కల్తీ కల్లు దొరకక మహిళ ఆత్మహత్య | woman died due to lack of adulterated liquor | Sakshi
Sakshi News home page

కల్తీ కల్లు దొరకక మహిళ ఆత్మహత్య

Published Wed, Sep 23 2015 4:22 PM | Last Updated on Sun, Sep 3 2017 9:51 AM

woman died due to lack of adulterated liquor

నర్వ(మహబూబ్‌నగర్): కల్తీ కల్లుకు అలవాటుపడిన మహిళ కల్లు దొరకకపోవడంతో వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలం కొంకణివారిపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. వివరాలు... గ్రామానికి చెందిన బోయ బుచ్చమ్మ(48) గత కొంతకాలంగా కల్తీ కల్లుకు అలవాటు పడింది.

వారం రోజులుగా కల్లు లభించకపోవడంతో మతిస్థిమితం కోల్పోయినట్లు ప్రవర్తిస్తూ.. మంగళవారం రాత్రి వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన స్థానికులు అంబులెన్స్ సాయంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవరారం నాడు ఆమె మృతిచెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement