court judge
-
హక్కుల రక్షణలో ‘సుప్రీం’
అరవింద్రెడ్డి గండ్రాతిసామాజిక న్యాయానికి విఘాతం కలిగినా.. రాజ్యాంగానికి భంగం వాటిల్లినా.. ప్రజాప్రయోజనాలు హరించినా.. రాజకీయాలు హద్దు దాటినా.. దేశ సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంటుంది. రాజ్యాంగ పరిరక్షణకు ఉపక్రమిస్తుంది. పౌర హక్కులను, సమానత్వాన్ని, ప్రజా స్వేచ్ఛను కంటికి రెప్పలా కాపాడుతుంది. సామాన్యుడి నుంచి దేశాధినేత వరకు అందరినీ సమానంగా పరిగణిస్తుంది.ప్రజా ప్రయోజనాలు కాపాడటంలో ‘సుప్రీం’ కమాండర్గా, రాజ్యాంగం, సమానత్వ పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్న సుప్రీంకోర్టు(Supreme Court) ఏర్పాటై జనవరి 28తో 75 ఏళ్లు పూర్తయింది. 1950, జనవరి 28న 8 మంది (సీజేతో కలిపి)తో ప్రారంభమైంది.. నేడు 34కి చేరింది. ఇప్పటివరకు ఇద్దరు తెలుగు వారు జస్టిస్ కోకా సుబ్బారావు, జస్టిస్ ఎన్వీ రమణ ప్రధాన న్యాయమూర్తి పీఠాన్ని అధిష్టించారు.రాజ్యాంగ పరిరక్షణకర్త..సుప్రీంకోర్టు(Supreme Court) దేశంలో సర్వోన్నత న్యాయస్థానం. సమాఖ్య కోర్టుగా, రాజ్యాంగ పరిరక్షణకర్తగా, అత్యున్నత ధర్మాసనంగా విధులు నిర్వర్తిస్తోంది. రాజ్యాంగంలోని 5వ భాగంలో అధికరణలు 124 నుంచి 147 వరకు సర్వోన్నత న్యాయస్థానం కూర్పు, అధికార పరిధిని తెలియజేస్తాయి. ముఖ్యంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని హైకోర్టులు ఇచ్చే తీర్పులపై అప్పీళ్లను స్వీకరిస్తుంది. అందుకే దీన్ని పునర్విచారణ ధర్మాసనం అని కూడా అంటారు.తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనల కేసుల్లో ఒరిజినల్ పిటిషన్లను, తక్షణ పరిష్కారం అవసరమైన తీవ్రమైన వివాదాల కేసులపైనా నేరుగా విచారణ జరుపుతుంది. తొలుత భారత సమాఖ్య న్యాయస్థానంగా పార్లమెంట్ భవనంలోని ప్రిన్సెస్ చాంబర్లో ప్రారంభించారు. ప్రిన్సెస్ చాంబర్లో 1937 నుంచి 1950 వరకు నడిపారు. భారతదేశం సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించిన రెండు రోజుల తరువాత సర్వోన్నత న్యాయస్థానం 1950, జనవరి 28న ఏర్పాటైంది. సుప్రీంకోర్టుగా రూపాంతరం చెందిన తర్వాత 1958 వరకు పాత పార్లమెంట్ భవనంలోని ఓ భాగంలో నడిపారు.ఇండో–బ్రిటిష్ వాస్తు శైలిలో..⇒ సుప్రీంకోర్టు భవన ప్రధాన భాగం 17 ఎకరాల స్థలంలో ఇండో–బ్రిటిష్ వాస్తు శైలిలో నిర్మించారు. ప్రముఖ వాస్తుశిల్పి గణేశ్ భైకాజీ డియోలాలీకర్ దీని నమూనా రూపొందించారు. శ్రీధర్ కృష్ణ జోగ్లేకర్ భవన నిర్మాణానికి నేతృత్వం వహించారు. ప్రస్తుత భవనంలోకి 1958లో న్యాయస్థానం మారింది. త్రాసు ఆకారాన్ని ప్రతిబింబించేలా భవన నమూనా రూపొందించారు. భవన మధ్య భాగం త్రాసుకోలను ప్రతిబింబిస్తుంది. 1979లో తూర్పు, పశ్చిమ భాగాలను ఈ సముదాయానికి జోడించారు. మొత్తం 19 కోర్టు గదులున్నాయి. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం పెద్దగా, మధ్య భాగంలో ఉంటుంది.న్యాయమూర్తుల సంఖ్య పెరిగిందిలా..సుప్రీంకోర్టును ఓ ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు న్యాయమూర్తులతో ఏర్పాటు చేసేందుకు 1950లో రాజ్యాంగం వీలు కల్పించింది. తదుపరి పరిస్థితుల మేరకు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అవకాశాన్ని పార్లమెంట్కు దఖలుపరిచింది. న్యాయమూర్తుల సంఖ్య (చీఫ్ జస్టిస్తో కలిపి) 1956లో 11కు, 1960లో 14కు, 1978లో 18కి, 1986లో 26కు, 2008లో 31కి, 2019లో 34 మందికి పెరిగింది. తొలుత సింగిల్ బెంచ్ విచారణలు ఉండగా. ఆ తర్వాత ఇద్దరు, ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనాల విచారణలు ప్రారంభమయ్యాయి.అత్యంత కీలకమైన వివాదాల సమయంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం (రాజ్యాంగ ధర్మాసనం) కొలువుదీరుతుంది. అవసరం మేరకు ఏ చిన్న ధర్మాసనమైనా పెద్ద ధర్మాసనానికి కేసును బదిలీ చేయొచ్చు. న్యాయమూర్తులను నియమించేందుకు సర్వోన్నత న్యాయస్థానంతో రాష్ట్రపతి తప్పనిసరిగా సంప్రదింపులు జరపాలి. ఇవి ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేకుండా జరుగుతాయి. న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లు. భారతీయుడై ఉండి ఐదేళ్ల పాటు హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం ఉండాలి.అవీ ఇవీ...⇒ హైకోర్టు న్యాయమూర్తినిగాని, సుప్రీంకోర్టు లేదా హైకోర్టుల్లో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తిని గానీ సుప్రీంకోర్టులో తాత్కాలిక (ప్రత్యేక) న్యాయమూర్తిగా నియమించేందుకు అవకాశం ఉంది.⇒ అత్యున్నత న్యాయస్థానంలో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పిస్తారు.⇒మతం, కులంతో సంబంధం లేకుండా న్యాయమూర్తుల నియామకం జరుగుతుంది.⇒ప్రధాన న్యాయమూర్తి పదవీకాలం ముగియడానికి నెల రోజుల ముందే తర్వాతి సీజేను ప్రకటించాలి.⇒ప్రసుత్తం 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.⇒మాస్టర్ ఆఫ్ ది రోస్టర్గా ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తారు. అంటే.. ఏ బెంచ్ ఏ కేసు విచారణ చేపట్టాలనేది నిర్ణయించే అధికారం సీజేకు ఉంటుంది.⇒ ప్రస్తుతం 33 మంది న్యాయమూర్తులున్న సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులు ఇద్దరు మాత్రమే. సుప్రీంకోర్టు ఏర్పాటు నుంచి దాదాపు 277 మంది న్యాయమూర్తులు నియమితులు కాగా, వీరిలో 11 మంది (దాదాపు 4 శాతం) మాత్రమే మహిళలు.⇒ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (1973) కేసును ఎక్కువ మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం విచారించింది.సుప్రీం కోర్టులో తొలిసారి..