'ఏపీలో సెక్షన్ 8 అమలు చేయాలి' | sv mohan reddy fires on cm chandra babau naidu | Sakshi
Sakshi News home page

'ఏపీలో సెక్షన్ 8 అమలు చేయాలి'

Published Sun, Jul 12 2015 2:52 PM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

'ఏపీలో సెక్షన్ 8 అమలు చేయాలి' - Sakshi

'ఏపీలో సెక్షన్ 8 అమలు చేయాలి'

సెక్షన్ 8ను తెలంగాణ లో కాకుండా ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

కర్నూలు: సెక్షన్ 8ను తెలంగాణ లో కాకుండా ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఉంటూ చంద్రబాబు నాయుడు రాచరిక పాలన చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా ఎమ్మార్వో వనజాక్షి అంశంలో న్యాయం చేయకపోగా టీడీపీ ఎమ్మెల్యే పక్షాన నిలబడటం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు.

అధికారులు, ప్రజలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడి చంద్రబాబు  అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. చట్టం తన పని తాను చేయకుండా సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement