగర్కాలనీలో 5.3, బీహెచ్ఈఎల్లో 4.9, బాలానగర్లో 4.8, బేగంపేట్లో 4.8 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. సరాసరిన గ్రేటర్ పరిధిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం గమనార్హం. రాగల 24 గంటల్లో ఉపరితల ద్రోణి ప్రభావంతో నగరంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు బేగంపేట్లోని వాతావరణ శాఖ తెలిపింది. కాగా గత పదేళ్లలోనూ ఈస్థాయిలో వర్షపాతం నమోదుకాకపోవడం గమనార్హం. ఇక 2010 డిసెంబరు 8న 1.5 సెంటీమీటర్లు, 2009 డిసెంబరు 27న కేవలం 4.4 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అత్యధికంగా 1918 డిసెంబరు ఒకటిన రికార్డు స్థాయిలో నగరంలో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం ఇప్పటివరకు ఉన్న రికార్డు. చలిగాలులతో ఉక్కిరిబిక్కిరి.. వాయుగుండం, ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆకాశం దట్టమైన మేఘాలతో ఆవహించి నగరంలో పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. చలిగాలులతోపాటు గాలిలో తేమశాతం ఏకంగా 96 శాతానికి చేరడంతో వృద్ధులు, చిన్నారులు, రోగులు ఇబ్బందిపడ్డారు. రాగల 24 గంటల్లో వాతావరణంలో స్వల్ప మార్పులుంటాయని బేగంపేట్లోని వాతావరణ శాఖ తెలిపింది. -
హీరో స్వెటర్.. బెటర్!
సాక్షి, సిటీబ్యూరో: ఆలస్యంగా వచ్చిన చలిపులి సిటీజనుల్నివణికిస్తోంది. శీతల గాలులు మేనిని తాకడంతో వెచ్చదనం ఇచ్చే దుస్తుల కోసం పరుగులు పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. చలినితట్టుకోవడానికి ప్రస్తుతం మార్కెట్లో ఎన్నోవైవిధ్యభరితమైన నూలు దుస్తులు లభ్యమవుతున్నాయి. స్వెటర్లతో పాటు టోపీలు, మఫ్లర్లు, చేతి గ్లౌజ్లు తదితర వస్త్రాలు కొలువుదీరాయి. ఇదంతా మామూలు విషయమే.. కానీ ప్రస్తుతం స్వెటర్ ధరించే యువతలో మార్పు కనిపిస్తోంది. సినీ హీరో, హీరోయిన్లు ధరించిన స్వెటర్ మోడళ్లపై మోజు పెంచుకొంటున్నారు. అలాంటి బ్రాండ్లేకావాలని దుకాణా యజమానులనుఅడుగుతుండటం యువత నయా అభిరుచికి అద్దం పడుతోంది. చలిని తట్టుకోవడంతో పాటు హుందాగా కనిపించేందుకు విభిన్న రకాల స్టైల్స్లో స్వెటర్లు లభ్యమవుతున్నాయని మదీనా సర్కిల్లోని మహ్మద్ క్యాప్ మార్ట్ నిర్వాహకుడు మహ్మద్ ఇల్యాస్ బుఖారీ తెలిపారు. దిలీప్కుమార్, ఏఎన్ఆర్, ఎన్టీఆర్, చిరంజీవి తదితర సినీ హీరోలు పలు సినిమాల్లో ధరించిన స్టైలిష్ స్వెటర్లపై ఆ రోజుల్లో ప్రజలు ఎక్కువగా మక్కువ చూపేవారు. వాస్తవానికి స్వెటర్ల వాడకం సినీ నటుల అనుసరణ నుంచే ప్రారంభంమైందని చెప్పవచ్చు. ప్రస్తుత సినీ హీరోలు రాంచరణ్ తేజ్, నానీ, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, దేవరకొండ విజయ్, సుమంత్లు ధరించిన స్టైలిష్ స్వెటర్లు సైతం తమ పాపులో అందుబాటులో ఉన్నాయని ఇల్యాస్ బుఖారీ పేర్కొన్నారు. కొందరు యువతీ యువకులు ఫలానా హీరో, హీరోయిన్ ఫలానా సినిమాల్లో ధరించిన స్వెటర్ తయారు చేసి ఇవ్వండని ఆర్డర్లు ఇస్తున్నారని ఆయన తెలిపారు. గతంలో స్వెటర్లు కేవలం చలి నుంచి తట్టుకోవడానికి ధరించే వారు. ప్రస్తుతం చలి నుంచి తట్టుకొవడంతో పాటు స్టైలిష్గా కనిపించేందుకు ధరిస్తున్నారని అన్నారు. యువత అభిరుచికి అనుగుణంగా విదేశాల నుంచి స్వెటర్లను దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు. స్టైలిష్ వింటర్ వేర్కు డిమాండ్ గతంలో నూలుతో తయారైన మందమైన స్వెటర్లను కస్టమర్లు ఎక్కువగా ఇష్టవాడేవారు. ప్రస్తుతం తేలికపాటి, క్యాష్ మిలన్ దారంతో తయారైన వింటర్ వేర్కు ప్రాధాన్యమిస్తున్నారు. తేలికగా ఉండి చలిని తట్టుకునే స్వెటర్లు, హ్యాండ్ గ్లౌజ్తో పాటు సాక్స్లను ఎక్కువగా వాడుతున్నారు. యువతరం హీరో, హీరోయిన్లు ధరించిన స్టైలిష్ వింటర్ వేర్ మోడళ్లపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. – మహ్మద్ ఇల్యాస్ బుఖారీ, క్యాప్ మార్ట్ నిర్వాహకుడు -
అలొవెరా.. టీ బ్యాగ్..
చలికాలం పెదవులు పొడిబారడం సహజంగా జరుగుతుంటుంది. ఈ సమస్యకు విరుగుడుగా.. కొబ్బరినూనె, తేనె కలిపి పెదవులపై రాసి, మసాజ్ చేయాలి. రోజులో 4 –5 సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పెదవులు పొడిబారడం, పగుళ్ల సమస్యలు తగ్గి, మృదువుగా అవుతాయి. అలొవెరా జెల్ చర్మం పగుళ్లను నివారిస్తుంది. రాత్రి పడుకునే ముందు పొడిబారిన పెదవులకు అలొవెరా జెల్ని రాయాలి. లేదా రోజ్వాటర్లో గ్లిజరిన్ కలిపి, పడుకునేముందు పెదవులకు రాసుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే పెదవుల చర్మం మృదువుగా అవుతుంది. గోరువెచ్చని నీటిలో టీ బ్యాగ్ ముంచి, పిండి, ఆ బ్యాగ్ను పెదవులపై మూడు, నాలుగు నిమిషాల సేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల పెదవుల చర్మంపై తేమ స్థాయి పెరుగుతుంది. దీనివల్ల పెదవులు పొడిబారకుండా ఉంటాయి. ఈ కాలం మృతకణాల సంఖ్య అధికంగానే ఉంటుంది. స్నానం చేసిన తర్వాత పొడి టవల్ని పెదవులపై ఒత్తిపెట్టి, మృదువుగా రుద్దాలి. దీనివల్ల మృతకణాలు సులువుగా తొలగిపోతాయి. తర్వాత లిప్ బామ్ రాసుకోవాలి. -
పొడిబారిన చర్మానికి...
చలికాలం చర్మం పొడిబారుతుంది. సరైన పోషణ లేకపోతే చర్మంపైన తెల్లని పొట్టులా ఏర్పడుతుంటుంది. ఈ సమస్య దరిచేరకుండా ఉండాలంటే... ∙అరకప్పు గులాబీ రేకలను పేస్ట్ చేసి అందులో టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు కలపాలి. ఈ పేస్ట్ను గోరువెచ్చని నీటిలో కలిపి స్నానం చేయాలి. గులాబీల సుగంధం ఒత్తిడి నుంచి త్వరగా ఉపశమనం పొందేలా చేస్తుంది. కొబ్బరిపాలు చర్మానికి మంచి మాయిశ్చరైజర్ని ఇస్తాయి. చలికాలం ఉన్నన్ని రోజులు రోజూ ఇలా చేస్తూ ఉంటే చర్మ మృదువుగా, కాంతిమంతంగా ఉంటుంది. ∙రెండు టీ స్పూన్ల కోకా బటర్ను కరిగించి అందులో టీ స్పూన్ విటమిన్–ఇ ఆయిల్, టీ స్పూన్ నువ్వుల నూనె కలిపి వేడి చేయాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేళ్లతో అద్దుకొని శరీరానికి మసాజ్ చేసుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. చర్మం మృదువుగా మారుతుంది. ∙టేబుల్ స్పూన్ తేనెలో, టీ స్పూన్ మీగడ కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి, మెడకు, భుజాలకు రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడి చర్మం గలవారికి ఇది మేలైన ప్యాక్. ముఖ్యంగా చలికాలంలో. ∙మూడు బాదంపప్పులను రాత్రిపూట నీళ్లలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పై పొట్టు తీసి, మెత్తగా రుబ్బి, అందులో టేబుల్ స్పూన్ పచ్చి పాలు, ఆలివ్ ఆయిల్ కొద్దిగా కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతో పాటు చేతులు, పాదాలకు కూడా రాసుకొని పదిహేను నిమిషాలు వదిలేయాలి. తర్వాత సున్నిపిండితో శుభ్రపరుచుకోవాలి. పొడిబారి నిస్తేజంగా ఉన్న చర్మం మృదువుగా, కాంతివంతం అవుతుంది. ∙ఉడికించిన ఒట్స్, తేనె బాగా కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ప్యాక్ వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది పొడి చర్మం గలవారికి మేలైన ప్యాక్. -
కీళ్లకు జ్వరం
చలికాలం జ్వరాల కాలం. చలికాలం కీళ్లనొప్పుల కాలం కూడా. జ్వరాలను, కీళ్లనొప్పులను విడివిడిగా ఎదుర్కొనడం ఒక పద్ధతి. కాని జ్వరం వల్ల కీళ్లనొప్పులు వస్తే? జ్వరం తర్వాత కూడా కీళ్లనొప్పులు వస్తే? ఈ సీజన్లో ఈ సమాచారం తెలుసుకొని ఉండాలి. జ్వరంతో వచ్చే కీళ్లనొప్పులకు పరిష్కారం తెలుసుకొని ఉండాలి. అందుకే ఈ కథనం. కాలం మారింది. దాంతో వాతావరణం మారిపోయింది. బయటి ఉష్ణోగ్రతలకు తగినట్లు ఒళ్లు తనను తాను మార్చుకోవడంలో ఒడిదొడుకులకు లోనవుతుంది. వైరస్లు ఈ సీజన్కి ‘జ్వరాల సీజన్’ అని పేరు పెట్టిస్తాయి. ఒంటికి టెంపరేచర్ తగ్గాక ధర్మామీటర్కి అందని కీళ్లజ్వరం మొదలవుతుంటుంది. జ్వరం తర్వాత... జ్వరం మనిషిని నేరుగా పీల్చివేయడం కంటే ఆ తర్వాత పీడించడమే ఎక్కువగా ఉంటుంది. ఒక రోజు జ్వరాన పడితే పూర్తిగా కోలుకోవడానికి ఓ వారం పడుతుంది. నాలుగు రోజులు జ్వరంతో మంచం పడితే కోలుకోవడానికి నెల రోజులు పడుతుంది. అలాంటి జ్వరానికి అనుబంధంగా వచ్చి పడేదే కీళ్ల జ్వరం. జ్వరం తగ్గిన తర్వాత హుషారుగా లేచి తిరుగుదామంటే ఒళ్లు సహకరించదు. కీళ్లు ఒక పట్టాన కదలవు. అప్పటి వరకు దేహంలో ఉన్న జాయింట్స్ గురించి మనకు పెద్దగా పట్టింపు ఉండదు. జాయింట్ మెకానిజం ఒకటి ఉంటుందని అవి కదలడం మానేసినప్పుడు గుర్తుకు వస్తుంది. కీళ్ల నొప్పి అని సింపుల్గా చెప్పుకునే ఈ సమస్యకు కారణాలు రకరకాలుగా ఉంటాయి. అలాగే కీళ్ల నొప్పులు కూడా ఒక రకం కాదు, అనేక రకాలుగా ఉంటాయి. కీళ్ల సమస్యకు దారి తీసిన కారణాన్ని బట్టి, కీళ్ల సమస్యల లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. వైరల్ ఆర్థరైటిస్ నార్మల్ ఫీవర్ నుంచి కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కానీ కోలుకుంటున్నప్పుడు కీళ్ల నొప్పులు విడవకుండా పీడించవచ్చు. ఈ లక్షణానికి కారణం ‘వైరల్ ఆర్థరైటిస్’ లేదా వైరస్ ద్వారా వచ్చిన ‘కీళ్లవాతం’. రోగకారక వైరస్ సోకడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయి. సాధారణ పరిభాషలో చెప్పాలంటే కొన్ని వైరస్లు సోకడం వల్ల సంక్రమించే వ్యాధి ఇది. దీని వల్ల కీళ్లలో వాపు వస్తుంది. వైరల్ జ్వరం తగ్గిన తర్వాత కీళ్లనొప్పి రావడం సర్వసాధారణంగా తలెత్తే చికిత్స సంబంధ సమస్య. వైరస్ ద్వారా సంక్రమించిన కీళ్లనొప్పుల్లో చాలా వరకు వాటంతట అవే తగ్గిపోతుంటాయి. కొన్నింటికి వైరస్ నిరోధక చికిత్స చేయవలసి ఉంటుంది. సాధారణంగా వచ్చే కీళ్ల వాపు, వైరస్ ద్వారా సంక్రమించే కీళ్ల వాపు మధ్య తేడాలను నిర్ధారించడం కొంచెం కష్టమే. వైరస్ప్రేరేపిత కీళ్ల వాపు సంభవించడం, వ్యాప్తి చెందడాన్ని గురించి నిర్దుష్ట సమాచారం అందుబాటులో లేదు. ప్రపంచవ్యాప్తంగా ఒక లక్ష మందిలో 0.6 నుంచి 27 మందికి ఈ వ్యాధి సోకుతున్నట్లు అంచనా. అయితే వార్ధక్యంలో ఉన్న వారిలో ఈ శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అరవై దాటిన వారిలో చూస్తే ప్రతి లక్షమందిలో 30 నుంచి 40 మందికి వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా జ్వరం అనంతరం బయటకు కనిపిస్తున్నప్పటికీ ఈ వ్యాధి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది. వైరల్ ఆర్థరైటిస్కు కారణమవుతున్న వైరస్ల జాబితా ఇలా ఉంది. అవి... ∙జఠర సంబంధ వైరస్ ∙డెంగ్యూ వైరస్, ∙హెపటైటిస్ ఎ,బి,సి, ∙హెచ్ఐవి, ∙పాలిచ్చే పశువుల నుంచి సంక్రమించే బి19 వైరస్ ∙గవద బిళ్లలు, రుబెల్లా వైరస్, ఆల్ఫా వైరస్, ∙జీవకణాల ద్వారా సంక్రమించే వైరస్, ∙సువాసనల నుంచి వచ్చే వైరస్ ∙రెట్రో వైరస్లు. వ్యాధి నిరోధానికి రుబెల్లా వ్యాక్సిన్ టీకాలు వేసినప్పుడు కూడా వైరల్ ఆర్థరైటిస్ రావచ్చు. ఇది పిల్లల్లో సర్వసాధారణం. అప్పుడు కూడా పిల్లలు కీళ్ల నొప్పులతో బాధపడతారు. అయితే చాలా మందికి వ్యాక్సిన్ల రూపంలో వైరస్ సోకినప్పటికీ, కొద్దిమందికి మాత్రమే వైరస్ సంబంధ కీళ్ల వాతం వస్తుంది. మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ విషక్రిమి సంబంధ కీళ్లవాతం వచ్చిన రోగులు బహుళ కీళ్ల నొప్పుల (మల్టిపుల్ జాయింట్ పెయిన్స్)తో బాధపడుతుంటారు. కేవలం కీళ్ల నొప్పులు లేక కీళ్ల వాపు, కీళ్ల దగ్గర చర్మం ఎరుపెక్కడం, వాతం వల్ల వచ్చిన కీళ్లనొప్పిని పోలి ఉంటుంది. కీళ్ల నొప్పులు ఉన్నట్లుండి రావడమే కాక దద్దుర్లు కూడా వస్తాయి. జ్వరం, చలిపెట్టడం, దద్దుర్ల వంటి ఇతర లక్షణాలు కనిపిస్తాయి. అయితే చాలా కేసుల్లో వైరల్ ఆర్థరైటిస్గా రోగ నిర్ధారణ చేయడం కష్టమవుతుంటుంది. వైరల్ ఆర్థరైటిస్ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి... అని ఇదమిత్ధంగా చెప్పడానికి ఒక్క నమూనా కూడా లేకపోవడం ఇందుకు కారణం. ∙ఈ రోగానికి సంబంధించిన సంకేతాలు, లక్షణాలు ప్రత్యేకంగా ఏమీలేవు (ఉదాహరణకు జ్వరం, కీళ్లనొప్పులు, దద్దుర్లు). ఎందుకంటే ఇవన్నీ ఇతర వ్యాధులతో కూడా కనిపిస్తాయి. ∙ఒక్కొక్కసారి ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు సోకడానికి ముందు సూచనగా కీళ్ల నొప్పులు రావచ్చు (ఉదాహరణకు హెపటైటిస్ బి వైరస్, పచ్చకామెర్లు రావడానికి ముందు) ∙వైరల్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన రుజువులను తరచుగా కనిపెట్టడం కష్టం. వైరల్ ఇన్ఫెక్షన్ అనంతర ఆర్థరైటిస్ చికిత్సజ్వరం లేదా వైరస్ జ్వరం నుంచి కోలుకుని కీళ్లనొప్పులతో బాధపడుతున్న వారికి అవుట్ పేషెంట్గా చికిత్స చేయవచ్చు. హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఉండదు. ఈ సమస్య వల్ల శాశ్వత అంగవైకల్యం వస్తుందని రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజులు గడుస్తున్న కొద్దీ నొప్పి తగ్గుముఖం పడుతుంది.వైరల్ ఆర్థరైటిస్ను తగ్గించే కొన్ని మందులు పారాసిటమాల్: ఇది మంచి బాధ నివారిణి. దీనిని సరైన మోతాదులో క్రమం తప్పకుండా వేయాల్సి ఉంటుంది. నిద్రకు ఉపయోగపడే మందులు : ట్రమాడాల్ మంచి ఎంపిక. 30–100 మిల్లీగ్రాముల మోతాదులో ఆరు గంటలకొకసారి వాడాలి. ఎసిటిల్ సాలిసైక్లిక్ యాసిడ్: మందులు వాడడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు తీవ్రమయ్యే అవకాశం ఉంది. అందువల్ల వాటి తీవ్రత తగ్గిన తరవాత మాత్రమే వాడాలి.మూర్ఛ నిరోధక మందుల, ఉత్సాహ పరిచే మందులు,కార్టికో స్టెరాయిడ్స్: కొద్దిపాటి నొప్పి నుంచి తీవ్రమైన నొప్పి ఉన్న ప్పుడు కూడా వాడవచ్చు. దీనికి ప్రెడ్నిసోన్ మాత్రలను సూచించడం జరుగుతుంది. ఈ మందుల వాడకం వల్ల తగిన గుణం కనిపిస్తున్నట్లయితే మధుమేహం, హైపర్ టెన్షన్, గతంలో ఎముకలు విరిగిన దాఖలాలు, మానసిక స్థితి ఉన్నట్లుంది మారిపోవడం, స్థూలకాయం, హృద్రోగం ఉన్నవారికి ఈ మందులను ఇవ్వరాదు. దీర్ఘకాలిక కీళ్ల నొప్పులు ఉన్న రోగులకు హైడ్రో క్లోరోక్వైన్, సల్ఫాసాలాజైన్, మెథోట్రెక్సేట్ కూడా వాడవచ్చు.కీళ్లనొప్పులతో బాధపడే వారికి మూడు దశల్లో భౌతిక చికిత్స చేయించవచ్చు. అయితే వ్యాధి తీవ్రత ముదరక ముందు, విడవకుండా పీడిస్తున్నప్పుడే భౌతిక చికిత్సకు ప్రాధాన్యమివ్వాలి. లేకపోతే ఎలాంటి ప్రత్యేక వైరస్ నిరోధక చికిత్స చేయాల్సిన అవసరం లేదు. డెంగ్యూ వ్యాధి ఉన్న రోగుల్లో ఆస్పిరిన్ వంటి కొన్ని ఇతర మందులు వాడరాదు. డెంగ్యూ తీవ్రత సంకేతాలు లేనప్పుడు మాత్రం వాటిని వాడవచ్చు.సెప్టిక్ ఆర్థరైటిస్ వచ్చే సూచనలున్నప్పుడు మినహా మిగిలిన సందర్భాల్లో సర్జికల్ డ్రైనేజ్ (రక్తంలో చీమును తీసేయడం) కూడా అవసరం లేదు. ఆహార నియమాల మీద పెద్దగా ఆంక్షలు లేవు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత నెమ్మదిగా కదలడం మొదలు పెట్టాలి. అనుమానించాల్సిన ఇతర కారణాలు సర్వ సాధారణంగా వచ్చే కీళ్ల నొప్పులు ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల తీవ్రమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చిందేమోనని పరిశీలించి ఒక అంచనాకు రావడం తప్పనిసరి. వ్యాధిని తీవ్రం చేయగల ఇన్ఫెక్షన్లలో సూక్ష్మ క్రిముల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్, కీళ్లవాపు జ్వరం, క్షయ, కీళ్లవాతం, కడుపులో మంట, రక్తంలోకి వివిధ రసాలను విసర్జించు గ్రంథులు జరిగ్గా పనిచేయకపోవడం మొదలైన వాటిని క్షుణ్ణంగా పరిశీలించుకుని నిర్ధారించుకోవాలి.సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత ప్రకృతి సిద్ధమైన కాల్షియం, మెగ్నీషియం మూలకాలు, డి, బి12, ఈ విటమిన్ల లోపం వల్ల కూడా కీళ్ల నొప్పులు వస్తాయి. మంచి ఆహారం తీసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. గమనిక: వ్యాధికి గురైన వాళ్లు తప్పని సరిగా నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వైద్యం చేయించుకోవాలి. ఈ కథనం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. చికున్ గున్యా చికున్ గున్యా వ్యాధి సోకిన వారిలో వివిధ దశల్లో కీళ్ల నొప్పులు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా లేచి మామూలుగా తిరగడం ఇబ్బంది కావడం వల్ల వ్యాధి సోకిన రోగుల దైనందిన జీవనంపై ప్రభావం పడుతుంది. వస్తువులు తీసుకోవడం, కుర్చీలు ఎత్తడం, నడవడం మొదలగునవి కూడా సాధ్యం కాదు. వ్యాధి సోకడం వల్ల దాని ప్రభావం కేవలం నొప్పులకే పరిమితం కాదు. రోగుల్లో చాలామందికి సరిగ్గానిద్రపట్టకపోవడం, మనసు స్థిమితంగా ఉండవకపోవడం, మూడ్ మారిపోతుండడం జరుగుతుంటుంది.చికున్ గున్యా సోకిన వారికి చిన్న, పెద్ద కీళ్లు నొప్పులు వస్తాయి. చికున్ గున్యా తీవ్రంగా ఉన్నప్పుడు ఇతర వైరస్లకు ముఖ్యంగా డెంగ్యూకు దానికి ఉన్న తేడాను కనిపెట్టలేం. ఈ వ్యాధి సోకిన వారికి దీర్ఘకాలం కీళ్లనొప్పులు ఉంటాయి. ఒక్కొక్కసారి మూడేళ్ల పాటు కూడా కీళ్ల నొప్పులు బాధించవచ్చు. ఈ నొప్పులు సాధారణంగా వేళ్లు, చేతి మణికట్టు, మోకాళ్లు, కాలి చీలమండల దగ్గర కనిపిస్తాయి. అరవై నుంచి ఎనభై శాతం మంది రోగుల్లో ఈ నొప్పులు వస్తూ పోతూ ఉంటాయి. ఇరవై నుంచి నలభై శాతం మంది రోగుల్లో నిరంతరం ఉంటాయి. వయసు పైబడిన వారిలో, మహిళల్లో, ఇది వరకే కీళ్ల నొప్పులు ఉన్న రోగుల్లో ఎక్కువ రోజులు కీళ్ల నొప్పులు ఉండే ప్రమాదముంది. ఇన్పుట్స్: డా‘‘ రాహుల్ అగర్వాల్ (ఎం.డి, జనరల్ మెడిసిన్) సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్ మాక్స్క్యూర్ హాస్పిటల్స్, మాధాపూర్,హైదరాబాద్ -
చలి కొరుకుతున్నప్పుడు ఏం తినాలి
చలికాలంలో ఏదో ఒకటి వేడిగా తినాలన్న యావ ఉంటుంది. పెనం మీద నుండి తీసి తింటే కడుపులో వెచ్చగా ఉండదు. నాలిక దాటాక చలి కొరుకుతూనే ఉంటుంది. మరి ఆవురావురని ఆవ తింటే... కాలిన కడుపుకి వెచ్చని కాపు కాస్తుంది. అందుకే ఆవురావురుమంటూ ఈ ఆవ పెట్టిన కూరలను వండండి... వేడివేడిగా తినండి... బొప్పాయి ఆవ పెట్టిన కూర కావలసినవి: బొప్పాయి తురుము – రెండు కప్పులు (బొప్పాయి కాయలను శుభ్రంగా కడిగి, సన్నగా తురుముకోవాలి); పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; ఆవాలు – 2 టీ స్పూన్లు (తగినన్ని నీళ్లల్లో నానబెట్టి, మిక్సీలో వేసి మెత్తగా ముద్ద చేయాలి); జీలకర్ర – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 4; అల్లం తురుము – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; నూనె – ఒక టేబుల్ స్పూను; చిక్కటి చింతపండు పులుసు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – తగినంత; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఒక దాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి ∙తరిగిన పచ్చి మిర్చి, అల్లం తురుము, కరివేపాకు వేసి మరోమారు బాగా కలపాలి ∙బొప్పాయి తురుము, ఉప్పు, పసుపు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి ∙బొప్పాయి తురుము మెత్తపడేవరకు ఉడికించాలి ∙చింతపండు రసం, ఆవ ముద్ద వేసి కలియబెట్టి, చింతపండు రసం పచ్చి వాసనపోయే వరకు ఉడికించి దింపేయాలి ∙కొత్తిమీరతో అలంకరించి వడ్డించాలి ∙అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. అరటి దూట ఆవపెట్టిన కూర కావలసినవి: అరటి దూట – పెద్ద ముక్క; పల్చటి మజ్జిగ – రెండు గ్లాసులు; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను ; తరిగిన పచ్చిమిర్చి – 5; అల్లం తురుము – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; ఆవ ముద్ద – ఒక టీ స్పూను; చిక్కటి చింతపండు రసం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; నువ్వుల నూనె – ఒక టేబుల్ స్పూను; కొత్తిమీర – కొద్దిగా తయారీ: ∙ముందుగా అరటిదూటను శుభ్రం చేసి, సన్నగా ముక్కలుగా తరగాలి ∙ఈ ముక్కలను మజ్జిగలో వేయాలి, లేదంటే న ల్లబడిపోతాయి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, తరిగిన పచ్చి మిర్చి, అల్లం తురుము వేసి దోరగా వేయించాలి ∙కరివేపాకు జత చేసి మరోమారు కలపాలి. తరిగిన అరటిదూటను మజ్జిగలో నుంచి గట్టిగా పిండి తీసి, వేగుతున్న పోపులో వేయాలి ∙పసుపు, ఉప్పు జత చేసి బాగా కలిపి మూత పెట్టాలి ∙అరటి దూట బాగా ఉడికిన తరవాత ఆవ ముద్ద, చింతపండు రసం వేసి కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించి దింపేయాలి ∙కొత్తిమీరతో అలంకరించి వడ్డించాలి ∙ఇది అన్నంలోకి రుచిగా ఉంటుంది. పనస పొట్టు ఆవపెట్టిన కూర కావలసినవి: పనస పొట్టు – ఒక కప్పు; ఆవాలు – ఒక టీ స్పూను (ఆవ పెట్టడం కోసం); చిక్కటి చింతపండు పులుసు – రెండు టీ స్పూన్లు పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – నాలుగు (ముక్కలు చేయాలి); తరిగిన పచ్చి మిర్చి – నాలుగు; ఉప్పు – తగినంత; కరివేపాకు – రెండు రెమ్మలు; పసుపు – పావు టీ స్పూను; నీళ్లు – తగినన్ని; నూనె – ఒక టేబుల్ స్పూను; కొత్తిమీర – కొద్దిగా తయారీ: ∙పనస పొట్టును నీళ్లలో శుభ్రంగా కడిగి నీరంతా పిండేసి తీసేయాలి ∙తగినన్ని నీళ్లు, ఉప్పు, పసుపు జత చేసి కుకర్లో ఉంచి మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి ∙ఆవాలకు నాలుగు స్పూన్ల నీళ్లు జత చేసి, పావు గంట తరవాత మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ ఉడికించిన పనస పొట్టును కుకర్ నుంచి బయటకు తీయాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి, నూనె వేసి కాగాక, పోపు దినుసులు వేసి వేయించాలి ∙కరివేపాకు జత చేసి మరోమారు కలపాలి ∙ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి మరోమారు వేయించాలి ∙పనస పొట్టును గట్టిగా పిండి పోపులో వేసి బాగా కలపాలి ∙చింతపండు రసం, ఉప్పు, పసుపు, ముందుగా నూరి పెట్టుకున్న ఆవ పొడి వేసి బాగా కలిపి, దింపేయాలి ∙వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. కొత్తిమీరతో అలంకరించాలి. క్యాబేజీ ఆవపెట్టిన కూర కావలసినవి: తరిగిన క్యాబేజీ – 2 కప్పులు; పోపు దినుసులు – ఒక టేబుల్ స్పూను; ఆవ పొడి – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 2; తరిగిన పచ్చి మిర్చి – 2; పసుపు – చిటికెడు; ఉప్పు – తగినంత; నిమ్మ రసం – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; నూనె – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక టేబుల్ స్పూను నూనె వేసి కాగాక, ఎండు మిర్చి, పోపు దినుసులు వేసి చిటపటలాడే వరకు వేయించాలి ∙పచ్చి మిర్చి జత చేసి వేయించాలి ∙పసుపు, ఉప్పు వేసి కలియబెట్టాలి ∙క్యాబేజీ తరుగు వేసి బాగా కలపాలి ∙బాగా ఉడికిన తరవాత, ఆవ పొడి వేసి కలపాలి ∙చివరగా నిమ్మ రసం జత చేసి మరోమారు కలియబెట్టి, దింపేయాలి. కంద–బచ్చలి ఆవపెట్టిన కూర కావలసినవి: కంద – పావు కేజీ; బచ్చలి కూర – 150 గ్రా.; ఉప్పు – రుచికి తగినంత; చిక్కటి చింతపండు రసం – ఒక టీ స్పూను. ఆవాల ముద్ద కోసం: ఆవాలు – 2 టీ స్పూన్లు; బియ్యం – అర టీ స్పూను; ఎండు మిర్చి – 2 పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; పసుపు – అర టీ స్పూను; ఎండు మిర్చి – 2; నువ్వుల నూనె – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙చిన్న పాత్రలో ఆవాలు, బియ్యం, ఎండుమిర్చి, తగినన్ని నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టాలి ∙మిక్సీలో వేసి మెత్తగా ముద్ద చేసి పక్కన ఉంచాలి ∙కందను శుభ్రం చేసి, తొక్క వేరు చేసి, కందను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి ∙బచ్చలికూరను శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి ∙ఒక పాత్రలో కంద ముక్కలు, తరిగిన బచ్చలి ఆకు వేసి తగినన్ని నీళ్లు జత చేసి కుకర్లోఉంచి మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి ∙చల్లారాక, ఎక్కువగా ఉన్న నీళ్లను వేరు చేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఆవాలు, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, పసుపు, ఎండు మిర్చి వేసి చిటపటలాడేవరకు వేయించాలి ∙ఉడికించిన కంద, బచ్చలి మిశ్రమం వేసి బాగా కలపాలి ∙ఉప్పు జత చేసి మరోమారు కలిపి చివరగా ఆవ ముద్ద, చింతపండు రసం వేసి కలిపి రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి. అరటికాయ ఆవపెట్టిన కూర కావలసినవి: అరటి కాయలు – 4; తరిగిన పచ్చి మిర్చి – 5; అల్లం తురుము – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; ఆవాలు – ఒక టీ స్పూను (తగినన్ని నీళ్లలో అరగంట సేపు నానబెట్టి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి); చిక్కటి చింతపండు రసం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; నువ్వుల నూనె – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙అరటికాయలను శుభ్రంగా కడిగి, పైన తొక్కను తీసి, పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి ∙తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించి, దింపేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి చిటపటలాడించాలి ∙పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి ∙కరివేపాకు, పచ్చి మిర్చి, అల్లం ముద్ద వేసి మరోమారు బాగా వేయించాలి ∙ఉడికించి ఉంచుకున్న అరటి కాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా మెదపాలి ∙ఆవ ముద్ద, చింతపండు రసం వేసి బాగా కలిపి, ఐదు నిమిషాలు ఉంచి దింపేయాలి. -
ఉన్ని దుస్తులకు భలే డిమాండ్ !
సాక్షి, నల్లగొండ టౌన్ : చలికాలం రానే వచ్చింది. చలి రోజురోజుకూ పెరుగుతుండడంతో పట్టణ ప్రజ లు ఉన్ని దుస్తులను ఆశ్రయిస్తున్నారు. సాయంత్రం నుంచి చలి ప్రారంభమై ఉదయం వరకు చలి గాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సాయంత్రం కాగానే ఉ న్ని దుస్తులను ధరిస్తూ చలినుంచి రక్షణ పొందుతున్నారు. పట్టణంలో పలుచోట్ల వెలిసిన దుకాణాలు పట్టణంలోని గడియారం సెంటర్, దేవరకొండ రోడ్డు, హైదరాబాద్ రోడ్డు తదితర ప్రాంతాల్లో సుమారు 20కిపైగా ఉన్ని దుస్తుల దుకాణాలను వెలిశాయి. చలి తీవ్రత కారణంగా ప్రజలు ఉన్ని దుస్తుల కొనుగోలుకు ఆసక్తి చూపుతుండడంతో దుకాణాల వద్ద రద్దీ ఎక్కువగా కనబడుతోంది. మంకీ క్యాప్ రూ. 20 నుంచి రూ.50వరకు,స్వెట్లర్ రూ.150 నుంచి 500ల వరకు, మఫ్లర్ రూ.50 నుంచి రూ.100వరకు, చిన్నపిల్లల ఉన్ని దుస్తులు రూ.100 నుంచి 250 వరకు విక్రయిస్తున్నారు. గత వారం మందకొడిగా సాగిన ఉన్ని దుస్తుల అమ్మకాలు చలి తీవ్రత పెరిగిపోవడంతో ఊపందుకున్నాయి. దీంతో వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ధరలు ఎక్కువగా ఉన్నాయి.. చలికాలం కావడంతో చాలా మంది ఉన్ని దుస్తులను కొనడానికి వస్తుండడంతో వ్యాపారులు ధరలు ఎక్కువగా చెబు తున్నారు. ఏది కొనాలన్నా ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ధరలు తగ్గించి అమ్మితే బాగుంటుంది. – అనూష, నల్లగొండ అమ్మకాలు పెరిగాయి.. చలి పెరుగుతుండడంతో ఉన్ని దుస్తుల అమ్మకాలు బాగానే పెరిగాయి. రెండు రోజులుగా వ్యాపారం కాస్త ఎక్కువగా పెరిగింది. ఏడాదిలో మూడు నెలలు మాత్రమే మా వ్యాపారాలు సాగుతాయి. – రాజు, వ్యాపారి -
చలిస్తున్న విశాఖ
సాక్షి, విశాఖపట్నం: విశాఖపై చలి పంజా విసురుతోంది. రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. రాష్ట్రంలో కెల్లా విశాఖలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం విశేషం. గడచిన వారం రోజులను పరిశీలిస్తే రాత్రి ఉష్ణోగ్రతలు ఏడు డిగ్రీలు తక్కువకు పడిపోయాయి. ఈ నెల 19న నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 23.4 డిగ్రీలు నమోదు కాగా సోమవారం 16 డిగ్రీలకు పడిపోయింది. ఇది సాధారణంకంటే ఐదు డిగ్రీలు తక్కువ. మరోవైపు విశాఖ ఏజెన్సీలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు క్షీణిస్తున్నాయి. లంబసింగిలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. రానున్న రోజుల్లో చలి మరింతగా పెరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
స్వైన్ఫ్లూ కలకలం
సాక్షి, విశాఖపట్నం: ప్రాణాంతక స్వైన్ఫ్లూ విశాఖ వాసులను కలవర పెడుతోంది. ఇటు జిల్లా, అటు నగరంలోనూ అలజడి రేపుతోంది. శీతాకాలంలోనే విజృంభించే స్వైన్ఫ్లూ మండుటెండల్లోనూ ప్రతాపం చూపింది. ఇప్పుడు చలికాలం మొదలవుతుండడంతో ఈ వైరస్ ఎంతలా అదుపుతప్పుతుందోనన్న ఆందో ళన సర్వత్రా వ్యక్తమవుతోంది. గతేడాది కంటే ఈ ఏడాది జిల్లాలో స్వైన్ఫ్లూ తీవ్రత ఎక్కువగా ఉంది. గతేడాది 40 మంది స్వైన్ఫ్లూ బారినపడ్డారు. జనవరి నుంచి ఇప్పటిదాకా (ఈ పదకొండు నెలల్లో నే) 64 మంది ఈ వ్యాధితో ఆస్పత్రుల్లో చేరారు. మార్చిలో ఒకరు, అక్టోబర్లో 42, నవంబరు 24 వరకు 21 మందికి స్వైన్ఫ్లూ సోకినట్టు నిర్ధారించారు. వీరిలో నలుగురు మృత్యువాత పడ్డారు. అయితే వీరు మధుమేహం, గుండెజబ్బు, కిడ్నీ, నరాల సంబంధ వ్యాధులతో మరణించారని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో ముగ్గురు, ప్రభుత్వ ఛాతి, అంటువ్యాధుల (చెస్ట్) ఆస్పత్రిలో మరొక రు స్వైన్ఫ్లూతో చేరి చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విశాఖ ప్రభావిత ప్రాంతం విశాఖపట్నం స్వైన్ఫ్లూ ప్రభావిత ప్రాంతం. నగరానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు, భక్తులు, సందర్శకులు వస్తుంటారు. ఆయా ప్రాంతాల్లో స్వైన్ఫ్లూ వైరస్తో ఇక్కడకు రావడం, నగరానికి చెందిన వారు ఆ ప్రదేశాలకు వెళ్లడం ద్వారా వైరస్ సోకడం వంటివి కారణాల వల్ల ఇది వ్యాప్తి చెందుతోంది. విశాఖ సమీపంలో సింహాచలం, నగరంలో కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయాలకు దూరప్రాంతాల నుంచి భక్తులు, అలాగే ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలకు టూరిస్టులు వస్తుంటారు. దీంతో స్థానికులతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వల్లే స్వైన్ఫ్లూ విజృంభిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అప్రమత్తమైన యంత్రాంగం స్వైన్ఫ్లూ నియంత్రణకు జిల్లా యంత్రాంగం, జీవీఎంసీ చర్యలు చేపట్టింది. జిల్లా, నగర వ్యాప్తంగా 12 స్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. విమానాశ్రయం, విశాఖ రైల్వే స్టేషన్ (ప్లాట్ఫాం –1, 8), సింహాచలం కొండపైన, దిగువన, ఆర్టీసీ కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో స్క్రీనింగ్ సెంటర్ల ద్వారా శాంపిళ్లు సేకరించి పరీక్షలు చేయిస్తున్నారు. కేజీహెచ్లో ఉన్న వైరాలజీ ల్యాబ్లో స్వైన్ఫ్లూ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. స్వైన్ఫ్లూ లక్షణాలున్న వారి కోసం కేజీహెచ్లో 10 పడకలు, పది వెంటిలేటర్లు, చెస్ట్ ఆస్పత్రిలో ఆరు పడకలు, రెండు వెంటిలేటర్లను అందుబాటులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి జలుబు, దగ్గు, గొంతునొప్పి, విపరీతమైన జ్వరం, కళ్లు మంటలు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. సమూహాలు, విందులు, వినోదాల్లో పాల్గొనేవారు అప్రమత్తంగా ఉండాలి. బయట తిరిగే వారు ముఖానికి మాస్కులు ధరించి వెళ్లాలి. చెస్ట్ ఆస్పత్రి, కేజీహెచ్, జిల్లాలోని నర్సీపట్నం, పాడేరు, అరకు, అనకాపల్లి ఏరియా ఆస్పత్రుల్లోను, అన్ని పీహెచ్సీలు, సీహెచ్సీల్లోనూ స్వైన్ఫ్లూ నిరోధక మందులను అందుబాటులో ఉంచాం. వీటిని ఉచితంగానే ఇస్తున్నాం. స్వైన్ఫ్లూ మందుల కొరత లేదు. – ఎస్.తిరుపతిరావు, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి -
ఇండిగో వింటర్ సేల్ : ఆఫర్లో 10 లక్షల టికెట్లు
సాక్షి,ముంబై: బడ్జెట్ క్యారియర్ ఇండిగో తక్కువ ధరల్లో విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. వింటర్ సేల్ పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక విక్రయాల్లో రూ.899 (అన్నీ కలుపుకొని) లకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. ప్రమోషనల్ ఆఫర్గా నిర్వహిస్తున్నఈ సేల్లో దాదాపు 10లక్షల సీట్లను ఆఫర్ చేస్తోంది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ రూట్లలో నాన్ స్టాప్ విమానాల్లో మాత్రమే ఈ ఆఫర్ను అందిస్తున్నట్టు ఇండిగో వెల్లడించింది. అంతర్జాతీయంగా 3199 రూపాయలకు టికెట్లను అందిస్తోది. నవంబరు 21 నుంచి 25 వ తేదీలోపు బుక్ చేసుకున్న టికెట్ల మాత్రమేఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా డిసెంబరు 6, 2018 నుంచి ఏప్రిల్ 15, 2019 వరకు ప్రయాణించే అవకాశం. Our Sale will make you feel all warm and fuzzy inside, So kick start winters with fares starting ₹899. Book your flights today! https://t.co/sngmgCNgEH pic.twitter.com/EA0RbeMg1g — IndiGo (@IndiGo6E) November 21, 2018 -
ఆత్మగ్లాని
ముసలావిడా కూతురూ వరండాలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, దూరంగా రోడ్డుమీద మొదటిసారిగా షిప్ట్లెట్ కనిపించాడు.అతనికి పనీపాటా ఉన్నట్లు లేదు. ఊళ్లు తిరుగుతూ కాలక్షేపం చేస్తుంటాడు. దేశదిమ్మరి. ఎడమ చేతి కోటు చెయ్యి సగం వేలాడుతోంది! ఎప్పుడు తెగిపోయిందో? అతను ఇంటి ఆవరణలోకి వచ్చిందాకా ముసలావిడ కదల్లేదు. లావుగా, బొద్దుగా ఉన్న కూతురు సడెన్గా కొత్త మనిషినిచూసి ఆనందం పట్టలేక ఎగురుతూ... మాట్లాడలేని నోటితో అరిచింది.పనిముట్ల డబ్బా కిందపెట్టి, టోపీ తీసి పట్టుకుని, అభివాదం చేశాడు షిప్ట్లెట్. నల్లటి జుత్తు నిగనిగలాడుతోంది. యువకుడే కానీ లోపల ఏదో అసంతృప్తి. జీవితాన్ని అర్థం చేసుకున్నతనం.షిప్ట్లెట్ వెనక్కు తిరిగి అస్తమిస్తున్న సూర్యుడ్ని చూశాడు. ముసలావిడ యువకుడ్ని పరిశీలనగా చూసింది. ‘‘మేడం, ఇంతటి అద్భుతమైన సూర్యాస్తమయాన్ని చూడగలగటమే నా అదృష్టం. ఎన్ని కష్టాలొచ్చినా సరే ఇలాంటిచోటు వదిలి వెళ్లాలనిపించటం లేదు’’ అన్నాడు యువకుడు కింది మెట్టు మీద కూర్చుని. ‘‘దానికేం రోజు ఇలాగే చూస్తూ కూర్చో’’ అంది ముసలావిడ కుర్చీలో వెనక్కు వాలి. షిప్ట్లెట్ చూపులు పరిసరాల్ని నిశితంగా పరిశీలించాయి. ఓ మూలన బోరుబావి, అత్తి చెట్టు, నాలుగు కోళ్లు, షెడ్డులో కారు.‘‘డ్రైవ్ చేస్తారా?’’‘‘పదిహేనేళ్ల నుంచీ అదక్కడే ఉంది. నా భర్త మరణించాక దాన్ని ముట్టుకోలేదు.’’‘‘పాతతరం కార్లే వేరు. ఇప్పుడెక్కడ చూసినా టోపీ వేసే వ్యాపారమే. లోకం పాడైపోయింది.’’‘‘అవును. సరే కానీ, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు?’’‘‘నా పేరు టాం షిప్ట్లెట్’’ అంటూ గొణిగాడు.‘‘సంతోషం. నా పేరూ, నా కూతురి పేరూ ఒకటే. లూసీ నెల్. సరే.. ఏ ఊరు మీది?’’షిప్ట్లెట్ మాట్లాడలేదు. జేబులోంచి పొగాకూ, కాగితాలూ తీసి తాపీగా సిగరెట్ రోల్ చేశాడు. అగ్గిపుల్ల వెలిగించి మంట చివరకి వచ్చిందాకా ఆగి (కాలుతుందనే భయంతో ముసలావిడ కూతురు శబ్దాలూ సైగలూ చేసింది) వెలిగించాడు.‘‘ఈ రోజుల్లో ఎవర్నీ నమ్మటానికి లేదు. నా పేరు షిప్ట్లెట్ అని ముందే చెప్పాను. నా ఊరు టార్వాటర్. కానీ నేనెవరో మీకు తెలియదు. మరో పేరూ, మరో ఊరూ కావచ్చు కదా’’‘‘నీ గురించి మాకేమీ తెలియదు’’ అంటూ విసుక్కుంది ముసలావిడ.‘‘ఈ లోకంలో అబద్ధాలాడేవాళ్లకు తక్కువేమీ లేదు. ఇవన్నీ ఎందుకు? నేను మనిషిని. మగాడ్ని. ఇంతకూ మనిషంటే ఎవరు?’‘‘సరే.. సరే.. ఆ డబ్బాలో ఏముంది?’’ అడిగింది ముసలావిడ. ‘‘పనిముట్లు. నేను వడ్రంగిని.’’‘‘ఓహో.. పని చేతవునన్నమాట. తిండిపెడతాను. ఉండటానికో చోటు చూపిస్తాను. జీతం మాత్రం ఇవ్వలేను. ముందరే చెప్పేస్తున్నా’’ అంది ముసలావిడ. ‘‘అమ్మా, మనిషన్నాక డబ్బే సర్వస్వం కాదు’’ అన్నాడు నెమ్మదిగా. ముసలావిడ మాట్లాడలేదు. కూతురు అతడ్నే దీక్షగా చూసింది.‘‘లోకంలో అందరికీ కావలసింది డబ్బే. అసలు మనిషంటే ఎవరు? డబ్బు కోసమే మనిషి పుట్టాడా ఏమిటి?’’ ఇన్నేళ్లొచ్చిన ఆవిడ కూడా అలాగే అనుకుంటుందా అనుకుంటూ ప్రశ్నించాడు. ఇలాగే మరెన్నో ప్రశ్నలు. ముసలావిడ దగ్గర సమాధానాలు లేవు.ఈ ఒంటి చెయ్యి మనిషి ఇంటీ మీద కప్పు సరిచెయ్యగలడా?యువకుడి వయసు ఇరవై ఎనిమిది. ఎన్నెన్నో ఉద్యోగాలు చేశాడు. దేశదేశాలు తిరిగొచ్చాడు. ‘‘పెళ్లైందా?’’చాలాసేపు నిశ్శబ్దం.‘‘తెల్లకాగితంలాంటి మనసున్న ఆడవాళ్లు కావాలి. అలాంటి అమాయకమైన ఆడపిల్లలు ఈ లోకంలో ఎక్కడున్నారండీ? తెలివిమీరిన నెరజాణలు నాకక్కర్లేదు.’’కూతురు ముందరికి వంగి మోకాళ్లమీద తల పెట్టుకుని కూర్చుంది. ఉన్నట్టుండి కింద పడి కాళ్లూ చేతులూ కొట్టుకుంది. షిప్ట్లెట్ ఆమెను లేపి, కూర్చీలో వెనక్కు వాల్చి కూర్చోబెట్టి.... ‘‘మీ అమ్మాయా?’’ అనడిగాడు ముసలావిడని.‘‘ఒక్కగానొక్క కూతురు. నా బంగారు కొండ. దాన్ని విడిచి ఒక్క క్షణమైనా ఉండలేను. అదెంత తెలివైందనుకున్నావ్? ఇంటిపనులన్నీ చెయ్యగలదు. ఇల్లూడుస్తుంది. భలే చలాకీ పిల్ల. దానెత్తు బంగారం ఇస్తానన్నా దాన్నెవరికీ ఇవ్వను.’’‘‘బాగా చెప్పారు. పెళ్లి పేరుతో అమ్మాయిని దూరం చేసుకోకండి.’’‘‘ఇక్కడ ఉండటానికి ఇష్టపడ్డవాడే దీన్ని చేసుకోవాలి.’’చీకట్లో మెరుస్తున్న కారు బంపర్ వైపు చూశాడు షిప్ట్లెట్. ‘‘ఇక్కడున్న అన్ని వస్తువులనూ రిపేర్ చెయ్యగలను. తుంటిచెయ్యివాడని తీసిపారెయ్యకండి. పనిలో నేనెవరికి తీసిపోను’ అంటూనే మరి కాస్సేపు ఆలోచించి అన్నాడు. ‘‘మనిషన్న తర్వాత నీతి ఉండాలి. జ్ఞానం ఉండాలి’’ అని. షిప్ట్లెట్ మాటలు వాళ్లని ఇంప్రెస్ చెయ్యలేదు. ‘‘పని చేస్తే తిండి పెడతాను. రాత్రికి కార్లో పడుకో’’ అంది ముసలావిడ.‘‘అదేం కష్టం! పూర్వకాలంలో సన్నాసులు శవపేటికల్లోనే రోజూ పడుకునేవారట’’ అన్నాడు షిప్ట్లెట్.‘‘ఆ కాలం వేరు’’ తెల్లారే కప్పు వెయ్యటం ప్రారంభించాడతను. ముసలావిడ కూతురు అతడ్నే చూస్తూ కూర్చుంది. వారం రోజుల్లో పని పూర్తయింది. విరిగిన మెట్లు సరిచేశాడు. చుట్టూ కంచె పూర్తి చేశాడు. పశువుల కొట్టం కట్టాడు. బ్రహ్మచెముడున్న లూసీనెల్కి ‘బర్డ్’ అనే మాట పలకడం నేర్పించాడు. ఆ పిల్ల రోజంతా చప్పట్లు కొడుతూ ‘బర్ర్ర్ర్ర్ట్’’ అంటూ అల్లరి చేసింది.దూరంనించి అన్నీ చూస్తూ తృప్తిగా నిట్టూర్చింది తల్లి. ‘అర్జెంట్గా అల్లుడు కావాలి. ఇక ఆలస్యం కాకూడదు’.కారు కిటికీలోంచి కాళ్లు బయటికి పెట్టి. వెనక సీట్లో పడుకున్నాడు షిప్ట్లెట్. వెంట బ్లేడూ, నీళ్ల గ్లాసూ, అద్దం ముక్కా తెచ్చుకున్నాడేమో... షేవ్ చేసుకుని నీటుగా తయారయ్యాడు. కోటును హాంగర్కు తగిలించి ఓ మూలన వేలాడదీశాడు.సాయంత్రాలు ఆడవాళ్లిద్దరూ వాలుకుర్చీలో ఊగినప్పుడు, మెట్లమీద కూర్చుని కబుర్లు చెప్పాడు. ఇల్లూ. చిన్న పొలం బాగుపడ్డాయి.‘‘ఒళ్లొంచి శ్రద్ధగా పనిచేస్తే ఏమైనా సాధించవచ్చు. సొంత ఇంటిలా చూసుకున్నాను. అందుకే ఇంత చేశాను’’ అన్నాడు. ‘మూలపడిన కారు బాగుచెయ్యాలి’ అనుకుంటూ బాయ్నెట్ తెరిచి చూశాడు. ‘‘కారంటే ఇలా ఉండాలి. ఇప్పటి కార్లా? ధరలెక్కువా, క్వాలిటీ తక్కువా! ఆ రోజుల్లో ఒక్క మనిషి మొత్తం కారు అసెంబుల్ చేసేవాడు. ఇప్పుడు ఒక్కొక్క బోల్టుని ఒక్కొక్కడు బిగిస్తాడు’’ అన్నాడు. ‘‘అవును’’ అంది ముసలావిడ.