Yemen
-
కేరళ నర్సుకు మరణశిక్ష..భారత ప్రభుత్వం కీలక ప్రకటన
న్యూఢిల్లీ:యెమెన్లో కేరళ నర్సు నిమిషప్రియ(36)కు మరణశిక్ష విధించిన అంశంలో భారత విదేశాంగశాఖ స్పందించింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ తెలిపారు. నిమిష కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు.యెమెన్ జాతీయుడి హత్య కేసులో కేరకు చెందిన నర్సు నిమిష ప్రియ నిందితురాలిగా ఉన్నారు. యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఇటీవలే నిమిష మరణశిక్షను ధృవీకరించారు. ఈ శిక్షను నెల రోజులలోపు అమలు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో నిమిష మరణశిక్ష రద్దు చేయించేందుకు ఆమె తల్లి ప్రేమకుమారి చేసిన శ్రమంతా అధ్యక్షుడి నిర్ణయంతో వృథా అయింది.ఈ ఏడాది మొదట్లోనే యెమెన్ వెళ్లిన నిమిష తల్లి అప్పటినుంచి ఇదే పని మీద అక్కడే ఉంటున్నారు. ఇక నిమిషను శిక్ష నుంచి కాపాడే శక్తి ఆమె చేతిలో హత్యకు గురైన కుటుంబ సభ్యులు, గిరిజన నేతల చేతిలోనే ఉంది. వారు క్షమాభిక్ష పెడితేనే నిమిష మరణశిక్ష నుంచి బయటపడుతుంది.నిమిషప్రియ 2017లో జరిగిన యెమెన్ జాతీయుడు అబ్దో మెహదీ హత్య కేసులో యెమెన్లో అరెస్టయ్యారు. ఆ తర్వాత సంవత్సరానికి ఆమెను ఈ కేసులో దోషిగా తేల్చిన కోర్టు మరణశిక్ష విధించింది. అనంతరం సుప్రీంకోర్టు నిమిష అప్పీల్ను తిరస్కరించింది. తాజాగా అధ్యక్షుడు ఆమె మరణశిక్షను ధృవీకరించారు.ఇదీ చదండి: క్లాస్మేట్ను చంపిన టీనేజర్కు జీవితఖైదు -
ఇజ్రాయెల్ బాంబు దాడి.. త్రుటిలో తప్పించుకున్న WHO చీఫ్ గుటేరస్
యెమెన్: పలు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ గ్యాబ్రియాసిస్(Tedros Adhanom Ghebreyesus)పై చూపించింది. బాంబు దాడి నుంచి ఆయన తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ షాకింగ్ ఘటన యెమెన్ దేశంలో చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ వైమానిక దాడి నుంచి ఆయన అదృష్టవశాత్తు తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.వివరాల ప్రకారం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ గురువారం యెమెన్ దేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితికి చెందిన ఉద్యోగులతో కలిసి ఖైదీల విడుదల, యెమెన్లో పరిస్థితులపై చర్చించేందుకు అక్కడికి వెళ్లారు. చర్చల అనంతరం ఆయన యెమెన్ నుంచి బయలుదేరుతున్న క్రమంలో వైమానిక బాంబు దాడి జరిగింది. సనాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆరోగ్య సంస్థకు చెందిన అధికారులు వేచి ఉన్న సమయంలో బాంబు దాడి జరిగింది. ఈ ప్రమాదంలో టెడ్రోస్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా.. ఇద్దరు మృతిచెందారు. ఇక, ఈ దాడిని ఐక్యరాజ్యసమితి సైతం తీవ్రంగా ఖండించింది.అనంతరం, ఈ దాడి ఘటనపై టెడ్రోస్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. టెడ్రోస్ ట్విట్టర్లో..‘ఐక్యరాజ్యసమితికి చెందిన ఉద్యోగులతో కలిసి ఖైదీల విడుదలపై చర్చలు, యెమెన్లో ఆరోగ్యం, మానవతా పరిస్థితులను అంచనా వేసేందుకు అక్కడికి వెళ్లాం. ఖైదీలను తక్షణమే విడుదల చేయాలని మేము పిలుపునిచ్చాం. సనాలో విమానం ఎక్కేందుకు వేచిఉండగా బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. విమానంలోని ఓ సిబ్బంది గాయాలపాలయ్యారు. ఘటన జరిగిన ప్రాంతానికి, మాకు కొన్ని మీటర్ల దూరం మాత్రమే ఉంది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియచేస్తున్నాం’ అని కామెంట్స్ చేశారు.Our mission to negotiate the release of @UN staff detainees and to assess the health and humanitarian situation in #Yemen concluded today. We continue to call for the detainees' immediate release.As we were about to board our flight from Sana’a, about two hours ago, the airport… pic.twitter.com/riZayWHkvf— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) December 26, 2024ఈ దాడిని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ (Antonio Guterres) ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘ఇటీవల యెమెన్, ఇజ్రాయెల్ల మధ్య దాడులు తీవ్రతరం అయ్యాయి. సనా అంతర్జాతీయ విమనాశ్రయంతో సహా ఎర్రసముద్రం, ఓడరేవులు, యెమెన్లో పవర్ స్టేషన్లపై వైమానిక దాడులు ఆందోళనకరంగా ఉన్నాయి’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలన్నారు. పౌరులు, కార్మికులే లక్ష్యంగా దాడులు చేయకూడదన్నారు. మరోవైపు. యెమెన్లోని సనా విమానాశ్రయం, ఇతర నౌకాశ్రయాలపై, పలు విద్యుత్కేంద్రాలపై గురువారం ఇజ్రాయెల్ (Israel) వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో పలువురు మృతి చెందారు. Israeli terrorism spreads to Yemen 🇾🇪🇮🇱Innocent civilians are forced to flee after Israel targets the airport in Sanaa. Israel's record of attacking unarmed women and children continues unabated. pic.twitter.com/DcnALJN8Nh— Robert Carter (@Bob_cart124) December 26, 2024 -
అమెరికా యుద్ధనౌకపై హూతీల దాడి: పెంటగాన్
న్యూయార్క్: తమ యుద్ధనౌకపై యెమెన్ హుతీ తిరుగుబాటుదారులు దాడి చేశారని అమెరికా వెల్లడించింది. బాబ్ అల్-మందాబ్ జలసంధిని దాటుతున్న సమయంలో రెండు అమెరికా డిస్ట్రాయర్లు లక్ష్యంగా హుతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు, క్షిపణులతో దాడి చేశారని పెంటగాన్ పేర్కొంది. అయితే.. హైతీ రెబల్స్ ప్రయోగించిన డ్రోనన్లు, క్షిపణులను యుద్ధనౌకలోని సిబ్బంది వెంటనే స్పందించి తిప్పి కొట్టారని అమెరికా వెల్లడించింది. ఇక.. ఈ ఘటనలో యుద్ధనౌకకు ఎటువంటి నష్టం జరగలేదని, సిబ్బందిలో కూడా ఎవరూ గాయపడలేదని వెల్లడించింది.‘‘అమెరికా యుద్ధనౌకలపై ఐదు యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణులు, మూడు యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణులతో హౌతీ రెబల్స్ దాడికి పాల్పడ్డారు. అయితే.. వాటిని యుద్ధనౌకలోని సిబ్బంది విజయవంతంగా తిప్పికొట్టారు. యుద్ధనౌకలు దెబ్బతినలేదు. అందులోని సిబ్బంది కూడా ఎవరూ గాయపడలేదు. మరోవైపు.. అమెరికా అబ్రహం లింకన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్పై కూడా దాడి చేశామని హుతీలు చేసిన వాదన సరైనది కాదు. మా వద్ద ఉన్న సమాచారం ఆధారంగా.. హుతీ తిరుగుబాటుదారుల దాడి జరగలేదు’’ అని పెంటగాన్ ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైడర్ తెలిపారు.నవంబర్ 2023లో ఎర్ర సముద్రం, ఏడెన్ గల్ఫ్లో హుతీ రెబల్స్ పలు నౌకలపై దాడి చేయడం మొదలుపెట్టారు. గాజాలో ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడులకు త్యరేకంగా హౌతీ తిరుగుబాటుదాడులు ఇజ్రాయెల్, వాటి మిత్ర దేశాలపై నౌకలపై దాడులకు దిగుతున్న విషయం తెలిసింది. ఇక.. అక్టోబరు 7న హమాస్ దాడి తర్వాత గాజాలో ప్రారంభమైన ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా.. లెబనాన్, ఇరాక్, సిరియా, యెమెన్లలో ఇరాన్ మద్దతుగల గ్రూప్లు దాడులు చేస్తున్నాయి. -
ఇజ్రాయెల్పై డ్రోన్ దాడులు జరిపాం: హౌతీ రెబల్స్
ఇరాన్, ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ సమీపంలో డ్రోన్ దాడులు చేసినట్లు యెమెన్ హౌతీ రెబల్స్ ప్రకటించాయి. గురువారం ఉదయం ఆక్రమిక పాలస్తీనాలోని జాఫా (టెల్ అవీవ్) ప్రాంతంలో పలు కీలక లక్ష్యాలను టార్గెట్ చేసి మరీ డ్రోన్ ఆపరేషన్ చేపట్టినట్లు హౌతీరెబల్స్ తెలిపాయి. తాము ప్రయోగించిన డ్రోన్లను ఇజ్రాయెల్ ఎదుర్కోకపోయింది. దీంతో తాము చేసిన డ్రోన్ దాడుల ఆపరేషన్ విజయవంతమైనట్లు పేర్కొంది.Yemen’s Houthi group says it “achieved its goals” in a drone attack on Tel Aviv, although there was no confirmation from Israeli authorities.“The operation achieved its goals successfully as the drones reached their targets without the enemy being able to confront or shoot them… pic.twitter.com/izNdIn7eAa— GAROWE ONLINE (@GaroweOnline) October 3, 2024 క్రెడిట్స్: GAROWE ONLINEయెమెన్ హౌతీ రెబల్స్ డ్రోన్ దాడులను ఇప్పటివరకు ఇజ్రాయెల్ అధికారికంగా గుర్తించకపోవటం గమనార్హం. గత రాత్రి అనుమానాస్పద వైమానిక టార్గెట్లను తాము అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. మరోవైపు.. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేయకంటే ముందే హౌతీలు ఇజ్రాయెల్పై క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు బుధవారం పేర్కొంది.యెమెన్లోని చాలా ప్రాంతాలను నియంత్రించే హౌతీ తిరుగుబాటుదారులు.. హమాస్పై మద్దతుగా ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్కు మద్దతు ఇచ్చే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో హౌతీ రెబల్స్ ఓ భాగం. ఇటీవల యెమెన్లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహిస్తుండగా .. ఇజ్రాయెల్ నగరాలపై హౌతీ రెబల్స్ క్షిపణులు ప్రయోగించి దాడులు చేశాయి.చదవండి: ‘హత్యకు ముందే కాల్పుల విరమణకు నస్రల్లా అంగీకారం’ -
ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్.. ఏ దేశం ఎటువైపు!
ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి.. ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా గాజాకు తీసుకువెళ్లటంతో గతేడాది అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైంది. హమాస్కు మద్దతుగా ఉండే లెబనాన్ దేశంలోని హెజ్బొల్లా గ్రూప్, యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో ఈ యుద్ధం కాస్త.. ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాన్ దేశాలకు విస్తరించింది. ఇక.. మంగళవారం ఇరాన్.. ఇజ్రాయెల్పై చేసిన భీకర మిసైల్స్ దాడితో ఒక్కసారిగా పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకొని ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.ఇజ్రాయెల్, ఇరాన్ మిత్రదేశాల మధ్య ఇటీవల కాలంలో దాడుల తీవ్రత విస్తరిస్తూ వస్తోంది. ఇలాగే కొనసాగితే.. ఈ దాడులు అరబ్ దేశాలు, అమెరికాకు విస్తరించే అవకాశం ఉన్నట్లు యుద్ధ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్లో ఇరాన్ ఇజ్రాయెల్పై మిసైల్స్తో మెరుపు దాడిని చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇరాన్కు యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు, లెబనాన్లోని హెజ్బొల్లా గ్రూప్, సిరియన్ సైన్యం నుంచి కూడా మద్దతు లభించింది. మరోవైపు.. ఇజ్రాయెల్ రక్షణకు దాని మిత్రదేశాలు (అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్), అరబ్ దేశాలైన జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ మద్దతుగా నిలిచి సహాయం అందించాయి.అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడుల నేపథ్యంలో ఏయే దేశాలు ఎవరికి మద్దతుగా నిలుస్తున్నాయనే చర్చ జరుగుతోంది.ఇజ్రాయెల్మిత్ర దేశం అమెరికా సాయం, ఐరన్ డోమ్ రక్షణతో ఇజ్రాయెల్ అక్టోబరు 2023 నుంచి గాజా స్ట్రిప్లోని హమాస్, లెబనాన్లోని హెజ్బొల్లా, యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులతో పోరాడుతోంది. ఇరాన్, ఇరాన్ మద్దతు మిలిటెంట్ గ్రూప్లను దాడులకు ప్రతిదాడులతో హెచ్చరిస్తూ.. గాజాలో హమాస్ను తుడిచిపెట్టేవరకు తమ దాడులను ఆపబోమని తేల్చిచెబుతోంది.ఇజ్రాయెల్ మిత్రదేశాలు: అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్, సౌదీ అరేబియాప్రత్యర్థులు: హౌతీలు, హమాస్, ఇరాన్, హెజ్బొల్లాఇరాన్గతంలో ప్రాక్సీ మిటిటెంట్ల గ్రూప్ల ద్వారా ఇరాన్.. ఇజ్రాయెల్పై ఎక్కువగా దాడి చేసింది. అనూహ్యంగా ఇటీవల ఏప్రిల్లో, మంగళవారం ఇరాన్ ఇజ్రాయెల్పకై ప్రత్యక్ష దాడులను ప్రారంభించింది. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్య , టెహ్రాన్లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే హత్యకు ప్రతీకారంగా ఇరాన్ అక్టోబర్ 1(మంగళవారం) ఇజ్రాయెల్పై 200లకుపైగా మిసైల్స్తో భీకర దాడులు చేసింది. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. అనంతరం ఇరాన్ ప్రతీకార చర్యలు భాగంగా ఇజ్రాయెల్పై 17 డ్రోన్లు, 120 బాలిస్టిక్ క్షిపణులను మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ కూడా క్రమంగా ఇజ్రాయెల్ను ఇరుకున పెట్టేందుకు పశ్చిమాసియా ప్రాంతంతో తన మిత్రదేశాలను సాయాన్ని మరింతగా సమీకరించుకుంటోంది.ఇరాన్ మిత్రపక్షాలు: యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, హమాస్ప్రత్యర్థులు: ఇజ్రాయెల్, అమెరికా, సౌదీ అరేబియాసౌదీ అరేబియాఇజ్రాయెల్తో దృఢమైన భద్రతా సంబంధాలను కలిగి ఉంది. కానీ దౌత్యపరంగా మాత్రం కఠినంగా వ్యవహరిస్తుంది. ఒక వైపు ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండిస్తూ.. గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం పిలుపునిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్లో ఇజ్రాయెల్పై దాడి చేయాలనే ఇరాన్ ప్రణాళికలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇజ్రాయెల్కు పంపిన దేశాలలో సౌదీ అరెబీయా ఒకటి.ఖతార్ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో ఖతార్ కీలక పాత్ర పోషిస్తోంది. అయినప్పటికీ, ఖతార్ హమాస్ నేత ఇస్మాయిల్ హనియెహ్కు ఆశ్రయం ఇచ్చింది. అదేవిధంగా ఇరాన్తో సత్సంబంధాలను కలిగి ఉంది. ఈ విషయంలో ఇజ్రాయెల్కు చాలా ఇష్టం లేకపోవటం గమనార్హం.జోర్డాన్ఈ ఏడాది జనవరిలో దేశంలోని అమెరికా ఆర్మీ స్థావరంపై ఇరాన్ మద్దతుగల మిలిటెంట్లు దాడి చేసి ముగ్గురు సైనికులను అంతం చేశారు. అనంతరం జోర్డాన్ కూడా తీవ్ర సంఘర్షణలో చిక్కుకుంది. జోర్డాన్ గాజాకు సహాయాన్ని పంపినప్పటికీ.. ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలను కూడా కొనసాగించింది. -
ఇజ్రాయెల్పై మిసైల్ దాడి
జెరూసలెం: ఇజ్రాయెల్పై హౌతీ గ్రూపు మిలిటెంట్లు ఆదివారం(సెప్టెంబర్15) ఉదయం మిసైల్తో దాడి చేశారు.యెమెన్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు.తూర్పు వైపు నుంచి మిసైల్ దూసుకువచ్చింది. అది ఓ బహిరంగ ప్రదేశంలో పడింది. మిసైల్ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలవలేదని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది.మిసైల్ దాడి కారణంగా రాజధాని టెల్అవీవ్తో పాటు సెంట్రల్ ఇజజ్రాయెల్లో సైరన్ అలర్ట్ మోగింది. దీంతో పౌరులు సురకక్షిత పప్రాంతాల్లో తలదాచుకునేందుకు పరుగులు పెట్టారు.క్షిపణి దాడితో భారీ శబ్దాలు వచ్చాయని, ఐరన్డోమ్ వ్యవస్థ క్షిపణిపై దాడి చేయడం వల్లే ఈ శబ్దాలు వచ్చాయని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది.కాగా, జులైలో యెమెన్ కేంద్రంగా పనిచేసే హౌతీ మిలిటెంట్లు రాజధాని టెల్అవీవ్పై చేసిన డ్రోన్ దాడిలో ఓ పౌరుడు మృతి చెందాడు. ఇరాన్ మద్దతుతోనే హౌతీలు దాడులు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి..పేలిన ఆయిల్ ట్యాంకర్.. 25 మందికిపైగా మృతి -
చమురు ట్యాంకర్కు మంటలు
ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల దాడులకు గురైన ‘సోయూనియన్’ అనే 900 అడుగుల భారీ చమురు ట్యాంకర్ ఇది. ఆగస్ట్ 21వ తేదీన ట్యాంకర్కు అంటుకున్న మంటలు ఇప్పటికీ చల్లారలేదు. ఇందులోని 10 లక్షల బ్యారెళ్ల ముడి చమురు లీకైతే మునుపెన్నడూ లేనంతగా సముద్ర పర్యావరణానికి హాని కలుగుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే, సాధ్యమైనంత మేర ట్యాంకర్లోని చమురును తరలించే అత్యంత క్లిష్టమైన ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. గ్రీస్కు చెందిన ఈ నౌక యాజమాన్యం ఈ విషయంలో సౌదీ అరేబియా సాయం కోరింది. అప్పటి వరకు మరిన్ని దాడులు జరగకుండా గ్రీస్, ఫ్రాన్సు నౌకలు ‘సోయూనియన్’కు కాపలాగా ఉన్నాయి. -
అమెరికాకు షాక్.. డ్రోన్ను కూల్చేసిన ‘హౌతీ’లు
సనా: అమెరికాకు చెందిన అత్యాధునిక నిఘా డ్రోన్ను కూల్చేసినట్లు యెమెన్ కేంద్రంగా పనిచేసే మిలిటెంట్ గ్రూపు హౌతీ రెబెల్స్ ప్రకటించారు. యెమెన్ గగనతలంలో ఎగురుతున్న ఎమ్క్యూ-9 మానవరహిత విమానాన్ని(యూఏవీ) కూల్చేసినట్లు హౌతీల ప్రతినిధి యాహ్యా సారీ తెలిపారు. హౌతీ నియంత్రణలోని యెమెన్ భూభాగంపై అమెరికా వైమానిక దాడులకు పాల్పడినట్లు ఆరోపించారు.2014లో యెమెన్ రాజధాని సనాను హౌతీలు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికాకు చెందిన పలు డ్రోన్లు, నిఘా విమానాలను రెబెల్స్ కూల్చేశారు. ‘మారిబ్ గవర్నరేట్ గగనతలంలో రీపర్ శత్రు కార్యకలాపాలకు పాల్పడుతోంది. అందుకే దానాని కూల్చేశాం. పాలస్తీనా ప్రజలు, యెమెన్ రక్షణ కోసం హౌతీలు దాడులు కొనసాగిస్తూనే ఉంటారు’అని సారీ చెప్పారు.ఎమ్క్యూ-9 రీపర్ డ్రోన్.. ఎన్నో ప్రత్యేకతలు..అమెరికా నిఘా డ్రోన్ ఎమ్క్యూ-9 విమానాన్ని పోలి ఉంటుంది. దీన్ని రిమోట్తో ఆపరేట్ చేస్తారు. పైలట్లు ఉండరు. సాధారణ డ్రోన్లతో పోలిస్తే ఈ నిఘా డ్రోన్ చాలా ఎత్తులో ఎగరగలదు. 50 వేల అడుగుల ఎత్తులో 24 గంటలపాటు నిరంతరాయంగా ఎగురుతూ కీలక సమాచారం సేకరించే సామర్థ్యం దీని సొంతం. దీని విలువ సుమారు రూ.250కోట్లకు పైనే.కాగా, ఇజ్రాయెల్- పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్కు మధ్య జరుతున్న యుద్ధంలో హౌతీ రెబెల్స్ పాలస్తీనాకు మద్దతు పలుకుతున్నారు. ఎర్రసముద్రంలోని వాణిజ్య నౌకలు లక్ష్యంగా కొంత కాలం నుంచి హౌతీలు దాడులు చేస్తున్నారు. ఇటీవల గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో ఓ వాణిజ్య నౌకపై మిసైల్తో దాడి చేశారు. -
హౌతీల స్థావరాలపై అమెరికా దాడులు
వాషింగ్టన్ : హౌతీ గ్రూపు మిలిటెంట్లు తమ ఆయుధాలు దాచుకున్న యెమెన్లోని వారి భూగర్భ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు జరిపింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్( సెంట్కామ్) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడుల్లో హౌతీలకు చెందిన నాలుగు అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్స్ (యూఏవీ)లను ధ్వంసం చేసినట్లు అమెరికా తెలిపింది. దాడుల సమయంలో హౌతీలు ఎర్ర సముద్రంలోకి నాలుగు యాంటీ షిప్ బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించినట్లు సెంట్కామ్ వెల్లడించింది. హౌతీల దాడుల్లో నౌకలకు, సిబ్బందికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీల దాడులను నివారించేందుకే వారి ఆయుధ స్థావరాలపై దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించింది. కాగా, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ మిలిటెంట్లు గత కొంతకాలంగా దాడులు చేస్తున్నారు. దీంతో ఆసియా నుంచి యూరప్, అమెరికా వెళ్లే నౌకలు దక్షిణాఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీంతో అంతర్జాతీయ నౌకాయాన ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. ఇదీ చదవండి.. గాజాలో కాల్పుల విరమణ.. యూఎన్లో వీగిన అమెరికా తీర్మానం -
అల్ఖైదా నేత ఖలిద్ అల్ బతర్ఫీ మృతి
యెమెన్ అల్-ఖైదా శాఖ నేత ఖలిద్ అల్ బతర్ఫీ మృతి చెందాడు. ఆదివారం అర్థరాత్రి ఉగ్రవాదులు ఈ సమాచారాన్ని అందించారు. అరేబియన్ పెనిన్సులా (ఏక్యూఏపీ) గ్రూపులో అల్-ఖైదాకు నాయకత్వం వహిస్తున్న ఖలిద్ అల్ బతర్ఫీపై యూఎస్ఏ ప్రభుత్వం ఐదు మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది. ఏక్యూఏపీ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ హత్య అనంతరం ఈ తీవ్రవాద గ్రూపును అత్యంత ప్రమాదకరశాఖగా పరిగణిస్తున్నారు. అల్-ఖైదా తాజాగా దీనికి సంబంధించి ఒక వీడియోను విడుదల చేసింది. దానిలో ఖలిద్ అల్ బతర్ఫీ శరీరానికి అల్ఖైదా జెండాను చుట్టినట్లు కనిపిస్తోంది. ఖలిద్ అల్ బతర్ఫీ కి 40 ఏళ్లు ఉంటాయని భావిస్తున్నారు. ‘సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ రంజాన్ మాసం సందర్భంగా దీనికి సంబంధించిన వివరాలు తెలియజేసింది. యెమెన్లో సోమవారం నుంచి ముస్లింల పవిత్ర మాసం ప్రారంభం కానుంది. -
Houthi Rebels: హౌతీ స్థావరాలపై అమెరికా దాడులు
సనా: యెమెన్లోని హౌతీ మిలిటెంట్ల స్థావరాలపై అమెరికా ఆర్మీ మళ్లీ దాడులు జరిపింది. ఈ విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్(సెంట్కామ్) వెల్లడించింది. హౌతీలకు చెందిన యాంటీ షిప్ క్రూయిజ్ మిసైళ్లు, మానవ రహిత ఉపరితల ఓడ, మానవ రహిత జలాంతర్గామిపై దాడులు జరిపినట్లు తెలిపింది. ‘ఎర్ర సముద్రంలో అమెరికాకు చెందిన వాణిజ్య నౌకలు, ఇతర దేశాల మధ్య సముద్ర రవాణాకు హౌతీల నుంచి పెను ముప్పు పొంచి ఉంది. హౌతీలు తొలిసారిగా మానవరహిత జలాంతర్గాములను వాడుతున్నారు. ఎర్ర సముద్ర రవాణాను రక్షించేందుకే హౌతీ స్థావరాలపై ఆత్మరక్షణ దాడులు చేశాం’అని సెంట్కామ్ అధికారులు తెలిపారు. పాలస్తీనాకు మద్దతుగా కేవలం ఇజ్రాయెల్ నౌకలపైనే దాడులు చేస్తామని తొలుత ప్రకటించిన హౌతీలు ఎర్ర సముద్రం నుంచి వెళ్లే అమెరికా,బ్రిటన్తో పాటు ఇతర దేశాల వాణిజ్య నౌకలపైనా దాడులు చేస్తున్నారు. దీంతో ఆసియా నుంచి అమెరికా వెళ్లే వాణిజ్య నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఇదీ చదవండి.. చేజారిన తోడే.. బొడ్డు తాడై -
యెమెన్లో హౌతీల స్థావరాలపై అమెరికా దాడులు
వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులపై అమెరికా కూటమి కన్నెర్ర చేసింది. యెమెన్లో డజన్ల కొద్ది హౌతీ స్థావరాలపై అమెరికా, యూకే దాడులు జరిపాయి. దాదాపు 13 ప్రదేశాల్లో 36 స్థావరాలపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. హౌతీల ఆయుధ సామాగ్రిని లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా కూటమి స్పష్టం చేసింది. జనవరి 28న జోర్డాన్లో ముగ్గురు అమెరికా సైనికులను దుండగులు హత్య చేశారు. దీనికి వ్యతిరేకంగా ఇరాక్, సిరియాలో ఇరాన్-సంబంధిత లక్ష్యాలపై అమెరికా దాడులు చేసింది. ఈ దాడులు జరిపిన ఒక రోజు తర్వాత యెమెన్లో మళ్లీ ఉమ్మడి వైమానిక దాడులు జరిగాయి. "అంతర్జాతీయ వాణిజ్య షిప్పింగ్తో పాటు ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించే నౌకలపై హౌతీల నిరంతర దాడులకు ప్రతిస్పందనగా యెమెన్లోని 13 ప్రదేశాలలో 36 హుతీ స్థావరాలపై దాడి చేశాం" అని యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్ సహా ఇతర దేశాల కూటమి స్పష్టం చేసింది. హౌతీల ఆయుధాల నిల్వలపై, క్షిపణి వ్యవస్థలు, లాంచర్లు, వాయు రక్షణ వ్యవస్థలు, రాడార్లతో ఉన్న స్థావరాలపై దాడులు జరిగాయి. ఎర్ర సముద్రంలో నౌకలపై ప్రయోగించడానికి సిద్ధమైన ఆరు హౌతీ యాంటీ షిప్ క్షిపణులపై అమెరికా సంయుక్త దళాలు విడివిడిగా దాడులు చేశాయని సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది. హమాస్పై ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా హౌతీలు ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ నౌకలపై దాడులు చేస్తున్నారు. మొదట ఇజ్రాయెల్ నౌకలపై దాడులు చేస్తామని ప్రకటించిన హౌతీలు.. ఇతర దేశాల నౌకలపై కూడా దాడులు ప్రారంభించాయి. దీంతో అమెరికా సహా 12 దేశాలు ఏకమై ఎర్ర సముద్రంలో హౌతీల దాడులకు అడ్డుకట్టవేస్తున్నాయి. ఇదీ చదవండి: ఇరాక్, సిరియాల్లోని లక్ష్యాలపై అమెరికా దాడులు -
బ్రిటిష్ నౌకపై హౌతీల దాడి
జెరూసలేం: యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు మళ్లీ రెచి్చపోయారు. బ్రిటిష్ చమురు ట్యాంకర్తోపాటు మొట్టమొదటిసారిగా అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ కారీ్నపైకి క్షిపణులను ప్రయోగించారు. బ్రిటిష్ చమురు నౌక మంటల్లో చిక్కుకోగా, అందులోని 22 మంది భారతీయ సిబ్బందిని కాపాడేందుకు భారత నావికా దళం ఐఎన్ఎస్ విశాఖపట్నం అక్కడికి హుటాహుటిన తరలి వెళ్లింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి ఎర్ర సముద్రంలోని ఏడెన్ సింధులో చోటుచేసుకుంది. బ్రిటిష్ చమురు నౌక ఎంవీ మర్లిన్ లువాండా లక్ష్యంగా హౌతీలు ప్రయోగించిన క్షిపణితో నౌకలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. విపత్తు సమాచారం అందుకున్న భారత నేవీకి చెందిన డె్రస్టాయర్ ఐఎన్ఎస్ విశాఖపట్నం అక్కడికి చేరుకుంది. నౌకలో మంటలను ఆర్పి, సిబ్బందిని కాపాడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నౌకలోని సిబ్బందిలో 22 మంది భారతీయులతోపాటు ఒక బంగ్లాదేశీ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని కలగలేదని సమాచారం. ఇలా ఉండగా, ఏడెన్ సింధు శాఖలో పయనించే చమురు నౌకలే లక్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారుల దాడులు పెరిగిన నేపథ్యంలో అమెరికాకు చెందిన యుద్ధ నౌక యూఎస్ఎస్ కార్నీని మోహరించింది. ఈ నౌకపైకి శుక్రవారం హౌతీలు మొట్టమొదటిసారిగా క్షిపణిని ప్రయోగించారు. దీనిని మధ్యలోనే కూల్చివేసినట్లు అమెరికా నేవీ ప్రకటించింది. -
హౌతీలపై భూతల దాడులకు యెమెన్ పిలుపు
యెమెన్, సనా: ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హౌతీలపై తిరుగుబాటుకు యెమెన్ పిలుపునిస్తోంది. అయితే.. హౌతీలపై భూతల దాడులు చేయడానికి తమ సైన్యానికి తోడుగా ఇతర దేశాల సైన్యం సహకారం అవసరమని యెమెన్ అధ్యక్ష మండలి డిప్యూటీ నాయకుడు అన్నారు. ఎడెన్ పోర్టు సమీపంలో అమెరికా నౌకపై హౌతీలు దాడి జరిపిన అనంతరం ఆయన ఈ మేరకు మాట్లాడారు. ఎడెన్ పోర్టు ప్రాంతంలో అమెరికా నౌకపై క్షిపణులతో దాడి చేశామని హౌతీ తిరుగుబాటుదారులు శుక్రవారం ఉదయం ప్రకటించారు. అయితే.. ఈ దాడిలో తమ నౌకకు ఎలాంటి నష్టం జరగలేదని, ఎలాంటి ప్రాణ నష్టం కూడా సంభవించలేదని అమెరికా స్పష్టం చేసింది. హౌతీల యాంటీ షిప్ క్షిపణిపై అమెరికా దాడులు జరిపిన మరుసటి రోజే ఎడెన్ పోర్టు ప్రాంతంలో హౌతీలు రెచ్చిపోయారు. 'హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా, యూకే వైమానిక దాడులతో పాటు భూతల యుద్ధానికి మాకు విదేశీ సహాయం అవసరం. ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ నావిగేషన్ను సురక్షితంగా ఉంచడానికి అంతర్జాతీయ, ప్రాంతీయ కూటమి అవసరం" అని యెమెన్ డిప్యూటీ ప్రెసిడెంట్ కౌన్సిల్ లీడర్ ఐదారుస్ అల్-జుబైది అన్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఇరాన్ మద్దతుతో హౌతీ తిరుగుబాటుదారులు ఎర్రసముద్రంలో ఇజ్రాయెల్ నౌకలపై దాడులు ప్రారంభించారు. ఇజ్రాయెల్కు వెళ్లే నౌలపైనే కాకుండా ఇతర దేశాల నౌకలపై కూడా హౌతీల దాడులు విస్తరించాయి. దీంతో అమెరికా సహా మిత్రపక్షాలు ఏకమై ఎర్రసముద్రంలో హౌతీల దాడుల నుంచి నౌకలను రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదీ చదవండి: Pakistan Strikes On Iran: ఇరాన్పై పాక్ ప్రతీకార దాడి -
ఎర్రసముద్రంలో యుద్ధమేఘాలు.. హౌతీ క్షిపణిని కూల్చివేసిన అమెరికా
వాషింగ్టన్: ఎర్రసముద్రంలో అలజడి నానాటికీ పెరిగిపోతోంది. హౌతీ తిరుగుబాటుదారులు, అమెరికా మిత్రపక్షాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. హౌతీల దాడులకు అమెరికా మిత్రపక్షాలు అడ్డుకట్ట వేసే క్రమంలో ఇరువైపుల నుంచి దాడులు జరుగుతున్నాయి. తాజాగా అమెరికా సాయుధ నౌకపై హౌతీలు ప్రయోగించిన యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణిని అమెరికా ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కూల్చివేసింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఎవరూ గాయపడలేదని పేర్కొంటూ సామాజిక మాధ్యమంలో పేర్కొంది. యెమెన్లోని హుడైదా సమీపంలో క్షిపణిని కూల్చివేసినట్లు స్పష్టం చేసింది. యెమెన్ గగనతలం, తీరప్రాంతానికి సమీపంగా అమెరికా విమానాలు ఎగురుతున్నట్లు హౌతీ ప్రతినిధి మహ్మద్ అబ్దుల్సలామ్ ఫిర్యాదు చేశారు. అమెరికా చర్య యెమెన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని అభివర్ణించారు. ఎర్ర సముద్రంలో హౌతీల దాడులు పశ్చిమాసియాలో ఆందోళనలను పెంచుతోంది. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో హమాస్కు మద్దతుగా హౌతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్కు సంబంధించిన నౌకలపైనే దాడులు చేస్తున్నామని తెలుపుతున్నప్పటికీ.. యూరప్ సహా అనేక దేశాల ఓడలపై దాడులు జరుగుతున్నాయి. దీనిని ఖండించిన అమెరికా మిత్రపక్షాలు హౌతీల దాడులకు అడ్డుకట్ట వేయడానికి నడుం బిగించాయి. ఎర్ర సముద్రంలో హౌతీలపై దాడులు పెంచుతున్నాయి. ఇదీ చదవండి: Israel-Hamas war: యుద్ధజ్వాలలకు... 100 రోజులు -
America Britain Attacks : టర్కీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
అంకారా: యెమెన్లోని హౌతీ గ్రూపు స్థావరాలపై అమెరికా, బ్రిటన్ చేస్తున్న వైమానిక దాడులపై టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డొగాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలు హౌతీలపై అవసరమైన దానికంటే ఎక్కువ దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. హౌతీలపై దాడులకు దిగడం ద్వారా ఎర్ర సముద్రాన్ని రక్త సముద్రంగా మార్చేందుకు అమెరికా, బ్రిటన్ ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. వివిధ మార్గాల ద్వారా తమకు అందుతున్న సమాచారం ప్రకారం అమెరికా, బ్రిటన్ల దాడుల నుంచి హౌతీలు తమను తాము రక్షించుకుంటూ సరైన రీతిలో స్పందిస్తున్నారని ఎర్డోగాన్ తెలిపారు. తాము కూడా అమెరికా, బ్రిటన్ల దాడులపై అవసరమైన రీతిలో స్పందిస్తామని చెప్పారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా యెమెన్కు చెందిన హౌతీ గ్రూపు మిలిటెంట్లు ఎర్ర సముద్రం నుంచి వెళ్లే వాణిజ్య నౌకలపై డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు దిగుతున్నారు. ఈ దాడులు ఎక్కువవడంతో అమెరికా, బ్రిటన్లకు చెందిన వైమానిక బలగాలు తాజాగా యెమెన్లోని హౌతీ గ్రూపు స్థావరాలు లక్ష్యంగా దాడులు జరిపి పలు స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇదీచదవండి.. చైనా బొగ్గు గనిలో భారీ పేలుడు.. 10 మంది మృతి -
'బ్లడ్ మనీ డీల్': మరణశిక్ష పడ్డ కూతురు కోసం ఓ తల్లి చేస్తున్న సాహసం!
బిడ్డ ఆపదలో ఉంటే ఏ తల్లి అయినా తల్లడిల్లిపోతుంది. అప్పటిదాక గడప దాటని అమాయకపు తల్లి అయినా బిడ్డ జోలికొస్తే.. శివంగిలా మారిపోతుంది. ఏదో విధంగా కాపాడాలని తపించిపోతుంది. అలానే ఇక్కడొక తల్లి కూడా వెరొక దేశంలో అనుకోని పరిస్థితుల్లో మర్డర్ కేసులో చిక్కుకుని విలవిలలాడుతున్న కూతుర్ని రక్షించాలని తప్పనపడింది. అందుకు ఆ దేశం వెళ్లి బాధితులతో నేరుగా మాట్లాడి ఒప్పందం చేసుకోవడమే ఒక్కటే ఆ తల్లి ముందున్న మార్గం. అయితే ఆ దేశానికి భారతీయ పౌరులెవ్వరికి వెళ్లేందుకు అనుమతి లేదు. అయినప్పటికీ ఆ తల్లి హైకోర్టులో పోరాడి అనుమతి తెచ్చుకుని మరీ వెళ్లేందుకు పయనమవుతుంది. అక్కడ వాళ్లతో 'బ్లడ్ మనీ డీల్' చేయబోతోంది. ఏంటీ బ్లడ్ మనీ డీల్..? ఏంటా ఆ తల్లి గాథ అంటే.. నిమిషా ప్రియా అనే ఒక నర్సు 2011లో యెమెన్కి వెళ్లింది. అక్కడ ఆమె సనాలో నర్సుగా పనిచేసేది. అయితే ఏం జరిగిందే ఏమో 2017 యెమెన్ పౌరుడైన తలాల్ అబ్దో మహదీని హత్య చేసింది. ఆమె సన్నిహితుల ప్రకారం..ఆమె పాస్పోర్ట్ని మహదీని తీసుకుని ఇవ్వకపోవడంతో ఎలాగైన అతడి నుంచి తీసుకునే క్రమంలో మహదీన్కి మత్తు మందులను ఇంజెక్ట్ చేసింది. దీంతో అతడు మరణించాడు. ఏం చేయాలో పాలుపోని నిమిషా తన సహోద్యోగి హనన్ సాయంతో ట్యాంకులో పడేసే క్రమంలో అతడి శవాన్ని ముక్కలు చేశారు. అయితే నిమిషా పోలీసులకు దొరికిపోయింది. దీంతో యెమెన్ ట్రయల్ కోర్లు కేసుని విచారించి..నిమిషాకి మరణ శిక్ష విధించగా, ఆమె సహోద్యోగికి జీవత ఖైదు విధించింది. 2018 నుంచి నిమిషా యెమెన్ జైలులోనే ఉంది. అప్పటి నుంచి నిమిషా కుటుంబం ఆమెను రక్షించేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. నిమిషా కుటుంబం ఈ విషయమై యెమెన్ సుప్రీం కోర్టుకు కూడా అప్పీలు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే..? అక్కడ ఆమె అప్పీలును తిరస్కరించింది యెమెన్ సుప్రీం కోర్టు. దీంతో నిమిషా కుటుంబానికి మిగిలిన ఏకైక ఆశ బాధితుడి కుటుంబంతో చేసుకునే 'బ్లడ్ మనీ డీల్' ఒప్పందం ఒక్కటే. ఈ ఒప్పందం కుదిరితే నిమిషాకి శిక్ష తప్పుతుంది తిరిగి భారత్లోని తన కుటుంబం చెంతకు వెళ్లిపోవచ్చు. అందుకోసం ఆమె తల్లి ప్రేమ కుమారి యెమెన్కి వెళ్లాలనుకుంది. కానీ 2017లో కేంద్రం యెమెన్కి ట్రావెల్ బ్యాన్ విధించింది. దీని కారణంగా ప్రభుత్వ అనుమతి లేకుండా యోమెన్కి వెళ్లటం ఆమెకు అసాధ్యం అందుకని ఆమె ఢిల్లీ కోర్టుని ఆశ్రయించింది. అయితే ధర్మాసనం ఈ విషయంలో కాస్త సడలింపు ఇవ్వాలని, ఆ తల్లికి కూతురుని రక్షించుకోవడానికి యెమెన్ వెళ్లేలా అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే కేంద్రం యెమెన్తో భారత్కు దౌత్య సంబంధాలు లేవని, అక్కడి రాయబార కార్యాలయాన్ని మూసివేసినట్లు పేర్కొంది. అందువల్ల ఆ దేశంతో ఎలాంటి అంతర్జాతీయ ఒప్పందాలు వర్తించవని కేంద్రం తన వాదనను హైకోర్టుకి తెలిపింది. దీంతో హైకోర్టు భారత ప్రభుత్వానికి ఎటువంటి బాధ్యత లేకుండా తన స్వంత పూచీతో బాధ్యతతో ప్రయాణిస్తానని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆ తల్లిని కోరింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఇవాళ (బుధవారం)ఆ తల్లికి పశ్చిమ ఆసియా దేశమైన యెమెన్ వెళ్లి తన కూతురు విడుదల కోసం "బ్లడ్ మనీ డీల్" చేసుకోవడానికి అనుమతి మంజూరు చేసింది. 'బ్లడ్ మనీ డీల్' అంటే.. యెమెన్ షరియా చట్టాల ప్రకారం ఆమెను విడుదల చేయడానికి బాధితురాలి కుటుంబం నిర్ణయించిన పరిహారం ఇచ్చేలా నేరుగా చర్చలు జరపడాన్ని " బ్లడ్ మనీ డీల్" అంటారు. అందుకోసం ఆ తల్లి వెళ్లడం అత్యంత ముఖ్యం. ఏదీఏమైన తన కూతురు కోసం ఆ తల్లి పడుతున్న కష్టం ఫలించాలని ఆశిద్దాం. (చదవండి: ఆ మహిళ కడుపునొప్పే షాకివ్వగా..బయటపడ్డ మరో ట్విస్ట్ చూసి కంగుతిన్న వైద్యులు) -
భారత్కు రావాల్సిన కార్గో షిప్ హైజాక్!
టెల్ అవీవ్: తుర్కియే నుంచి భారత్ రావాల్సిన కార్గో షిప్ ఎర్ర సముద్రంలో హైజాక్కు గురైంది. యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఈ ఘటనకు పాల్పడ్డారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇరాన్ ఆధారిత ఉగ్రవాదంగా పేర్కొన్న ఇజ్రాయెల్.. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత తీవ్ర పరిణామాలకు దారితీసే చర్యగా తెలిపింది. వివిధ దేశాలకు చెందిన 25 మంది సిబ్బంది కూడా ఓడలో ఉన్నారని వెల్లడించింది. బ్రిటీష్ యాజమాన్యంలోని జపాన్ నిర్వహిస్తున్న కార్గో షిప్ను హౌతీ తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. షిప్లో ఇజ్రాయెల్ పౌరులెవ్వరూ లేరని స్పష్టం చేశారు. ఇది ఇరాన్ ఆధారిత ఉగ్రవాదంగా పేర్కొన్న నెతన్యాహు.. అంతర్జాతీయ స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఇరాన్ చర్యలను ఆయన ఎండగట్టారు. The hijacking of a cargo ship by the Houthis near Yemen in the southern Red Sea is a very grave incident of global consequence. The ship departed Turkey on its way to India, staffed by civilians of various nationalities, not including Israelis. It is not an Israeli ship. — Israel Defense Forces (@IDF) November 19, 2023 షిప్ హైజాక్కు బాధ్యత వహిస్తున్నట్లు హౌతీ ఉగ్రవాదులు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్కు చెందిన ఓటను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. షిప్ను యెమెన్ పోర్టుకు తీసుకువచ్చినట్లు చెప్పారు. దీనిని ఇజ్రాయెల్ ఖండించింది. అది తమ ఓడ కాదని వెల్లడించింది. బ్రిటీష్ యాజమాన్యంలోని ఓడగా స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ ఓడ జపాన్ నిర్వహణలో ఉందని వెల్లడించింది. అందులో ఉన్న 25 మంది సిబ్బంది ఉక్రెయిన్, బల్గేరియా, ఫిలిప్పీన్స్, మెక్సికోకు చెందినవారని పేర్కొంది. ఇజ్రాయెల్పై దాడులను ఉదృతం చేస్తామని హౌతీ తిరుగుబాటుదారులు గతవారం ప్రకటించారు. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ ఆధారిత ఓడలన్నింటిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ జెండాలు కలిగిన షిప్లను హైజాక్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఇజ్రాయెల్ ఓడల్లో ఇతర పౌరులు పనిచేయకూడదని కూడా హౌతీ హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. హమాస్ అంతమే ధ్యేయంగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అయితే.. పాలస్తీనాకు మద్దతుగా ఇరాన్ ఆధారిత హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడుతున్నారు. ఇదీ చదవండి: Napoleon Bonaparte: రికార్డు ధరకు నెపోలియన్ టోపీ -
యెమెన్లో కేరళ నర్సుకు నిరాశ
ఢిల్లీ: యెమెన్లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయ నర్సుకు నిరాశే ఎదురైంది. ఆమె మరణశిక్షపై దాఖలు చేసిన అప్పీల్ను ఆ దేశ సుప్రీంకోర్టు తిరస్కరించింది. మరోవైపు తన కూతుర్ని విడిపించడానికి యెమెన్ వెళ్లాలని బాధితురాలి తల్లి చేసిన అభ్యర్థనపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని గురువారం కోరింది. కేరళకు చెందిన నిమిషా ప్రియ అనే మహిళ తన పాస్పోర్ట్ను తిరిగి పొందే ప్రయత్నంలో తలాల్ అబ్దో మహదీ అనే వ్కక్తికి మత్తుమందు ఇచ్చి చంపినట్లు కోర్టు దోషిగా తేల్చింది. మరణశిక్ష విధించింది. ఈ కేసులో 2017 నుంచి నిమిషా ప్రియ యెమెన్లో జైలు శిక్ష అనుభవిస్తోంది. అరబ్ దేశంలో అంతర్యుద్ధం కారణంగా 2017 నుంచి భారతీయ పౌరులకు ప్రయాణ నిషేధం ఉంది. అయినప్పటికీ యెమెన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ ప్రియా తల్లి ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రియను విడుదల చేయడానికి మహదీ కుటుంబంతో నష్టపరిహారం గురించి చర్చలు జరపడానికి యెమెన్ వెళ్లాలని కోరుకుంటోంది. తన బిడ్డను కాపడటానికి తప్పకుండా యెమెన్ వెళ్లాల్సి ఉందని ధర్మాసనానికి ప్రియ తల్లి విన్నవించుకున్నారు. అందుకు ప్రయాణ నిషేధం అడ్డుగా ఉందని పేర్కొన్నారు. యెమెన్ ప్రయాణ నిషేధాన్ని సడలించవచ్చని ప్రభుత్వ తరుపు న్యాయవాది తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లో భారతీయులు యెమెన్ వెల్లడానికి ప్రభుత్వం అంగీకరించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రియా విడుదల కోసం "సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్" అనే బృందం 2022లో హైకోర్టును ఆశ్రయించింది. నిమిషా ప్రియను రక్షించేందుకు దౌత్యపరమైన జోక్యం చేసుకోవడంతో పాటు కేంద్రం చర్చలు జరపాలని కోరింది. అయితే.. ప్రియాను రక్షించడానికి పరిహారం గురించి చర్చలు జరపాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్టు తెలిపింది. ఆమెను దోషిగా నిర్ధారించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని ధర్మాసనం వెల్లడించింది. ఇదీ చదవండి: లాటరీలో రూ.45 కోట్లు గెలుచుకున్న కేరళవాసి -
అమెరికా ఎంక్యూ–9 డ్రోన్ పేల్చివేత
సనా: ఇప్పటికే ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఘర్షణలతో పశి్చమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లు అమెరికా సైన్యంపై దాడులు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాకు చెందిన ఎంక్యూ–9 డ్రోన్ను హౌతీ మిలిటెంట్లు పేలి్చవేశారు. యెమెన్ ప్రాదేశిక జలాల్లో బుధవారం ఈ సంఘటన జరిగిందని అమెరికా సైన్యం వెల్లడించింది. హౌతీ దుశ్చర్య నేపథ్యంలో పశి్చమాసియాలో అమెరికా సేనలు అప్రమత్తమయ్యాయి. హౌతీకి ఇరాన్ ప్రభుత్వం అండగా ఉండడం గమనార్హం. -
రంజాన్ 2023: యెమెన్లో వితరణ వేళ విషాదం.. 78 మంది దుర్మరణం
సనా: యెమెన్ దేశంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని స్థానికులకు తలో 7 డాలర్లమేర ఉచిత నగదు పంపిణీ కార్యక్రమం చివరకు ఘోర విషాదంతో ముగిసింది. వందల సంఖ్యలో జనం తరలిరావడం, వారిని అదుపుచేసేందుకు సాయుధ హౌతీ తిరుగుబాటుదారులు గాల్లోకి కాల్పులు జరపడం, ఆ తూటాలు తగిలి విద్యుత్ తీగల వద్ద పేలిన శబ్దాలతో భయపడిన పేదజనం పరుగెత్తారు. దీంతో హఠాత్తుగా తొక్కిసలాట చోటుచేసుకుంది. యెమెన్ రాజధాని సనా సిటీలోని ఓ పాఠశాల ఆవరణలో జరిగిన ఈ తొక్కిసలాటలో చిన్నారులు, మహిళలుసహా 78 మంది ప్రాణాలుకోల్పోయారు.73 మంది గాయపడ్డారు. 13 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న హౌతీ తిరుగుబాటుదారులు తెలిపారు. ఓల్డ్సిటీ పరిధిలోని బాబ్ అల్–యెమెన్ ప్రాంతంలోని మయీన్ స్కూల్లో బుధవారం అర్ధరాత్రివేళ ఈ ఘోరం సంభవించింది. నగదు పంపిణీ కార్యక్రమం నిర్వహణలో విఫలమవడంతో దాతలైన ఇద్దరు స్థానిక వ్యాపారవేత్తలను అరెస్ట్చేశామని హౌతీ రెబల్స్ నేతృత్వంలోని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. దారుణ మానవ విపత్తు 2014లో యెమెన్ ఉత్తర ప్రాంతంపై పట్టు కోల్పోయిన హౌతీ తిరుగుబాటుదారులు ఆ తర్వాతి ఏడాదే దేశ రాజధానిని తమ వశంచేసుకుని ఆ ప్రాంతాన్ని పాలిస్తున్నారు. అదే ఏడాది గత ప్రభుత్వాన్ని పునరుద్ధరించేందుకు సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి ప్రయత్నించినా ఇంతవరకూ సాధ్యపడలేదు. ఆ ఆగ్రహమే పలు మలుపులు తిరిగి నాటి నుంచి సౌదీ అరేబియా, ఇరాన్ల మధ్య శత్రుత్వాన్ని కొనసాగింది. ఇన్నాళ్లలో అక్కడి ఘర్షణల్లో 1,50,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో పౌరులు, సైనికులను పొట్టనబెట్టుకున్న ఈ సంఘర్షణ ప్రపంచంలోనే అత్యంత దారుణ మానవసంక్షోభాల్లో ఒకటిగా నిలిచింది. 2.1 కోట్ల దేశజనాభాలో మూడింట రెండొంతుల మంది పేదలు అంతర్జాతీయ సాయంకోసం అర్రులుచాస్తున్నారు. -
యెమెన్ జైలుపై సౌదీ వైమానిక దాడి
దుబాయ్: యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు నిర్వహించే ఒక జైలుపై సౌదీ ఆధ్వర్యంలో శుక్రవారం వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో వందమందికి పైగా గాయపడడం, చనిపోవడం జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు యెమెన్లోని హోడైడా నగరంలో ఉన్న కమ్యూనికేషన్ సెంటర్పై వైమానిక దాడి జరగడంతో దేశమంతా ఇంటర్నెట్ సౌకర్యం నిలిచిపోయింది. ఇటీవలి కాలంలో సౌదీ, యూఏఈపై హౌతీ రెబల్స్ డ్రౌన్ దాడులు పెరిగాయి. వీటికి ప్రతీకారంగా అరబ్ దేశాల కూటమి ఈ దాడులకు దిగినట్లు తెలుస్తోంది. సదా నగరంలోని జైలుపై జరిగిన దాడిలో గాయపడిన వారిని రక్షించే కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు రెడ్క్రాస్ సంస్థ ప్రకటించింది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ విషయమై హౌతీ వర్గాలు ఇంకా స్పందించలేదు. సిరియా, ఇరాక్లో ఐసిస్ దాడులు బాగ్దాద్: ఇరాక్, సిరియాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దారుణాలకు తెగబడ్డారు. సిరియాలోని అతిపెద్ద జైలుపై దాదాపు 100మందికిపైగా ఐసిస్ ఉగ్రవాదులు గురువారం రాత్రి దాడి జరిపగా, ఇరాక్లో ఆర్మీ బ్యారక్పై శుక్రవారం విరుచుకుపడ్డారు. ఇరాక్లో జరిగిన దాడిలో 11మంది ఇరాకీ సైనికులు చనిపోగా, సిరియా జైలు దాడిలో ఏడుగురు కుర్దిష్ సైనికులు, 23 మంది ఐసిస్ ఉగ్రవాదులు మరణించగా పలువురు గాయాలపాలయ్యారు. ఇటీవల కాలంలో రెండు దేశాల్లో ఐసిస్ స్లీపర్ సెల్స్ చురుగ్గా పనిచేయడం ఆరంభించి పలువురు ఇరాకీ, సిరియన్ల మృతికి కారణమవుతున్నాయి. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్ దగ్గరలోని సైనిక శిబిరంపై ఐసిస్లు తుపాకులతో విరుచుకుపడ్డారు. దీంతో శిబిరంలో నిద్రిస్తున్న ఒక లెఫ్టినెంట్ సహా 10మంది సైనికులు చనిపోయారు. మరోవైపు సిరియాలో ఇటీవల ఐసిస్కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇందుకు ప్రతీకారంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత భారీగా గ్వేరియన్ జైలుపై దాడికి దిగారు. ఆ సమయంలో జైల్లో 3వేలమంది ఐసిస్ మిలిటెంట్లున్నారని కుర్దిష్ డెమొక్రాటిక్ బలగాల ప్రతినిధి ఫర్హాద్ షామి చెప్పారు. దాడికి ముందు జైల్లో ఉగ్రవాదులు తిరుగుబాటు చేసి పారిపోయేందుకు యత్నించారని, ఇదే సమయంలో జైలు బయట ఒక కారుబాంబు పేలిందని జైలు వర్గాలు తెలిపాయి. దాడికి దిగిన ఉగ్రవాదుల్లో సిరియన్లు లేరని, వీరంతా విదేశీయులని తెలిపారు. దాడి అనంతరం తప్పించుకున్న 89 మంది ఉగ్రవాదులను తిరిగి పట్టుకున్నారు. 2017లో ఇరాక్, 2019లో సిరియాల్లో ఐసిస్ ఓడిపోయింది. అప్పటినుంచి ఇలా మెరుపుదాడులకు దిగడం ఆరంభించింది. దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాక్ మిలటరీ ప్రతిజ్ఞ చేసింది. -
ఇరాన్ అక్రమ ఆయుధ రవాణాకు అమెరికా చెక్
దుబాయ్: ఇరాన్ నుంచి యెమెన్కు ఆయుధాల అక్రమ రవాణాను అమెరికా అడ్డుకుంది. ఒమన్, పాకిస్తాన్ సమీపంలోని అరేబియా సముద్ర జలాల్లో వెళ్తున్న చేపలు పట్టే నౌకను అమెరికా నావికా దళాలు అడ్డగించి 1,400 కలష్నికోవ్ తరహా రైఫిళ్లు, మెషీన్ గన్స్, రాకెట్ గ్రనేడ్ లాంచర్లతోపాటు దాదాపు 2.3 లక్షల రౌండ్ల తూటాలను స్వాధీనం చేసుకున్నాయి. చాన్నాళ్లుగా అంతర్యుద్ధంతో సతమతమవుతున్న యెమెన్లోని హౌతీ రెబల్స్కు ఇచ్చేందుకు వీటిని తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలపై హౌతీ రెబల్స్ పోరు కొనసాగిస్తున్నారు. ఆయుధాలను అమెరికా క్షిపణి విధ్వంసక యూఎస్ఎస్ ఓకేన్ యుద్ధ నౌకలోకి ఎక్కించి, చేపల పడవను సముద్రంలో ముంచేశారు. -
శవాల గుట్టల కోసం బావిలోకి దిగితే..
-
శవాల గుట్టల కోసం బావిలోకి దిగితే..
Yemen Hell Of Well: అదొక భారీ బావి. దూరం నుంచి చూస్తే చిన్న గుంతలా కనిపిస్తుంది. దగ్గరికెళ్లి చూస్తే.. లోపల చీకట్లు అలుముకుని భయంకరంగా అనిపిస్తుంది. దాని గురించి చుట్టుపక్కల ఉన్న ఊరి వాళ్లు కథలు కథలుగా చెప్తుంటారు. కొందరేమో దుష్టశక్తులు కొలువైన బావిగా చెప్తారు. ఎక్కువ మంది మాత్రం శవాల దిబ్బగా పేర్కొంటారు. ఖైదీలను, శత్రువులను గుంపులుగా అందులో పడేసి ఊచకోత కోసేవాళ్లని ప్రచారం వినిపించేది మొన్నటిదాకా. కానీ.. 112 మీటర్ల లోతున్న ఆ బావి నరక కూపం కాదని, అదొక ప్రకృతి అందంగా తేల్చేశారు. యెమెన్(యెమన్) ఆల్ మహారాలోని బార్హౌట్ బావి.. చాలా ఏళ్ల నుంచి ఒక మిస్టరీగా ఉండిపోయింది. లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ భారీ బావి గురించి ఎన్నో కథలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వీటన్నింటికి తేల్చేందుకు తాజాగా ఎనిమిది మంది సాహసికులతో ఓ బృందం లోపలికి దిగింది. అందులో శవాల గుట్టలుగానీ, అస్థిపంజరాలుగానీ ఏవీ కనిపించలేవు. కనీసం కంపు వాసన కూడా రాలేదు. లోయ అడుగున ఓ జలపాతం, రంగు రాళ్లు, మేలిమి ముత్యాలు దొరికాయి వాళ్లకి. కాకపోతే కొన్ని పాములు మాత్రం కనిపించాయట. అక్కడ దొరికిన వాటి మీద రీసెర్చ్ చేసి.. ఆ బావి వయసు తేల్చే పనిలో పడ్డారు పరిశోధకులు. గతంలో యెమెన్ అధికారుల బృందం ఒకటి ఈ బావిలో 50-60 మీటర్ల దాకా వెళ్లి భయంతో వెనక్కి వచ్చేసిందట. ప్రస్తుతం ఈ భారీ బావి మిస్టరీని చేధించినప్పటికీ.. ఆ ఊరి ప్రజలు మాత్రం ఆ బావి పక్కకు వెళ్లమనే చెప్తున్నారు. -
ఇంత వరకు వర్షం కురవని వింత గ్రామం.. ఎక్కడో తెలుసా!
పుడమి అంటే అద్భుతాలకు పుట్టిల్లు. ఈ ప్రపంచంలో మనకి తెలియని ఎన్నో వింతలు.. మరెన్నో విచిత్రాలు దాగున్నాయి. భూమిపై ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా వర్షం కురుస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు. కానీ, ఓ గ్రామంలో మాత్రం ఇప్పటి వరకు వర్షం కురవలేదంటే నమ్మగలరా? ఇదేంటి వింత అనుకుంటున్నారా ! అలాంటి ఓ వింత ప్రదేశాం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే.. ప్రపంచంలో అత్యధిక వర్షాలు మేఘాలయలోని మాసిన్రామ్ గ్రామంలో కురుస్తుందని తెలిసిన విషయమే కానీ అసలు వర్షం కురవని గ్రామం కూడా ఉందట. ఆ గ్రామం పేరు ‘అల్-హుతైబ్’. ఇది యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉంటుంది. కాగా ఈ గ్రామం భూమికి 3200 మీటర్ల ఎత్తులో ఉన్న ఓ కొండపై ఉంది. దీని ప్రకారం మేఘాల కంటే ఎత్తులో ఆ గ్రామం ఉన్నదన్న మాట. మేఘాల కంటే ఎత్తులో ఉండటం వలన ఈ ప్రాంతంలో వర్షాలు కురవడం లేదు. అక్కడ వాతావరణ విషయానికొస్తే ఉదయం పూట ఎండ, రాత్రి సమయం చలిగా ఉంటుంది. అక్కడ నివసిస్తున్న ప్రజలకు కూడా ఆ వాతావరణం అలవాటే. కాగా ఆ వింత ప్రాంతాన్ని చూసేందుకు టూరిస్టులు తాకిడి బాగానే ఉంటుందట. -
సుడి తిరిగింది.. కళేబరం కడుపున కోట్లు!
అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. అలాగే ఆలస్యం చేస్తే ఆ అదృష్టం అందకుండా పోవచ్చు కూడా. కానీ, యెమెన్లో కొందరు జాలర్లు అదృష్టాన్ని అమాంతం ఒడిసి పట్టుకున్నారు. రాత్రికి రాత్రే కోట్లు సంపాదించారు. ఆ దక్కిన దానితో ఊరును బాగుచేసేందుకు ఖర్చు చేస్తున్నారు కూడా. యెమెన్: చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన జాలర్ల గుంపుకి జాక్పాట్ తగిలింది. చనిపోయిన ఓ భారీ తిమింగలం కడుపు నుంచి విలువైన వస్తువును వెలికి తీశారు. దీంతో అది వాళ్ల తలరాతనే మార్చేసింది. అల్-ఖైసా గ్రామానికి చెందిన కొందరు జాలర్లకు గల్ఫ్ ఆడెన్ సమీపంలో చేపల వేటకు వెళ్లారు. ఆ టైంలో చచ్చిన భారీ తిమింగలం కళేబరం సముద్రంపైన తేలుతూ కనిపించింది. వెంటనే 35 మంది జాలర్లు.. ఆ కళేబరాన్ని అతికష్టం మీద ఒడ్డుకు లాక్కొచ్చారు. చివరికి దాన్ని చీల్చగా.. అత్యంత విలువైన అంబర్గ్రిస్ బయటపడింది. సముద్రపు బంగారం అంబర్గ్రిస్ అంటే తిమింగలం వాంతి. తిమింగలం జీర్ణించుకోలేని వాటిని కడుపులో ఘన పదార్థంగా మైనపు పదార్థం రూపంలో నిల్వ ఉంచుకుంటుంది. ఒక్కోసారి వాంతి రూపంలో వెలువడి నీళ్లలో తేలుతుంది. లేదంటే చనిపోయాక(వేటాడతారు కూడా) దాని కడుపు నుంచి బయటకు వస్తుంది. దీనిని సెంట్ల తయారీలో ఉపయోగిస్తారు. కాబట్టే భారీ డిమాండ్ ఉంటుంది. ఇక యెమెన్ జాలర్లకు స్పెర్మ్ వేల్ కడుపులో 127కేజీల బరువు అంబర్గ్రిస్ కనిపించింది. అది విలువైందని వాళ్లకు తెలుసు. కాబట్టి ఓ దుబాయ్ డీలర్ సాయంతో మార్కెట్లో దాన్ని అమ్మేశారు. అంబర్గ్రిస్ అమ్మేయాగా సుమారు రూ.10కోట్లు సొమ్ము వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ సొమ్మును ఆ 35 మంది పంచుకోవడంతోనే ఆపకుండా.. తమ కమ్యూనిటీలోని మరికొందరికి ఆర్థిక సాయం చేశారు. ఊరును బాగు చేసుకున్నారు కూడా. ఇక సువాసన వెదజల్లే అంబర్గ్రిస్కి చైనా, జపాన్, ఆఫ్రికా, అమెరికా, గల్ప్ దేశాల పముద్ర తీరాల్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఆ జనవరిలో థాయ్లాండ్లో 20 ఏళ్ల ఓ కుర్రాడికి అంబర్గ్రిస్ ముద్ద దొరకడంతో కోటీశ్వరుడు అయ్యాడు. చదవండి: పోర్న్ తీయాలనుకున్న ఆ స్టార్ దర్శకుడెవరు? -
ఎర్ర సముద్రంలో ఇరాన్ నౌకపై దాడి
దుబాయ్: ఎర్ర సముద్రంలోని యెమెన్ తీరం వద్ద లంగరేసి ఉన్న ఇరాన్ రివల్యూషనరీ గార్డ్కు చెందిన ఓ నౌకపై మంగళవారం దాడి జరిగింది. ప్రభుత్వ ఆధీనంలోని ఇరాన్ షిప్పింగ్ లైన్స్కు ఎంవీ సవిజ్ అనే నౌకపై దాడి జరిగినట్లు ధ్రువీకరించిన ఇరాన్.. ఇందుకు ఇజ్రాయెల్పైనే అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించ లేదని కూడా వెల్లడించింది. ఈ నౌకపై దాడికి పాల్పడినట్లు ఇజ్రాయెల్ తమకు సమాచారం అందించినట్లు అమెరికా ఉన్నతాధికారి ఒకరు తమకు తెలిపినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. ఎంవీ సవిజ్ వాణిజ్య నౌక అని చెబుతున్నప్పటికీ దీనిద్వారా యెమెన్లోని హౌతి తిరుగుబాటుదారులకు ఇరాన్ ఆయుదాలు సరఫరా చేస్తోందని సౌదీ అరేబియా ఆరోపిస్తోంది. ఇరాన్ నౌకపై దాడిపై స్పందించేందుకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి బెన్నీ గంట్జ్ నిరాకరించారు. ఇరాన్తోపాటు ఇరాన్ మిత్రదేశాలు తమ భద్రతకు ప్రమాదకారులని, ఇటువంటి వాటి నుంచి స్వీయ రక్షణకు చర్యలు తీసుకుంటుందని వ్యాఖ్యానిం చారు. సవిజ్ నౌక వెలుపల అమర్చిన లింపెట్ మందుపాతరతోనే పేలుడు సంభవించిందని ప్రభుత్వ అనుకూల తస్నిమ్ వార్తా సంస్థ తెలిపింది. దీంతో నౌకకు భారీ నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. చదవండి: తెలివైన జింకలు.. రౌండప్ చేశాయంటే కష్టమే! -
యెమెన్ ఎయిర్పోర్టులో భారీ పేలుడు
సనా: యెమెన్లోని ఏడెన్ నగర విమానాశ్రయంలో భారీ పేలుడు జరిగింది. దేశంలో కొత్తగా ఏర్పాటైన కేబినెట్ మంత్రులతో కూడిన విమానం రావడానికి కొంచెం ముందు ఈ పేలుడు సంభవించినట్లు ఎయిర్పోర్టు అధికారులు చెప్పారు. పేలుడుకు కారకుల వివరాలు తెలియరాలేదు. పేలుడులో 22మంది పౌరులు మరణించగా, 50మంది గాయపడ్డారు. పేలుడు సమాచారం తెలియగానే ప్రధాని, ఇతర మంత్రులు వెంటనే ఎయిర్పోర్టు నుంచి నగరంలోని ప్యాలెస్కు తరలిపోయారు. అయితే ప్యాలెస్కు సమీపంలోకూడా మరో పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. కానీ ఇందులో ఎలాంటి నష్టం వాటిల్లినట్లు తెలియరాలేదు. విమానం వచ్చాక బాంబులు పేలినట్లయితే పరిస్థితి ఘోరంగా ఉండేదని కమ్యూనికేషన్ మంత్రి నగుబి ఆల్ అవగ్ అన్నారు. ప్రస్తుతం ఎయిర్పోర్టును భద్రతా బలగాలు అధీనంలోకి తీసుకొని విచారణ జరుపుతున్నాయి. పేలుళ్లను ఐరాస తీవ్రంగా ఖండించింది. ఈజిప్ట్, జోర్డాన్, అరబ్దేశాలు సైతం దాడులను ఖండించాయి. 2014 నుంచి యెమెన్లో పౌరయుద్ధం, అశాంతి కొనసాగుతున్నాయి. సౌదీ బలపరిచే ప్రభుత్వాధినేత మన్సూర్ హది, దక్షిణాన యూఏఈ బలపరిచే సెపరేటిస్టులు, ఇతర ప్రాంతంలో ఇరాన్ బలపరిచే హౌతి రెబెల్స్ మధ్య పట్టుకోసం పోరాటం కొనసాగుతోంది. తాజాగా హది, సదరన్సెపరేటిస్టుల సంతృప్తి కోసం వారిని కూడా కలుపుకొని కొత్త కేబినెట్ను ఏర్పాటు చేశారు. యెమెన్ అంతర్యుద్ధంలో ఇప్పటికి దాదాపు 1.12 లక్షల మంది మరణించారు. -
అల్ కాయిదా టాప్ లీడర్ రిమీ హతం
వాషింగ్టన్: యెమెన్లో అమెరికా భద్రతా దళాలు జరిపిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో అల్ కాయిదా ఇన్ అరేబియన్ పెనిన్సులా (ఏక్యూఏపీ) కీలక నేత ఖాసిం అల్ రిమీ (46) హతమ య్యాడు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ధ్రువీకరించారు. రిమీ మరణంతో అరేబియన్ ద్వీపకల్పంలో అల్కాయిదా మరింత బలహీనపడుతుందని, దీంతో జాతీయ భద్రతకు ఉగ్రవాద గ్రూపుల నుంచి ముప్పు తప్పుతుందని పేర్కొన్నారు. తన ఆదేశాల మేరకు యెమెన్లోని అమెరికా దళాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ జరిపినట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే ఈ ఆపరేషన్ ఎప్పుడు, ఎలా నిర్వహించారో వెల్లడించలేదు. రిమీ 1990 ల్లో అల్కాయిదాలో చేరాడని, అఫ్గానిస్తాన్లో ఒసామా బిన్ లాడెన్ కోసం పని చేశాడని ట్రంప్ తెలిపారు. రిమీ నేతృత్వంలో అల్కాయిదా ఇన్ అరేబియన్ పెనిన్సులా (ఏక్యూఏపీ) గ్రూపు యెమెన్లోని సాధారణ పౌరులపై హింసాకాండ జరిపిందని పేర్కొన్నారు. రిమీ మరణంతో అమెరికా ఆశలు, ఆశయాలు భద్రంగా ఉన్నాయన్నారు. అమెరికాకు హాని తలపెట్టాలని చూసే ఉగ్రవాదులను ఏరిపారేసి అమెరికన్ పౌరులను కాపాడుకుంటామన్నారు. కాగా, డిసెంబర్ 6న ఫ్లోరిడాలోని అమెరికా నావల్ బేస్లో జరిగిన కాల్పులకు రిమీ నేతృత్వంలోని గ్రూపు తమదే బాధ్యత అని ప్రకటించింది. ఈ ఘటనలో ఓ సౌదీ వాయుసేన అధికారి ముగ్గురు అమెరికా నావికులను చంపాడు. రిమీకి సంబంధించిన సమాచారం ఇచ్చినవారికి కోటి డాలర్లు (10 మిలియన్ డాలర్లు) ఇస్తామని అమెరికా గతంలో ప్రకటించింది. అల్కాయిదాకు అల్జవహరి వారసుడు రిమీ అనుకుంటారు. గత కొన్ని నెలల్లో అమెరికా చేపట్టిన మూడో పెద్ద ఆపరేషన్ ఇది. గతేడాది అక్టోబర్లో ఐసిస్ నేత బగ్దాదీని, ఈ ఏడాది జనవరిలో ఇరానియన్ జనరల్ సులేమానీని అమెరికా దళాలు హతం చేశాయి. -
అతడిని అంతమొందించాం: ట్రంప్
వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ ఆల్- ఖైదా యెమెన్ చీఫ్ ఖాసీం ఆల్- రిమీని హతమార్చినట్లు అమెరికా తెలిపింది. తమ దేశ నావికా దళ అధికారులను బలి తీసుకున్నందుకు గానూ అతడిని మట్టుబెట్టినట్లు పేర్కొంది. యెమెన్లో హింసకు కారణమైన అత్యంత ప్రమాదకర వ్యక్తిని అంతమొందించినట్లు వెల్లడించింది. ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో భాగంగా ఆల్- ఖైదా ఇన్ అరేబియన్ పెనిసులా(ఏక్యూఏపీ) కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఈ ఆపరేషన్ నిర్వహించామని తెలిపింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరిట శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. యెమన్లో హింసకు పాల్పడి.. ఇక్కడ కూడా ‘‘రిమీ నేతృత్వంలో ఏక్యూఏపీ యెమెన్లో తీవ్ర హింస చెలరేగింది. ఎంతో మంది పౌరులను బలిగొన్నారు. ఇప్పుడు అమెరికా పౌరులు, అమెరికా బలగాలపై దాడులు చేసేందుకు ఆ సంస్థ ప్రణాళికలు రచించింది. అందుకే ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో భాగంగా యెమెన్లో చేపట్టిన ఆపరేషన్లో ఏక్యూఏపీ వ్యవస్థాపకుడు ఖాసీం ఆల్- రిమీని అంతమొందించాం. అతడి చావుతో ఏక్యూఏపీ, ఆల్- ఖైదా ఉద్యమం నీరుగారిపోతుంది. ఇలాంటి ఉగ్రసంస్థల వల్ల మా జాతీయ భద్రతకు భంగం వాటిల్లకుండా ఉంటుంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా గతేడాది డిసెంబరు 6న ఫ్లోరిడాలోని పెన్సాకోలా వద్ద ఉన్న నావల్ ఎయిర్ స్టేషన్పై ఓ సౌదీ అధికారి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా... ముగ్గురు అమెరికా సెయిలర్లు మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ఘటనకు బాధ్యత వహిస్తూ ఏక్యూఏపీ ముందుకువచ్చింది. ఇక ఈ ఘటనపై విచారణ జరిపిన ఎఫ్బీఐ.. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని మహ్మద్ అల్శమ్రానీగా గుర్తించింది. అతడు రాయల్ సౌదీ వైమానిక దళానికి చెందినవాడని, ప్రస్తుతం మహ్మద్ అమెరికాలో శిక్షణ పొందుతున్నాడని పేర్కొంది. మహ్మద్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాడని.. ‘‘నేను దుష్టులకు వ్యతిరేకం, అమెరికా ఓ దుష్టశక్తిగా అవతరించింది. కేవలం ముస్లింలకే కాకుండా, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలను ప్రోత్సహిస్తున్న మిమ్మల్ని ద్వేషిస్తున్నాను’’ అంటూ ఆల్-ఖైదా వ్యవస్థాకుడు ఒసామా బిన్ లాడెన్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ అనేక పోస్టులు పెట్టినట్లు గుర్తించింది. ఇదిలా ఉండగా.. మహ్మద్ చర్యను సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ తీవ్రంగా ఖండించారు. హేయమైన నేరానికి పాల్పడిన మహ్మద్ క్షమార్హుడు కాదని పేర్కొన్నారు. కాగా విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్న దాదాపు 5 వేల మంది సౌదీ బలగాల్లో దాదాపు 850 మంది అమెరికాలో శిక్షణ తీసుకుంటున్నారు. చదవండి: అభిశంసన: ట్రంప్నకు భారీ ఊరట..! కాగా మధ్యప్రాచ్య దేశమైన యెమెన్పై ఆధిపత్యం సాధించేందుకు ఆల్-ఖైదా సహా పలు ఉగ్ర సంస్థలు ప్రయత్నిస్తుండగా.. అక్కడి ప్రభుత్వానికి సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. 2014లో మొదలైన ఈ యుద్ధంలో తిరుగుబాటుదారులకు ఇరాన్ సహకారం అందిస్తోంది. అంతర్యుద్ధం కారణంగా యెమెన్లో ఎంతో మంది పౌరులు దుర్మరణం పాలవుతున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా తినడానికి తిండిలేక చిన్నారులు ఎముకల గూడులా మారి ప్రాణాలు కోల్పోతున్నారు. -
యెమెన్ రక్తసిక్తం
దుబాయ్: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న యెమెన్ మరోసారి రక్తమోడింది. మసీదులో ప్రార్థనలు చేస్తున్న సైనికులే లక్ష్యంగా జరిగిన డ్రోన్ క్షిపణి దాడిలో 80 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటనకు హుతి తిరుగుబాటుదారులే కారణమని అనుమానిస్తున్నారు. మరిబ్ ప్రావిన్సు సైనిక శిబిరంలోని మసీదులో శనివారం సైనికులంతా ప్రార్థనలు చేస్తుండగా ఈ దాడి చోటుచేసుకుంది. ఘటనలో 83 మంది సైనికులు చనిపోగా 148 మంది గాయపడ్డారని ఆస్పత్రి వర్గాల సమాచారం. 2014లో యెమెన్లో అంతర్యుద్ధం మొదలైన తర్వాత జరిగిన అతిపెద్ద దాడి ఇదే. కాగా, నిహ్మ్ ప్రాంతంలో జరిపిన సైనిక చర్యలో పెద్ద సంఖ్యలో హుతిలను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు. యెమెన్ ప్రభుత్వానికి సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు మద్దతిస్తుండగా హుతి తిరుగుబాటుదారులకు ఇరాన్ సహకారం అందిస్తోంది. తాజా ఘటనపై హుతి తిరుగుబాటు నేతలు స్పందించలేదు. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో కీలకమైన హొడైడా నౌకాశ్రయం చుట్టుపక్కల ప్రాంతం నుంచి వైదొలిగేందుకు ఇరుపక్షాలు అంగీకరించిన తర్వాత ఏడాది కాలంగా హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయి. కానీ, ఒప్పందంలోని అంశాల అమలు నత్తనడకన సాగుతుండటంతో శాంతిస్థాపనపై నీలినీడలు అలుముకున్నాయి. అంతర్యుద్ధం కారణంగా దేశంలో వేలాది మంది చనిపోగా లక్షలాదిగా జనం నిరాశ్రయులయ్యారు. దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. -
పెరగనున్న పెట్రోలు ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : సౌదీ అరేబియాలోని చమురు నిల్వలపై యెమెన్కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు శనివారం దాడి చేసిన సంఘటనలో రోజుకు 57 లక్షల బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోయింది. పర్యవసానంగా అంతర్జాతీయ మార్కెట్కు రోజుకు ఐదు శాతం చొప్పున చమురు సరఫరా నిలిచిపోయింది. పర్యవసానంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరిగి పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ చమురు మార్కెట్ నిపుణులు సోమవారం హెచ్చరించారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగకుండా నివారించేందుకు తక్షణమే అమెరికా దేశీయ చమురు నిల్వలను విడుదల చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రెండు, మూడు రోజులు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగకుండా నిలబడవచ్చని, మంటల్లో చిక్కుకుని తీవ్రంగా నష్టపోయిన సౌదీ అరేబియా చమురు సంస్థ ఎప్పటిలోగా తమ చమురు ఉత్పత్తుల సరఫరాను పునరుద్ధరించగలదనే అంశంపై ఆధారపడి చమురు ధరలు పెరగడం, పెరగకుండా ఉండడం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత సౌదీ అరేబియా చమురు సంస్థ సరఫరాపై అనిశ్చిత పరిస్థితే కొనసాగుతోంది. ఎందుకంటే ఇప్పటికీ అక్కడి చమురు నిల్వల నుంచి పొగ వెలువడుతూనే ఉంది. సౌదీపై ఈ దాడికి పాల్పడింది ఎవరో ఇప్పటికే గుర్తించామని, వారిపై ప్రతీకార దాడి జరిపేందుకు ఆయుధాలు లోడ్ చేసి పెట్టుకున్నామని, సౌదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరుక్షణం దాడికి పాల్పడతామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ప్రోత్సాహంతో యెమెన్కు చెందిన హౌతి మిలిటెంట్లు ఈ దాడికి పాల్పడ్డారని అంతర్జాతీయ వార్తలు తెలియజేస్తుండగా, ఇరాన్యే ఈ దాడికి పాల్పడిందని అమెరికా నేరుగా ఆరోపిస్తోంది. అంటే ఇరాన్పైనే అమెరికా దాడి చేసే అవకాశం ఉంది. ఈ ఉద్రిక్తల కారణంగా కూడా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. (చదవండి: అమెరికా అబద్ధాలు గరిష్టానికి చేరాయి) -
సౌదీ చమురు క్షేత్రాలపై డ్రోన్లతో దాడి
రియాధ్: యెమెన్ ఉగ్రవాదులు జరిపిన డ్రోన్ దాడులతో సౌదీ అరేబియా చమురు క్షేత్రాల్లో మంటలు చెలరేగాయి. సౌదీ తూర్పు ప్రాంతంలో ఆరామ్కోకు చెందిన అబ్కేయిక్, ఖురైస్ క్షేత్రాలపై శనివారం వేకువ జామున రెండు డ్రోన్లు కూలాయి. దీంతో భారీగా చెలరేగిన మంటలను సిబ్బంది దాదాపు రెండు గంటల అనంతరం అదుపులోకి తెచ్చారని ప్రభుత్వం తెలిపింది. ఈ దాడికి కారణం తామేనంటూ ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న యెమెన్లోని హౌతి ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని తెలిపిన అంతరంగిక శాఖ మంత్రి.. డ్రోన్లు ఎక్కడివి? ప్రాణాపాయం, పనులపై ప్రభావం వంటి వివరాలను వెల్లడించలేదు. కాగా, అబ్కేయిక్, ఖురైస్లపై శనివారం వేకువజామున పది వరకు డ్రోన్లతో తాము దాడి చేసినట్లు హౌతీ ఉగ్రవాదుల ప్రతినిధి అల్ మసీరా టీవీకి తెలిపారు. ఇటీవలి కాలంలో హౌతి ఉగ్రవాదులు సౌదీ అరేబియా వైమానిక స్థావరాలపై పలు క్షిపణి, డ్రోన్ దాడులు జరిపిన విషయం తెలిసిందే. యెమెన్లో తమ ప్రాంతాలపై సౌదీ అరేబియా దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేస్తున్నట్లు హౌతీలు అంటున్నారు. ఆరామ్కోకు ఉన్న అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో ఒకటైన అబ్కేయిక్పై గతంలో అల్ఖైదా జరిపిన దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు. తాజా ఘటనతో ప్రపంచంలోనే అత్యధికంగా చమురు ఎగుమతి చేసే సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు గల్ఫ్ జలాల్లోని ఆయిల్ ట్యాంకర్లపై జూన్, జూలైల్లో జరిగిన దాడులకు ఇరానే కారణమంటూ సౌదీ ప్రభుత్వం, అమెరికా ఆరోపిస్తుండగా తాజా ఘటనతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. వ్యాపార విస్తరణ కోసం ఆరామ్కో త్వరలోనే ఐపీవోకు వెల్లనుండగా ఈ పరిణామం సంభవించడం గమనార్హం. -
నిన్ను స్వర్గంలో కలుస్తాను
బంజారాహిల్స్: తాను పెళ్లి చేసుకోబోయే యువతి కేన్సర్తో మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక యెమన్ దేశానికి చెందిన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పారామౌంట్ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యెమన్ దేశానికి చెందిన మహ్మద్ ఒత్మాన్ అలీ(24) గత కొన్నేళ్లుగా హైదరాబాద్లో ఉంటూ చదువుకుంటున్నాడు. కొద్ది క్రితం అతడికి తమ దేశానికి చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇటీవల ఆమె కేన్సర్తో మృతి చెందింది. దీంతో మనస్తాపానికిలోనైన ఒత్మాన్ అలీ తరచూ బాధపడుతున్నాడు. సోమవారం అతడి స్నేహితుడు మబ్కోట్ హస్సన్ బయటికి వెళ్లగా గదిలో ఒంటరిగా ఉన్న ఒత్మాన్అలీ ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక వైపు వీసా గడువు ముగుస్తున్నట్లు సమాచారం అందడం, మరో వైపు కాబోయే భార్య మృతిని తట్టుకోలేకపోతున్నానని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ‘నిన్ను అమితంగా ప్రేమించాను, నువ్వులేని లోకంలో నేనుండలేను.. స్వర్గంలో నిన్ను కలుస్తానంటూ’ లేఖలో పేర్కొన్నాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
యెమెన్లో దాడులు, 61 మంది మృతి
హుదైదా: యెమెన్లోని హుదైదా నగరంలో ఉన్న హౌతీ తిరుగుబాటుదారులపై సౌదీ నేతృత్వంలోని సంకీర్ణసేనలు విరుచుకుపడ్డాయి. నగరంలోని స్థావరాలపై శని, ఆదివారం జరిపిన దాడుల్లో తొమ్మిది మంది అనుచరులు సహా 61 మంది హౌతీ తిరుగుబాటుదారుల్ని హతమార్చాయి. ఈ దాడుల్లో గాయపడ్డ పలువురిని అధికారులు మోఖా నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 2014లో ఇరాన్ మద్దతుతో హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్ ప్రభుత్వాన్ని కూలదోశారు. పదవీచ్యుతుడైన అధ్యక్షుడు మన్సూర్ హాదీకి మద్దతుగా సౌదీఅరేబియా నేతృత్వంలోని యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, ఈజిప్ట్, జోర్డాన్ల సంకీర్ణ సేనలు ఉగ్రవాదులపై దాడులు ప్రారంభించాయి. -
మిస్సైల్స్ దాడులతో గడగడలాడిన సౌదీ
-
మిస్సైళ్ల వర్షం.. గడగడలాడిన రియాద్
రియాద్: మిస్సైల్స్ దాడులతో ఆదివారం అర్థరాత్రి సౌదీ అరేబియా గడగడలాడిపోయింది. పొరుగున ఉన్న యెమెన్ నుంచి బాలిస్టిక్ మిస్సైళ్ల ప్రయోగంతో అంతా వణికిపోయారు. అయితే సౌదీ ఎయిర్ ఫోర్స్ వాటిని గాల్లోనే అడ్డగించటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో గాల్లోనే క్షిపణులు పేలిపోగా.. ప్రజలు మాత్రం వణికిపోయారు. ‘హౌతీ రెబల్స్ వర్గం గత రాత్రి రియాద్ నగరంపై రెండు బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించింది. అయితే సైన్యం ఆ దాడులకు ధీటుగా తిప్పి కొట్టింది’ అని అధికారిక టెలివిజన్ ఛానెల్ ‘అల్ ఎఖాబారియా’ కథనాలు ప్రసారం చేసింది. అయితే ప్రాణ, ఆస్తినష్ట వివరాలను మాత్రం వెల్లడించలేదు. మరోవైపు ఏఎఫ్పీ జర్నలిస్ట్ నాలుగు భారీ పేలుళ్ల శబ్ధాలను విన్నట్లు చెబుతుండగా, స్థానికులు మాత్రం ఆ సంఖ్య ఎక్కువే అని అంటున్నారు. అయితే రియాద్ సైన్యం తమ మిస్సైళ్లను కూల్చలేదని, తాము ప్రయోగించిన మిస్సైళ్లు లక్ష్యాలను చేరుకోలేకపోయాయని రెబల్ గ్రూప్ ప్రతినిధి ఒకరు ప్రకటించారు. ఇదిలా ఉంటే సౌదీ అరేబియా, యూఏఈ, ఇతర మిత్ర పక్షాలు.. ఉత్తర యెమన్ను దిగ్బంధించిన హౌతీ మిలిటెంట్లు ఆయుధాలను అప్పగించేంత వరకూ దాడులు కొనసాగిస్తామని అరబ్ లీగ్ శిఖరాగ్ర సదస్సులో నిర్ణయించిన విషయం తెలిసిందే. అమెరికా కూడా మిత్రపక్షాల వైపు నిలిచి దాడులకు ఎగదోస్తోంది కూడా. అసలే అంతర్యుద్ధంతో(రాజకీయ సంక్షోభం) సతమతమవుతున్న యెమెన్కు ఈ దాడులు మరింత ఇబ్బందికరంగా మారాయి. అయినప్పటికీ హౌతీ రెబల్స్ మాత్రం సౌదీపై ఎదురు దాడి చేస్తూ వస్తోంది. పరస్సరం క్షిపణుల దాడులతో ఇరు దేశాలు దాడులు చేసుకుంటున్నాయి. మరోవైపు సౌదీ అరేబియాపై దాడులకు యెమెన్కు ఇరాన్ సహకరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే హౌతీ తిరుగుబాటుదారులకు ఆయుధాలను, ఖండాంతర క్షిపణులను సరఫరా చేయాల్సిన అవసరం తమకు లేదని, హౌతీలు సొంతంగా అభివృద్ధి చేసుకునే స్థాయికి ఎదిగారని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీ) స్పష్టం చేసింది. యెమెన్, ఇరాన్ దేశాల సరిహద్దు ఇప్పటికే మూతపడ్డ విషయాన్ని ఐఆర్జీ ఈ సందర్భంగా గుర్తు చేసింది. -
ఒమన్, యెమన్లను గడగడలాడిస్తున్న మెకును తుఫాను
-
పెళ్లి వేడుకపై బాంబు దాడి 20మంది మృతి
-
డ్రోన్ దాడిలో తీవ్రవాదులు హతం
ఎడెన్(యెమెన్): దక్షిణ యెమెన్లో అల్ఖైదా లక్ష్యంగా జరిగిన డ్రోన్ దాడిలో ఏడుగురు తీవ్రవాదులు హతమయ్యారు. యెమెన్పై డ్రోన్ దాడులు జరిపే సత్తా ఒక్క అమెరికా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. షాబా ప్రావిన్స్ నుంచి బేడా ప్రావిన్స్కు వెళ్లే మార్గంలో వెళ్తున్న మూడు వాహనాలపై అమెరికాకు చెందిన డ్రోన్ ఒకటి బాంబు దాడి చేసినట్లు తమకు సమాచారం ఉందని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ దాడిలో ఏడుగురు చనిపోయారని భావిస్తున్నారు. యెమెన్ కేంద్రంగా నడుస్తున్న అల్ఖైదా విభాగం ఈ ప్రాంతంలో చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తోందని కొంతకాలంగా అమెరికా అనుమానిస్తోంది. ఈ తీవ్రవాదులకు సౌదీ అరేబియా మద్దతు ఇస్తూ స్థానిక హుతి రెబల్స్పై ఉసిగొలుపుతోంది. కానీ, డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అల్ఖైదాపై అమెరికా డ్రోన్ దాడులు సాగిస్తోంది. -
ఉగ్ర చెర నుంచి ఫాదర్కు విముక్తి
మస్కట్: యెమెన్లోని ఇస్లామిక్ ఉగ్ర వాదుల చెరలో 18 నెలలుగా బందీగా ఉన్న భారత్కు చెందిన ఫాదర్ థామస్ ఉఝూనాలిన్ను సురక్షితంగా కాపాడామని మంగళవారం ఒమన్ ప్రకటించింది. కేరళకు చెందిన మతప్రబోధకుడు థామస్ 2010 నుంచి యెమెన్లోని అడెన్ కేర్ హోంలో సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో 2016లో ఉగ్రవాదులు కేర్హోంపై దాడి చేసి 16 మందిని దారుణంగా హతమార్చి, థామస్ను అపహరించారు. థామస్ చివరిసారిగా గతేడాది డిసెంబర్లో ఓ వీడియోలో కనిపించాడు. అందులో తనను రక్షించాల్సిందిగా ప్రధాని మోదీ, పోప్ ఫ్రాన్సిస్ను అభ్యర్థించాడు. దీంతో విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ యెమెన్ డిప్యూటీ ప్రధానితో మాట్లాడి ఆయన విడుదలకు చొరవ చూపాలని కోరారు. ఒమన్ సుల్తాన్ సూచన మేరకు యెమెన్తో కలసి ఆయనను విడిపిం చామని ఆ దేశం తెలిపింది. ఆయన విడుదలకు సంబంధించి తాజా ఫొటోలను ఆ దేశ అధికారిక మీడియా విడుదల చేసింది. ఉగ్రవాదుల చెర నుంచి ఫాదర్ థామస్ విడుదల కావటం పట్ల కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ట్వీటర్లో ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేవుడి దయ వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని, తన విడుదల కోసం ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని థామస్ వ్యాఖ్యానించారు. -
యెమెన్లో కూలిన అమెరికా చాపర్
వాషింగ్టన్: అమెరికా సైన్యానికి చెందిన యూహెచ్ 60- బ్లాక్హాక్ హెలికాప్టర్ ఒకటి యెమెన్లో కూలిపోయింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో పైలట్ సహా ఆరుగురు సైనికులు ఉన్నారని, వారిలో ఐదుగురు సురక్షితంగా బయటపడగా, ఒకరు మాత్రం గల్లంతయ్యారని యూఎస్ ఆర్మీ ప్రకటించింది. యెమెన్ దక్షిణ తీరంలో ఆరుగురు సభ్యులతో కూడిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ను శుక్రవారం సిబ్బంది శిక్షణలో వినియోగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం వెనుక ఉగ్రకోణం దాగున్నది, లేనిదీ ఇప్పుడే చెప్పలేమని, దర్యాప్తు కొనసాగుతున్నదని అధికారులు పేర్కొన్నారు. -
‘180 మందిని సముద్రంలోకి తోసేశారు’
దుబాయ్: యెమెన్ సమీపంలో గురువారం దారుణం చోటుచేసుకుంది. స్థానిక అధికారులు అరెస్టు చేస్తారన్న భయంతో స్మగ్లర్లు అక్రమంగా యెమెన్కు తరలిస్తున్న 180 మంది ఆఫ్రికన్లను సముద్రంలోకి తోసేయడంతో ఆరుగురు మృతి చెందగా..దాదాపు 50 మంది గల్లంతయ్యారు. ప్రస్తుతం గాయాలతో యెమెన్ దక్షిణ తీరానికి చేరుకున్న 25 మంది శరణార్థులకు చికిత్స అందిస్తున్నట్లు ఐరాస అంతర్జాతీయ వలస వ్యవహారాల సంస్థ(ఐఓఎం) తెలిపింది. శరణార్థుల్లో ఇథియోపియోకు చెందిన యువతీయువకులే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. బుధవారం కూడా మనుషులను అక్రమరవాణా చేస్తున్న స్మగ్లర్లు యెమెన్ తీరం సమీపంలో సోమాలియా,ఇథియోపియాకు చెందిన 120 మంది శరణార్థులను సముద్రంలోకి తోసేయడంతో 50 మంది మృతి చెందగా, 22 మంది గల్లంతయ్యారని ఐఓఎం పేర్కొంది. తీరానికి కొట్టుకువచ్చిన 29 మృతదేహాలను మిగిలిన శరణార్థులు పూడ్చిపెట్టారని వెల్లడించింది. -
అనుకున్నదొకటి... అయ్యిందొకటి
అగ్రరాజ్యం అధిపతిగా ప్రతి మాటను ఎంత ఆచితూచి మాట్లాడాలో ట్రంప్కు ఖతర్ ఉదంతంలో తెలిసివచ్చింది. గత నెలలో సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లినప్పుడు తీవ్రవాదులకు, వేర్పాటువాదులకు సహాయం చేస్తున్న ఇరాన్ను ఏకాకిని చేయాలని ట్రంప్ పిలుపు ఇచ్చారు. ఐసిస్కు, ఇతర ఉగ్రమూకలకు ఇరాన్ నిధులు అందజేస్తోందన్నారు. అమెరికా అండ కోసం చూడకుండా తమ దేశాల, భావితరాల శ్రేయస్సు దృష్ట్యా పశ్చిమాసియా దేశాలు తమ కార్యచరణను రూపొదించుకోవాలన్నారు. సౌదీ అరేబియా దీన్ని మరోలా అర్థం చేసుకుంది. ఇరాన్ను కట్టడి చేయడం అంత సులువైన పనికాదు కాబట్టి... తమ పొరుగున పంటికింద రాయిలా మారిన ‘ఖతర్’పై కత్తిదూసింది. ట్రంప్ మాటలను సానుకూల సంకేతంగా తీసుకొని... యూఏఈ, యెమెన్, బహ్రయిన్లతో కలిపి ఖతర్తో సంబంధాలను తెంపేసుకుంది. ఇరాన్తో అంటకాగుతూ తీవ్రవాదానికి ఊతమిస్తోందని ఆరోపించింది. సౌదీలో ట్రంప్ మాట్లాడినపుడు పర్యవసానాలను ఊహించని అమెరికా ఇప్పుడు అరబ్ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి తంటాలు పడుతోంది. చిన్ని దేశం... గ్యాసే బలం ఖతర్ 26 లక్షల జనాభా, 11,586 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన పశ్చిమాసియాలోని చిన్నదేశం. ప్రపంచంలోనే చమురు, సహజవాయువు నిక్షేపాలు అధికంగా ఉన్న దేశాల జాబితాలో నాలుగోస్థానం ఈ బుల్లిదేశానిదే. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) అతిపెద్ద ఎగుమతిదారు. ప్రపంచ ఎల్ఎన్జీ ఎగుమతుల్లో ఖతర్ వాటా 31.8 శాతం. ఇదే వీరి బలం కూడా. తలసరి ఆదాయపరంగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం. తలసరి ఆదాయం 83 లక్షల రూపాయలు. ముస్లిం దేశాల్లో అత్యంత ఆదరణ కలిగిన ‘అల్ జజీరా’ టీవీ ఛానల్ ఖతర్ ప్రభుత్వానిదే. పెద్దన్నను కాదని... పశ్చిమాసియా ప్రాంతంలో సౌదీ అరేబియా పెద్దన్న పాత్రను పోషిస్తోంది. అరబ్ దేశాల్లో సున్నీల పాలనలో ఉన్న దేశాలకు సౌదీ మార్గనిర్దేశం చేస్తోంది. భౌగోళికంగా సువిశాల దేశం కావడం, చమురు నిక్షేపాలు పుష్కలంగా ఉండటం, పైగా దీర్ఘకాలంగా అగ్రరాజ్యం అమెరికాతో బలమైన మైత్రి ఉండటంతో ఈ ప్రాంతంలో సౌదీ ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే దాదాపు రెండు దశాబ్దాలుగా ఖతర్ సున్నీ రాజ్యాల బాటలో వెళ్లకుండా విదేశాంగ విధానంలో స్వతంత్ర వైఖరిని అవలంభిస్తోంది. సంపన్న దేశం కావడం, మీడియా అండ ఉండటంతో పశ్చిమాసియాలో ఖతర్కు స్థాయికి మించిన ప్రాధాన్యం దక్కుతోంది. సౌదీ దీన్ని సహించలేకపోతోంది. భిన్న మార్గం... ఈజిప్టులో ముస్లిం బ్రదర్హుడ్కు సహాయపడ్డ ఖతర్... ఇజ్రాయిల్లో హమస్కు అన్నిరకాలుగా అండదండగా నిలుస్తోంది. హమస్ అగ్రనేతలు దోహాలో తలదాచుకోవడానికి అనుమతించింది. మరోవైపు గల్ఫ్లో అమెరికా అతిపెద్ద సైనిక స్థావరం కూడా ఖతర్లోనే ఉంది. ఇక్కడి ఎయిర్బేస్లో ఏకంగా 11 వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. ప్రాంతీయంగా బలీయమైన శక్తులు, బద్ధవిరోధులైన సౌదీ అరేబియా, ఇరాన్లలో ఏదో పక్షం పక్కన చేరకుండా... రెండుదేశాలతోనూ సంబంధాలు నెరుపుతూ స్వతంత్రంగా ఉంటోంది. అమెరికా సైనిక స్థావరానికి అనుమతిచ్చినట్లుగానే... పలు తీవ్రవాద సంస్థల రాజకీయ కార్యాకలాపాలను తమ గడ్డ మీద అనుమతించింది. ఈ సానుభూతితోనే తీవ్రవాద సంస్థలేవీ ఖతర్లో కార్యచరణకు దిగవు. అలాగే మరోవైపు అరబ్ దేశాల మధ్య తలెత్తే విబేధాల్లో ఖతర్ మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటుంది. దౌత్యవ్యవహారాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. మరోవైపు తమకున్న సంబంధాల దృష్ట్యా తీవ్రవాద సంస్థలతోనూ బేరసారాలు నెరపగలదు. బందీలను తీవ్రవాద చెర నుంచి విడిపించింది కూడా. అరబ్ విప్లవాన్ని సమర్థించింది. షియా... సున్నీ విబేధాలు స్వతంత్ర వైఖరితో పాటు షియా– సున్నీ విబేధాలు కూడా సౌదీ, యెమెన్, యూఏఈ, ఈజిప్టులు ఖతర్తో సంబంధాలను తెంచుకోవడానికి ఒక కారణం. సౌదీ, ఖతర్తో సహా చాలా అరబ్ దేశాల్లో సున్నీ పాలకులే ఉన్నారు. రాజరిక పాలన ఉన్న ఈ దేశాల్లో సున్నీ రాజవంశాలు అధికారంలో ఉన్నాయి. ఖతర్కు చేరువ కావడం ద్వారా షియా ఆధిక్య ఇరాన్... సున్నీ రాజ్యాలను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందనేది సౌదీ అరేబియా అనుమానం. తమను అధికారంలో నుంచి కూలదోసే కుట్ర జరుగుతోందనేది సున్నీ రాజుల భయం. అల్ జజీరా ఛానల్ ద్వారా తీవ్రవాద అనుకూల ప్రచారాన్ని నిర్వహిస్తోందని, తిరుగుబాటుదారులను రెచ్చగొడుతోందని ఖతర్పై సౌదీ ఆరోపణ. తమ దేశంలోని తూర్పు ప్రాంతమైన ఖాతిఫ్లో (షియాల ఆధిక్య ప్రాంతం) ఇరాన్ దన్నుతో దాడులకు దిగుతున్న మిలిటెంట్లకు ఖతర్ మద్దతిస్తోందని కూడా సౌదీ ఆరోపించింది. ఇరాన్పై ట్రంప్, సౌదీల వైఖరిని తప్పుపడుతూ ఖతర్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ వ్యాఖ్యలు చేసినట్లు దేశ అధికారిక వార్తాసంస్థలో వచ్చింది. తమ సైట్ను ఎవరో హ్యాక్ చేసి ఈ పనిచేశారని ఖతర్ వివరణ ఇచ్చింది. దీనిని సౌదీ కూటమి తీవ్రంగా ఖండించింది. అల్ జజీరాతో పాటు ఖతర్కు చెందిన ఇతర మీడియా సంస్థలను నిషేధించాయి సౌదీ, మిత్రదేశాలు. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడిగా హసన్ రౌహానీ మే నెలలో మరోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఖతర్ రాజు షేక్ తమీమ్... రౌహానికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. దీన్ని సౌదీ కవ్వింపు చర్యగా పరిగణించింది. ఫలితంగా కొద్దిరోజులగా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అదును కోసం చూసిన సౌదీ ట్రంప్ వ్యాఖ్యలను సానుకూలంగా తీసుకొని ఖతర్తో కటీఫ్ అంది. తిండికి కటకట... ఖతర్ ద్వీపకల్పం. ఒక్క సౌదీతో మాత్రమే ఈ దేశానికి భూ సరిహద్దు ఉంది. అన్ని రకాల రవాణా మార్గాలను మూసివేస్తున్నట్లు సౌదీ ప్రకటించిన నేపథ్యంలో ఖతర్పై తక్షణ ప్రభావం పడేది ఆహారం విషయంలోనే. . ఎందుకంటే ఖతర్ దిగుమతి చేసుకునే ఆహారంలో 40 శాతం సౌదీ నుంచే వస్తుంది. సౌదీ కీలక మిత్రదేశమైనప్పటికీ ఖతర్తోనూ అమెరికాకు అవసరం ఉంది. సైనిక స్థావరమే కాకుండా అమెరికా సంస్థల్లో భారీ పెట్టుబడులకు ఖతర్ హామీ ఇచ్చింది. వీటిని దృష్టిలో పెట్టుకునే అమెరికా ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. ఖతర్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ను సైనిక తిరుగుబాటును ప్రొత్సహించడం ద్వారా కూలదోయాలని సాదీ ప్రయత్నిస్తోందని రాజు అనుకూలవర్గాలు ఆరోపిస్తున్నాయి. చర్చలు జరిగితే తీవ్రవాదులకు నిధులు నిలిపివేయడం లాంటి వాటికి ఖతర్ అంగీకరించొచ్చు. అయితే ఇరాన్తో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని సౌదీ, దాని మిత్రదేశాలు డిమాండ్ చేస్తే మాత్రం... ఖతర్ ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే భారీ గ్యాస్ నిక్షేపాలున్న ‘నార్త్ ఫీల్డ్’పై ఖతర్, ఇరాన్లకు ఉమ్మడి యాజమాన్య హక్కులున్నాయి. ఖతర్ ఆర్థిక పటిష్టతకు నార్త్ఫీల్డ్ చాలా కీలకం. ఈ నేపథ్యంలో పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
హెలికాప్టర్ కూలి 12 మంది దుర్మరణం
రియాద్ : సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దళాలకు చెందిన హెలికాప్టర్ ఒకటి మంగళవారం యెమన్లో కూలిపోయిన ఘటనలో నలుగురు అధికారులు సహా 12 మంది సైనికులు దుర్మరణం చెందారు. అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ పాటిస్ సౌదీ పర్యటనలో ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. యెమన్లోని మరిబ్ ప్రావిన్సులో తమ బ్లాక్ హాక్ హెలికాప్టర్ కూలిపోయిందని, ఇందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు స్పష్టం చేశారు. ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు యెమన్ రాజధాని సనాతో పాటు పలు నగరాలను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు అధ్యక్షుడు అబేద్ మన్సూర్కు మద్దతుగా దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకూ 10 వేల మంది ప్రజలు చనిపోగా, దాదాపు 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. -
యెమెన్లో భీకర పోరు.. 38 మంది మృతి
సనా: గల్ఫ్ దేశం యెమెన్లో ప్రభుత్వ దళాలు తిరుగుబాటు దారులపై చేపట్టిన దాడుల్లో 38 మంది చనిపోయారు. రేవు నగరం మోచాపై పట్టుకోసం ప్రభుత్వ బలగాలు జరిపిన దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన 38 మంది మృతి చెందినట్లు సమాచారం. యెమెన్లోని అబెద్ రబ్బో హన్సూర్ హదీ ప్రభుత్వానికి, షియా వర్గానికి చెందిన హౌతి తీవ్రవాదులకు మధ్య రెండేళ్లుగా పోరు సాగుతోంది. దేశ రాజధాని సనా సహా కొన్ని ప్రాంతాలు హౌతి తిరుగుబాటు దారుల హస్తగతమయ్యాయి. వాటిని తిరిగి చేజిక్కించుకునేందుకు పొరుగునే ఉన్న సౌదీ అరేబియా సాయంతో యెమెన్ ప్రభుత్వం పోరాటం సాగిస్తోంది. కాగా, తాజాగా జరిగిన మోచా ఘటనపై ప్రభుత్వ వర్గాలు అధికారికంగా స్పందించటం లేదు. -
యెమెన్ లో అమెరికా దాడులు
41 మంది ఉగ్రవాదులు సహా 57 మంది మృతి అదెన్ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా ఓ దేశం (యెమెన్ )పై ఆ దేశ భద్రతా దళాలు దాడులకు పాల్పడ్డాయి. యెమెన్ లో జరిగిన ఈ దాడుల్లో 41 మంది అనుమానిత అల్కాయిదా ఉగ్రవాదులు, 16 మంది సాధారణ పౌరులు మృతి చెందినట్లు ఆ దేశ అధికార వర్గాలు వెల్లడించాయి. బైదా సెంట్రల్ ప్రావిన్స్ లోని యక్లా జిల్లాలో జరిగిన ఈ దాడుల్లో 8 మంది మహిళలు, 8 మంది చిన్నపిల్లలు సహా మొత్తం 57 మంది మృత్యువాత పడ్డారు. అల్కాయిదా బడులు, మసీదులు, వైద్య ప్రాంతాల్లో కూడా దాడులు నిర్వహించారు. ఈ ప్రాంత అల్కాయిదా చీఫ్ అబు బరాజన్ కూడా దాడుల్లో చనిపోయినట్లు అధికారులు చెప్పారు. దాడుల్లో తమ సైనికుడు ఒకరు మృతి చెందాడని అమెరికా పేర్కొంది.గత 24 గంటల్లో 100 మంది రెబల్స్ను హతమార్చామని యెమెన్ ఆర్మీ చెప్పింది. -
యెమెన్ లో ఆకలి చావులు
సరైన ఆహారం లేక ఎముకలు తేలిన శరీరంతో ఆసుపత్రి బెడ్పై దీనంగా కూర్చుని ఉన్న ఈ ఐదేళ్ల బాలుడి పేరు మొహన్నద్ అలీ. ఇతని రెండేళ్ల వయసున్న సోదరుడు ఈ మధ్యే ఆకలితో మృతిచెందాడు. ఇప్పుడు అలీ కూడా చావుకు దగ్గరగా ఉన్నాడనీ, కాపాడుకోడానికి తీవ్రంగా శ్రమిస్తున్నానని అతని 19 ఏళ్ల అన్న చెబుతున్నాడు. ఈ ఫొటోను 2016 డిసెంబరు 12న తీయగా యూనిసెఫ్ విడుదల చేసింది. ప్రచ్ఛన్న యుద్ధం వల్ల యెమెన్ ప్రజలు ఆహారం కోసం పడుతున్న కష్టాలకు ఈ ఫొటో సాక్ష్యంగా నిలుస్తోంది. -
ఉగ్రవాది సైనికుల్లో కలిసిపోయి..
అడెన్: యెమెన్లో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సైనికులు మృతి చెందారు. దేశ దక్షిణ ప్రాంతంలోని సిటీ అడెన్లో ఆదివారం సైనికులు తమ జీతాలు తీసుకోవడానికి గుంపుగా ఉన్న సమయంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఓ ఉగ్రవాది సైనికుల గుంపులో కలిసిపోయి భారీ పేలుడు పదార్థాలతో తనను తాను పేల్చేసుకున్నాడని సీనియర్ మిలిటరీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. అడెన్లోని అల్- సోల్బాన్ మిలిటరీ బేస్లో ఈ దాడి జరిగింది. వారం రోజుల క్రితం అడెన్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇదే తరహాలో జరిపిన ఆత్మాహుతి దాడిలో 48 మంది సైనికులు మృతి చెందగా.. 29 మంది గాయపడ్డారు. వరుస ఆత్మాహుతి దాడులు ఎమెన్ సైనికులను బెంబేలెత్తిస్తున్నాయి. -
అక్కడ పది నిమిషాలకో మృత్యువు
సనా: యెమెన్లో రెండేళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి బాల్యం బలవుతోంది. పిల్లల ఎండిన డొక్కల్లో పేగులు ఆకలిదప్పులతో నకనకలాడుతున్నాయి. జీవచ్ఛవమవుతున్న బాల్యాన్ని మృత్యువు ఎప్పటికప్పుడు మింగేస్తుంది. ప్రస్తుతం యెమెన్లో 22 లక్షల మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారని యునిసెఫ్ ఓ నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. వారిలో నాలుగున్నర లక్షల మంది పిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉందని పేర్కొంది. సౌదీ మద్దతిస్తున్న ప్రభుత్వ దళాలకు, షియా తిరుగుబాటుదారుల మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధం వల్ల దేశం వైద్యరంగం కూడా పూర్తిగా కుప్పకూలిపోయింది. షియా తిరుగుబాటుదారుల ప్రాబల్యం ఎక్కువగావున్న సాదా ప్రావిన్స్లో ప్రతి పదిమంది పిల్లల్లో ఎనిమిది మంది పిల్లలు ఆహారం నోచుకోక అల్లాడిపోతున్నారు. ప్రపంచంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా యెమెన్ పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. అతిసారం, శ్వాస సంబంధిత సమస్యలతో పది నిమిషాలకు ఒక పిల్లా లేదా పిల్లాడు మరణిస్తున్నాడని పేర్కొంది. ఈ ఏడాది యెమెన్లోని రెండు లక్షల మంది పిల్లలకు మాత్రమే తాము విటమిన్ సప్లిమెంట్లు, పౌష్టికాహారాన్ని అందజేయగలిగామాని యునిసెఫ్ అధికారి మెరిటెక్సెల్ రెలానో తెలిపారు. నిధుల కొరత యుద్ధ ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకపోవడం వల్ల ఇంతమందికన్నా ఎక్కువ మంది పిల్లలకు తాము సరఫరాలు అందించలేకపోయామని రెలానో ఆందోళన వ్యక్తం చేశారు. దయచేసి పిల్లలను ఆదుకునేందుకు తమకు సహకరించాలని యుద్ధం చేస్తున్న ఇరు వర్గాలకు విజ్ఞప్తి చేశారు. -
యెమెన్ లో వైమానిక దాడులు
82 మంది దుర్మరణం సనా: తిరుగుబాటుదారుల అధీనంలోని యెమెన్ రాజధాని సనాపై శనివారం సౌదీ సంకీర్ణ సేనల వైమానిక దాడితో ఓ ప్రాంతం మరుభూమిగా మారింది. ఈ దాడిలో సనా స్థానిక మండలి అధినేత, మేజర్ జనరల్ అబ్దుల్ ఖాదర్ హిలాల్సహా 82 మంది ప్రాణాలు కోల్పోయారు. చెల్లాచెదురుగా పడిన మృతుల శరీరభాగాలతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. ఈ దాడి ఘటనలో దాదాపు 534 మంది గాయపడ్డారు. సనాలోని ఓ భవంతిలో అంత్యక్రియల్లో వందలాది మంది పాల్గొన్న సమయంలో ఈ వైమానిక దాడి జరిగింది. మరణించిన, గాయపడిన వారిలో హాతీ తిరుగుబాటుపాలనకు చెందిన సైన్యాధికారులు, భద్రతాధికారులు కూడా ఉన్నారు. -
బాంబులతో దద్దరిల్లిన యెమెన్, ఇరాక్
యెమెన్/బాగ్దాద్: ఉగ్రవాదులు మరోసారి పడగవిప్పారు. ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లేలా చేశారు. ఈ దాడులతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. సౌతర్న్ యెమెన్ పట్టణంలోని మిలటరీ ఫెసిలిటీ సెంటర్ లక్ష్యంగా చేసుకొని చేసిన ఈ దాడుల్లో ఇప్పటి వరకు 40మంది చనిపోయినట్లు తెలుస్తోంది. పలువురు గాయాలపాలయ్యారు. ఈ బాంబు ధాటికి ప్రభుత్వ బలగాలు ఉపయోగిస్తున్న ఓ ట్రైనింగ్ క్యాంపు కూడా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య 45 నుంచి 60 వరకు పెరిగే అవకాశం ఉందని అక్కడి మీడియా చెప్తోంది. దాడి జరిగిన ప్రాంతం రక్తసిక్తంగా భీతావాహంగా మారింది. మరోపక్క, బాగ్దాద్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఏకే 47 తుపాకులతో, గ్రనేడ్లతో, ఆత్మాహుతి దాడులతో తెగబడటంతో దాదాపు 18మంది ప్రాణాలుకోల్పోయారు. ఇద్దరు ఉగ్రవాదులు ఈ చర్యలకు పాల్పడగా అందులో ఒకరు ఆత్మాహుతి దాడి చేసుకొని చనిపోగా మరొకరిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. -
కార్లనిండా బాంబులతో రెచ్చిపోయారు
ఏడెన్: యెమెన్ లో ఉగ్రవాదులు పెట్రేగి పోయారు. సైనిక బలగాలే లక్ష్యంగా రెండు కారు బాంబు దాడులు చేశారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు ప్రాణాలుకోల్పోయారు. ఇంకొందరు గాయపడినట్లు తెలుస్తోంది. వారిలో కొందరి పరిస్థితి విషమంగా కూడా ఉంది. దీంతో మృతులసంఖ్య మరింత పెరిగే అవకాశ ఉంది. ముకల్లా అనే నగరంలోని సైనిక శిబిరంలోకి అమాంతం బాంబులతో నింపిన కారుతో ఓ ఉగ్రవాది విరుచుకుపడగా మరో కారుతో నగరం నడిఒడ్డున మరో ఉగ్రవాది తెగబడ్డాడు. పేలుడు ధాటికి అక్కడి ప్రాంతం చిన్నాభిన్నమై రక్తసిక్తంగా మారింది. ఒక ఇప్పుడు ఈ ప్రాంతంలో అల్ కాయిదా ప్రభావం ఎక్కువగా ఉండేది. -
యెమెన్ ఆత్మాహుతి దాడుల్లో 43 మంది మృతి
ముకల్లాః యెమెన్ లో ఉగ్రమూక మళ్ళీ రెచ్చిపోయింది. సైన్యమే లక్ష్యంగా ఆత్మాహుతి దళాలు విరుచుకుపడ్డాయి. సుమారు ఏడుచోట్ల ఏకకాలంలో సూసైడ్ బాంబర్లు జరిపిన దాడుల్లో 43 మంది మరణించగా... పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. యెమెన్ ముకల్లా నగరంలో ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు జరిపిన పేలుళ్ళలో 43 మంది మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాంబర్లు ముకల్లా నగరంలోని ఏడుచోట్ల దాడులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. సైన్యాధికారులే లక్ష్యంగా బాంబర్లు నిఘా కార్యాలయాలు, ఆర్మీ చెక్ పాయింట్స్, బరాక్ లపై దాడులు జరుపుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం జరిగిన పేలుళ్ళలో పేలుడు పదార్థాలను ఆత్మాహుతి దళాలు రంజాన్ ఉపాహారాలకు సంబంధించిన ఫుడ్ బాక్స్ లో పెట్టి తెచ్చినట్లుగా ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. ఇదిలా ఉంటే యెమెన్ లో తాజాగా జరిగిన దాడులు తమపనేనని ఐసిస్ ప్రకటించింది. -
యెమెన్లో భారతీయ ఫాదర్ను శిలువేశారు!
సనా: యెమెన్లో మూడు వారాల క్రితం కిడ్నాప్ చేసిన భారత్లోని బెంగళూరుకు చెందిన క్యాథలిక్ ఫాదర్ టామ్ ఉజున్నలీల్ (56)ను ఐసిస్ టైస్టులు శుక్రవారం ‘గుడ్ ఫ్రైడే’ రోజున శిలువేసి చంపేశారు. ఈ విషయాన్ని వియన్నా ఆర్చిబిషప్ క్రిస్టఫ్ క్యథెడ్రల్ శ్యాన్బార్న్ ధ్రువీకరించారు. అయితే ఆయన ఈ విషయాన్ని ఎలా ధ్రువీకరించుకున్నారన్న విషయాన్ని వెల్లడించలేదు. మార్చి 4వ తేదీన ఏడెన్లో మదర్ థెరిస్సా క్రిస్టియన్ మిషనరీస్ నిర్వహిస్తున్న వృద్ధుల ఆశ్రమంలోకి సాయుధులైన నలుగురు ఐసిస్ టెర్రరిస్టులు జొరబడి ఫాదర్ టామ్ (థామస్)ను కిడ్నాప్ చేశారు. ఈ సందర్భంగా టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో భారత్కు చెందిన నలుగురు నన్స్, ఇద్దరు యెమెన్ స్టాఫ్, ఎనిమిది మంది వృద్ధులు, ఓ గార్డు మరణించారు. కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకెళ్లిన భారతీయ ఫాదర్ టామ్ను గుడ్ఫ్రై రోజున శిలువేసి చంపేస్తామని కూడా టెర్రరిస్టులు ముందుగానే హెచ్చరించారట. -
అతడిని శిలువ వేశారేమో..!
- ఇండియన్ ప్రీస్ట్ ను కిడ్నాప్ చేసిన ఐఎస్ఐఎస్ - గుడ్ ఫ్రైడే నాడు శిలువ వేసి ఉంటారని అనుమానం ఐఎస్ఐఎస్ కిడ్నాప్ చేసిన ఇండియన్ ప్రీస్ట్ ను గుడ్ ఫ్రైడే నాడు.. శిలువ వేసి ఉంటారనే ఆనుమానాలు బలపడుతున్నాయి. యెమెన్ లో మార్చి 4న ఒక రిటైర్డ్ మెంట్ హౌస్ పై ఇస్లామిక్ తీవ్రవాదులు దాడి చేసిన సమయంలో ఫాదర్ టామ్ ఉజునలిల్ ను ఎత్తుకెళ్లారని భావిస్తున్నారు. అతి కిరాతకంగా.. దాడిచేసిన తీవ్రవాదులు.. ఓ మిషనరీ ఆధ్వర్యంలో నడుస్తున్న హోమ్ పై దాడి చేసి.. నలుగురు క్రైస్తవ సన్యాసినులతో సహా.. 16 మందిని చంపేశారు. దాడి తర్వాత అదే హొం లో బస చేస్తున్న ఫాదర్ టామ్ జాడతెలియడం లేదు. గత ఆదివారం ఓ క్రైస్తవ సన్యాసిని ఫేస్ బుక్ అకౌంట్ నుంచి ఫాదర్ టామ్ పై జరగనున్న హింసకు సంబంధించి ఒక మెసేజీ పోస్టు చేశారు. ఈ పోస్టు ప్రకారం గుడ్ ఫ్రైడే నాడు ఫాదర్ ను శిలువ వేసే అవకాశం ఉనట్లు అనుమానిస్తున్నారు. మరో వైపు దాడికి ముందు ముగ్గురు ఇథియోపియన్ క్రిస్టియన్ యువకులు హోమ్ లోకి హడావుడిగా వచ్చి.. ఐఎస్ఐఎస్ దాడికి సంబంధించిన సమాచారం ఇచ్చారని. తర్వాత కొద్ది సేపటికే.. మారణ హోమం జరిగిందని. అప్పుడే ఫాదర్ ని కిడ్నాప్ చేశారని ఓ సన్యాసిని చేతిరాతతో ఉన్న నోట్ హోమ్ లో లభించిందని పేర్కొంటూ అలెటియన్ అనే క్రిస్టియన్ వెబ్ సైట్ కథనాన్ని ప్రచురించింది. భారత్ లోని బెంగళూరు నగరంలోని డాన్ బాస్కోకి చెందిన సలేషియన్ సిస్టర్స్ సభ్యులు మాట్లాడుతూ.. ఫాదర్ ఆచూకీపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా.. హోమ్ పై దాడులకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. అయితే యెమెన్ అధికారులు మాత్రం ఇది ఐఎస్ఐఎస్ దుశ్చర్యే అని ప్రకటించాయి. ఈ ప్రాంతంలో అల్ ఖైదా కు కూడా పట్టు ఉండంతో.. వారు చేసి ఉంటారని కొంత మంది విస్తున్నారు. -
యెమెన్లో ఉగ్రదాడులు నలుగురు భారత నర్సులు మృతి
* వృద్ధాశ్రమంలో16 మందిని కాల్చి చంపిన ముష్కరులు * కోల్కతాకు చెందిన మిషనరీల ఆధ్వర్యంలోని ఆశ్రమం అడెన్, న్యూఢిల్లీ: యెమెన్ తాత్కాలిక రాజధాని అదెన్లోని ఓ వృద్ధాశ్రమంపై ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులు తెగబడ్డారు. విచ్చలవిడిగా కాల్పులు జరిపి.. నలుగురు భారతీయ నర్సులు సహా 16 మందిని బలిగొన్నారు. కోల్కతాలో మదర్ థెరీసా స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ సంస్థ అడెన్ నగరంలోని దక్షిణ ప్రాంతంలో ఒక వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం అక్కడికి ఆరుగురు సాయుధ దుండగులు వచ్చారు. తమ తల్లిని చూడడానికి వచ్చామని, గేటు తెరవాలని సెక్యూరిటీ గార్డును కోరారు. గేటు తీయగానే మొదట ఆ గార్డును కాల్చి చంపారు. దుండగుల్లో ఇద్దరు బయట కాపలాగా ఉండగా... మిగతా నలుగురు లోపలికి వెళ్లారు. గదుల్లోకి ప్రవేశించి లోపల ఉన్నవారి చేతులు కట్టేసి తలపై తుపాకీతో కాల్చారు. ఆశ్రమంతా తిరిగి 16 మందిని చంపేశారు. ఉగ్రవాదులు ఆశ్రమంలోకి చొరబడిన సందర్భంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు హెచ్చరించడంతో ఓ నర్సు స్టోర్రూమ్లోని ఫ్రిజ్లోకి వెళ్లి దాక్కుంది. దాడి జరిగిన కొద్దిసేపటికే ఆశ్రమంలోకి వెళ్లిన ఖలీద్ హైదర్ అనే స్థానికుడు ఆమెను గుర్తించి రక్షించారు. అందరినీ చేతులు కట్టేసి, తలపై కాల్చి చంపారని తెలిపారు. తన సోదరుడి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళ్లామన్నారు. -
వైమానిక దాడిలో 15 మంది మృతి
సనా: యెమన్ లో సౌదీ సంకీర్ణ సేనలు జరిపిన దాడిలో కనీసం 15 మంది కార్మికులు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. యెమెన్ ఉత్తర ప్రావిన్స్ లోని ఆమరాన్ లో సిమెంట్ కర్మాగారంపై బుధవారం ఈ వైమానిక దాడి జరిగింది. కర్మాగారం మెయిన్ గేటు వద్ద కార్మికులు జీతాలు తీసుకుంటుండగా ఈ దాడి జరిగిందని అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారని 'జిన్హువా' వార్తా సంస్థ పేర్కొంది. గాయపడిన వారిని ఆమరాన్ లోని ఆస్పత్రికి తరలించారని తెలిపింది. కుటాఫ్ ప్రాంతంలోని ఆల్-జుబారా ట్రైబ్ లోని పలు గ్రామాలపై బుధవారం వైమానిక దాడులు జరిగాయి. సౌదీ సంకీర్ణ సేనలు జరిపిన మూడు వైమానిక దాడుల్లో 40 మంది గ్రామస్థులు చనిపోవడం లేదా గాయపడడం జరిగిందని స్థానికులు తెలిపారు. -
దూసుకొస్తున్న "రోవాను" తుఫాను
-
వైమానిక దాడి: బస్సులోని 8 మంది మృతి
సనా : యెమెన్ దక్షిణ ప్రాంతం టైజ్ ప్రావిన్స్లో సౌదీ సంకీర్ణ దళాలు గురువారం వైమానిక దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో ఎనిమిది మంది పౌరులు మరణించారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సంకీర్ణ దళాలు విడిచిన ఆయుధాలు రహదారిపై వెళ్తున్న బస్సుపై పడింది. కాగా బస్సులో 24 మంది కార్మికులు ఉన్నారని చెప్పారు. సదరు బస్సు కార్మికులను కంపెనీకి తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఉన్నతాధికారులు వివరించారు. -
వివాహ వేదికపై దాడి.. 26కు పెరిగిన మృతుల సంఖ్య
సనా: యెమెన్లో ఓ వివాహ వేదికపై జరిగిన వైమానిక దాడిలో మరణించిన వారి సంఖ్య 26కు పెరిగింది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మరో 40 మంది గాయపడ్డారు. బుధవారం రాత్రి దమర్ ప్రావిన్స్లో ఓ గిరిజన నాయకుడి ఇంట్లో పెళ్లి జరుగుతున్న సమయంలో యుద్ధ విమానాలు దాడి చేశాయి. ఆయన షీటె హౌతీ గ్రూప్నకు మద్దతుదారు. యెమెన్లో గతవారం మరో పెళ్లి బృందంపై వైమానిక దాడి జరిగింది. -
పెళ్లి బృందంపై దాడి.. 13 మంది మృతి
సనా: యెమెన్లో ఓ వివాహ వేదికపై జరిగిన వైమానిక దాడిలో 13 మరణించగా, మరో 38 మంది గాయపడ్డారు. దమర్ ప్రావిన్స్లో ఓ ఇంట్లో పెళ్లి జరుగుతున్న సమయంలో బాంబు దాడి చేశారు. ఈ దాడి ఎవరు చేశారన్నది తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
మసీదులో భారీ పేలుడు: 29 మంది మృతి
-
మసీదులో భారీ పేలుడు: 29 మంది మృతి
సనా: యెమన్ రాజధాని సనాలోని మసీదులో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో ఇప్పటి వరకు 29 మంది మృతి చెందగా, మరికొంత మంది తీవ్రగాయాలైనట్టు అధికారులు తెలిపారు. మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అల్-బలిలీ మసీదులో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. యెమన్ అధ్యక్షుడు అబ్ద్రుబ్ మన్సూర్ రెండు రోజుల కింద సౌదీ అరేబియానుంచి తిరిగి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హౌతీ మిలిటెంట్ల హిట్ లిస్ట్లో ఉండటంతో మన్సూర్ మార్చిలో దేశాన్ని వదిలి వెళ్లాడు. -
'బాంబులేస్తున్నారు.. చంపేస్తారు.. రక్షించండి'
యెమెన్: 'పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. బాంబులు వేస్తున్నారు. కచ్చితంగా చనిపోతాం. ఈలోగా దయచేసి మమ్మల్ని రక్షించండి. మేమంతా భారతీయులమే' అంటూ ఓ ఆడియో మెస్సేజ్ భారత విదేశాంగ వ్యవహారాలశాఖకు విన్నప రూపంలో వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే గుజరాత్ తీరం నుంచి వస్తు రవాణాకోసం యెమెన్ తీరానికి వెళ్లిన భారతీయులు అక్కడి ఖోఖా పోర్టు వద్ద చిక్కుకు పోయారు. వీరు తీరం చేరక ముందే యెమెన్లో బాంబుల దాడులు మొదలయ్యాయి. ఘర్షణ వాతావరణం నెలకొంది. ముందు వెనుకా చూడకుండా వైమానిక దాడులు జరుపుతున్నారు. సరిగ్గా ఐదు పడవల్లో బయలు దేరి వెళ్లిన 70 మంది భారతీయుల పడవలు తీరం చేరుతుండగానే కొద్ది దూరంలో ఓ భారీ బాంబు పడింది. అది కొంచెం సమీపంలో పడినా వారి మృతి వార్త వినాల్సి వచ్చేది. ఈ ఘటన జరిగిన వెంటనే వారు వేగంగా తీరం చేరుకుని ఇప్పుడు నేలపై అటూఇటూ పరుగులు పెడుతున్నారు. ప్రాణాలు రక్షించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి దగ్గర ఉన్న ఫోన్లతో భారత్కు ఆడియో మెస్సేజ్ పంపించారు. అందులో వారి మాటలను పరిశీలిస్తే.... మేం ఇక్కడ చిక్కుకుపోయాం. ఇప్పటి వరకు మాకు ఎలాంటి సాయం దరిచేరలేదు. పరిస్థితి దారుణంగా ఉంది. మేం బోటులో ఉండగా వైమానికి బాంబు దాడులు జరిగాయి. అది కొద్ది దూరంలోపడింది కాబట్టి బతికి బయటపడ్డాం. ఈ నెల 11న మా బోట్లను ఖోఖా పోర్టు వద్ద వదిలేసి వచ్చాం. అవి ఇప్పుడు అక్కడ ఉన్నాయో లేవో తెలియదు. ప్రాణాలు రక్షించుకునేందుకు అక్కడా ఇక్కడా తిరుగుతున్నాం. మొత్తం 70మంది ఉన్నాం. మేమంతా భారతీయులమే. దయచేసి మమ్మల్ని రక్షించండి. లేదంటే వారు మమ్మల్ని చంపేస్తారు' అని అందులో ఉంది. దీనిపై భారత విదేశాంగ వ్యవహారాలశాఖ స్పందిస్తూ వారిని అక్కడి నుంచి భారత్కు తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వారిని రక్షిస్తామని హామీ ఇచ్చారు. -
దాడుల్లో ఆరుగురు భారతీయుల మృతి
న్యూఢిల్లీ: యెమెన్లో జరిగిన వైమానిక దాడుల్లో ఆరుగురు భారతీయులు మృతి చెందారు. ఈ నెల 8న యెమెన్లోకి రెండు బోట్లలో చొరబడిన 21 మంది భారతీయులపై సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణదళాలు వైమానిక దాడులు చేశాయి. 14 మంది తప్పించుకోగా, ఒకరు గల్లంతయ్యారు. చనిపోయిన ఆరుగురికీ హొడైడాలో అంత్యక్రియలు జరిపామని భారత్ తెలిపింది. -
ఆ దాడుల్లో భారతీయులు చనిపోలేదు
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు యెమెన్లో జరిపిన వైమానిక దాడుల్లో 13 మంది భారతీయులు ప్రాణాలతో ఉన్నట్లు భారత విదేశాంగశాఖ తెలిపింది. మరో ఏడుగురు కనిపించడం లేదని, బహుశా వారు కూడా ప్రాణాలతోనే ఉండిఉండవచ్చని అన్నారు. తొలుత యెమెన్లోని హొదీదా ఓడరేవులో చమురు స్మగ్లర్లను లక్ష్యంగా చేసుకుని సౌదీ దళాలు దాడులు జరిపాయని, స్థానిక జాలర్లు ఈ దాడుల్లో చనిపోయారని కొన్ని జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో వార్తలు వచ్చాయి. మృతుల్లో దాదాపు 20 మంది భారతీయులు ఉన్నట్లు ఈ వార్తలు పేర్కొన్నాయి. ఈ 20మంది కూడా మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ, అందుకు సంబంధించిన ఎలాంటి సమాచారం తమ దగ్గర లేదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. యెమెన్లో భారత్కు దౌత్యకార్యాలయం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో సంక్షోభం తలెత్తినప్పుడు అక్కడి భారతీయులందరినీ స్వదేశానికి తరలించిన తరువాత, దౌత్య కార్యాలయాన్ని కూడా మూసివేశారు. -
యెమెన్లో 20మంది భారతీయుల మృతి!
