రిషితేశ్వరి కేసును సీబీఐకి అప్పగించాలి | cbi to take rishiteshvari case says father murali krishna | Sakshi
Sakshi News home page

రిషితేశ్వరి కేసును సీబీఐకి అప్పగించాలి

Published Mon, Sep 7 2015 3:21 AM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM

రిషితేశ్వరి కేసును సీబీఐకి అప్పగించాలి

రిషితేశ్వరి కేసును సీబీఐకి అప్పగించాలి

గుంటూరు కలెక్టర్, ఎస్పీలకు రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ వినతి
 గుంటూరు ఈస్ట్: 'యూనివర్సిటీలో చదివే విద్యార్థినుల తల్లిదండ్రులు నాలా పిల్లల్ని కోల్పోయి బాధపడకుండా ఉండాలంటే రిషితేశ్వరి కేసుపై సమగ్ర న్యాయ విచారణ జరగాలి. ఈ కేసులో పోలీసులు హడావుడిగా చార్జిషీటు దాఖలు చేస్తున్నారనే విషయం తెలుసుకుని మరోసారి కలెక్టర్‌ను కలసి న్యాయం చేయాలని కోరడానికి వచ్చాను' అని రిషితేశ్వరి తండ్రి మురళీ కృష్ణ పేర్కొన్నారు. ఈ కేసును పోలీసుల నుంచి సీబీఐకు బదలాయించాలని ఆయన ఆదివారం రాత్రి జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దం డేను కలెక్టరేట్‌లో కలసి వినతిపత్రం అందించారు. అనంతరం ఐజీ ఎన్.సంజయ్, అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠిల ఆఫీసుల్లో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. బాబూరావును ఏ-1 ముద్దాయిగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడంతోపాటు, రిషితేశ్వరి డైరీలో రాసుకున్న విద్యార్థులపైనా ఎఫ్‌ఐఆర్  నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రిషితేశ్వరి కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, బాలసుబ్రహ్మణ్యం కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement