-
ఎలన్ మస్క్కు ఘోర అవమానం?!
ప్రపంచ అపరకుబేరుడు ఎలన్ మస్క్కు ఘోర అవమానం జరిగిందా?.. అవుననే చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది. అందుకు కారణం.. మాజీ ప్రేయసి అంబర్ హర్డ్. ఎలన్ మస్క్.. ఎట్టకేలకు ట్విట్టర్(ట్విటర్) డీల్ను ముగించిన సంగతి తెలిసిందే. మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ద్వారా స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తానని ప్రకటించిన మస్క్.. తొలుత యూజర్ల అభిమానాన్ని చురగొన్నాడు కూడా. అయితే.. ట్విట్టర్ ఆఫీస్లో అడుగుపెట్టాక తనదైన నిర్ణయాలతో ట్విట్టర్ను ఆగం పట్టిస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మార్పుల పేరిట బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నుంచి.. కీలక పదవుల్లో ఉన్న వాళ్లను సాగనంపగా.. ఆపై టెస్లా ఉద్యోగులను ట్విటర్లోకి తెచ్చుకున్నాడు. మరోవైపు వెరిఫికేషన్ ప్రాసెస్కు, బ్లూటిక్ కోసం 8 డాలర్లు చెల్లించాలని ప్రకటించి.. పక్కా కమర్షియల్ ఆలోచనను అమలు చేస్తున్నాడు. ఈ క్రమంలో నిరసన వ్యక్తం చేస్తూ కొందరు సెలబ్రిటీలు ట్విటర్ను వీడుతున్నారు. ట్విటర్ను ఇప్పటికే చాలామంది ప్రముఖులు వీడారు. టోనీ బ్రాక్స్టన్, షోండా రిమ్స్తో పాటు ప్రొఫెషనల్ రెజ్లర్(రిటైర్డ్)..డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ మిక్ ఫోలీ ట్విటర్ అకౌంట్లను డిలీట్ చేశారు. ఇక ఇప్పుడు ఆ లిస్ట్లోకి నటి అంబర్ హర్డ్ కూడా చేరింది. ఆమె ఎందుకు వీడిందో అనే దానిపై స్పష్టత లేకున్నా.. సెలబ్రిటీల గుడ్బై మూమెంట్లో ఆమె కూడా చేరడం పట్ల మస్క్పై సెటైర్లు పడుతున్నాయి. మాజీ ప్రేయసి మస్క్ పరువు తీసేసిందనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది కూడా. మరోవైపు ఆమె మాజీ భర్త జానీ డెప్ అభిమానుల కారణంగానే ఆమె ట్విటర్కు గుడ్బై చెప్పి ఉంటుందనే వాదన సైతం చక్కర్లు కొడుతోంది కూడా. అంబర్ హర్డ్.. 2016 నుంచి 2018 మధ్య ఎలన్ మస్క్తో డేటింగ్ చేసింది. అయితే అప్పటికే నటుడు జానీ డెప్తో ఆమె విడాకులకు సిద్ధమైంది. అయితే మస్క్ వల్లే తన కాపురంలో చిచ్చు రగిలిందని, హర్డ్ సైకోతనం భరించలేక తాను విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు జానీ డెప్. ఈ క్రమంలో జానీ డెప్ వేసిన పరువు నష్టం దావా కేసు.. విచారణ సందర్భంగా మస్క్ కూడా హాజరవుతాడని అంతా భావించారు. కానీ, అది జరగలేదు. ఇక ఈ కేసులో ఈ ఏడాది మొదట్లో జానీ డెప్కు అనుకూలంగా తీర్పు వెలువడడం గమనార్హం. అయితే ఆ సమయంలోనూ ఆమెకు సంబంధించిన కోర్టు ఫీజులను ఎలన్ మస్క్ చెల్లించాడనే వాదన వినిపించింది. -
డ్రగ్స్ ఇచ్చాడు, అలా ఫస్ట్ టైం జానీతో బెడ్ షేర్ చేసుకున్నా..
హాలీవుడ్ హీరో జానీ డెప్ మీద సంచలన ఆరోపణలు చేసింది అతడి మాజీ ప్రేయసి ఎలెన్ బార్కిన్. తాము తొలిసారి శారీరకంగా కలవడానికి ముందు అతడు తనకు క్వాల్యూడ్ అనే డ్రగ్ ఇచ్చాడని ఆరోపించింది. ఆ సమయంలో అతడు బాగా తాగి తనను కంట్రోల్ చేయడమే కాక నోటికొచ్చినట్లు మాట్లాడాడని పేర్కొంది. జానీ మీద అంబర్ హెరాల్డ్ వేసిన పరువు నష్టం దావా కేసులో సాక్షిగా ఉన్న ఆమె ఆరువేల పేజీలున్న కోర్టు డాక్యుమెంట్స్లో పై వ్యాఖ్యలు చేసింది. జానీ ఎప్పుడూ తనను కట్టడి చేయాలని చూసేవాడంది. ఎవరితోనైనా కాస్త చనువుగా ఉంటే చాలు ఈర్ష్య పడేవాడంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరితో వెళ్తున్నావు? మీరిద్దరూ రాత్రంతా ఏం చేశారు? వంటి ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడని చెప్పుకొచ్చింది. ఒకసారి తన వీపు మీద ఏదో గీత పడితే నేను ఎవరితోనో బెడ్ షేర్ చేసుకున్నానని అనుమానించాడని వాపోయింది. ఒకసారి తనకు క్వాల్యూడ్ అనే డ్రగ్ ఇచ్చాడని, అప్పుడే తామిద్దరం తొలిసారిగా బెడ్ షేర్ చేసుకున్నామని పేర్కొంది. కొన్ని నెలలపాటు తమ బంధం కొనసాగిందని, ఆ సమయంలో వారానికి మూడు, నాలుగు రోజులు ఒకరింటికి మరొకరం వెళ్లి కలుసుకునేవాళ్లమని తెలిపింది. చాలావరకు జానీ పూటుగా మద్యం సేవించి, ఆ మత్తులోనే ఉండేవాడని చెప్పింది. అతడు కొకైన్, గంజాయి, హాలూసినోజెనిక్ వంటి డ్రగ్స్ సేవించడం తాను కళ్లారా చూశానని చెప్పుకొచ్చింది. అయితే మందు, లేదంటే సిగరెట్ తాగేవాడని, అందరి మీదా అరుస్తాడని, ఓసారి తనమీదకు మందు బాటిల్ విసిరాడని ఆరోపణలు చేసింది. కాగా అంబర్ హెరాల్డ్, జానీ డెప్ ఒకరి మీద ఒకరు వేసుకున్న పరువు నష్టం కేసులో ఫైనల్గా జానీ డెప్ గెలిచిన విషయం తెలిసిందే! చదవండి: భర్తను టార్చర్ పెట్టిన హీరోయిన్, ట్రెండింగ్లో బాయ్కాట్ ఆలియా.. తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని ఎమోషనలైన కల్యాణ్ రామ్ -
ఆ ముసలోడి కంటే నేనే నయం: నటికి పెళ్లి ప్రపోజల్
సానుభూతితో అయినా గెలుపు దక్కుతుందనుకుంటే.. ఆ నటికి ఘోరమైన ఓటమి ఎదురైంది. గృహ హింస వేధింపుల కేసు ఓడిపోవడంతో పాటు పరువు నష్టం రాబట్టడంలోనూ ఎదురు దెబ్బే తగిలింది. ఒక మగాడు.. అందునా కాస్త పేరున్న హీరో కావడంతో జానీ డెప్ సక్సెస్ను ఆయన అభిమానగణం, ప్రత్యేకించి.. పురుష సమాజం భారీగానే సెలబ్రేట్ చేసుకుంది. పుట్టెడు దుఖంలో ఉన్న ఆమెకు ఇప్పుడు ఒక అసాధారణమైన పెళ్లి ప్రపోజల్ వచ్చింది. జానీ డెప్-అంబర్ హర్డ్ పరువు నష్టం దావా వ్యవహారం ఇంకా పూర్తిగా ముగిసిపోలేదు. మాజీ భార్య అంబర్కు డెప్ ఇంకా 2 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలి. అదే సమయంలో డెప్కు అంబర్ హర్డ్ 13.5 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలి. అయితే అంత పరిహారం చెల్లించే పరిస్థితిలో తను లేదంటూ మరోసారి కోర్టును ఆశ్రయించారు ఆమె తరపు న్యాయవాది. ఇదిలా ఉండగా.. సౌదీ అరేబియాకు చెందిన ఓ వ్యక్తి ఇప్పుడు అంబర్ హర్డ్కు పెళ్లి ప్రపోజల్ పంపాడు. అది మామూలుగా లేదు! ఆ ముసలోడి(జానీ డెప్ను ఉద్దేశించి) కంటే నేనే నయం అంటూ ఓ ఆడియో వాయిస్ను అంబర్ హర్డ్కు పంపాడు ఆ వ్యక్తి. సౌదీ అరేబియాకు చెందిన సదరు వ్యక్తి ఓ షేక్గా తెలుస్తోంది. వాయిస్ నోట్ ద్వారా అంబర్ హర్డ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు సందేశం పంపాడు. అంబర్.. నీ దారులన్నీ మూసుకుపోతున్నాయ్. నేను తప్ప నిన్ను జాగ్రత్తగా చూసుకునేవాళ్లెవరూ లేరు. కొందరు నిన్ను ద్వేషిస్తూ.. తిడుతున్నారు. అందుకే.. నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నా. ఈ సమాజం నిన్ను అంగీకరించకపోయినా.. నిన్ను నేను పెళ్లి చేసుకుంటా. అల్లా దయ నీ మీద ఉంటుంది. నువ్వు గొప్పదానివి. అయినా జనాలు నిన్ను కావాలనే మెచ్చుకోరు. ఆ ముసలోడి కంటే నేనే నయం. నన్ను పెళ్లి చేస్కో. నాతో సంతోషంగా ఉంటావ్’’ అంటూ వాయిస్ నోట్ పంపాడు ఆ వ్యక్తి. Bee4andafter_kw అనే అకౌంట్ నుంచి ఆ వాయిస్ నోట్ విపరీతంగా వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Bee4andafter_kw 🇰🇼 (@bee4andafter_kw) అంబర్ హర్డ్(36), జానీ డెప్ (58) .. 2015లో వివాహం చేసుకున్నారు. కానీ, ఏడాదికే ఈ సెలబ్రిటీ జంట కాపురం రచ్చకెక్కింది. దీంతో 2017లో అధికారికంగా విడాకులు తీసుకుంది ఈ జంట. అయితే కొద్దిరోజులకే ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు.. అదీ జుగుప్సాకరంగా చేసుకుంటూ వార్తల్లోకి ఎక్కారు. వాషింగ్టన్ పోస్ట్లో గృహ హింస బాధితురాలిని అంటూ ఆమె రాసిన కథనంపై 50 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ కోర్టుకు ఎక్కాడు జానీ డెప్. ప్రతిగా 2020 ఆగష్టులో తానూ గృహ హింసను ఎదుర్కొన్నానని, పైగా జానీ డెప్.. ఆయన లాయర్ నుంచి అసత్య ప్రచారాలు ఎదుర్కొంటున్నాంటూ 100 మిలియన్ డాలర్లకు కౌంటర్ దావా వేసింది ఆమె. వర్జీనీయా ఫెయిర్ఫాక్స్ కోర్టులో ఆరువారాల పాటు సాగిన విచారణ తర్వాత.. కోర్టు తీర్పు ఇచ్చింది. ఇద్దరినీ పరువు నష్టం పొందేందుకు అర్హులే అని పేర్కొన్న కోర్టు.. జానీ డెప్ వైపే తీర్పు ఇవ్వడంతో అప్పటిదాకా అంబర్ హర్డ్ మీద వ్యతిరేకత ఉన్నవాళ్లంతా హర్షం వ్యక్తం చేయసాగారు. చదవండి: అంబర్ హర్డ్ బిడ్డకు తండ్రి ఎవరో తెలుసా? -
సంచలన తీర్పు.. బోరున ఏడ్చేసిన హీరోయిన్
ఆసక్తికరమైన వ్యవహారంలో తీర్పు వెలువడింది. హాలీవుడ్ మాజీ జంట జానీ డెప్-అంబర్ హర్డ్ పరువు నష్టం దావా వ్యవహారంలో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జానీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో పాటు అంబర్ హర్డ్కు జరిమానా విధించింది కోర్టు. పైగా ఆమె ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చేసింది కోర్టు. వర్జీనీయాలోని ఫెయిర్ఫ్యాక్స్ కౌంటీ కోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. నటుడు జానీ డెప్(58), అతని మాజీ భార్య అంబర్ హర్డ్(36) ఇద్దరూ పరువు నష్టం పొందేందుకు అర్హులేనంటూ పేర్కొంటూనే.. డెప్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఏడుగురు సభ్యులతో కూడిన జ్యూరీ ఇచ్చిన తీర్పుతో కోర్టు హాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. అస్పష్టమైన వాదనలు, పోటాపోటీ ఆరోపణల(సంచలన)తో ఆరు వారాలపాటు సాగింది విచారణ. బుధవారం ఈ మేరకు తీర్పు వెలువరించిన జ్యూరీ.. నటి అంబర్ హర్డ్ తన మాజీ భర్తకు 15 మిలియన్ డాలర్ల(తర్వాత దానిని 13.5 మిలియన్ డాలర్లకు కుదించింది) పరిహారం చెల్లించాలని తెలిపింది. 2018లో ఆమె రాసిన సెక్సువల్ వయొలెన్స్ ఆర్టికల్ ఒకటి.. జానీ పరువుకు భంగం కలిగించేంది ఉందని, దాని ఆధారంగానే ఆమె ఆయనపై వేధింపులకు, పరువుకు భంగం కలిగించిందని అంచనాకి వచ్చామని కోర్టు పేర్కొంది. కోర్టు తీర్పు అనంతరం అంబర్ బోరున ఏడ్చేసింది. తన గుండె బద్ధలైందని, నిరాశ చెందానని, ఈ తీర్పు తనకే కాదని.. మహిళలందరికీ దెబ్బ అని ఆమె వ్యాఖ్యానించింది. కేవలం తన పరపతితోనే తన మాజీ భర్త నెగ్గాడంటూ ఆరోపణలు చేసింది ఆమె. ఇదిలా ఉంటే జానీ డెప్ పేరును ప్రస్తావించకుండానే.. వైవాహిక జీవితపు హింస గురించి.. 2018లో ఆమె ది వాషింగ్టన్ పోస్టులో ఒక కథనం రాసింది. దాని ఆధారంగా 50 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలంటూ 2019 ఫిబ్రవరిలో కోర్టుకు ఎక్కాడు పైరెట్స్ ఆఫ్ కరేబియన్ నటుడు. అంతేకాదు ఆమె తనకు నరకం చూపించేదని, అవమానించేదని, ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో(ఎలన్ మస్క్)తో ఎఫైర్ నడిపించిందని, అదే ఆమెను ప్రభావితం చేసిందని దావాలో ఆరోపించాడు. ప్రతిగా 2020 ఆగష్టులో తానూ గృహ హింసను ఎదుర్కొన్నానని, పైగా జానీ డెప్.. ఆయన లాయర్ నుంచి అసత్య ప్రచారాలు ఎదుర్కొంటున్నాంటూ 100 మిలియన్ డాలర్లకు కౌంటర్ దావా వేసింది ఆమె. ఈ దావాల్లో ఇరు పక్షాల వాదనలు వింటూ వచ్చిన కోర్టు.. తీర్పును రిజర్వ్లో ఉంచింది. బుధవారం(జూన్ 1) తీర్పు జానీ డెప్కు అనుకూలంగానే వచ్చినా.. అంబర్ హర్డ్ ప్రత్యారోపణలను సైతం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ప్రతిగా 2 మిలియన్ డాలర్లను చెల్లించాలంటూ జానీ డెప్కు ఆదేశించింది వర్జీనీయా ఫెయిర్ఫాక్స్ కోర్టు. నా జీవితం నాకు దక్కింది కోర్టు తీర్పు పట్ల ‘జాక్ స్పారో’ జానీ భావోద్వేగానికి లోనయ్యాడు. తనకు అనుకూలంగా రావడంతో.. జానీ డెప్ సంతోషం వ్యక్తం చేశాడు. తన జీవితాన్ని తనకు తిరిగి ఇచ్చారంటూ జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడాయన. ఇదిలా ఉంటే.. 2015లో జానీ డెప్, అంబర్హర్డ్ల వివాహం జరిగింది. కానీ, ఏడాదికే వాళ్ల కాపురంలో మనస్పర్థలు మొదలు అయ్యాయి. 2017లో అధికారికంగా విడాకులు తీసుకుంది ఈ జంట. అయితే కొద్దిరోజులకే ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు.. అదీ జుగుప్సాకరంగా చేసుకుంటూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇది వాళ్ల వాళ్ల కెరీర్ను సైతం దెబ్బ తీయడం గమనార్హం. -
ఎలన్ మస్క్: అప్పుడు డేటింగ్తో చిచ్చు! ఇప్పుడేమో ఇలా..
ఎలన్ మస్క్కు ఉన్న ఫాలోయింగ్, అభిమాన గణం సంగతి ఏమోగానీ.. తాజాగా ఆయన చేసిన ఓ రీట్వీట్ ఎక్కువ విమర్శలకే దారి తీసింది. హాలీవుడ్ సెలబ్రిటీ ఎక్స్ కపుల్.. జానీ డెప్-అంబర్ హర్డ్ కోర్టుకెక్కిన వ్యవహారంపై తొలిసారి బహిరంగంగా స్పందించాడు ఎలన్ మస్క్. డెప్-హర్డ్ దావా వ్యవహారంలో శుక్రవారం కోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో జ్యూరీ తదుపరి చర్చలు మొదలు పెట్టింది. ఈ దరిమిలా.. ఎలన్ మస్క్ శనివారం ఉదయం ఓ ట్వీట్ చేశాడు. ఇద్దరూ ఉత్తమమైన వ్యక్తిత్వాలు ఉన్న అద్భుతమైన వ్యక్తులని.. వారిద్దరూ జీవితంలో ముందుకు సాగాలని ఆశిస్తున్నట్లు ఓ ట్వీట్కు రీట్వీట్ చేశాడు. దీంతో కాపురంలో చిచ్చు పెట్టి.. ఇప్పుడు ఓదారుస్తున్నాడంటూ మండిపడుతున్నారు పలువురు. I hope they both move on. At their best, they are each incredible. — Elon Musk (@elonmusk) May 28, 2022 బుధవారం కోర్టులో వాదనల సందర్భంగా.. డెప్ తన మాజీ టాలెంట్ మేనేజర్ అయిన క్రిస్ట్రియన్ కార్నిన్నోకు పంపిన ఓ సందేశం హైలైట్ అయ్యింది. అందులో అంబర్ హర్డ్, ఎలన్ మస్క్ మధ్య ఎఫైర్ గురించి ప్రస్తావన ఉంది. అసభ్యమైన పదజాలంతో అందులో మస్క్ను తిట్టాడు డెప్. ఇదిలా ఉంటే.. 2015లో జానీ డెప్, అంబర్హర్డ్ల వివాహం జరిగింది. కానీ, ఏడాదికే వాళ్ల కాపురంలో మనస్పర్థలు మొదలు అయ్యాయి. దాదాపుగా ఆ టైంలోనే నటి అంబర్ హర్డ్తో కొంతకాలం డేటింగ్ చేశాడు ఎలన్ మస్క్. ఎలన్ మస్క్ డేటింగ్తో ఆ గొడవలు మరింత ముదిరాయన్నది జానీ డెప్ ఆరోపణ. అంతేకాదు.. ఇప్పుడు కూడా ఆమె కోర్టు ఫీజులను ఎలన్ మస్కే చెల్లిస్తున్నాడంటూ చెప్తున్నాడు. ఇదిలా ఉంటే.. హాలీవుడ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానగణం సంపాదించుకున్న ఈ మాజీ భార్యాభర్తలు.. ఒకరి మీద ఒకరు పరువు నష్టం దావాతో వర్జీనీయా ఫెయిర్ఫాక్స్ కౌంటీ కోర్టుకెక్కడమే కాదు.. యాక్టింగ్ ప్రొఫెషన్కు భారీగా డ్యామేజ్ చేసుకున్నారు కూడా.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
రేవంత్ దుకాణం బంద్ కావాలి
తప్పక చదవండి
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
Advertisement