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు యెమెన్లో జరిపిన వైమానిక దాడుల్లో 20 మంది భారతీయులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. యెమెన్లోని హొదీదా ఓడరేవులో చమురు స్మగ్లర్లను లక్ష్యంగా చేసుకుని సౌదీ దళాలు దాడులు జరిపాయని, స్థానిక జాలర్లు ఈ దాడుల్లో చనిపోయారని కొన్ని జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో వార్తలు వచ్చాయి. మృతుల్లో దాదాపు 20 మంది భారతీయులు ఉన్నట్లు ఈ వార్తలు పేర్కొన్నాయి. హోదీదా తీరానికి దగ్గరలో ఉన్న అల్ ఖోఖా ప్రాంతంలో రెండు జాలర్ల బోట్లు ధ్వంసం అయినట్లు కూడా తెలిపాయి. అయితే ఈ వార్తలు పూర్తిగా ధ్రువీకరణ కాలేదని, ఇందుకు సంబంధించిన ఎలాంటి సమాచారం తమ దగ్గర లేదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. యెమెన్లో భారత్కు దౌత్యకార్యాలయం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో సంక్షోభం తలెత్తినప్పుడు అక్కడి భారతీయులందరినీ స్వదేశానికి తరలించిన తరువాత, దౌత్య కార్యాలయాన్ని కూడా మూసివేశారు. -
22 మంది అరబ్ సైనికులు హతం
ప్రజలు కట్టుబట్టలతో దేశం విడిచి, శరణార్థులుగా సముద్రాలు దాటే క్రమంలో ప్రాణాలు కోల్పోతున్నా.. యెమెన్లో అధికారం కోసం అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా హుతీ దళాలు జరిపిన మెరుపదాడిలో తమ దేశానికి చెందిన 22 మంది సైనికులు మరణించినట్లు యూఏఈ శుక్రవారం ప్రకటించింది. యెమెన్లో హుతీ తిరుగుబాటు దళాలకు వ్యతిరేకంగా సౌదీ అరేబియా నేతృత్వంలో పలు దేశా సైనికులు యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. సెంట్రల్ మరిబ్ ప్రాంతంలోని ఓ క్యాంపులో సౌదీ దళాలు ఉన్నట్లు గుర్తించిన తిరుగుబాటుదారులు.. ఆ క్యాంపుపై రాకెట్ లాంచర్లతో దాడికి తెగబడ్డారు. క్యాంపులో భారీ ఎత్తున మందుగుండు సామగ్రి నిల్వ ఉండటమే మృతుల సంఖ్య పెరగడానికి కారణమయింది. దాడిలో పలువురు యెమెన్ సైనికులు కూడా మరణించారు. పెద్దసంఖ్యలో సైనిక వాహనాలు, నాలుగైదు హెలికాప్టర్లు కూడా ధ్వంసమైనట్లు తెలిసింది. గత ఏడాది సెప్టెంబర్లో హుతీ తిరుగుబాటు దళాల చేతిలో పదవీచ్యుతుడై దేశం విడిచి పారిపోయిన సిరియా మాజీ అధ్యక్షుడు అబెబ్ రబ్బూ మన్సూర్ హదీ.. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఆశ్రయం పొందుతున్నాడు. అతడికి మళ్లీ అధికారాన్ని కట్టబెట్టేందుకు పది సున్నీ ముస్లిం దేశాలు నడుం కట్టాయి. ఆ క్రమంలోనే సౌదీ అరేబియా నేతృత్వంలో పలు సున్నీ దేశాలు కలిసి ఈ ఏడాది మార్చిలో నూతన సైన్యంగా ఏర్పడి హుతీ తిరుగుబాటుదారులతో పోరాడుతున్నాయి. సిరియాలోని ప్రభుత్వ సైన్యాలు కూడా వీరిని అనుసరిస్తూ ఉన్నాయి. కాగా, తిరుగుబాటుదారులైన హుతీలు షియాలు కావడంతో వారికి ఇరాన్ మద్దతునిస్తోంది. ఈ పోరులో గతంలో ఓ సారి ఐదుగురు జవాన్లను పోగొట్టుకున్న యూఏఈ.. ఇప్పుడు భారీ సంఖ్యలో 22 మంది సైనికులను పోగొట్టుకుంది. -
వైమానిక దాడులు.. 31మంది మృతి
సనా: ఉగ్రవాదులను అణిచి వేసే క్రమంలో సౌదీ అరేబియా సమక్షంలో ఆదివారం జరిగిన వైమానిక దాడుల్లో 31మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 17మంది అమాయక పౌరులు ఉండగా.. మిగితా 14మంది షితే హుతికి చెందిన ఉగ్రవాదులు. సౌదీ అరేబియాలోని హజ్జా వద్ద గల వాటర్ బాటిల్ కర్మాగారంలో తిరుగుబాటుదారులు తలదాచుకుని ఉన్నారన్న సమాచారం మేరకు సౌదీ సైన్యం దానిపై వైమానిక దాడులు జరిపింది. ఒక్క ఆదివారమే ఈ ఫ్యాక్టరీ కాకుండా మొత్తం పన్నెండు చోట్ల వైమానిక దాడులు నిర్వహించింది. దీంతో ఒక్క వాటర్ బాటీల్ కర్మాగారం వద్దే 31 మంది ప్రాణాలు కోల్పోయారు. గత నెలలో కూడా సౌదీ సైన్యం ఉగ్రవాదుల కోసం నిర్వహించిన దాడుల్లో 65 మంది అమాయక ప్రజలు మృతిచెందారు. -
వైమానిక దాడులు.. 45 మంది మృతి
సనా: యెమన్లో వైమానిక దాడులు చోటుచేసుకుని 45 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పిల్లలు, మహిళలే అధిక సంఖ్యలో ఉన్నారు. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులను అణిచివేసే క్రమంలో భాగంగా సౌదీకి చెందిన అరబ్ లీగ్ సంస్థ ఈ దాడులను జరిపించింది. దాడులు జరిగిన ప్రాంతాల్లో హౌతీ షియతే ఉగ్రవాదుల ప్రభావం ఎక్కువగా ఉంది. -
కారు బాంబు పేలుడు:8 మంది మృతి
సానా: మరోసారి యెమెన్ బాంబు పేలుళ్లతో రక్తసిక్తమయ్యింది. సోమవారం అర్ధరాత్రి దాటాకా సానాలో షీటీ హౌతీ పార్టీ నాయకుడు అబ్దుల్ కరీమ్ అలం కుహ్లానీనే లక్ష్యంగా జరిగిన దాడిలో ఆయన మరణించారు. ఈ ప్రమాదంలో అల్ కుహ్లీనీతో సహా ఏడుగురు సెక్యూరిటీ సిబ్బంది మృతిచెందారు. అల్ కుహ్లీనీ కాన్వాయ్ లో వస్తున్న సమయంలో ఆయనకు ఇంటికి సమీపంలోన కారు బాంబు పేలుడు చోటు చేసుకుంది. అయితే దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ట్విట్టర్ లో పేర్కొంది. -
ప్రమాదంలో సనా సిటీ
అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వారసత్వ నగరాల జాబితాలో యెమెన్ రాజధాని సనా చేరింది. ప్రభుత్వ అనుకూల బలగాలకు, షియా (హుతీ) తిరుగుబాటుదారులకు మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో సనా సిటీని ఈ జాబితాలో చేర్చినట్లు ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) జూలై 3న పేర్కొంది. రెండున్నర వేల ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన సనా నగరం 7,8 శతాబ్దాల్లో ముఖ్యమైన ఇస్లామిక్ కేంద్రంగా విలసిల్లింది. పదకొండో శతాబ్దానికి పూర్వమే ఇక్కడ 103 మసీదులు, ఆరువేలకు పైగా ఇళ్లు ఉన్నాయి. -
వైమానిక దాడుల్లో 45 మంది మృతి
యెమెన్: యెమెన్లోని షియా తిరుగుబాటుదారులపై సౌదీ అరేబియా నేతృత్వంలోని అరబ్ దేశాల కూటమికి చెందిన యుద్ధవిమానాలు జరిపిన దాడుల్లో 45 మంది ప్రాణాలొదిలారు. సౌదీఅరేబియా నేతృత్వంలో యెమన్ రాజధాని సనా పై ఆదివారం జరిపిన వైమానిక దాడుల్లో 20 మంది సాధారణ ప్రజలతో పాటు మొత్తం 45 మంది మృతి చెందారు. యెమెన్ రాజధాని సనా చుట్టుపక్కల ఉన్న రెబెల్స్ స్థావరాలు, తిరుగుబాటు దారులకు చెందిన సాయుధ దళాల ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయి. -
యెమెన్ పోరులో 114 మంది మృతి
మిలిటెంట్లు, సేనల మధ్య కొనసాగుతున్న ఘర్షణలు మరో 1,052 మంది భారతీయులను కాపాడిన ప్రభుత్వం ఆడెన్: యెమెన్లో రక్తపుటేర్లు పారుతూనే ఉన్నాయి. హుతీ మిలిటెంట్లు, భద్రతా బలగాల మధ్య సాగిన భీకర పోరులో సోమవారం ఆడెన్లో 114 మంది చనిపోయారు. ఈ తీరప్రాంత పట్టణాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు మిలిటెంట్లు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. వారిని సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు ప్రతిఘటిస్తున్నాయి. మృతుల్లో 19 మంది తీవ్రవాదులు, 15 మంది అధ్యక్షుడి మద్దతుదారులు ఉన్నట్లు తెలుస్తోంది. 53 మంది సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అబ్యాన్ రాష్ట్రంలో కూడా ఏడుగురు పౌరులు మరణించారు. లాహ్జ్కు సమీపంలో సంకీర్ణ సేనలు తాజాగా జరిపిన వైమానిక దాడిలో 10 మంది రెబెల్స్ చనిపోయారు. ఇరుపక్షాలు తక్షణమే ఒక ఒప్పందానికి వచ్చి కాల్పులకు విరమణ ప్రకటించాలని రెడ్క్రాస్ సొసైటీ విజ్ఞప్తి చేసింది. పౌరులకు తాగునీరు, ఆహారం, వైద్యసాయం అందించేందుకు సహకరించాలని కోరింది. కాగా, భారత్ సోమవారం యెమెన్ నుంచి మరో 1052 మందిని రక్షించింది. ఇప్పటివరకు ఆ దేశం నుంచి కాపాడిన భారతీయుల సంఖ్య 3,300 కు చేరింది. యెమెన్ నుంచి భారతీయుల తరలింపునకు కృషి చేస్తున్న ప్రభుత్వ విభాగాలను ప్రధాని మోదీ ప్రశంసించారు. ప్రజలకు సాయం అం దించాలన్న ప్రభుత్వ వైఖరికి ఇది అద్దం పడుతోందన్నారు. భారతీయులతోపాటు ఆపదలో ఉన్న విదేశీయులనూ యెమెన్ నుంచి కాపాడుతున్నారంటూ అధికారులను కొనియాడారు. -
మరో 670 మంది తరలింపు
న్యూఢిల్లీ: అంతర్యుద్ధంలో చిక్కుకున్న యెమెన్నుంచి భారత ప్రభుత్వం ఆదివారం మూడు విమానాల్లో మరో 670 మంది భారతీయులను తరలించింది. దీంతో అక్కడి నుంచి తరలించిన భారతీయుల సంఖ్య 2,300 కు చేరుకుంది. ‘ఆపరేషన్ రాహత్’కు విశేష కృషి చేస్తున్న ఎయిరిండియాకు విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. యెమెన్లోని అశ్షిహర్ నుంచి 203 మందిని ఐఎన్ఎస్ సుమిత్ర నౌకలోకి చేర్చామని విదేశాంగశాఖ ప్రతినిధి తెలిపారు. వీరిలో 182 మంది భారతీయులు కాగా ముగ్గురు పాకిస్తానీలతో పాటు మరో ఆరు దేశాలకు చెందినవారున్నారు. అల్ముకల్లాహ్ పట్టణాన్ని అల్కాయిదా చేజిక్కించుకోవడంతో అక్కడికి చేరాల్సిన నౌకను దారిమళ్లించి 25 కి.మీ. దూరంలోని అశ్షెహర్ పోర్టులో నిలిపారు. చిన్నచిన్న బోట్లలో 203 మందిని ఐఎన్ఎస్ సుమిత్రలోకి చేర్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో పోర్టుకు మూడు కిలోమీటర్ల దూరంలో నౌకను నిలిపినట్లు అధికారులు తెలిపారు. 11 మంది భారతీయులను రక్షించిన పాక్ యెమెన్ ఆగ్నేయ ప్రాంతంలో అల్కాయిదా ఆధీనంలో ఉన్న మొకల్లా పట్టణంనుంచి తమపౌరుల్ని తరలించిన పాక్ నౌక వారితో పాటుగా 11 మంది భారతీయులను రక్షించింది. 35 మంది విదేశీయులతో సహా 183 మందిని నౌకలో చేర్చినట్లు పాక్ విదేశాంగ అధికారి తెలిపారు. వీరిలో 8 మంది చైనీయులు, 11 మంది భారతీయులు, నలుగురు బ్రిటన్ దేశస్తులు ఉన్నారని ఆ అధికారి తెలిపారు. ఈ నెల 7న నౌక కరాచీ పోర్టుకు చేరుకుంటుంది. యెమెన్ నుంచి 2,300 మంది భారతీయులను తరలించడంలో మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం విజయవంతమైందని బీజేపీ పేర్కొంది. -
11మంది భారతీయులను రక్షించిన పాక్
ఇస్లామాబాద్: ఉద్రిక్త పరిస్థితుల్లో మునిగిపోయిన యెమెన్ నుంచి తమవాళ్లతోపాటు 11మంది భారతీయులను కూడా రక్షించి తీసుకొస్తున్నామని పాకిస్థాన్ ప్రకటించింది. ఏప్రిల్ 7న కరాచీకి వారి నౌక చేరుకోనుందని తెలిపింది. పూర్తిగా అల్ కాయిదా వారి హస్తగతంలో ఉన్న యెమెన్లోని మొకల్లా అనే నగరం నుంచి తమ దేశీయులను వెనక్కి రప్పించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఓ నౌకను పంపించింది. అక్కడి వారితో చర్చలు జరిపి మొత్తం 148 మంది పాకిస్థానీయులను తమ నౌకలో ఎక్కించుకోవడమే కాకుండా మరో 35 మంది విదేశీయులకు కూడా ఆశ్రయం కల్పించింది. ఆ 35 మందిలోనే 11 మంది భారతీయులు ఉన్నారు. యెమెన్లో రాజకీయ అస్థిరత చోటుచేసుకోవడమే కాకుండా.. నిత్యం ఘర్షణలతో అట్టుడుకోతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉంటున్న తమ దేశాలవారిని స్వదేశాలకు రప్పిస్తున్నారు. భారత్ ఇప్పటికే ఈ విషయంలో వేగంగా స్పందిస్తోంది. -
తరలింపు ముమ్మరం
యెమెన్ నుంచి మరో 800 మంది భారతీయుల తరలింపు న్యూఢిల్లీ: రెబెల్స్కు, అరబ్ దేశాల కూటమికి మధ్య దాడులతో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్న యెమెన్ నుంచి భారత్ శనివారం మరో 800 మంది భారతీయులను తరలించింది. దీంతో యెమెన్ నుంచి బయటపడిన భారతీయుల సంఖ్య 1,800కు చేరింది. శనివారం యెమెన్ రాజధాని సనా నుంచి రెండు ఎయిరిండియా విమానాల్లో 350 మంది భారతీయులు పొరుగు దేశమైన జిబౌతి చేరుకున్నారు. యెమెన్లోని ఆడెన్ పోర్టుకు దగ్గర్లో భారత నౌక ఐఎన్ఎస్ ముంబైని మోహరించారు. ఆడెన్లో బాంబు దాడుల వల్ల అక్కడి భారతీయులను చిన్నచిన్న పడవల్లో ఈ నౌకలోకి చేరుస్తున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. చిన్నచిన్న విమానాల్లోనూ భారతీయులను ఇందులో చేరుస్తున్నారని అధికారులు వెల్లడించారు. యెమెన్ నుంచి భారత్కు చేరుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన 86 మంది ఉన్నారు. ఆడెన్ ఘర్షణల్లో ఇప్పటి వరకు 185 మంది చనిపోయారని సమాచారం. -
యెమెన్ పయనం ఎటు?
అరబ్ వసంతం మధ్య ఆసియా దేశాల ప్రజలకు హక్కులు ప్రసాదించడానికి బదులు, ఆయా దేశాలలో అంతర్యుద్ధాలకీ, అశాంతికీ దారితీయడం ఒక చారిత్రక విషాదం. ప్రస్తుతం యెమెన్ సంక్షోభాన్ని గమనిస్తే ఇదే భావనకు రాక తప్పదు. అవినీతికీ, రాచరికాలకీ, కుటుంబ పాలనకీ వ్యతిరేకంగా ప్రారంభమైన అలజడిని ఆసరా చేసుకుని ఉగ్రవాదులు తిష్టవేశారని అనిపిస్తుంది. యెమెన్ పరిణామాలు ఇదే చెబుతున్నాయి. అరబ్ ద్వీపకల్పంలోనే పేద దేశమైన యెమెన్ ఇప్పుడు అంతర్యుద్ధం అంచున ఉంది. 1978 నుంచి యెమెన్ను పాలిస్తున్న అల్ అబ్దుల్లా సలేహ్ నియంతృత్వానికీ, అవినీతి విధానాలకీ వ్యతిరేకంగా 2011కు ముందే ప్రజలు గళమెత్తారు. ఈ నిరసన ఈజిప్ట్, ట్యునీషియా ఉద్యమాలతో మిన్నంటింది. ఈజిప్ట్ ఆందోళనకారులు పద్దెనిమిది రోజులలో పాలకుడు ముబారక్నూ, ట్యునీషియా నిరసనకారులు నెలలోపున బెన్ అలీనీ గద్దెలు దింపగలిగారు. కానీ ‘ఇది యెమెన్. ఈజిప్ట్, ట్యునీషియా కాదు’ అని సలేహ్ బీరాలు పలికినా 2012లో విపక్షాలతో కుదిరిన ఒప్పందం మేరకు పదవి నుంచి వైదొలిగాడు. సలేహ్ ప్రభుత్వంలో ఉపాధ్యక్షునిగా పని చేసిన అబ్ద్ రుబ్బు మన్సూర్ హాదీ అధ్యక్షుడయ్యాడు. అయితే ఇతడు కూడా సెప్టెంబర్ 21, 2014న రాజీనామా చేశాడు. హుతీ ఉగ్రవాదులు రాజభవనాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఇతడు మొదట ఏడెన్ తరువాత రియాద్ వెళ్లిపోయాడు. ఇతడిని సంక్షుభిత కాలంలో యెమెన్ అధ్యక్షునిగా చాలా దేశాలు గుర్తించాయి. యెమెన్లో హుతీ ఉగ్రవాదులు (జేదీ పోరాట యోధులు, షియా వర్గీయులు, అబ్దుల్ మాలిక్ అల్ హుతీ నాయకత్వంలో పోరాడుతున్నవారు) ఉత్తర యెమెన్ కేంద్రంగా గడచిన రెండు మూడేళ్లలో అనూహ్యమైన విజయాలు సాధించారు. అందులో రాజధాని సనాను అదుపులోకి తెచ్చుకోవడం ఒకటి. తరువాత దేశమంతటా విస్తరించాలని కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. ఇక దక్షిణ యెమెన్ కేంద్రంగా అల్ కాయిదా, హిరాక్ ఉద్యమకారులు విడివిడిగా హుతీతో పోరాడుతూ, సనాపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల రాజధాని సనాలో జరిగిన రెండు ఆత్మాహుతి దాడులు తమ పనేనని ఐఎస్ఐఎస్ ప్రకటించింది. అంటే జాతీయ, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు సమస్యను మరింత జటిలం చేశాయి. అలాగే పొరుగున ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య వైషమ్యం కూడా యెమెన్ మంటలకు ఆజ్యం పోస్తోంది. ఇంకో షియా రాజ్యం తన పొరుగున ఉండరాదన్నదే సౌదీ అరేబియా ఆశయం. మార్చి మాసాంతంలో జరిగిన పరిణామాలతో సౌదీ అరేబియా హుతీ ఉగ్రవాదులపై వైమానిక దాదులకు కూడా పాల్పడింది. ఇక హుతీలు షియా తెగకు చెందిన వారు కాబట్టి ఇరాన్ తన మద్దతును ప్రకటించింది. సౌదీ అరేబియాకు యథాప్రకారం అమెరికా, బ్రిటన్ సాయం అందిస్తున్నాయి. అయితే అమెరికా అల్కాయిదా పట్ల తనకు ఉన్న వ్యతిరేకతను దాచు కోకుండా దక్షిణాది నుంచి పోరాడుతున్న ఆ సంస్థ సభ్యుల మీద డ్రోన్లతో దాడులు చేస్తూనే ఉంది. నియంతృత్వం సరికాదని భావించి, బాధ్యతాయుతమైన ప్రభుత్వం కోసం ఆశపడి వీధులలోకి వచ్చిన యెమెన్ పౌరులకు చివరికి అశాంతే మిగిలింది. అశాంతి నుంచి అశాంతికే పరిస్థితులు నడిపించాయి. సలేహ్ 1999లో మొదటిసారి ఎన్నికలు జరిపాడు. తనే మళ్లీ పాలకుడయ్యాడు. నిజానికి ఏ ప్రతిపక్షానికి పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పరిస్థితులు కల్పించుకున్నాడు. తరువాత రాజ్యాంగం ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే అందుకు ప్రజలు నిరాకరించారు. ఎందుకంటే, ఆ రాజ్యాంగం ప్రకారం సలేహ్ జీవితకాలం దేశ అధ్యక్షుడిగా కొనసాగుతాడు. ఇతడు యెమెన్కు ఇచ్చినది ఏమీ లేదు- బహుముఖ సంక్షోభం తప్ప. ఏ సమస్యనీ పరిష్కరించే యత్నం చేయలేదు. అరబ్ దేశాలలో ఒకటైనా ఇక్కడ చమురు కొరత ఏర్పడింది. దేశ ఎగుమతులు 85 శాతం వరకు అదే. ప్రభుత్వ ఆదాయంలో 70 శాతం చమురు మీదే. దీనికి తోడు నీటి కొరత నెలకొంది. పదేళ్లు గడిస్తే రాజధాని సనాలో చుక్క నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని అంచనా. ఇలా ఉండగా జనాభా విపరీతంగా పెరిగింది. నిరుద్యోగం, ఆకలీ పెరిగాయి. దీని తోనే అసంతృప్తి ఉద్యమరూపం దాల్చింది. దేశంలో అధికార మార్పిడి అని వార్యమైంది. అయితే ఈ పరిణామాన్ని ఉగ్రవాదం, అంతర్జాతీయ రాజకీయం హైజాక్ చేయడమే విషాదం.