
యెమెన్ మసీదులపై ఆత్మాహుతి దాడులు...
యెమెన్ రాజధాని సనాలో షియా రెబెల్స్ సంస్థ హుతీ అధీనంలోని రెండు మసీదుల్లో ఆత్మాహుతి బాంబర్లు నెత్తుటేర్లు పారించారు.
సనా: యెమెన్ రాజధాని సనాలో షియా రెబెల్స్ సంస్థ హుతీ అధీనంలోని రెండు మసీదుల్లో ఆత్మాహుతి బాంబర్లు నెత్తుటేర్లు పారించారు. ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు జరిపిన దాడుల్లో 142 మంది మరణించగా 351 మంది గాయపడ్డారు. రాజధానిలోని దక్షిణ, ఉత్తర ప్రాంతాల్లోని మసీదులపై ఈ దాడులు జరిగాయి. దీనికి బాధ్యత విహ స్తున్నట్టు ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది.