-
చైనాలో నలుగురు అమెరికన్లపై దాడి
చైనాలో మరో ఘాతుకం చోటుచేసుకుంది. నలుగురు అమెరికన్ అధ్యాపకులపై దాడి జరిగింది. దుండగులు అధ్యాపకులపై కత్తులతో దాడికి తెగబడ్డారు. చైనాలోని ఈశాన్య జిలిన్ ప్రావిన్స్లోని ఒక పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ అధ్యాపకులంతా చైనాలోని తమ భాగస్వామ్య విశ్వవిద్యాలయాన్ని సందర్శించడానికి వెళ్లారు. ఈ ఘటన నేపధ్యంలో అయోవా కాంగ్రెస్ ప్రతినిధి మరియాన్నెట్ మిల్లర్ మీక్స్ మాట్లాడుతూ ఈ దాడిలో గాయపడిన అధ్యాపకులను తగిన వైద్య చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ దాడికి సంబంధించిన వివరాలను అమెరికా ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. కార్నెల్ కళాశాల అధ్యాపకులు చైనాలోని భాగస్వామ్య విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తుండగా ఈ దాడి జరిగిందని వార్తా సంస్థ సీఎన్ఎన్ తెలిపింది. కార్నెల్ కాలేజ్ ప్రెసిడెంట్ జోనాథన్ బ్రాండ్ ఈ ఘటనను ధృవీకరించారు.మరోవైపు ఈ దాడికి సంబంధించిన నివేదికలు తమకు అందాయని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అధ్యాపకులు ఏ మేరకు గాయపడ్డారు? వీరిపై దాడికి కుట్ర జరిగిందా? లేక మరేదైనా కారణమా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని కార్నెల్ ప్రతినిధి జెన్ వీజర్ తెలిపారు. కాగా అమెరికా పౌరులపై దాడి ఘటనను చైనా పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ కార్యకర్తల దాడి
సాక్షి, అనకాపల్లి: అధికారం అండ చూసుకుని టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపుపాలెం మండలం రాశిపల్లి శివారు ఎరకన్నపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ బూత్ కనీ్వనర్ కొల్లి అప్పలనాయుడుపై కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆదివారం రాత్రి ఎరకన్నపాలెంలో టీడీపీ విజయోత్సవ ర్యాలీ చేశారు. గ్రామ శివారులో ఉన్న వైఎస్సార్సీపీ బూత్ కనీ్వనర్ అప్పలనాయుడు ఇంటిపై బాణా సంచాకాల్చారు. దీంతో అప్పలనాయుడు ఇంటి సమీపంలోనే ఉన్న పశువులు బెదిరాయి.పశువులు బెదురుతున్నాయని, పక్కనే గడ్డి వాము కూడా ఉందని, బాణాసంచా కాసింత దూరంలో కాల్చుకోవాలని అప్పలనాయుడు వారిని కోరాడు. వెంటనే టీడీపీ కార్యకర్తలు ఆయనపై కర్రలతో దాడి చేశారు. దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన ఆయన తమ్ముడు రామారావు, తల్లి సత్యవతి, తండ్రి అప్పారావును కూడా కర్రలతో కొట్టారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పలనాయుడుకు తలపై తీవ్రమైన గాయం కావడంతో గాజువాక కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో, ఆయన తల్లి సత్యవతి, తమ్ముడు రామారావు ఇద్దరూ నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రణాళిక ప్రకారమే దాడి అప్పలనాయుడిపై ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని గ్రామస్థులు తెలిపారు. ఆయన ఇంటి వద్దకు టీడీపీ ర్యాలీ వచి్చన వెంటనే కరెంటు పోయిందని, అప్పలనాయుడిపై దాడి జరిగిన కొన్ని నిమిషాల్లో కరెంట్ వచి్చందని, ముందస్తుగానే కరెంటు తీసేసి దాడికి పాల్పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాడికి పాల్పడిన వారే ముందుగా పోలీసు స్టేషన్కు వెళ్లి తమపై కూడా దాడి చేశారని వెళ్లి ఫిర్యాదు చేశారు.50 మంది టీడీపీ రౌడీలు కర్రలతో దాడి టీడీపీ గూండాలు ఉద్దేశపూర్వకంగానే అప్పలనాయుడు ఆవుల షెడ్పైకి తారాయి జువ్వలు వేశారు. దూరంగా కాల్చుకోవాలని చెప్పిన అప్పలనాయుడుపై 50 మందికి పైగా టీడీపీ గూండాలు కర్రలతో దాడి చేశారు. ఆయన తల పగిలేలా కొట్టారు. అప్పలనాయుడును నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యుల సూచన మేరకు రాత్రి 12 గంటల సమయంలో విశాఖలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తీసుకెళ్లాం. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. పోలీసు స్టేషన్లో 8 మందిపై కేసు నమోదు చేశారు. – భద్రాచలం, జెడ్పీటీసీ, మాకవరపుపాలెం మండలం -
సరిపల్లిలో టీడీపీ, జనసేన కార్యకర్తల విధ్వంసం
కొయ్యలగూడెం: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామంలో సచివాలయ భవనాన్ని ఆదివారం జనసేన, టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. మాజీ ఎమ్మెల్యే బాలరాజు శిలాఫలకాన్ని, సచివాలయం నిర్మించ తలపెట్టిన సామగ్రిని ధ్వంసం చేశారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ పేరిట ప్రణాళిక ప్రకారం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనం వద్దకు చేరుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డిŠ, తెల్లం బాలరాజు ఫ్లెక్సీలను, శిలాఫలకాలను ధ్వంసం చేశారు.సచివాలయ కార్యాలయంలోని సామగ్రిని పగలగొట్టి వీరంగం సృష్టించారు. ఎవరైనా అడ్డుకుంటే అంతుచూస్తామంటూ భవన నిర్మాణ కారి్మకులను బెదిరించారు. పక్కన నిర్మాణంలో ఉన్న మహానేత వైఎస్సార్ విగ్రహం, స్మారక మందిరం వద్ద దాడులకు పాల్పడుతున్న సమయంలో సమీపంలోని రైతులు ఎదురు తిరగడంతో విరమించుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు పీఏసీఎస్ అధ్యక్షురాలు మందపాటి శ్రీదేవి తెలిపారు.కొయ్యలగూడెం మండలం సరిపల్లి సచివాలయ భవనంపై దాడి చేస్తున్న కూటమి పార్టీ కార్యకర్త -
వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడులు హేయం : సామినేని
సాక్షి,కృష్ణా జిల్లా : ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని ,పేర్ని నాని, వల్లభనేని వంశీ ఇళ్లపై దాడులు చేయటం హేయమైన చర్య అని కృష్ణా జిల్లా జగ్గయ్య పేట వైస్సాఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మండిపడ్డారు.టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైస్సాఆర్సీపీ సానుభూతిపరులపై జరుగుతున్న దాడుల్ని ఆయన ఖండించారు. కృష్ణా జిల్లా జగ్గయ్య పేటలో వైస్సాఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వరుస దాడులపై పోలీసులు తాత్కాలిక కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పును మేం గౌరవిస్తాం. జగ్గయ్యపేటలో గెలిచిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్కు అభినందనలు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఉండేందుకు నాయకులు ప్రయత్నించాలని వైఎస్సాఆర్ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను విజ్ఞప్తి చేశారు. -
ఇదేనా ప్రజాస్వామ్యం !
-
టీడీపీ అరాచకాలపై వైఎస్ఆర్ సీపీ యాక్షన్ ప్లాన్
-
దేశం మొత్తం చర్చించేలా ఏపీలో టీడీపీ రావణకాష్టం..
-
పోలీసుల అండతో ఏపీ వ్యాప్తంగా టీడీపీ విద్వాంసఖండ
-
వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
-
వరుస దాడులు..భయాందోళనలో ప్రజలు..
-
Gunshot: ఓడినా గెలిచాడు YS Jagan
-
డెన్మార్క్ ప్రధానిపై దాడి
కోపెన్హాగెన్/న్యూఢిల్లీ: డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టె ఫ్రెడెరిక్సన్(46)పై దాడి జరిగింది. శుక్రవారం ఆమె రాజధాని కోపెన్హాగెన్లోని కుల్వోర్వెట్ స్క్వేర్ వద్ద సోషల్ డెమోక్రాట్ల తరఫున ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎదురుగా వచి్చన ఓ వ్యక్తి చేతితో ప్రధానిని భుజాన్ని బలంగా నెట్టివేశాడు. దీంతో, ఆమె పక్కకు తూలారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనతో ప్రధాని ఫ్రెడెరిక్సన్కు ఎటువంటి గాయాలు కాలేదు కానీ, షాక్కు గురయ్యారని ఆమె కార్యాలయం తెలిపింది. ఘటన నేపథ్యంలో శనివారం ప్రధాని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారని వివరించింది. యూరోపియన్ పార్లమెంట్కు ఆదివారం ఎన్నికలు జరగనుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. ఫ్రెడెరిక్సన్పై దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. -
టీడీపీ అరాచకాలు..మరో బీహార్ గా మారిన ఏపీ
-
పిఠాపురంలో వర్మపై దాడి చేసిన జనసైనికులు
-
మూడోరోజు అదే పరిస్థితి..అగని ఎల్లో దాడులు..
-
కిడ్నీ పరిశోధన కేంద్రంపై దుశ్చర్య
కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా పలాసలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన కిడ్నీ పరిశోధన కేంద్రంపై టీడీపీ కార్యకర్తలు శుక్రవారం దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ కేంద్రంపై పేరులో ఉన్న వైఎస్సార్ అనే అక్షరాలను తొలగించారు. శిలాఫలకాలను, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన శిలాఫలకాలను తొలగించారు.ఆస్పత్రి రెండు విభాగాలుగా ఉన్న భవనాలపై ఏర్పాటు చేసిన వైఎస్సార్ కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, డయాలసిస్ సెంటర్ అనే తెలుగు, ఇంగ్లిష్ అక్షరాల్లో వైఎస్సార్ అనే అక్షరాలను తీసేశారు. రాజకీయాలకు అతీతంగా ఉద్దాన ప్రాంతంలో ఉన్న ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలతో పాటు ఆంధ్రా–ఒడిశా సరిహద్దుతోపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఇక్కడ వైద్యసేవలు పొందుతున్నారు. అన్ని రకాల పరీక్షల నుంచి డయాలసిస్, అరుదైన ఆపరేషన్లకు ఈ ఆస్పత్రి నెలవుగా మారింది. ఉచితంగా స్కానింగ్ చేసి మందులు ఇస్తున్నారు. ఈ చర్యను మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తీవ్రంగా ఖండించారు. -
బెజవాడలో టీడీపీ విధ్వంసకాండ
విజయవాడ: బెజవాడలో పట్టపగలే టీడీపీ కార్యకర్తలు విధ్వంసకాండకు దిగారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్పై దాడికి విఫలయత్నం చేశాయి. నగరంలోని లబ్బీపేట మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలోని వంశీ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్పై పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన రాత్రి వరకు ఈ విధ్వంసకాండ కొనసాగింది.అరుపులు, కేకలు, బూతులతో ఆ ప్రాంతాన్ని అట్టుడికించారు. పోలీసులనూ తరిమేశారు. చివరకు సీఆర్పీఎఫ్ పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జి చేయడంతో పరిస్థితి అదుపులోకి వచి్చంది. ఇటీవలి ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు అక్కడికి వచ్చి అల్లరి మూకలకు మరింతగా రెచ్చగొట్టడం గమనార్హం. ముందస్తు వ్యూహంతోనే దాడి టీడీపీ అధినాయకత్వం అండతో, ముందస్తు వ్యూహంతోనే విజయవాడ సెంట్రల్, తూర్పు, గన్నవరం నియోజకవర్గాల నుంచి గంజాయి, మద్యంతో పాటు ఇతర మత్తు పదార్థాలు సేవించిన టీడీపీకి చెందిన యువకులు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం. తొలుత మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాలుగు కార్లలో కత్తులు, ఇటుకలు, కంకర రాళ్లు, కర్రలతో కొందరు టీడీపీ కార్యకర్తలు వంశీ ఉంటున్న అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు. వస్తూనే బూతులు తిడుతూ కార్లలో తెచ్చుకున్న రాళ్లను విసిరారు. రాళ్ల దాడిలో వంశీ కారుతో పాటు ఆ ప్రాంతంలోని కొన్ని కార్లు, ద్విచక్ర వాహనాలు, సమీపంలోని ఇళ్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.కొందరు సమీపంలోని ఇళ్లలోకి చొరబడి కర్రలతో కుండీలు, కిటికీలు పగలకొట్టి భీభత్సాన్ని సృష్టించారు. టీడీపీ జెండాలను పట్టుకుని నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి కవి్వంపు చర్యలకు దిగారు. బూతులు, అరుపులతో అక్కడున్న అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. అపార్ట్మెంట్ గోడ దూకి సెల్లార్లో ఉన్న పలు కార్ల అద్దాలను పగులగొట్టారు. ప్రతి అర గంటకు మరికొందరు అక్కడకు చేరుకోవడంతో ఆ ప్రాంతం పూర్తిగా టీడీపీ వారితో నిండిపోయింది. 300 మందికి పైగా ఈ దాడిలో పాల్గొన్నారు. ఒక్కసారిగా భీభత్సం సృష్టించడంతో స్థానికులు భయకంపితులయ్యారు.పలువురు మహిళలు భయాందోళనకు గురయ్యారు. పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ ఆదేశాలతో పోలీసులు భారీ సంఖ్యలో చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులను చూడగానే అల్లరి మూకలు మరింతగా రెచి్చపోయాయి. విధ్వంసాన్ని అదుపు చేసేందుకు వచి్చన పోలీసులను వెంటబడి తరిమారు. పరిస్థితి అదుపు తప్పడంతో సీఆర్పీఎఫ్ బలగాలు అక్కడికి చేరుకున్నాయి.సీఆర్పీఎఫ్ పోలీసులు వచ్చీ రాగానే లాఠీచార్జీ ప్రారంభించడంతో టీడీపీ కార్యకర్తలు పరుగులు పెట్టారు. దాడులకు పాల్పడిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు సమీపంలోని ఇళ్లలోకి దూరి దాక్కున్నారు. పోలీసులు వారిని వెతికి పట్టుకుని మరీ పోలీస్ స్టేషన్కు తరలించారు. విధ్వంసానికి ఆజ్యం పోసిన యార్లగడ్డ టీడీపీ కార్యకర్తలను పోలీసులు స్టేషన్కు తరలిస్తున్న సమయంలో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అక్కడకు చేరుకుని విధ్వంసానికి ఆజ్యం పోసేందుకు ప్రయత్నించారు. అదుపులోకి తీసుకుంటున్న వారిని అక్కడే వదిలేయాలని పోలీసులకు హుకుం జారీ చేశారు. పోలీసులు ససేమిరా అనడంతో వారితో వాగ్వాదానికి దిగారు.టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలతోనే ఈ దాడికి దిగినట్లు చెప్పడంతో అక్కడున్న పోలీసులు సైతం నివ్వెరపోయారు. స్వయంగా చంద్రబాబు వచ్చి విడిపిస్తారంటూ అరెస్ట్ అయిన వారిని మరింత రెచ్చగొట్టేందుకు వెంకట్రావు ప్రయత్నం చేశారు. పోలీసులు అక్కడివారిని తరిమేస్తున్నా అక్కడే తిరుగుతూ కవి్వంపు చర్యలు కొనసాగించారు. అర్ధరాత్రి వరకు పరిస్థితి ఇలానే కొనసాగింది. గవర్నర్ కార్యాలయ ఉద్యోగి వాహనం ధ్వంసం టీడీపీ కార్యకర్తలు మద్యం, గంజాయి మత్తులో విచక్షణరహితంగా చేసిన దాడిలో గవర్నర్ కార్యాలయ ఉద్యోగి కారు కూడా ధ్వంసమైంది. ఆ ఉద్యోగి అదే అపార్ట్మెంట్లో ఉంటున్నారు. సెల్లార్లో పార్క్ చేసిన ఆయన కారుపై టీడీపీ వారు రాళ్లు రువ్వడంతో అద్దాలన్నీ పూర్తిగా పగిలిపోయాయి.దేవినేని అవినాశ్కు భద్రత పెంపు గుణదల (విజయవాడ తూర్పు): విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి దేవినేని అవినాశ్కు పోలీసులు భద్రత పెంచారు. విజయవాడ ఏలూరు రోడ్డులోని ఆయన ఇల్లు, కార్యాలయం వద్ద మాచవరం పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. బారికేడ్లు, ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఆయన్ని కలిసేందుకు వచ్చే అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.సమీపంలో అనుమానంగా సంచరించే వారిని గమనిస్తున్నారు. యువకులు గుంపులుగా ఉండకుండా, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. టీడీపీ అల్లరి మూకలు రాష్ట్రవ్యాప్తంగా విచక్షణరహితంగా విధ్వంసం సృష్టిస్తుండటంతో అవినాశ్కు భద్రత పెంచినట్లు మాచవరం పోలీసులు తెలిపారు. -
ప్రజాస్వామ్యమా? ఆటవిక రాజ్యమా?
పూర్వం యుద్ధం ముగిశాక విజయం సాధించిన రాజులు ఓడిపోయిన రాజు రాజ్యంపై పడి విధ్వంసం సృష్టించేవారు. జనావాసాలపై దాడులు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవారు. అందినకాడికి దోచుకునేవారు. ప్రజలంతా ఒకచోటుకు చేరి.. మోకరిల్లి శరణుకోరాక కానీ శాంతించే వారు కాదు. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే అలాంటి దుస్థితే కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచి టీడీపీ శ్రేణులు యథేచ్ఛగా విధ్వంసకాండ కొనసాగిస్తున్నాయి. ఎక్కడికక్కడ దాడులకు తెగబడి భయోత్పాతం సృష్టిస్తున్నాయి.ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా విజయం సాధించాక తొలుత దృష్టి సారించాల్సింది శాంతి భద్రతల పరిరక్షణపైనే. అందుకు విరుద్దంగా రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం కొనసాగిస్తుండగా... టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం వారిని నిలువరించే ప్రయత్నం చేయకుండా... తిరిగి వైఎస్సార్సీపీ కవ్వంపుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వైఎస్సార్సీపీ కవ్వంచినా సంయమనం పాటించాలంటూ ట్వీట్ చేయటం విధ్వంసాలకు మరింత ఊతమిచ్చేదిగా కనిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది... వచ్చామన్న కిక్కుతో ఊరూరా కవ్వంపులకు, దాడులకు తెగబడుతున్నది తెలుగుదేశమే.మూడు రోజులుగా వరుస దాడులు చేస్తున్నా పోలీసులకు పైనుంచి ఆదేశాలుండటంతో చేష్టలుడిగి చూస్తున్నారు తప్ప నిలువరించే ప్రయత్నం చేయటం లేదు. తాను ప్రమాణ స్వీకారం చేసే వరకు ఏమైనా చేయండని, రెచ్చిపోండని చంద్రబాబు పరోక్షంగా సంకేతాలిచ్చారని, అందుకే పోలీసులు పట్టనట్లు ఊరుకుంటున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఎందుకంటే తాను ప్రమాణ స్వీకారం చేయకముందయితే తన హయాంలో జరగలేదని చెప్పొచ్చనేది బాబు యోచనగా చెబుతున్నారు. -
నరసరావుపేటలో పేట్రేగిపోయిన పచ్చమూకలు
సాక్షి, పల్నాడు జిల్లా: ఏపీలో పచ్చమూకలు పేట్రేగిపోతున్నారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులు, సానుభూతిపరులపై యథేచ్ఛగా దాడులకు పాల్పడుతున్నారు. గ్రామాలు వీడకుంటే పంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పలుచోట్ల హింస, ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్నారు. నరసరావుపేటలో వైఎస్సార్సీపీ మాజీ జడ్పీటీసీకి చెందిన బార్ను ధ్వంసం చేశారు. తాళాలు పగలగొట్టి మద్యం,నగదును టీడీపీ శ్రేణులు ఎత్తుకెళ్లారు.చంద్రగిరిలో 11 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పచ్చ మూకల దాడి తిరుపతి: గత రెండు రోజులుగా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో 11 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పచ్చ పార్టీ నేతలు దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో గాయపడిన వారికి చంద్రగిరి మాజీ శాసన సభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ధైర్యం చెప్పారు."ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర పార్టీ కార్యాలయం ఆధ్వర్యంలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని, ఎలాంటి ఆపదొచ్చిన ఆదుకునేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. ఏక పక్షంగా వ్యవహరించే పోలీసులకు కోర్టు ద్వారానే సమాధానం ఇద్దామన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పై దాడి చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు.గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిపైనా దాడులు చేయలేదని, తమకు ఆ సంస్కృతి లేదన్నారు. కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సేవ చేసామన్నారు. ఆపద అంటూ తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకున్నామే తప్ప గత ఐదు సంవత్సరాలలో ఒక్క టీడీపీ కార్యకర్తకు కూడా హాని తలపెట్ట లేదన్నారు. గత ఐదేళ్లు అధికారం ఉన్నప్పుడు తెలుగుదేశం వారిపై దాడులు చేసుంటే ఇప్పుడు వాళ్లు ఎవ్వరూ ఉండేవారు కాదన్న విషయం గుర్తుంచు కోవాలన్నారు. -
ఏపీ వ్యాప్తంగా ఆగని టీడీపీ దాడులు
-
టీడీపీ దౌర్జన్యకాండ..
-
Big Question: అటు కౌంటింగ్ పూర్తయ్యింది..ఇటు అటాకింగ్ మొదలయ్యింది
-
దాడులతో ఏపీనీ మరో బీహార్ లా మారుస్తున్న టీడీపీ
-
శ్రీకాళహస్తిలో టీడీపీ నేతల అరాచకం
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వాలంటీర్లు మహేశ్వరి, పృథ్వీ ఇళ్లపై దాడులకు పాల్పడిన టీడీపీ నేతలు.. వారిని నిర్బంధించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వాలంటీర్ల కుటుంబాన్ని రక్షించారు.వైఎస్సార్ విగ్రహాలను కూల్చడం అప్రజాస్వామికం: తోపుదుర్తిఅనంతపురం: టీడీపీ నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని.. రాప్తాడులో టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ విగ్రహాలను టీడీపీ నేతలను కూల్చడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనకు ఆరు నెలలు సమయం ఇస్తాం. హామీలు నెరవేర్చకుంటే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని తోపుదుర్తి హెచ్చరించారు.టీడీపీ దాడులపై ఎస్పీ గౌతమి శాలి సీరియస్టీడీపీ దాడులపై అనంతపురం ఎస్పీ గౌతమి శాలి సీరియస్ అయ్యారు. దాడులకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హింసకు పాల్పడే వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ నేత ఇంటిపై దాడి చేసిన వారి కోసం గాలింపు చర్యలు చేపడతామన్నారు. -
అరాచకం సృష్టిస్తున్న టీడీపీ జనసేన నాయకులు
Pagination
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
అలాంటి వ్యక్తిని కనుగొనడం చాలా అరుదు: సమంత పోస్ట్ వైరల్!
నటి సురేఖావాణితో వైరల్ స్టార్.. ఇతడెవరో గుర్తుపట్టారా?
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (11-06-2024)
ఒడిశా కొత్త సీఎంగా గిరిజన నేత మోహన్ మాఝీ
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? తప్పకుండా ఇవి తెలుసుకోండి
వైఎస్ జగన్ ను కలిసిన మాజీ మంత్రులు
కోహ్లికి ప్రపోజ్ చేసిన క్రికెటర్.. ప్రేయసితో ఘనంగా పెళ్లి (ఫొటోలు)
యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ‘సన్నాఫ్ సునామి’
ఆరుగురు ఇండియా కూటమి యూపీ ఎంపీలు సభ్యత్వం కోల్పోనున్నారా?
మిర్యాలగూడ గ్యాంగ్ వార్ లపై డి.ఎస్ .పి సీరియస్ వార్నింగ్
Advertisement