
డీకే అరుణ పిటిషన్ తిరస్కరణ
ఢిల్లీ: కేబినెట్ లో మహిళల స్థానంపై మాజీ మంత్రి డీకే అరుణ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తెలంగాణ రాష్ట్రం సహా మరో 7 రాష్ట్రాల్లో కేబినెట్ లో మహిళలకు స్థానం కల్పించలేదని డీకే అరుణ శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారణకు చేపట్టిన సుప్రీంకోర్టు ఈ అంశం ముఖ్యమంత్రుల పరిధిలోనిదని పిటిషన్ ను తిరస్కరించింది. కేబినెట్ లో మహిళలకు స్వచ్ఛందంగా స్థానం కల్పించి ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కాగా సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలోనైనా సీఎం కేసీఆర్ కేబినెట్ లో మహిళలకు స్థానం కల్పించాలని డికే అరుణ సూచించారు.