‘‘అసలు ఈ రోజుల్లో ఎవరికీ పనిమీద శ్రద్ధ లేదే! సొంత మనుషులనుకోవటం వల్లనే కదా, మాటలు రాని లూసీనెల్కు ఒక్క మాటైనా నేర్పించాను’’‘‘దానికింకేమైనా నేర్పించు’’ అంది ముసలావిడ.‘‘ఏం నేర్పించాలో చెప్పండి?’’‘‘ప్రియుడా..! అనమను’’ షిప్ట్లెట్కు ముసలావిడ మనసులోని మాట బాగానే అర్థమైంది. తెల్లారి అతను కారు రిపేర్ ప్రారంభించాడు. కొత్త ఫాన్ బెల్ట్ వేస్తే కారు నడుస్తుందన్నాడు. డబ్బులిస్తానంది ముసలావిడ.‘‘దానికి పెళ్లిచేసి పంపించే ఉద్దేశం ఎంత మాత్రం లేదు. కానీ యోగ్యుడైన కుర్రాడు వచ్చి ‘మీతోపాటే ఉంటాను’ అంటే ఆలోచించవచ్చు. ఉండటానికో మంచి ఇల్లు, ఓ అందాలరాశి కూడా దొరుకుతుంది. తెలివైనవాళ్లెవరూ ఇంత మంచి అవకాశాన్ని వదులుకోరు.’’ ‘‘ఆమె కెన్నేళ్లు?’’ ఆసక్తి లేనట్లుగా అడిగాడు షిప్ట్లెట్.‘‘ఆ.. ఎంతా? పదిహేనో పదహారో..’’ అంది ముసలావిడ. ముప్ఫై దాకా ఉంటాయా పిల్లకు. కానీ మాటలు రాని అమాయకత్వంతో ఆమెకి అంత వయసుందని అనిపించదు. ‘‘కారుకు పెయింట్ వెయ్యకపోతే తుప్పు పట్టి పాడవుతుంది’’ అన్నాడు షిప్ట్లెట్.‘‘చూద్దాంలే’’ అంది ముసలావిడ.మర్నాడు పక్క ఊరికెళ్లి స్పేర్ పార్ట్స్, పెట్రోలు తీసుకొచ్చాడు. మధ్యాహ్నం వరకూ షెడ్లోంచి రకరకాల శబ్దాలు వెలువడ్డాయి. కూతురికి మళ్లీ మూర్ఛ వచ్చిందేమోనని పరిగెత్తుకుని వచ్చింది ముసలావిడ. ఓ మూలన కూర్చుని ‘‘బర్ర్ర్ట్’’ అంటూ కాళ్లు నేల మీద కొడుతూ అరుస్తోంది పిల్ల. భయంకరమైన రోదతో కారు, షెడ్ దాటి బయటికొచ్చింది. ‘చచ్చిన మనిషిని బతికించినట్లు’గా డ్రైవర్ సీట్లోంచి వినయంగా చూశాడు షిప్ట్లెట్. ఆ రాత్రి ముసలావిడ వ్యవహారంమాట్లాడింది. ‘‘నీకు అమాయకురాలు కావాలి. నెరజాణలు వద్దు.’’‘‘అవును’’‘‘నీ మాటకు ఎదురు చెప్పని మనిషి, నోట్లో నాలుకలేని మనిషి కావాలి. ఆ పిల్ల ఇక్కడే నీ కళ్లముందే ఉంది.’’కాళ్లు ముడిచి, పాదాలను చేతులతో పట్టుకుని కూర్చీలో కూర్చుంది లూసీనెల్. ‘‘ఆమె నిన్ను ఇబ్బందిపెట్టని మనిషి. శనివారం ముగ్గురం కలిసి వెడదాం. పక్క ఊరిలో పెళ్లి చేసుకోండి.’’మెట్లమీద కూర్చున్న షిప్ట్లెట్ ‘‘పెళ్లి వీలుపడదండీ. డబ్బులేవీ?’’ అన్నాడు ఇబ్బందిగా.‘‘దేనికి?’’‘నేను అందరిలాంటివాడ్ని కాను. భార్యకున్న చిన్నచిన్న సరదాలు తీర్చాలంటే డబ్బు కావాలి. పెళ్లి తర్వాత ఏదైనా హోటలుకు తీసికెళ్లాలా? మంచి భోజనం పెట్టించాలా? ‘పెళ్లాన్ని పువ్వుల్లో పెట్టిచూసుకోవాలిరా’ అని చెప్పింది మా అమ్మ’’‘‘లూసీ నెల్కు హోటల్ అంటే ఏమిటో కూడా తెలియదు. ఇదిగో, నా మాట వినబ్బాయ్. పర్మినెంట్ ఇల్లు, మంచినీళ్ల బావి, నోట్లో వేలుపెడితే కొరకలేని అమాయకురాలు! ఇంకా డబ్బెందుకు? అసలే ఒక చెయ్యలేని అవిటివాడివి నువ్వు. నా అన్నవాళ్లంటూ లేని బికారివి. ఇంతకన్నా మంచి సంబంధం నీకీ జన్మకు దొరకదు.’’ఆమె మాటల పరుషత్వం అతడ్ని దిమ్మెరపరచి ఉండవచ్చు.తల తిరిగింది. మాట్లాడకుండా మరో సిగరెట్ రోల్ చేసుకుని వెలిగించాడు. ‘‘మేడం, మనిషిలో రెండు భాగాలుంటాయి’’ అన్నాడు కాసేపాగి నెమ్మదిగా.‘‘ఒకటి శరీరం. మరొకటి ఆత్మ. శరీరమంటే ఇల్లు లాంటిది. ఎక్కడికీ కదలదు. ఆత్మంటే కారులాంటిది. ఒక్క దగ్గరా నిలకడగా ఉండదు’’ అంటూ వివరించాడు షిప్ట్లెట్. ‘‘చూడబ్బాయ్, మా దొడ్లో ఉన్న బావి ఎప్పుడూ ఎండిపోదు. నా ఇల్లు చలికాలంలో కూడా వెచ్చగా ఉంటుంది. ఇంటిమీద అప్పులు లేవు. కావాలంటే కోర్లుకెళ్లి దస్తావేజులు పరీక్షించుకో. కారు చూశావుగా. బంగారం లాంటి కారు’’ అంటూ మరొక్క గాలం విసిరిందా ముసలామె. ‘‘ఈ శనివారం దానికి పెయింట్ వేయించుకో. పెయింట్ డబ్బులు నేనిస్తాలే’’చీకట్లో నవ్విన షిప్ట్లెట్ పెదాలు. పడగ విప్పిన పాముల్లా మెలికలు తిరిగాయి. కాసేపాగి ‘‘మనస్సాక్షిని నమ్ముకున్నవాడ్ని. నాకేది బాగనితోస్తే అది చేస్తాను. ఎంత ఖర్చయినా సరే, పెళ్లి తర్వాత నా భార్యకు రెండు మూడు ఊళ్లు చూపించి తిప్పుకొస్తాను’’ అన్నాడు.‘‘సరే. మీ ప్రయాణానికి పదిహేను డాలర్లిస్తాను. నేనివ్వగలిగిందంతే.’’‘‘పెట్రోలు ఖర్చుకూ, హోటల్ అద్దెకూ ఆ మాత్రం సరిపోతుంది. మరి తిండికి?’’‘‘చివరి మాట.. పదేహేడు డాలర్ల యాభైసెంట్లు. ఇంక నువ్వెంత పిండినా లాభం లేదు. కావాలంటే లంచ్ కట్టిస్తాను.’’‘పిండినా’ అనే మాట అతడ్ని బాధించింది. ముసల్దాని దగ్గర బాగానే డబ్బుండకపోదు. కానీ తను డబ్బు మనిషిని కాదని ప్రకటించాడే! ‘‘ఉన్న దాంతో సర్దుకుంటాలెండి’’ అంటూ లేచాడు.శనివారంనాడు. కారుకేసిన కొత్త పెయింట్ ఇంకా ఆరనైనా లేదు. ముగ్గురూ వెళ్లి గవర్నమెంటాఫీసులో పెళ్లయిందనిపించారు. షిప్ట్లెట్కేదో ఇబ్బందిగా, ఇరకాటంగా ఉంది. ఎవరో అవమానించినట్లుగా అన్నాడు ‘‘పెళ్లి జరగాల్సిన పద్ధతి ఇది కాదు. కాగితాలమీద సంతకాలు పెడితే పెళ్లైనట్లా? నాకైతే నచ్చలేదు’’‘‘చట్టప్రకారమే జరిగిందిలే’’ అంది ముసలావిడ కాస్త కఠినంగా.‘‘చట్టం కోసం నేనా? నా కోసం చట్టమా?’’ అన్నాడు షిప్ట్లెట్ కోపాన్ని అణచుకుంటూ.ఆకుపచ్చ – పసుపురంగు కార్లో కూర్చున్నారు ముగ్గురూ. ‘‘లూసీ నెల్ అందాల భరిణ. ఎంత ముద్దొస్తోందో’’ అంది ముసలావిడ. మురిపెంగా పాలనురగలాంటి డ్రెస్లో, చెర్రీపళ్ల డిజైన్ ఉన్న హ్యాట్ పెట్టుకుని ఉంది పెళ్లికూతురు.‘‘నువ్వు అదృష్టవంతుడివి’’ అంది ముసలావిడ. కారింటికి చేరగానే ముసలావిడ దిగింది. లంచ్ బాక్సు కూతురికందించింది. కారు కదిలింది. కిటికీలోంచి చూస్తూ ఉబికివస్తున్న కన్నీటిని తుడుచుకుంది ముసలావిడ. ‘ఇంత వరకూ దాన్ని విడిచి ఒక్కరోజూ ఉండలేదు’ అనుకుంటూ గొణుక్కుంది.‘‘త్వరగా వస్తాంగా. నీ కూతురు నీ దగ్గర తప్ప మరెక్కడా క్షేమంగా ఉండలేదు’’ అంటూ క్లచ్ నొక్కాడు షిప్ట్లెట్. వీడ్కోలు చెప్పింది ముసలావిడ.వాతావరణం ప్రశాంతంగా ఉంది. దూరంగా కొండలు. మబ్బులు లేని ఆకాశం నులివెచ్చగా ఉంది.షిప్ట్లెట్కు కోపం తగ్గింది. కారుమీద తనకెప్పటి నుండో కోరికగా ఉంది. స్పీడు పెంచాడు. రాత్రికల్లా మోబిల్(ఊరు) చేరుకోవాలి.ఆగి, అప్పుడప్పుడూ లూసీ నెల్ వైపు చూశాడు. డబ్బాలో ఉన్న లంచ్ని ఎప్పుడో తినేసింది ఆ పిల్ల. కారు తనదేనన్న ఉత్సాహంలో కూడా కాస్తంత నీరసంగా ఉంది. వందమైళ్లువచ్చారు. ‘ఆమెకు మళ్లీ ఆకలేస్తోందేమో’ అనుకుంటూ, దారిపక్కన చిన్న ఊర్లో ఒక హోటల్ వద్ద ఆపి భోజనం ఆర్డరిచ్చాడు. బడలిక వల్ల లూసీ నెల్కు నిద్ర ముంచుకువస్తోంది. భోజనం వచ్చేలోగా ఆమె టేబుల్ మీద తలపెట్టి నిద్రపోయింది.‘‘లేచాక తింటుందిలే. నేను బిల్ పేచేస్తాను’’ అన్నాడు షిప్ట్లెట్. సప్లయర్ కుర్రాడు వంగి ఆమె జుత్తు సరిచేస్తూ ‘‘ఎంత అందమైన పిల్లో’’ అన్నాడు.‘‘అవును. ఎవరో హిచ్హైకర్. లిప్ట్ అడిగితే ఇచ్చాను. నాకు ఆలస్యమవుతోంది అర్జెంట్గా టస్కా లూసా (ఊరు) వెళ్లాలి’’ అంటూ బయల్దేరాడు షిప్ట్లెట్. విరక్తిగా ఉంది. వేడి పెరిగింది. కనుచూపు మేరలో ఎక్కడా చెట్టూ చేమా లేవు. అంతటా విశాలమైన మైదానాలు. తుఫాను వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పిడుగులూ మెరుపులూ వడగళ్ల వర్షం వచ్చే సూచనలు. ఈలోగా తేమనంతా పీల్చేసుకుంటోంది గాలి.కారున్న మనిషికి బాధ్యతలు కూడా ఉంటాయని షిప్ట్లెట్ నమ్మకం. ఎవరైనా హిచ్హైకర్ కనిపిస్తే లిఫ్ట్ ఇవ్వాలి. రోడ్డుపక్కన సైనుబోర్డులు. ‘డ్రైవ్ కేర్ఫుల్లీ’.. ‘ది లైఫ్ యూ సేవ్.. మే బీ యువర్ ఓన్’రోడ్డు ఇరుకైంది. రెండు వైపులా దుబ్బులు. దారిలో రేకుల షెడ్డు, పెట్రోలు బంకు. ఎండ కళ్లకు కొడుతోంది. ఎరుపెక్కిన సూర్యబింబం. రోడ్డుపక్కనో కుర్రాడు కనిపించాడు. వేగం తగ్గించి వాడ్ని చూశాడు.కుడిచేతి బొటనవేలు చూపుతున్నా లిఫ్ట్ అడగటం లేదు కుర్రాడు! చెంత ఒక అట్టసూట్కేస్ ఉంది.కారాపి ‘‘లిఫ్ట్ కావాలా బ్రదర్?’’ అన్నాడు షిప్ట్లెట్.కుర్రాడు మాట్లాడకుండా డోర్ తెరిచి వచ్చి కూర్చున్నాడు. గొడవపడి ఇల్లు విడిచి వచ్చినట్టుగా ఉంది. లిఫ్ట్ ఇచ్చిన మనిషిని చూడటం ఇష్టం లేనట్టుంది. కారు విండోలోంచి మరెటో దృష్టి సారించాడు.‘‘బ్రదర్. ప్రపంచంలోకెల్లా మా అమ్మ బెస్ట్. మీ అమ్మ నెక్ట్స్ బెస్ట్’’ అన్నాడు షిప్ట్లెట్.వినిపించుకోనట్లుగా కుర్రాడు బైటిలోకాన్ని చూస్తున్నాడు.‘‘తొమ్మిది నెలలు మోసి కనిపెంచిన అమ్మ. ఊహ తెలియని మనకు మంచి చెడులు బోధించిన అమ్మ. ఈ లోకంలో ప్రేమ అనేది ఉందని మొదటిసారిగా మనకు తెలిసింది అమ్మ ద్వారా కాదూ! అమ్మ లేకపోతే అందరంఅనాథలమే కదూ..’’ అన్నాడు షిప్ట్లెట్.కుర్రాడు సీట్లో ఇబ్బందిగా కదిలాడు. చేత్తో కారు డోర్హాండిల్ పట్టుకున్నాడు.‘‘మా అమ్మ దేవత. స్వర్గంలో ఉన్న దేవదూత మా అమ్మగా వచ్చిందనుకుంటాను.’’కుర్రాడు కోపం పట్టలేక ‘‘గో టు హెల్. మా అమ్మ దెయ్యం. మీ అమ్మ రాక్షసి’’ అంటూ డోర్ తెరచుకుని, కదులుతున్న కార్లోంచి దూకాడు సూట్ కేస్తో సహా.ఈ పరిణామాన్ని ఊహించని షిప్ట్లెట్ మరో వంద అడుగుల తర్వాత కారాపాడు.సూర్యుడు మేఘాల చాటున దాక్కున్నాడు. కారు వెనకవైపున మరో మేఘం. ప్రపంచంలోని కల్మషమంతా తనను కబళించివేయబోతోంది. ఇంతమురికిని కడిగేయ్యటం ఎవరి తరం? ఆ పని దేవుడు చెయ్యాల్సిందే.పిడుగులు పడ్డాయి.రాళ్లవాన కురిసింది. కారు మోబిల్ వైపు పరుగుతీసింది. ఆంగ్ల మూలం : ఫ్లానెరీ ఓకానర్ అనువాదం: ముక్తవరం పార్థసారథి -
రైస్ ఫ్లోర్ సూప్
కావలసినవి చిన్నచిన్న ముక్కలుగా తరిగిన క్యారట్ + క్యాబేజి + బీన్స్ + బఠాణీ – 5 కప్పులు; బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్లు; ఉల్లి తరుగు – ఒక టేబుల్ స్పూను; పచ్చి మిర్చి – 2 (చిన్న ముక్కలుగా కట్ చేయాలి); అల్లం తురుము – ఒక టేబుల్ స్పూను; వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూను; మిరియాల పొడి – ఒక టీ స్పూను; కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూను; పాలు – 2 టేబుల్ స్పూన్లు; కొత్తి మీర – కొద్దిగా; బటర్ – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత తయారి ∙స్టౌ మీద బాణలి వేడి చేశాక, బటర్ వేసి కరిగించాలి ∙ఉల్లి తరుగు, అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ∙కూర ముక్కలు, ఉప్పు జత చేసి మరో రెండు నిమిషాలు వేయించాలి ∙మూడు కప్పుల నీళ్లు జత చేసి, ముక్కలు మెత్తబడేవరకు ఉడికించాలి ∙ఒక చిన్న గిన్నెలో పాలు, బియ్యప్పిండి వేసి బాగా కలిపి, ఉడుకుతున్న కూరముక్కలలో వేసి సన్నటి మంట మీద ఐదు నిమిషాలు ఉంచాలి ∙మిరియాల పొడి, కొత్తిమీర జత చేస్తే, వేడి వేడి రైస్ ఫ్లోర్ సూప్ రెడీ అయినట్లే ∙బ్రెడ్ లేదా పావ్తో అందించాలి. -
చలి మొదలైంది...
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో చలి మొదలైంది. తెల్లవారుజామున, సాయంత్రం, రాత్రి వేళల్లో వీస్తున్న చలిగాలులు సిటీజనులను వణికిస్తున్నాయి. ఆదివారం కనిష్టంగా 19 డిగ్రీలు, గరిష్టంగా 30 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 30 శాతానికి పడిపోయింది. చర్మ, శ్వాస సమసమస్యలున్న రోగులు, వృద్ధులు చలితో ఇబ్బందులు పడుతున్నారు. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప మార్పులుంటాయని బేగంపేట్లోని వాతావరణ శాఖ తెలిపింది. -
శీతాకాలంలో పెరగనున్న హృద్రోగ ముప్పు..
లండన్ : శీతాకాలంలో గుండె జబ్బుల ముప్పు అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. చలికాలంలో శీతల గాలులు, తక్కువ సూర్యరశ్మి కారణంగా రక్తనాళాలు కుచించుకుపోయే ప్రమాదం ఉందని, ఇది గుండె పోటుకు దారితీయవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. గుండెకు ఆక్సిజన్ సరఫరా తగ్గి పెనుముప్పు ఎదురయ్యే అవకాశం పది శాతం అధికమని అథ్యయన రచయిత, లండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ ఎర్లింగె వెల్లడించారు. శీతాకాలంలో జలుబు, ఫ్లూ జ్వరాలు సాధారణం కాగా, గుండె జబ్బుల రిస్క్ కూడా అధికమని చెప్పారు. జీరో సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో ఈ ముప్పు అధికమని వెల్లడించారు. స్వీడిష్ నేషనల్ రికార్డులను 1998 నుంచి 2013 వరకూ పరిశోధకులు విశ్లేషించి ఈ అంచనాకు వచ్చారు. 50 నుంచి 89 ఏళ్ల మధ్య 2,74,000 మంది సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. తక్కువ ఉష్ణోగ్రతలతో పాటు చలిగాలులు, సూర్యరశ్మి తక్కువగా ఉండే రోజుల్లో గుండె పోటు ముప్పు అధికమని ప్రొఫెసర్ ఎర్లింగె తెలిపారు. ఉష్ణోగ్రతలు సున్నా సెంటీగ్రేడ్ (32 డిగ్రీల ఎఫ్) కంటే తక్కువగా ఉన్న రోజుల్లో గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుందని తమ పరిశోధనలో వెల్లడైందని చెప్పారు. ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్కు పెరిగిన సందర్భాల్లో గుండె పోటు రిస్క్ తక్కువగా ఉన్నట్టు గుర్తించామన్నారు. రక్త సరఫరా నిలిచిపోయి గుండె కణాలు నిర్జీవమవడంతో వచ్చే గుండెపోటు అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణించాలన్నారు. శీతాకాలంలో కొవ్వు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం కూడా గుండె ఆరోగ్యానికి హానికరమని, అలాగే సూర్యరశ్మి తక్కువగా ఉండటంతో విటమిన్ డీ సరిగ్గా అందకపోవడం కూడా గుండె జబ్బుల రిస్క్ పెంచుతుంది. కాగా అథ్యయన వివరాలు జామా కార్డియాలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. -
ఎముకలు కొరికే చలిలో ఐస్క్రీం..
సాక్షి, మహేంద్రగఢ్ : మండువేసవిలో ఉక్కపోత, శీతాకాలంలో భరించలేని చలి ఎవరికైనా అనుభవమే. అయితే హరియాణాలోని మహేంద్రగఢ్లో సంత్రామ్ అనే వ్యక్తి మాత్రం దీనికి సరిగ్గా వ్యతిరేకం. సంత్రామ్కు వేసవిలో చలి, శీతాకాలంలో వేడిగా అనిపిస్తుంటుందని చెబుతున్నాడు. భానుడు భగభగ మండే ఏప్రిల్, మే నెలల్లో ఆయన దుప్పట్లు లేకుండా ఉండలేడట. పైగా చలి మంటలు సైతం వేసుకుని ఊరట పొందుతానంటాడు. ఇక శీతాకాలం ఎముకలు కొరికే చలిలో సంత్రామ్కు ఉక్కపోతగా ఉంటుందట. చలికాలంలో వేడిని తట్టుకునేందుకు ఆయన ఎంచక్కా ఐస్క్రీంలు లాగిస్తానని చెబుతున్నాడు. సంత్రామ్ నివసించే డెరోలి గ్రామస్తులు సైతం ఆయన చిన్నప్పటి నుంచీ ఇలాగే ఉండేవాడని అంటున్నారు. -
సంక్షేమ హాస్టళ్లను వణికిస్తున్న చలిపులి
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రాన్ని చలిపులి వణికిస్తోంది. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు చలికి గజగజ వణుకుతున్నారు. చలికాలం వచ్చినా దుప్పట్లు, రగ్గులు, పరుపులు ఇంకా పూర్తిస్థాయిలో పంపిణీ చేయకపోవడం, చాలా హాస్టళ్లకు కిటికీలు, తలుపులు లేకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు దోమలు విజృంభిస్తున్నాయి. ఈ సమస్యలతో విద్యార్థులు రాత్రిళ్లు నిద్రకు దూరమై చదువుపై శ్రద్ధ చూపలేకపోతున్నారు. మరికొందరు చలికి, దోమలకు తట్టుకోలేక ఇంటి బాట పడుతున్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వ యంత్రాంగం మాత్రం మిన్నకుంటోంది. శీతాకాలం వచ్చినా.. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు 2,020 ఉన్నాయి. వీటిల్లో 1,88,917 మంది విద్యార్థులు ఉన్నారు. ఆయా హాస్టళ్లలో దాదాపు 500పైగా ప్రైవేటు భవనాలతోపాటు శిథిల భవనాల్లో కొనసాగు తున్నాయి. హాస్టళ్లను తగ్గించుకుంటూ వస్తున్న ప్రభుత్వం కనీసం ఉన్న హాస్టళ్ల లోనైనా సదుపా యాలను కల్పించడం లేదు. ఏటా శీతా కాలంలో విద్యార్థులు చలికష్టాలు ఎదుర్కొం టున్నారు. ఇంకా వసతి గృహాల్లో దుప్పట్లు, పరుపులు పంపిణీ చేయలేదు. ఆగస్టులో పంపిణీ చేశామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఒక్కో పరుపుపై ముగ్గురు చొప్పున విద్యార్థులు నిద్రిస్తున్నారు. కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేక ఇద్దరేసి ఒక దుప్పటితో సరిపెట్టుకుంటున్నారు. కిటీకీలు, తలుపులు లేని హాస్టల్స్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో నిద్ర పట్టక చలిమంటలతో జాగారం చేస్తున్న సంఘటనలున్నాయి. దోమల బెడద తీవ్రంగా ఉంది. దోమతెరలు ఇస్తామని గతంలోనే ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఇంతవరకు ఆ హామీ నెరవేరలేదు. విద్యార్థులు ఇటు చలి, అటు దోమల బెడదతో నిద్రకు దూరమై అనారోగ్యం బారినపడుతున్నారు. స్కూలుకెళ్లినా నిద్రలేమితో చదువుపై శ్రద్ధచూపలేకపోతున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఇలా.. - తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కోటీకేశ్వరం బీసీ హాస్టల్ పరిస్థితి దయనీయంగా ఉంది. శిథిల భవనంలో వసతి గృహాన్ని నిర్వహిం చలేక స్థానిక హైస్కూల్లోనే మూడు గదులను హాస్టల్ కింద నిర్వహిస్తున్నారు. అందు లోనూ కిటికీలు, తలు పులు లేక చలితో విద్యార్థులు సతమతమవుతున్నారు. కిర్లంపూడి, అద్దరిపేట, ములకపూడి బీసీ హాస్టల్స్ ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్నారు. - కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులోని స్థానిక బీసీ బాలుర వసతి గృహం అద్దె భవనంలో ఉంది. అందులో 85 మంది విద్యార్థులు ఉంటే మూడు గదులు మాత్రమే ఉన్నాయి. ఆ గదులు చాలక వరండాలోనే నిద్రిస్తున్నారు. ఈ చలికాలంలో వారి పరిస్థితి దయనీయంగా ఉంది. ఇదే జిల్లాలో పెడనలో కూడా ఇదే పరిస్థితి ఉంది. - కర్నూలులో బి క్యాంపులో ఉన్న బీసీ హాస్టల్లో 220 మంది విద్యార్థులు ఉన్నారు. భవనం శిథిలావస్థకు చేరుకుంది. కిటికీలు, తలుపులు లేకపోవడంతో విద్యార్థులు దుప్పట్లను, గోనె సంచులను అడ్డుపెట్టుకుని చలిగాలుల నుంచి రక్షించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. కప్పుకునేందుకు దుప్పట్లు చాలక అల్లాడుతున్నారు. ఇందులో విచిత్రం ఏమిటంటే.. ఆ హాస్టల్ జిల్లా ఉన్నతాధికారులకు కూతవేటు దూరంలోనే ఉంది. అయినా హాస్టల్ వైపు తొంగిచూసినవారు లేరు. -
చలి పంజా
చలి పంజా దెబ్బకు జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. రుతువులు కూడా సహజ కాలాన్ని మరచి మందగమనంతో సాగుతున్నాయి. చలి దుప్పటే ఎక్కువ కాలం జిల్లాను కప్పుతోంది. జనవరి ప్రారంభంలో శిశిర రుతువు (ఆకురాల్చే కాలం) ప్రారంభం కావాల్సి ఉండగా దాని ఊసే లేదు. ఉదయం పూట నులివెచ్చని గాలులు వీచి హాయి గొల్పాల్సి ఉండగా దాని జాడే లేదు. వేర్వేరు సంవత్సరాల్లో ఒకే రోజు ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. చిలకలూరిపేటటౌన్: వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా జీవైన శైలిలో క్రమేణా మార్పులు సంభవిస్తున్నాయి. పెద్ద మొత్తంలో వెలువడుతున్న కర్బన ఉద్గారాల ప్రభావంతో భూతాపం పెరిగిపోతోంది. ఫలితంగా కొన్ని రుతువుల మందగమనం కనిపిస్తోంది. కొన్ని రుతువులు కాలపరిమితులు రెట్టింపు దశకు చేరుకుంటున్నాయి. దీంతో ఏ సీజన్ ఎన్ని నెలలు కొనసాగుతుందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. శీతాకాల, వర్షాకాలాల పరిధి క్రమేణా తగ్గిపోతున్నాయి. రెండు నెలల నిడివిగా ఉండాల్సిన ఒక్కో రుతువు రెట్టింపు నెలలు కొనసాగుతున్నాయి. రుతువులు కూడా తారుమారు.. హేమంత ఋతువు (చలికాలం), గ్రీష్మ (వేసవి కాలం) రుతువుల మధ్య ఉన్న రెండు నెలల కాలాన్నే శిశిర రుతువు అని, దీన్నే ఆకురాలే కాలం అంటాం. ఈ రుతువులో చలి క్రమేణా తగ్గుముఖం పట్టి నులివెచ్చని గాలులు వీయాలిఉంది. జనవరి మాసాంతంలో ఈ రుతువు ప్రభావం ఇప్పుడు పూర్తి మారినట్లు కనిపిస్తోంది. మొదటి పక్షం రోజులు రాత్రి విపరీతమైన చలి వచ్చి తర్వాతి రోజుల్లో ఎండలు పెరుగుతున్నాయి. పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. జిల్లా అంతటా ఒకే రోజు రాత్రి ఉష్టోగ్రత 10 డిగ్రీల సెంటిగ్రేడ్కు పడిపోయిన రికార్డు 1936 డిసెంబర్ 31న నమోదైంది. మరో పదేళ్లకి 1946 లో ఒకరోజు 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత అంత తక్కువ సగటు ఉష్ణోగ్రత ఆదివారం (21 జనవరి 2018) అర్ధరాత్రి నమోదైంది. ఈ సీజన్లో ఎప్పుడూ లేని విధంగా 16 డిగ్రీల కనిష్ట స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 25న 70 ఏళ్ల కిందట నాటి పరిస్థితులు పునరావృతం కానున్నాయని, వచ్చే గురువారం 14 డిగ్రీలకు పడిపోతుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరో రెండు డిగ్రీల కనిష్టానికి చేరుకున్నా ఆశ్యర్యపడాల్సిన అవసరం లేదని హెచ్చరిస్తున్నారు. చలితో పాటు పెరుగుతున్న ఎండ.. వాస్తవానికి జనవరి ముగింపు నాటికి పగటి పూట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతూ చలిగాలులు, మంచు పడటం చాలా వరకు తగ్గుముఖం పడుతూ ఉండాలి. కానీ గడిచిన ఐదేళ్ల నుంచి శీతోష్ణస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2014లో జనవరిలో పగటి పూట గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు కాగా ఈ ఏడాది జనవరిలో 32 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రిళ్లు కనిష్ట ఉష్ణోగ్రత 2014లో 21 డిగ్రీలుగా నమోదు కాగా ఈ ఏడాదిలో ఈ నెలలో 16 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఎండ పెరిగే కొద్దీ చలి తగ్గాల్సి ఉండగా సమాంతరంగా చలి కూడా పెరగడం గమనార్హం. అనేక రంగాలపై తీవ్ర ప్రభావం.. జిల్లా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి తయారీ, పాడి పరిశ్రమ రంగాలపై చలి ప్రభావం పడింది. విద్యారంగంలో పరీక్షల ఫీవర్ మొదలు కావడంతో విద్యార్థులు చలిలో తెల్లవారుజామున లేవలేని పరిస్థితి. పాడి పరిశ్రమపై ఆధారపడే పోషకులకు మరో నెలపోతే పాలిచ్చే పశువులన్నీ ఒట్టిపోయే పరిస్థితి. నిర్మాణం, తయారీ రంగాలకు చెందిన కార్మికులు ఫ్యాక్టరీలు, నిర్మాణ స్థలాలకు వెళ్లడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూలీలు తెల్లవారుజామునే గ్రామాల నుంచి పల్లెల నుంచి పట్టణాలకు రావాల్సి ఉండటంతో రవాణా కష్టతరమవుతుంది. ఇక రహదారులను మంచుతెర కప్పుకోవడంతో ఉదయం 9 వరకూ వాహనం తీయలేని పరిస్థితి. అగ్ని పరీక్షలా డ్రైవింగ్.. చలి కాలంలో సర్వీస్లకు వెళ్లాలంటే దేవుడు గుర్తొస్తున్నాడు. ఒక వైపు మంచు, మరోవైపు చలి. డ్రైవింగ్ చేస్తున్నంత సేపు ఎప్పుడు సూర్యోదయం అవుతుందా? అన్న ఎదురుచూపే మాకు దిక్కు. ప్రమాదాలు ఎక్కువ సంభవించే కాలం కూడా ఇదే. చలికి తట్టుకుని డ్రైవింగ్ చేయడం అగ్నిపరీక్షలా మారింది. – ఎస్.నాయక్, హైదరాబాద్ సర్వీస్ ఆర్టీసీ డ్రైవర్ రాత్రి షిప్టులు మానుకున్నా.. నెలలో 15 రోజుల మాత్రమే పరిశ్రమకు వెళ్తున్నా. రాత్రి షిఫ్టులు వేస్తే మానుకున్నా. ఈ చలిలో పనికి వెళ్లాలంటే భయమేస్తోంది. చలి తీవ్రత వల్ల ఎంతో మంది కార్మికులు పనులు మానుకుంటున్నారు. ఇది సామన్యులకు తీవ్ర నష్టం కలుగజేస్తోంది. ఆరోగ్యానికి ఓటు వేసి ఆగిపోతున్నాం. – కె.బాలు, రోజు కూలి -
రోడ్డును చీల్చుకొని వచ్చినట్లుంది కదా..!
-
రోడ్డును చీల్చుకొని వచ్చినట్లుంది కదా..!
న్యూయార్క్ : అమెరికాలో విపరీతంగా ఉన్న చలి జనాలనేకాదు.. జంతుజాలాన్ని సైతం బెంబేలెత్తిస్తోంది. ముఖ్యంగా ఉత్తర కరోలినాలో గత వారం వాతావరణంలో విపరీత మార్పులు చోటుచేసుకొని మునుపెన్నడూ లేనంత భయంకరంగా కనిపిస్తోంది. తీవ్రమైన చలి ధాటికి అక్కడి వాగులు, వంకలు, చిన్నచిన్న నీటి జలాశయాలు గడ్డకట్టుకుపోయాయి. పార్క్లల్లో ఏర్పాటు చేసిన నీటి గుంటలు కూడా గడ్డకట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో జంతువులు నరకం చూశాయి. అందుకు సాక్ష్యంమిచ్చేలా ఓ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా మొసళ్లు 40 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు ఉండే నీటిలో జీవిస్తాయి. కానీ, విపరీతమైన చలికారణంగా గడ్డ కట్టుకుపోయిన స్వామ్ పార్క్లోని ఓ నీటి గుంటలో మొసళ్లన్నీ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ప్రాణాలను రక్షించుకునేందుకు తమ బాడీ మొత్తం నీటిలో పెట్టి కేవలం శాసేంద్రియాలు బయటకు ఉండేలా తలపైకెత్తి రక్షించండి మహాప్రభో అన్నట్లుగా చూస్తున్నాయి. ఆ నీటి గుంటల్లో కేవలం అవి తల పైకి పెట్టిన చోట తప్ప మిగితా మొత్తం కూడా గాజు ఫలకలా నీరు గడ్డకట్టుకుపోయింది. వాటి పరిస్థితి ఏమిటో చూడాలంటే ఈ వీడియో చూడాల్సిందే..