⇒తొలి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హరిలాల్ జె. కానియా (1947, ఆగస్టు 14 – 1951, నవంబర్ 5)⇒ తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ (1989)⇒ తొలి దళిత న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ (2000)⇒ తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ (2007)⇒ బార్ నుంచి తొలిసారి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన వ్యక్తి జస్టిస్ ఎస్ఎం సిక్రి (1971)⇒ బార్ నుంచి న్యాయమూర్తిగా పదోన్నతి పొంది సీజే అయిన వ్యక్తి జస్టిస్ యూయూ లలిత్ (2022, ఆగస్టు 27)అత్యధిక కాలం పనిచేసిన టాప్–5 సీజేలు1. జస్టిస్ వైవీ చంద్రచూడ్ఏడేళ్ల 139 రోజులు (1978, ఫిబ్రవరి 22 నుంచి 1985, జూలై 11 వరకు)2. జస్టిస్ భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా నాలుగేళ్ల 122 రోజులు (1959, అక్టోబర్ 1 నుంచి 1964, జనవరి 31 వరకు)3. జస్టిస్ అజిత్ నాథ్ రేమూడేళ్ల 276 రోజులు (1973, ఏప్రిల్ 26 నుంచి 1977, జనవరి 28 వరకు)4. జస్టిస్ సుధీ రంజన్ దాస్మూడేళ్ల 241 రోజులు (1956, ఫిబ్రవరి 1 నుంచి 1959, సెప్టెంబర్ 30 వరకు) 5. జస్టిస్ కేజీ బాలకృష్ణన్మూడేళ్ల 117 రోజులు (2007, జనవరి 14 నుంచి 2010, మే 11 వరకు)ప్రధాన న్యాయమూర్తులుగా తెలుగువారు1) జస్టిస్ కోకా సుబ్బారావు తొమ్మిదో చీఫ్ జస్టిస్ (1966, జూన్ 30 నుంచి 1967, ఏప్రిల్ 11 వరకు (285 రోజులు) 2). జస్టిస్ ఎన్వీ రమణ48వ చీఫ్ జస్టిస్ (2021, ఏప్రిల్ 24 నుంచి 2022, ఆగస్టు 26 వరకు (సంవత్సరం 124 రోజులు)ప్రస్తుతం సుప్రీంకోర్టులో తెలుగు న్యాయమూర్తులుజస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహహైదరాబాద్కు చెందిన ఈయన 1988లో న్యాయవిద్య పూర్తి చేసి న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2021, ఆగస్టు 31న నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.జస్టిస్ సంజయ్కుమార్ హైదరాబాద్కు చెందిన ఈయన 1988లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2008లో ఏపీ హైకోర్టు అడిషనల్ న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2010లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019లో తెలంగాణ హైకోర్టుకు కేటాయించబడిన ఈయన 2019లో పంజాబ్– హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021లో మణిపూర్ చీఫ్ జస్టిస్గా బాధ్యతలు చేపట్టారు. 2023, ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వెళ్లారు.జస్టిస్ సరసి వెంకటనారాయణ భట్టిఆంధ్రప్రదేశ్కు చెందిన ఈయన 1987లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2013లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టారు. విభజనలో భాగంగా ఏపీ హైకోర్టుకు వెళ్లారు. 2019లో కేరళకు బదిలీపై వెళ్లి 2023 జూన్లో చీఫ్గా పదోన్నతి పొందారు. 2023, జూలైలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.నేరుగా బార్ నుంచి సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి పొందిన వారు..జస్టిస్ ఎస్ఎం సిక్రి (1971లో– 9.1 ఏళ్లు), జస్టిస్ ఎస్సీ రాయ్ (1971లో–3 నెలలు), జస్టిస్ కుల్దీప్సింగ్ (1988లో–8.1 ఏళ్లు), జస్టిస్ సంతోష్ హెగ్డే (1999లో–6.4 ఏళ్లు), జస్టిస్ రోహింటన్ నారిమన్ (2014లో–7.1ఏళ్లు), జస్టిస్ యూయూ లలిత్ (2014లో–8.2 ఏళ్లు), జస్టిస్ నాగేశ్వర్రావు (2016లో–6.1ఏళ్లు), జస్టిస్ ఇందు మల్హోత్రా (2018లో –2.8 ఏళ్లు), జస్టిస్ కేవీ విశ్వనాథన్ (2023లో–8 ఏళ్లు), జస్టిస్ పీఎస్ నరసింహ (2021లో–6.6 ఏళ్లు) (జస్టిస్ విశ్వనాథన్, జస్టిస్ నరసింహ ప్రస్తుతం న్యాయమూర్తులుగా కొనసాగుతున్నారు)తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కీలక తీర్పులు కొన్ని..1993 ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ప్రాథమిక హక్కుల్లో విద్యాహక్కు లేకపోతే జీవించే హక్కుకు, వ్యక్తి గౌరవానికి అర్థం లేదని.. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. లాభాపేక్ష లేకుండా, సమాజానికి ఉప యోగకరంగా విద్యాసంస్థల నిర్వహణ ఉండాలి. ఆర్టికల్ 19(1) ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థలను నెలకొల్పే హక్కు ఉన్నా..19(6) ప్రకారం నియంత్రించే హక్కు సర్కార్కు ఉంది.1997 సమతా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్దేశంలోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నివసించే గిరిజన, ఆదివాసీల జీవనో పాధి హక్కులను రక్షిస్తూనే స్థిరమైన అభివృద్ధికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. అటవీ భూములకు భంగం కలగకుండా, పర్యావరణం దెబ్బతిన కుండా గిరిజనులు వ్యక్తిగతంగా లేదా సంఘంగా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఖనిజాలను వెలికితీయొచ్చని పేర్కొంది. గిరిజనేతరులకు హక్కులు ఉండవని స్పష్టం చేసింది. సమతా అనే స్వచ్ఛంద సంస్థ పిటిషన్ వేసి పోరాటం చేయడంతో ఆ పేరుతో ఈ కేసు ప్రసిద్ధికెక్కింది.ఆ రెండు సందర్భాల్లోఅమలవుతున్న సంప్రదాయం ప్రకారం.. పదవీ విరమణ చేయబోయే ప్రధాన న్యాయమూర్తి సిఫారసు చేసిన న్యాయ మూర్తే తదుపరి ప్రధాన న్యాయ మూర్తి అవుతారు. దాదాపుగా సుప్రీం కోర్టులో రెండవ స్థానంలో ఉండే అత్యంత సీనియర్ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తి పదవికి సూచిస్తారు. అయితే ఈ సంప్రదాయం రెండు సందర్భాల్లో అమలు కాలేదు. 1973లో జస్టిస్ ఎ.ఎన్.రే ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులను అధిగమిస్తూ ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. అలాగే 1977లో జస్టిస్ హన్స్రాజ్ ఖన్నా కాకుండా ఆయనకు జూనియర్ అయిన జస్టిస్ మీర్జా హమీదుల్లా బేగ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.హైదరాబాద్లో బెంచ్ ఎప్పుడో..సుప్రీంకోర్టు ప్రారంభించినప్పుడు దేశ జనాభా 36 కోట్లు మాత్రమే. ఇప్పుడది 140 కోట్లు దాటింది. ఇన్ని కోట్ల మందికి న్యాయం జరగాలంటే పలు రాష్ట్రాల్లో సుప్రీంబెంచ్ ఏర్పాటు చేయాలన్న అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. సుప్రీంకోర్టును కాలాను గుణంగా విస్తరించవచ్చని అధికరణం 130లో బీఆర్ అంబేడ్కర్ క్లుప్తంగా పేర్కొ న్నారు. దక్షిణాన హైదరాబాద్, తూర్పున కోల్కతా, పశ్చిమాన ముంబైలో ప్రాంతీయ బెంచ్ల ఆవశ్యకత ఉందని 18వ లా కమిషన్ 2009లోనే కేంద్రానికి తెలిపింది. దీనిపై పార్లమెంట్లో 2023లో నాటి ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి ప్రైవేట్ బిల్లు పెట్టారు. ప్రాంతీయ బెంచ్ల ఏర్పాటుకు పార్లమెంట్లో సాధారణ మెజారిటీ సరిపోతుంది. సుప్రీంకోర్టు సీజే ప్రతిపా దిస్తే.. రాష్ట్రపతి ఆమోదించినా ఏర్పాటు చేయొచ్చు. తెలంగాణ సరిహద్దుగా ఏపీ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలు న్నాయి. ఏపీ సరిహద్దుగా తమిళనాడు, ఒడిశా ఉన్నాయి. హైదరాబాద్ బెంచ్ తో ఈ రాష్ట్రాలకు ‘న్యాయం’ అందుతుందనే అభిప్రాయం ఉంది.ధిక్కారాన్ని శిక్షించే అధికారం..ఏ న్యాయస్థానాన్నైనా ధిక్కరించిన వారిని శిక్షించే అధికారం రాజ్యాంగంలోని 129, 142 అధికరణల ద్వారా సుప్రీంకోర్టుకు ఉంది. మహారాష్ట్ర మాజీ మంత్రి స్వరూప్ సింగ్ నాయక్పై సుప్రీంకోర్టు ఈ అధికారంతో ఒక అసాధారణ చర్య తీసుకుంది. 2006, మే 12న కోర్టు ధిక్కార నేరంపై ఆయనకు నెలరోజులపాటు జైలు శిక్ష విధించింది. మంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని జైలుకు పంపడం దేశంలో ఇదే తొలిసారి.స్వతంత్ర పటిష్టతతోనే విశ్వాసం..⇒ శాసన, కార్యనిర్వాహక విభాగాలకు సుప్రీంకోర్టు అంతరం పాటించాలి. ఈ వైఖరిని కొనసాగించపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు. దేశం పురోగతి సాధించదు. ప్రజల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను పరిరక్షించడానికి సుప్రీంకోర్టు ఏర్పాటైంది. రాజ్యాంగాన్ని దృఢమైన శరీరంగా కాకుండా.. స్వపరిపాలన, శక్తి కలిగిన జీవిగా వ్యాఖ్యానించే ప్రయత్నం చేద్దాం. అత్యున్నత న్యాయస్థానానికి విస్తృతాధికారాలు కల్పించడంలో రాజ్యాంగం కీలకప్రాత పోషించింది. హైకోర్టులు బలంగా ఉంటేనే సుప్రీంకోర్టు భారం తగ్గుతుంది. మెరిట్పై మాత్రమే న్యాయమూర్తుల నియామకాలు జరగాలి. రాజకీయాలు దీన్ని ప్రభావితం చేయలేవని భావిస్తున్నా. స్వతంత్ర పటిష్టతే న్యాయవ్యవస్థకు ప్రజల్లో విశ్వాసాన్ని పొందేలా చేస్తుంది. న్యాయస్థానాలు ఎవరి సొత్తూ కాదు. సద్భావన, సానుభూతిని ఆచరిస్తాయి. – జస్టిస్ హరిలాల్ జె. కానియా (సుప్రీంకోర్టు ఏర్పాటు సందర్భంగా..)లిల్లీ థామస్ గీ యూనియన్ ఆఫ్ ఇండియా (2013)పిటిషన్: రెండేళ్లు.. అంతకంటే ఎక్కువ కఠిన కారాగార శిక్ష పడిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీకి అనర్హులని ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ, సిట్టింగ్ చట్టసభల సభ్యులకు వర్తించదని పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు.బెంచ్: జస్టిస్ ఆర్పీ సేథి, జస్టిస్ ఎస్.సగీర్ అహ్మ తీర్పు: ‘సిట్టింగ్ చట్టసభల సభ్యులకు ఇస్తున్న మినహాయింపు చెల్లదు’ఎస్ఆర్ బొమ్మై గీ యూనియన్ ఆఫ్ ఇండియా (1994)పిటిషన్: కర్ణాటక (1988–89)లో తన మద్దతుకు సంబంధించి జనతాదళ్ శాసనసభాపక్షం ఆమోదించిన తీర్మాన కాపీని నాటి సీఎం బొమ్మై అప్పటి గవర్నర్ పి.వెంకటసుబ్బయ్యకు సమర్పించినా అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వలేదు. తీర్మాన కాపీని తిరస్కరిస్తూ రాష్ట్రపతి పాలన విధించాలన్న గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బొమ్మై పిటిషన్ వేశారు. బెంచ్: జస్టిస్ కుల్దీప్ సింగ్, జస్టిస్ పీబీ సావంత్, జస్టిస్ కే రామస్వామి, జస్టిస్ ఎస్సీ అగర్వాల్, జస్టిస్ యోగేశ్వర్ దయాల్, జస్టిస్ బీపీ జీవన్రెడ్డి, జస్టిస్ ఎస్ఆర్ పాండియన్, జస్టిస్ ఏఎం అహ్మదీతీర్పు: ‘సమాఖ్య వ్యవస్థ అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే ముందు అసెంబ్లీలో బల నిరూపణకు గవర్నర్ అవకాశం కల్పించాలి. రాజ్యాంగంలోని 356 అధికరణం కింద గవర్నర్ సర్కార్ను డిస్మిస్ చేయడం నిరంకుశత్వం. ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకునేందుకు అసలైన వేదిక శాసనసభే. గవర్నర్ సొంత అభిప్రాయానికి తావు లేదు’దేశవ్యాప్త సంచలన తీర్పులు..శంకరీ ప్రసాద్ సింగ్ గీ యూనియన్ ఆఫ్ ఇండియా గీ బిహార్ (1951)పిటిషన్: పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేయడాన్ని సవాల్ చేస్తూ శంకరీ ప్రసాద్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. బెంచ్: జస్టిస్ హీరాలాల్ జె. కనియా, జస్టిస్ బీకే ముఖర్జీ, జస్టిస్ చంద్రశేఖర అయ్యర్ తీర్పు: ‘ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంట్కు ఉంది’. తొలిసారిగా న్యాయ సమీక్షాధికారం వినియోగం.స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ గీ బేలా బెనర్జీ (1953)పిటిషన్: భూ సేకరణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. బెంచ్: జస్టిస్ పతంజలి శాస్త్రి, జస్టిస్ మెహర్ చంద్ మహా జన్, జస్టిస్ గులాం హసన్, జస్టిస్ బి.జగన్నాథ దాస్తీర్పు: ‘ప్రజల ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు మార్కెట్ విలువతో కూడిన నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందే’గోలక్నాథ్ గీ స్టేట్ ఆఫ్ పంజాబ్ (1967)పిటిషన్: పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూ సంస్కరణలను సవాల్ చేస్తూ గోలక్నాథ్ పిటిషన్ వేశారు.బెంచ్: జస్టిస్ కె.సుబ్బారావు, జస్టిస్ కెఎన్ వాంచూ, జస్టిస్ ఎం. హిదాయతుల్లా, జస్టిస్ జేసీ షా, జస్టిస్ ఎస్ఎం సిక్రి, జస్టిస్ ఆర్ ఎస్ బచావత్, జస్టిస్ వి.రామస్వామి, జస్టిస్ జేఎం షెలత్, జస్టి స్ విశిష్ఠ భార్గవ, జస్టిస్ జీకే మిట్టర్, జస్టిస్ సీఏ వైద్యలింగం. తీర్పు: ‘‘ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్కు లేదు. రాజ్యాంగ సవరణలపైనా ఆర్టికల్ 13 ప్రకారం న్యాయసమీక్ష జరుగుతుంది. ఈ తీర్పు గత తీర్పులకు వర్తించదు. రాబోయే వాటికి వర్తిస్తుంది (దీన్ని ‘ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్’ అంటారు). రాజ్యాంగంలోని 1వ, 4వ, 17వ సవరణలు చెల్లుబాటు అవుతాయి. ప్రాథమిక హక్కులను పార్లమెంట్ సవరించాలంటే ‘ప్రత్యేక రాజ్యాంగ పరిషత్’ను ఏర్పాటు చేయాలి’’.కేశవానంద భారతి గీ స్టేట్ ఆఫ్ కేరళ (1973)పిటిషన్: ఐదు దశాబ్దాల క్రితం మఠం ఆస్తుల విషయంలో కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో ఎడనీర్ మఠాధిపతి కేశవానంద స్వామి పిటిషన్ వేశారు. బెంచ్: జస్టిస్ ఎస్ఎం సిక్రి అధ్యక్షతన జస్టిస్ ఏఎన్ గ్రోవర్, జస్టిస్ ఏఎన్ రే, జస్టిస్ డీజీ పాలేకర్, జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా, జస్టిస్ జేఎం షెలత్, జస్టిస్ కేకే మాథ్యూ, జస్టిస్ కేఎస్ హెగ్డే, జస్టిస్ ఎంహెచ్ బేగ్, జస్టిస్ పి.జగన్మోహన్రెడ్డి, జస్టిస్ ఎస్ఎన్ ద్వివేది, జస్టిస్ వైవీ చంద్రచూడ్ తీర్పు: ‘రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, మౌలిక స్వరూ పాన్ని మార్చలేం. సుప్రీంకోర్టు వాటి రక్షణ బాధ్యతను నిర్వర్తిస్తుంది. రాజ్యాంగ సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందిగానీ, మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం లేదు. రాజ్యాంగ ఆత్మను మార్చడం సాధ్యంకాదు.’మేనకాగాంధీ గీ యూనియన్ ఆఫ్ ఇండియా (1978) పిటిషన్: తన పాస్పోర్టును అధికారులు స్వాధీనం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ మేనకాగాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.బెంచ్: జస్టిస్ ఎం.హమీదుల్లా బేగ్, జస్టిస్ వైవీ చంద్రచూడ్, జస్టిస్ పీఎన్ భగవతి, జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్, జస్టిస్ ఎన్ఎల్ ఉంత్వాలియా, జస్టిస్ సయ్యద్ ముర్తజా ఫజలాలి, జస్టిస్ పీఎస్ కైలాసంతీర్పు: ‘ప్రజాప్రయోజనం అనేది బహుళ విస్తృతమైనది. పాస్పోర్టు చట్టం 1967 పేరుతో అధికారులు 14, 19, 21 అధికరణాలను ఉల్లంఘించారు. వ్యక్తుల ప్రాథమిక హక్కులను భంగపర్చలేరు. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను చట్టబద్ధమైన ప్రక్రియతో ఆటంకపర్చలేరు’మినర్వా మిల్స్ గీ యూనియన్ ఆఫ్ ఇండియా (1980)పిటిషన్: ఇందిరాగాంధీ సర్కార్ చేసిన 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మినర్వా మిల్స్ లిమిటెడ్ సవాల్ చేసింది.బెంచ్: జస్టిస్ వైవీ చంద్రచూడ్, జస్టిస్ పీఎన్ భగవతి, జస్టిస్ ఏసీ గుప్తా, జస్టిస్ ఎన్ఎల్ ఉంట్వాలియా, జస్టిస్ పీఎస్ కైలాసంతీర్పు: రాజ్యాంగ సవరణ చట్టాలను న్యాయస్థానాల్లో సవాల్ చేయకూడదంటూ అధికరణం 368(4), రాజ్యాంగ సవరణ అధికారంపై పార్లమెంట్కు ఎలాంటి పరిమితులు ఉండొద్దంటూ అధికరణం 368(5)కు చేసిన సవరణ రద్దు చేస్తున్నాం. ఈ క్లాజ్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం.మహమ్మద్ అహ్మద్ ఖాన్ గీ షా బానో బేగం (1985)పిటిషన్: మహమ్మద్ అహ్మద్ ఖాన్ నుంచి భరణం కోరుతూ ట్రయల్ కోర్టును ఆశ్రయించిన 65 ఏళ్ల షాబానో బేగం. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973లోని సెక్షన్ 123 ప్రకారం తనకు, తన ఐదుగురు పిల్లలకు భరణం ఇవ్వాలని కోరారు. అహ్మద్ ఖాన్ అప్పీల్పై విచారణ. బెంచ్: జస్టిస్ వైవీ చంద్రచూడ్, జస్టిస్ మిశ్రా రంగానాథ్, జస్టిస్ డీఏ దేశాయ్, జస్టిస్ ఓ.చిన్నపరెడ్డి, జస్టిస్ ఈఎస్ వెంకటరామయ్యతీర్పు: ‘ముస్లిం మహిళలకు కూడా భరణం చెల్లించాల్సిందే. ఇద్దత్ గడువు (విడాకుల తర్వాత 3 నెలలు) ముగిసిన తర్వాత కూడా ముస్లిం భర్త.. భరణం చెల్లించాల్సిందే. భరణం చారిటీ కాదు.. హక్కు’ఇందిరా సహాని గీ యూనియన్ ఆఫ్ ఇండియా (1992)పిటిషన్: మండల కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) 27 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సవాల్ చేశారు.బెంచ్: జస్టిస్ ఎంహెచ్ కనియా, జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య, జస్టిస్ ఎస్.రణవేల్ పాండియన్, జస్టిస్ టీకే తొమ్మెన్, జస్టిస్ ఏఎం అహ్మదీ, జస్టిస్ కుల్దీప్ సింగ్, జస్టిస్ పీబీ సావంత్, జస్టిస్ ఆర్ఎం సహాయ్, జస్టిస్ బీపీ జీవన్రెడ్డితీర్పు: ‘ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) 27 శాతం రిజర్వేషన్లు సమర్థనీయం’ -
హైకోర్టు జడ్జీలుగా ముగ్గురు ప్రమాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా కుంచం మహేశ్వరరావు, తూటా చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్లు సోమవారం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో ఈ ముగ్గురితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అంతకుముందు.. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై. లక్ష్మణరావు ఈ ముగ్గురు నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీచేసిన ఉత్తర్వులను చదవి వినిపించారు. అనంతరం సీజే వారితో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత సీజే ఒక్కొక్కరికీ రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వులను అందచేశారు.ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేష్, విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ చల్లా కోదండరాం, జస్టిస్ మంతోజు గంగారావు, ప్రమాణం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) పసల పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, హైకోర్టు రిజిస్ట్రార్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.ప్రమాణం అనంతరం జస్టిస్ ధనశేఖర్ సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ గుహనాథన్ నరేందర్తో కలిసి కేసులను విచారించారు. జస్టిస్ మహేశ్వరరావు, జస్టిస్ గుణరంజన్లు సింగిల్ జడ్జీలుగా కేసులను విచారించారు. ప్రమాణం సందర్భంగా న్యాయవాదులు, శ్రేయోభిలాషులు వీరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ముగ్గురితో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. మరో 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను న్యాయాధికారులు, న్యాయవాదులతో భర్తీచేసేందుకు జనవరిలో చర్యలు చేపట్టే అవకాశం ఉంది. -
అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం
చిలకలపూడి (మచిలీపట్నం): అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జయ బాడిగ నియమితులయ్యారు. 2022 నుంచి ఆమె కోర్టు కమిషనర్గా పనిచేసి ఫ్యామిలీ లా నిపుణురాలిగా పేరొందారు. కుటుంబ న్యాయ సలహాల రంగంలో పలువురికి మార్గదర్శకురాలిగా వ్యవహరించారు. ఏపీలోని విజయవాడలో ఆమె జన్మించారు. 1991–94 మధ్య ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా వర్సిటీలో సైకాలజీ, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులతో బీఏ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. శాంటాక్లారా వర్సిటీ నుంచి లా పట్టాను పొందారు. కాలిఫోర్నియాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అటారీ్నగా, గవర్నర్ కార్యాలయం అత్యవసర సేవల విభాగంలో పనిచేశారు. జయ బాడిగ మంగళవారం న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె తండ్రి బాడిగ రామకృష్ణ 2004–09 వరకు మచిలీపట్నం ఎంపీ (కాంగ్రెస్)గా పనిచేశారు. గర్వకారణంగా ఉంది నాతో పాటు మా కుటుంబ సభ్యులందరికీ గర్వకారణంగా ఉంది. అంతేకాకుండా తెలుగువారందరు గర్వపడేలా నా కుమార్తె జయ ఘనకీర్తి సాధించటం ఎంతో సంతోషంగా ఉంది. ఆమె ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. తెలుగువారందరు గరి్వంచే విధంగా పనిచేస్తానని జయ చెప్పింది. – బాడిగ రామకృష్ణ, మాజీ ఎంపీ -
కష్టం వృథా కాలేదు.. కూలి కుమారుడు జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక
సాక్షి,సారవకోట(శ్రీకాకుళం): మండలంలోని మారుమూల మూగుపురం గ్రామానికి చెందిన కొంకాడ రమేష్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. మార్చి 29న ఈ ఫలితాలు విడుదలయ్యాయి. రమేష్ తండ్రి పురుషోత్తుకర్ర గ్రామానికి చెందిన ఆదినారాయణ, తల్లి మాణిక్యమ్మ. తల్లిదండ్రుల మధ్య మనస్ఫర్థల కారణంగా రమేష్ చిన్నప్పటి నుంచి తల్లితోనే మూ గుపురంలో పెరిగారు. మాణిక్యమ్మ కూలి పనులు చేసుకుంటూ రమేష్ను చదివించారు. రమేష్ ఒకటి నుంచి 7వ తరగతి వరకు టెక్కలి గిరిజన బాలుర వసతి గృహంలో ఉంటూ చదువుకున్నారు. 8 నుంచి 10వ తరగతి వరకు సింహాచలం రెసిడెన్షియల్ పాఠశాలలో చదివారు. ఇంటర్ను మెళియాపుట్టి మండలం పెద్దమడి రెసిడెన్షియల్ కళాశాలలో 2006లో పూర్తి చేశారు. తూముకొండ గ్రామానికి చెందిన తన చిన్నాన్న, పిన్ని రవికుమార్, వజ్రంల సహకారంతో 2009లో కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ చేశారు. అనంతరం 2009–11లో విశాఖపట్నంలో ఎంబీఏ పూర్తి చేసి అనంతరం బీఎల్ను ఆంధ్రా యూనివర్సిటీలో 2015లో పూర్తి చేశారు. బీఎల్ పూర్తి చేశాక జడ్జి కావాలనే పట్టుదలతో జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకు నోటిఫికేషన్ పడిన సమ యంలో దరఖాస్తు చేశారు. అలా రెండు సార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయినా నిరుత్సాహ పడకుండా 2020లో వెలువడిన నోటికేషన్లో ద రఖాస్తు చేసి రోజుకు సుమారు 20 గంటల పాటు కృషి చేశారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబర్చి 2022 మార్చి 29న విడుదల చేసిన ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. సర్పంచ్ షణ్ముఖరావు, గ్రామస్తులు అభినందించారు. చదవండి: వర్క్ఫ్రమ్ హోం వలలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి.. లింక్ క్లిక్ చేయడంతో... -
వైరల్ : జడ్జీ కళ్ల ముందే గంజా సిగరెట్ తాగాడు
టేనస్సీ : కోర్టు ఆవరణలో జడ్జీ ముందే ఓ వ్యక్తి గంజాయి సిగరెట్ (గంజా సిగరెట్)ను తాగిన ఘటన అమెరికాలోని టేనస్సీ నగరంలో చోటు చేసుకుంది. కోర్టు ధిక్కారణ కేసు కింద అతనికి 10 రోజులు జైలు శిక్ష కూడా విధించబడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. విరాల్లోకి వెళితే.. టేనస్సీ నగరానికి చెందిన స్పెన్సర్ బోస్టన్ అనే ఓ 20 ఏళ్ల యువకుడు గంజాయి స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. పోలీసులు ఇటీవల అతన్ని టెనస్సీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అతను తన వాదనలు వినిపిస్తూ.. గంజాయి విక్రయాన్ని చట్ట బద్ధం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కోర్టు బోనులోనే నిలబడి జేబులో నుంచి సిగరెట్ తీసి కాల్చాడు. అందరికి గంజాయి సిగరెట్ చూపిస్తూ.. ఇది తీసుకోవడం తప్పు కాదు.. బహిరంగంగా గంజాయి తీసుకునే అర్హత ప్రతి ఒక్కరికి ఉందంటూ గట్టిగా అరిచాడు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, కోర్టు ఆవరణలో.. న్యాయమూర్తి ముందే సిగరెట్ కాల్చిన బోస్టన్కు కోర్టు ధిక్కారణ కేసు కింది 10 రోజులు జైలు శిక్ష విధించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 14కు వాయిదా వేసింది. నిందితుడు స్పెన్సర్ బోస్టన్ -
తీర్పు చెప్పి.. తుపాకీతో..
బ్యాంకాక్: అందరికీ న్యాయం చెప్పే న్యాయమూర్తి థాయ్లాండ్ న్యాయవ్యవస్థలో అడుగడుగునా వచ్చే అడ్డంకుల్ని సహించలేకపోయారు. కిక్కిరిసిపోయిన కోర్టు హాలు సాక్షిగా దేశ న్యాయవ్యవస్థలో లోటుపాట్లను చీల్చి చెండాడుతూ తనని తాను తుపాకీతో కాల్చుకున్నారు. ఉగ్రవాదం వెర్రి తలలు వేసే దక్షిణ థాయ్లాండ్లోని యాలా కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనకోర్న్ పియాన్చన ఒక హత్యా కేసులో నిందితుల్ని నిర్దోషులుగా తీర్పు చెప్పిన తర్వాత ఆత్మహత్యాయత్నం చేశారు. అంతకు ముందు ఫేస్బుక్ లైవ్లో న్యాయవ్యవస్థ ఎంత కుళ్లిపోయిందో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఆ తర్వాత తన దగ్గరున్న తుపాకీతో ఛాతీలో కాల్చుకున్నారు. వెంటనే కోర్టు అధికారులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. సర్జరీ చేసి ఛాతీలో దిగిన గుళ్లను బయటకు తీశారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. న్యాయమూర్తి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు వెల్లడించారు. థాయ్ సమాజంలో ధనబలం, కండబలం ఉన్నవారికి కోర్టులు అనుకూలంగా ఉంటాయని, సాధారణ పౌరులైతే చిన్నా చితక నేరాలకు కూడా కఠినమైన శిక్షలు విధిస్తున్నారన్న విమర్శలు ఎప్పట్నుంచో ఉన్నాయి. అయితే ఒక న్యాయమూర్తి ఇలా వ్యవస్థను నిందించడం ఇదే తొలిసారి. ఒక హత్య కేసులో ముస్లింలైన అయిదుగురు నిందితుల్ని విముక్తుల్ని చేస్తూ తీర్పు చెప్పిన పియాన్చన న్యాయవ్యవస్థ పారదర్శకంగా ఉండాలని అన్నారు. ‘ఎవరికైనా శిక్ష విధించాలంటే స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉండాలి. అలా లేవని అనిపిస్తే వారిని విముక్తిల్ని చేయాలి. ఒక నిర్దోషికి ఎన్నడూ శిక్షపడకూడదు. వారిని బలిపశువుల్ని చేయకూడదు‘‘ అని అన్నారు. ఈ కేసులో నిర్దోషులుగా ప్రకటించిన ఆ అయిదుగురికి శిక్షలు వేయాలంటూ పియాన్చనపై ఒత్తిళ్లు వచ్చాయని, సాక్ష్యాధారాలు లేకుండా శిక్ష విధించలేని ఆయన తీర్పు చెప్పిన తర్వాత తనని తాను కాల్చుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరోవైçపు న్యాయశాఖ అధికారులు న్యాయమూర్తి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని, అందుకు వ్యక్తిగత సమస్యలే కారణమని అంటున్నారు. అసలు ఆయన ఎందుకు ఈ పని చేశారో విచారణ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. -
బాలిక నాలుక కట్ చేసిన మహిళ
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలోని బంటుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ కానిస్టేబుల్ కుటుంబాన్ని బంధువులు చిత్రహింసలు పెడుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలివి.. పోలీస్ శాఖకు చెందిన కానిస్టేబుల్ బ్రహ్మం గత సంవత్సరం మరణించాడు. దీంతో అతడి వదిన ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు చేసే పనులను మృతి చెందిన కానిస్టేబుల్ భార్యకు పోలీసులు అప్పగించారు. కోపం పెంచుకున్న ఆదిలక్ష్మి తరపువారు బ్రహ్మం కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. మైనర్ బాలిక అయిన కానిస్టేబుల్ కూతురిని ఆదిలక్ష్మి చిత్రహింసలు పెట్టి, నాలుక కోసేసింది. అంతటితో అగకుండా కానిస్టేబుల్ భార్య చేత బంటుపల్లి బస్టాండ్లో ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు మరుగుదొడ్లు శుభ్రం చేయించారు. భర్త మరణించిన అనంతరం ఆమెకు ఫెన్షన్ రూపంలో వచ్చిన 17 వేల రూపాయల నగదును కూడా అన్న వేణు, వదిన ఆదిలక్ష్మిలు లాగేసుకున్నారు. కానిస్టేబుల్ కూతురు స్థానికుల సహాయంతో నిన్న(మంగళవారం) బంటుపల్లి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ బాలిక కోర్టు జడ్జి ఎస్. విజయ్ చంద్రను ఆశ్రయించింది. జడ్జి చొరవతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఎట్టకేలకు స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
వివక్షే అతి పెద్ద నేరం
సాక్షి, సిద్దిపేట: ‘పిల్లలకు ఎంత ఆస్తి ఇవ్వాలి.. వారి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలి.. అని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. కానీ, మా అమ్మానాన్నలు అందుకు విరుద్ధం. తమ వారసులను ఎలా తయారుచేయాలో ఆలోచించారు. స్థిరచరాస్తులకే కాదు.. ఇంట్లోని గది నిండా ఉండే పుస్తకాలకూ వారసులు ఉండాలని భావించారు. ఈక్రమంలో అమ్మానాన్నల నుంచి అందిపుచ్చుకున్న న్యాయశాస్త్ర పరిజ్ఞానం, భర్త ప్రోత్సాహం.. నన్ను న్యాయమూర్తిగా నిలబెట్టింది. అమ్మే నాకు ఆదర్శం.. నాన్న పుస్తకాలకు వారసురాలిగా నా న్యాయవాద వృత్తిని ప్రారంభించా..’ అని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి గూడ అనూష తెలిపారు. అమ్మానాన్నల కలలను సాధించడం నుంచి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తిగా సక్సెస్ అయిన వైనం.. తల్లిదండ్రుల పెంపకం.. మహిళా సాధికారత.. బాధ్యతలు మొదలైన అంశాలపై ఆమె సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు.. ఆమె మాటల్లోనే వివరాలు.. గది నిండా పుస్తకాలే.. మాది వరంగల్ పట్టణం. అమ్మ అమృతమ్మ, నాన్న యాదగిరిశర్మ న్యాయవాదులే. చిన్నప్పటి నుంచి ఇంటి వద్ద చట్టాలు, న్యాయాలు, కేసులు పరిష్కారాలు మాకు వినిపించేవి. కొత్త పుస్తకాలు వస్తే చాలు అమ్మానాన్నలు పోటీ పడి కొని మరీ ఇంటికి తెచ్చేవారు. ఇలా ఇంటి నిండా పుస్తకాలు చేరాయి. అయితే, వాటికి వారసులు ఎవరు? అనేది వారి ప్రశ్న. నేను, తమ్ముడు రవిశర్మ.. ఇద్దరం ఇతర చదువులతో పాటు న్యాయవాద కోర్సు పూర్తి చేశాం. అమ్మానాన్నలు మమ్మల్ని జడ్జీలుగా చూడాలని అనుకునేవారు. ఈ విషయం అమ్మ నాకు చెబుతూ ఉండేది. వారి కోరిక తీర్చడంతో పాటు పుస్తకాలకు వారసురాలిగా ఉంటానని ఏదో సరదాగే చెప్పేదాన్ని. కానీ, అవే మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. నా ఆలోచనకు భర్త ప్రోత్సాహం నా భర్త అనికుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. సమాజాన్ని చదివిన మనిషి. నేను బీటెక్ చదివి లా కోర్సు చేసిన వెంటనే వివాహమైంది. ఆయనది బెంగుళూర్లో ఉద్యోగం. మా కుటుంబ పరిస్థితి.. వాతావరణం చూసిన ఆయన న్యాయమూర్తి కావాలనే నా ఆలోచనకు ఏనాడు అడ్డు చెప్పలేదు. నన్ను మరింత ప్రోత్సహించారు. నా పెద్ద కుమారుడు సాయిసిద్దార్థ 18 నెలల వయస్సునప్పుడు ఆయాతో కలిసి హైదరాబాద్కు కోచింగ్కు వచ్చా. నేనెలా చదువుతున్నానో? ఆయన ప్రతిరోజు ఆరా తీసేవారు. నాకు ధైర్యం చెప్పేవారు. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను న్యాయమూర్తి పోటీ పరీక్షలో రాష్ట్రంలో ఐదో ర్యాంక్ సాధించగలిగాను. సంస్కృతి, సంప్రదాయాలతో ఆత్మవిశ్వాసం సంస్కృతి, సంప్రదాయాలు మనలోని ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని పెంచుతాయి. పూజలు, ఉపవాసాలు, పండుగలు ఏకాగ్రత పెంచేందుకు ఉపయోగపడుతాయి. వాటిని ఏనాడు విస్మరించవద్దు. అయితే, అందులో ఉన్న మంచిని మాత్రమే మనం స్వీకరించాలి. సర్వమానవాళి అభివృద్ధికి దోహదపడేందుకు ఎందరో మహానుభావులు చెప్పిన మాటలు, సూక్తులు స్వీకరించాలి. వాటిని మన జీవన మనుగడకు, తోటివారికి సహాయం చేసేందుకు వినియోగించాలి. అలాగే కట్టుబాట్లు, సామాజిక ఆచారాల ద్వారా ఇతరులను నొప్పించడం, ఇబ్బంది పెట్టకూడదు. అమ్మే నా రోల్ మోడల్ అమ్మే నా రోల్ మోడల్. పేరెంట్స్ ఇద్దరు న్యాయవాదులే. వారి కుటుంబ పరిస్థితి.. పడిన కష్టాలు.. సమాజంలో గుర్తింపులు.. మొదలైన విషయాలు మాకు ఎప్పుడు చెబుతుండేది. వారి న్యాయమూర్తుల గురించి చెబుతూ.. వారిచ్చిన తీర్పులు చర్చించే సమయంలో మేము కూడా న్యాయమూర్తులు అయితే బాగుంటుందని నాన్న పదేపదే చెప్పేవారు. ఆయన మాటలే నన్ను న్యాయమూర్తి పరీక్ష రాసేందుకు సిద్ధం చేశాయి. దీనికి తోడు స్వామి వివేకానంద ‘హన్మంతుడు’ పుస్తకం, పాల్కో రచించిన ‘ది ఆల్కమిస్ట్’ పుస్తకాలు నన్ను ప్రభావితం చేశాయి. సమయం దొరికనప్పుడు పుస్తకాలు చదవడం నా హాబీ. అందులో మనకు కావాల్సిన అంశాలుంటే రాసుకుంటాను. వివక్ష ఎక్కడ ఉన్నా నేరమే.. వివక్ష ఎక్కడ ఉన్నా నేరమే. నేను, తమ్ముడు ఇద్దరం పోటీ పడి చదివేవాళ్లం. మా పెంపకంలో ఎక్కడా తల్లిదండ్రులు వివక్ష చూపలేదు. తల్లిదండ్రులు తమ బిడ్డలను సమానంగా చూడాలి. ప్రస్తుతం మగవారి కన్నా ఆడపిల్లలే బాధ్యతగా చదువుతున్నారు. వారు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. ఇంకెందుకు ఈ వివక్ష. పిల్లలు తమ తల్లిదండ్రులను రోడ్ల మీద వదిలేసిన సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. వీరి రక్షణ కోసం ప్రభుత్వం చట్టాలు చేసింది. అంతేకాదు తల్లిదండ్రుల బాధ్యతలు విస్మరించిన వారిపైనా చట్టం కఠినంగా వ్యవహరిస్తుంది. పట్టుదల ఉంటే విజయం ఆడపిల్లలు.. మహిళలు ఎక్కడా తక్కువ కాదు. మేం తక్కువ అనే భావన తీసేయాలి. ఆడవాళ్లను భూమాతతో పోల్చుతారు. అంటే అంత సహనం ఉంటుందని అర్థం. అందుకే ఓపికతో పెంచుకోవాలి. లక్ష్యం ఎన్నుకొని.. దానిని సాధించే వరకు శ్రమించాలి. అంతేకానీ, నిరాశతో ఉంటే విజయం సాధించలేవు. కుటుంబసభ్యుల సహకారం తీసుకోవాలి. తల్లిదండ్రులు, పుట్టిన ఊరి రుణం తీర్చుకోవాలి. అంతేకాదు ఎన్నుకున్న రంగంలో రాణించాలి. -
అందరూ భాగస్వాములు కావాలి
జిల్లా జడ్జి నాగమారుతిశర్మ టవర్సర్కిల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కోర్డు జడ్జి నాగమారుతీశర్మ అన్నారు. శుక్రవారం నగరంలోని 4వ డివిజన్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విరివిగా చెట్ల పెంపకం చేపట్టడం వలన సకాలంలో వర్షాలు కురుస్తాయన్నారు. నగరంలో పచ్చదనం పెంపొందించడానికి ప్రతి ఒక్కరు మొక్కలు పెంచాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ను హరిత నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థులు భవిష్యత్ తరాలకు వారసులని, మొక్కలకు తమ పేర్లను పెట్టుకొని బాధ్యతతో పెంచాలని సూచించారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి మూడు మొక్కలను తప్పనిసరిగా పెంచాలన్నారు. హరితహారంలో అందరూ భాగస్వాములయితేనే ఫలితం పొందుతామని సూచించారు. నగర మేయర్ సర్దార్ రవీందర్సింగ్ మట్లాడుతూ.. పచ్చదనం పెంపొందించనప్పుడే నగరంలో కాలుష్యాన్ని తగ్గించగలుగుతామని అన్నారు. అనంతరం మొక్కలను నాటి, విద్యార్థులకు, స్థానికులకు మొక్కలు, ట్రీగార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, ఎస్పీ జోయల్ డేవిస్, ఆర్డీవో చంద్రశేఖర్, కార్పొరేషన్ కమిషనర్ కేవీ.రమణాచారి, కార్పొరేటర్లు ఎడ్ల సరితఅశోక్, వై.సునీల్రావు, కంసాల శ్రీనివాస్, పిట్టల శ్రీనివాస్, లింగంపల్లి శ్రీనివాస్, ఏవీ.రమణ, మెండి చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక వారధి కళాభారతి బృందం మొక్కల పెంపకంపై ఆలపించిన గీతాలు అలరింపజేశాయి. హరితోద్యమంలో భాగస్వాములు కావాలి : జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితోద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాదు.. వాటిని సంరక్షించినపుడే హరితహారం లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. శుక్రవారం నగరంలోని జెడ్పీ క్వార్టర్స్లో కలెక్టర్ నీతూప్రసాద్తో కలిసి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్వార్టర్స్ ఆవరణ, రోడ్డుకిరువైపులా 300 మొక్కలు నాటారు. చెట్లు లేని ప్రపంచాన్ని ఊహించలేమని, ఇప్పటికే చెట్ల సంఖ్య తగ్గడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నదని ఉమ పేర్కొన్నారు. అందుకే సీజన్లో వర్షాలు కురవకపోవడం, అకాల వర్షాలు పడడం జరుగుతుందన్నారు. భవిష్యత్ ప్రమాదాన్ని ఊహించిన కేసీఆర్ ప్రజా ఉద్యమంలా హరితహారాన్ని చేపట్టారని చెప్పారు. మొక్కలు నాటడంతో పాటు, వాటి సంరక్షణ బాధ్యత కూడా చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సూరజ్కుమార్, జెడ్పీటీసీ తన్నీరు శరత్రావు, కార్పొరేటర్ యాదగిరి సునీల్రావు తదితరులు పాల్గొన్నారు. కదిలిన జిల్లా యంత్రాంగం ముకరంపుర : హరితహారంలో భాగంగా ఆయా శాఖల అధికారులు మొక్కలు నాటేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. నగరంలోని వెటర్నరీ పాలిక్లినిక్లో 50 మొక్కలను ఒక ప్లాటుగా.. 200 మొక్కలు పాలిక్లినిక్ ప్రహారీ చుట్టూ నాటారు. ముఖ్య అతిథిగా సీపీవో సుబ్బారావు, పశుసంవర్దకశాఖ జేడీ రాంచందర్, డీడీలు షేక్ ఖలీల్ రహ్మాన్, వెంకటేశ్వర్లు, కిషన్, కళ్యాణి, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా పాల్గొనగా మొక్కలు నాటారు. మార్కెటింగ్ శాఖ డీడీఎం కృష్ణయ్య, సిబ్బంది. కార్పొరేటర్లు పాల్గొన్నారు. చొప్పదండి మండలం రుక్మాపూర్ ఉద్యానక్షేత్రంలో ఉద్యానశాఖ సిబ్బంది మొక్కలు నాటా రు. ఉద్యానశాఖ డీడీ సంగీతలక్ష్మి, ఏడీ జ్యోతి, అసిస్టెంట్ పీడీ మధుసూధన్ పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట ఐసోటీం స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో మొక్కలను ఉచితంగా అందజేస్తూ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. హౌసింగ్ పీడీ నర్సింగరావు మొక్కను తీసుకుని పేరు నమోదు చేసుకున్నారు. వయోజన విద్య ఉపసంచాలకుల కార్యాలయంలో మొక్కలు నాటారు. ఉపసంచాలకులు ఎం.జయశంకర్, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి బాల సురేందర్, ఏపీవో దేవదాస్, పర్యవేక్షకులు వి.రాజేందర్ఱావు, ఆదిరెడ్డి పాల్గొన్నారు. -
న్యూయార్క్ కోర్టు జడ్జిగా రాజరాజేశ్వరి
న్యూయార్క్: న్యూయార్క్ క్రిమినల్ కోర్టు న్యాయమూర్తిగా భారతీయ సంతతికి చెందిన రాజరాజేశ్వరి(43) నియమితులయ్యారు. అమెరికాలో న్యాయమూర్తిగా గౌరవం అందుకున్న తొలి భారతీయ మహిళ రాజరాజేశ్వరి. నగర మేయర్ బిల్ డే బ్లాసియో ఆమె చేత ప్రమాణం చేయించారు. గత 16 సంవత్సరాలుగా రాజరాజేశ్వరి వివిధ న్యాయ విభాగాల్లో పనిచేశారు. రిచ్మండ్ కంట్రీ జిల్లా అటార్నీగా ఆమె పనిచేశారు. ఎక్కడో దూరదేశం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన మహిళకు ఇంతటి గౌరవం దక్కడం గర్వంగా ఉందని రాజరాజేశ్వరి తెలిపారు.