రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం | Rajya Sabha papers filing from tomorrow | Sakshi
Sakshi News home page

రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Published Wed, Jan 22 2014 2:11 AM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM

ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు రాజ్యసభ స్థానాలతోపాటు దేశవ్యాప్తంగా మొత్తం 55 రాజ్యసభ స్థానాలకు ఎలక్షన్ కమిషన్ మంగళవారం ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.

సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు రాజ్యసభ స్థానాలతోపాటు దేశవ్యాప్తంగా మొత్తం 55 రాజ్యసభ స్థానాలకు ఎలక్షన్ కమిషన్ మంగళవారం ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ మంగళవారమే ప్రారంభం కాగా.. తొలిరోజు రాష్ట్రం నుంచి ఒక్కటి కూడా దాఖలు కాలేదు. ఈ నెల 28 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు.
 
 29న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు 31 వరకు గడువు ఉంది. ఏకగ్రీవం లేని స్థానాలకు పోలింగ్ ఫిబ్రవరి 7న జరుగుతుంది. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో ఆరు స్థానాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, ఏడో అభ్యర్థి రంగంలో నిలిస్తే పోలింగ్ నిర్వహించాల్సి వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement