యెమెన్ నుంచి స్వదేశానికి చేరిన భారతీయులు | 190 Indians evacuated from Yemen reach Mumbai | Sakshi
Sakshi News home page

యెమెన్ నుంచి స్వదేశానికి చేరిన భారతీయులు

Published Thu, Apr 2 2015 10:25 AM | Last Updated on Sat, Sep 2 2017 11:45 PM

190 Indians evacuated from Yemen reach Mumbai

ముంబై: యెమెన్ సంక్షోభంలో చిక్కుకున్న 190 మంది భారతీయులు ఈ రోజు తెల్లవారుజామున భారత వైమానికి దళానికి చెందిన విమానంలో ముంబై చేరుకున్నారని ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. మరో విమానం ద్వారా 169 మంది కేరళలోని కొచ్చిలో దిగారని తెలిపారు. వారందరిని వారివారి స్వస్థలాలకు తరలించేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టిందని ఉన్నతాధికారులు వివరించారు.

యెమెన్లో సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను ఐఎన్ఎస్ సుమిత్ర ద్వారా జిబౌతిలోని పోర్ట్ సిటీ అడెన్ నగరం చేర్చగా... అక్కడి నుంచి వారందరిని భారతీయ వాయు సేనకు చెందిన విమానాల ద్వారా భారత్కు తరలిస్తున్నారు. దాదాపు 4 వేల మంది భారతీయులు యెమెన్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. వారందరిని స్వదేశానికి తరలించేందుకు కేంద్ర మంత్రి వీకే సింగ్ ఇప్పటికే జిబౌతి చేరుకుని చర్యలు చేపట్టిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement