despite
-
కోర్టు కాంప్లెక్స్లోనే లాయర్ దారుణ హత్య..
లక్నో: ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో దారుణం జరిగింది. కోర్టు కాంప్లెక్స్లో తన ఛాంబర్లో ఉన్న మోను చౌదరి అనే లాయర్ని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. న్యాయవాది తన సన్నిహితులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తుండగా.. ఈ ఘటన జరిగింది. కోర్టులో సెక్యూరిటీ కళ్లుగప్పి దుండగులు ఎలా ప్రవేశించారనేది మిస్టరీగా మారింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో లాయర్లు తమ ఛాంబర్లలోకి వెళ్లి భోజనాలు చేస్తున్నారు. లాయర్ మోను చౌదరి కూడా తన సన్నిహితులతో కలిసి భోజనం చేస్తుండగా.. దుండగులు అకస్మాత్తుగా తన ఛాంబర్లోకి ప్రవేశించి గన్లతో కిరాతకంగా కాల్చి చంపారు. న్యాయవాది రక్తపు మడుగులు పడి ఉండగా.. దుండగులు తప్పించుకుని పారిపోయారు. ఆయితే.. పోలీసులకు న్యాయవాదులకు మధ్య జరుగుతున్న హాపూర్ లాయర్ల ఆందోళన తర్వాత ఈ ఘటన జరగడం పోలీసులపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టులో సెక్యూరిటీని దాటుకుని దుండగులు పిస్టళ్లతో ఎలా ప్రవేశించగలిగారనేది మిస్టరీగా మిగిలింది. సెక్యూరిటీ కెమెరాలు ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం వివాదాస్పదంగా మారింది. లాయర్ మోను చౌదరి హత్యపై లాయర్ల సంఘాలు భగ్గుమన్నాయి. న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. హాపూర్ లాయర్ల ఆందోళన.. ఓ లాయర్, అతని తండ్రిపై తప్పుడు కేసు పెట్టినందుకు న్యాయవాదుల సంఘాలు నిరసనలు చేపట్టాయి. ఈ ఆందోళనలను అదుపుచేయడానికి పోలీసులు.. లాయర్లపై లాఠీఛార్జీ చేశారు. దీంతో న్యాయవాదులపై పోలీసుల చర్యలు హక్కులను భంగపరచడమేనని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. శాంతియుత నిరసనలు చేపట్టిన లాయర్లపై పోలీసులు లాఠీఛార్జీ చేయడాన్ని తప్పబట్టింది. ఇదీ చదవండి: ఢిల్లీలో ఘోరం.. అమెజాన్ మేనేజర్ దారుణ హత్య.. -
వాహన రుణాలు రూ.5.09 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వ్యవస్థలో మొత్తం వాహన రుణాలు మే నాటికి రూ.5.09 లక్షల కోట్లకు చేరాయి. క్రితం ఏడాది మే నాటికి ఉన్న రూ.4.16 లక్షల కోట్లతో పోలిస్తే ఏడాదిలో 22 శాతం పెరిగాయి. 2021 మే నాటికి ఈ మొత్తం రూ.3.65 లక్షల కోట్లుగా ఉండడం గమనించొచ్చు. అంతకుముందు ఏడాది కంటే గతేడాది వాహన రుణాలు ఎక్కువగా వృద్ధి చెందాయి. ఆర్బీఐ గతేడాది మే నుంచి వడ్డీ రేట్లను క్రమంగా సవరించడం మొదలు పెట్టి, ఈ ఏడాది ఫిబ్రవరిరి వరకు మొత్తం మీద 2.5 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. అయినప్పటికీ వాహన విక్రయాలు పెద్ద ఎత్తున పెరగడం వాహన రుణాలకు సైతం డిమాండ్ను తీసుకొచి్చంది. ఈ ఏడాది జూన్కు సంబంధించి ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య విడుదల చేసిన గణాంకాలను పరిశీలించినా, అన్ని విభాగాల్లో వాహన విక్రయాలు పెరిగినట్టు తెలుస్తోంది. ఆటో రిటైల్ విక్రయాలు 10 శాతం మేర పెరిగాయి. ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ బలంగా ఉన్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ రోహన్ కన్వార్ గుప్తా తెలిపారు. కార్ల ధరలు, రుణాల రేట్లు పెరిగినప్పటికీ వాహన డిమాండ్ ఆరోగ్యంగా ఉన్నట్టు పేర్కొన్నా రు. అయితే కారు కొనుగోలు వ్యయం పెరిగినందున వాహన విచారణలు, విక్రయాల గణాంకాలు సమీప కాలానికి ఎలా ఉంటాయో పర్యవేక్షించాల్సి ఉందన్నారు. సెమీకండక్టర్ సరఫరా కొంత స్థిరపడినప్పటికీ, ఇక ముందూ సరఫరా పరంగా కొరత ఓఈఎంలను ఆందోళనకు గురి చేయవచ్చని గుప్తా అభిప్రాయం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఆదాయాలు ఆకాంక్షలు పెరగడం, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధి వల్ల కార్లకు డిమాండ్ను తీసుకొస్తున్నట్టు ఆండ్రోమెడా సేల్స్, ఆప్నాపైసా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వి.స్వామినాథన్ వివరించారు. ఆధునిక డిజైన్, ఫీచర్లతో నూతన కార్లను విడుదల చేస్తుండడంతో వీటి ధరల్లోనూ పెరుగుదల కనిపిస్తున్నట్టు చెప్పారు. కార్ల రుణాలకు ఎంతో ఆదరణ కనిపిస్తోందని, సగటు వాహన రుణం మొత్తం కూడా పెరిగినట్టు తెలిపారు. ‘‘ఆర్థిక వ్యవస్థ సంఘటితం వైపు అడుగులు వేస్తుండడం, ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వ్యక్తుల సంఖ్య పెరుగుతుండడంతో, అది వారి రుణ అర్హతను ఇతోధికం చేస్తుంది. దీనికి అదనంగా రుణ లభ్యతను ఫిన్టెక్ కంపెనీలు మరింత సులభతరం చేస్తున్నాయి. దీంతో వ్యక్తులు సులభంగా రుణాలు పొందేలా చేస్తోంది’’ అని స్వామినాథన్ వివరించారు. దేశవ్యాప్తంగా రుతుపవనాల విస్తరణతో, సాధారణ వర్షపాతం అంచనాలు, ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాతో ఆర్థిక వృద్ధి మెరుగ్గా ఉంటుందని, ఇది ఆటో విక్రయాలకు మేలు చేస్తుందని పరిశ్రమ భావిస్తోంది. -
జెట్ ఎయిర్వేస్లో జీతాల రగడ!
న్యూఢిల్లీ: దేశీ ఎయిర్లైన్స్ దిగ్గజం జెట్ ఎయిర్వేస్లో ప్రతిపాదిత జీతాల కోత, ఉద్యోగుల తొలగింపులపై దుమారం చెలరేగుతోంది. జీతాల తగ్గింపు విషయంలో కంపెనీ యాజమాన్యం, పైలట్ల మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. వ్యయాలను తగ్గించుకోకపోతే రెండు నెలలకు మించి నడిపే పరిస్థితి లేదంటూ జెట్ యాజమాన్యం తమను బెదిరిస్తోందని పైలట్లు పేర్కొన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, జెట్ ఎయిర్వేస్ దీనిపై శుక్రవారం ఎక్సే్ఛంజీలకు వివరణ ఇచ్చింది. 60 రోజులకు మించి నడిచే పరిస్థితి లేదంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్నారంటూ స్పష్టం చేసింది. అదేవిధంగా సంస్థలో వాటా విక్రయ ప్రతిపాదనలేవీ లేవని కూడా తేల్చిచెల్పింది. అయితే, వ్యయాలను తగ్గించుకోవడం కోసం పలు చర్యలను అమలు చేస్తున్నామని చెప్పడం కొసమెరుపు!! అసలేం జరిగిందంటే... గత వారంలో పైలట్లు వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులతో జెట్ ఎయిర్వేస్ యాజమాన్యం ఒక సమావేశం ఏర్పాటుచేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా కంపెనీ ఆర్థిక పరిస్థితులు బాగోలేవని, వ్యయాలను తగ్గించుకోవడానికి సహకరించాల్సిందిగా సిబ్బందిని యాజమాన్యం కోరింది. భారీగా జీతాల కోత, కొన్ని విభాగాల్లో ఉద్యోగుల తొలగింపు వంటి ప్రతిపాదనలను యాజమాన్యం తమ ముందుంచిందని పైలట్ వర్గాలు పేర్కొన్నాయి. రూ. కోటి వరకు వార్షిక వేతన ప్యాకేజీ ఉన్నవారికి 25 శాతం కోత, రూ.12 లక్షల వరకు ప్యాకేజీ ఉన్న ఉద్యోగులకు 5 శాతం కోతను కంపెనీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఇక పైలట్లకు 17 శాతం మేర వేతన కోత ఉండొచ్చని అంచనా. జెట్ ఎయిర్వేస్ చైర్మన్ నరేశ్ గోయల్, సీఈఓ వినయ్ దూబే, డిప్యూటీ సీఈఓ అమిత్ అగర్వార్ తదితరులు ఈ భేటీకి హాజరైనట్లు ఆయా వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా తక్షణం వ్యయ నియంత్రణ చర్యలను చేపట్టకపోతే 60 రోజులకు మించి ఎయిర్లైన్స్ను నడిపే పరిస్థితి లేదంటూ యాజమాన్యం పేర్కొన్నట్లు సమాచారం. దీనికి పైలట్లు, ఇంజినీర్లు ససేమిరా అనడంతోపాటు ఈ మొత్తం వ్యవహారాన్ని మీడియాకు వెల్లడించడంతో కంపెనీలో గగ్గోలు మొదలైంది. ఈ ఏడాది మార్చి నాటికి జెట్ ఎయిర్వేస్లో 16,558 మంది పర్మినెంట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. 6,306 మంది తాత్కాలిక/క్యాజువల్ సిబ్బంది కూడా ఉన్నారు. ఉద్యోగుల వేతన బిల్లు ఏడాదికి దాదాపు రూ.3,000 కోట్లుగా ఉంది. తాజా కోత ప్రతిపాదనలతో దాదాపు రూ. 500 కోట్ల మేర ఆదా అవుతుందని కంపెనీ లెక్కలేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ రూ.1,040 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. కాగా, జనరల్ మేనేజర్లు అంతకంటే పెద్ద స్థాయి(సీనియర్ మేనేజ్మెంట్) ఎగ్జిక్యూటివ్లకు ఇప్పటికే 25 శాతం వేతన కోతను అమల్లోకి తెచ్చినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ ఏమంటోంది... అధిక ఇంధన వ్యయాలు, నిర్వహణ భారం పెరిగిపోవడంతో వ్యయాల కోతపై దృష్టిపెట్టామని స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ వివరించింది. దీనికోసం పలు చర్యలు అమలు చేస్తున్నామని.. నిర్వహణ సామర్థ్యం పెంపు, సేల్స్–డిస్ట్రిబ్యూషన్, ఉద్యోగులు, మెయింటెనెన్స్ వంటివి ఇందులో ఉన్నట్లు పేర్కొంది. పైలట్లు, ఇంజినీర్లు, ఇతరత్రా ఉద్యోగులందరితో ప్రస్తుతం పరిశ్రమతో పాటు కంపెనీ ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను చర్చించిన విషయాన్ని ఒప్పుకుంది. అయితే, ప్రతిపాదిత జీతాల కోతపై మాత్రం స్పష్టమైన వివరణ ఇవ్వక పోవడం గమనార్హం. టికెట్ ధరలు తగ్గడం, అధిక ఇంధన వ్యయాలు, రూపాయి విలువ పతనం వంటి పలు అంశాల కారణంగా విమానయాన పరిశ్రమ తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోందని జెట్ ఎయిర్వేస్ సీఈఓ వినయ్ దూబే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, గడిచిన 25 ఏళ్లుగా ఇలాంటి ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి విజయవంతంగా తామ వ్యాపారాన్ని నడిపిస్తున్నామని చెప్పారు. వాటా విక్రయిస్తారా..! జెట్ ఎయిర్వేస్లో ప్రస్తుతం గల్ఫ్కు చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్కు 24 శాతం వాటా ఉంది. ఇప్పుడు మరో 20 శాతం వాటాను ఏదైనా అంతర్జాతీయ ఎయిర్లైన్స్కు విక్రయించాలని కంపెనీ యాజమాన్యం భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. నెదర్లాండ్స్కు చెందిన కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్లైన్స్ ఇతరత్రా దిగ్గజాలతో వాటా అమ్మకానికి సంబంధించి జెట్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. అయితే, ఈ వార్తలను జెట్ యాజమాన్యం ఖండించింది. వాటా విక్రయంపై ఎలాంటి చర్చలూ జరపలేదని అంటోంది. కాగా, కంపెనీలో రాజుకున్న జీతాల రగడ, ఆర్థిక పరిస్థితి దిగజారిందన్న అనుమానాల నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ షేరు శుక్రవారం బీఎస్ఈలో 9 శాతం మేర కుప్పకూలింది. ఒకానొక దశలో రూ.301 కనిష్టాన్ని తాకింది. చివరకు 7 శాతం నష్టంతో రూ.308 వద్ద ముగిసింది. -
‘ఫెయిర్’ జపాన్
డ్రా చేసుకున్నా నాకౌట్ చేరే పరిస్థితి జపాన్ది! గెలిచినా ముందుకెళ్లలేని స్థితి పోలాండ్ది! ఈ లెక్కల మధ్య... ఆసియా జట్టు అనూహ్యంగా ఓడింది. అయినా తదుపరి రౌండ్ చేరింది. ఊహించని గణాంకాలు తెరపైకి వచ్చి జపాన్ను ఒడ్డున పడేశాయి. వొల్గొగ్రాడ్: ప్రస్తుత ప్రపంచ కప్లో నాకౌట్ చేరిన ఏకైక ఆసియా జట్టుగా జపాన్ నిలిచింది. గ్రూప్ ‘హెచ్’లో భాగంగా గురువారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో పోలాండ్ చేతితో 0–1తో ఓడినా ఆ జట్టుకు కొంత అదృష్టం తోడై ముందుకెళ్లింది. పోలాండ్ తరఫున ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బెడ్నారెక్ (59వనిమిషం) గోల్ చేశాడు. ఆధిపత్యం అటు ఇటు... పెద్దగా మెరుపుల్లేకుండానే సాగిన ఆటలో మొదటి భాగంలో పోలాండ్, రెండో భాగంలో జపాన్ ఆధి పత్యం కనబర్చాయి. యొషినొరి మ్యుటో దాడితో ప్రారంభంలో ఆసియా జట్టుకే గోల్ అవకాశం దక్కింది. కీపర్ లుకాజ్ ఫాబియాన్స్కీ అడ్డుకోవడంతో స్కోరు కాలేదు. అయితే, ప్రత్యర్థి డిఫెన్స్ బలంగా ఉండటంతో పైచేయి చిక్కలేదు. ఓ దశలో పోలాండ్కు కమిల్ గ్రోస్కీ హెడర్ షాట్తో గోల్ తెచ్చినంత పని చేశాడు. కానీ, కీపర్ ఎజ్జి కవాషిమా చురుగ్గా స్పందించి నిలువరించాడు. జపాన్ మొదటి భాగంలోనే ఆరుగురు ఆటగాళ్లను సబ్స్టిట్యూట్లుగా దింపి నా ఫలితం పొందలేకపోయింది. ఇటు పోలాండ్ కెప్టెన్ లెవాన్డొస్కీ ప్రత్యర్థి శిబిరంపై కనీసం షాట్ కూడా కొట్టలేకపోవడంతో స్కోరేమీ లేకుండానే తొలి 45 నిమిషాల సమయం ముగిసింది. ఏకైక గోల్... రెండో భాగమూ పోటాపోటీగానే ప్రారంభమైంది. అయితే, రఫల్ కుర్జావా కొట్టిన ఫ్రీ కిక్ను అద్భుత రీతిలో అందుకున్న బెడ్నారెక్ గోల్ పోస్ట్లోకి పంపడంతో ఆధిక్యం దక్కింది. సరిగ్గా ఈ సమయానికి అటువైపు మ్యాచ్లో సెనగల్పై కొలంబియా గోల్ చేయకపోవడంతో గ్రూప్లో జపాన్ మూడో స్థానానికి పరిమితమయ్యే ప్రమాదంలో పడింది. ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆ జట్టు ఒక్కసారిగా దాడులు పెంచింది. అయితే, చివర్లో లెక్క అర్థం చేసుకుని ఎలాంటి ప్రయోగాలకు పోకుండా సమయాన్ని గడిపేసి ముగించింది. మ్యాచ్ మొదటి భాగంలో బంతి 56 శాతం పోలాండ్ ఆధీనంలోనే ఉంది. మొత్తం మీద చూస్తే జపానే (54 శాతం) బంతిని ఎక్కువ నియంత్రణలో ఉంచుకుంది. ఎల్లో కార్డులే కారణం వరల్డ్ కప్ చరిత్రలో ఇదో అరుదైన ఘటన. తొలి సారి ఒక జట్టు ‘ఫెయిర్ ప్లే’ ద్వారా నాకౌట్కు అర్హత సాధించింది. గ్రూప్ ‘హెచ్’లో గురువారం అన్ని మ్యాచ్లు ముగిశాక కొలంబియా 6 పాయింట్లతో అగ్రస్థానంతో ముందంజ వేసింది. జపాన్, సెనెగల్ చెరో 4 పాయింట్లతో సమంగా నిలిచాయి. ఇరు జట్లు ఒక మ్యాచ్ గెలిచి, ఒకటి ఓడి, మరోటి డ్రా చేసుకున్నాయి. చేసిన గోల్స్, ఇచ్చిన గోల్స్ కూడా సమానంగా (4) ఉన్నా యి. దాంతో ‘ఫిఫా’ నిబంధనల ప్రకారం మైదానంలో ఆటతీరును బట్టి ఫెయిర్ ప్లే ప్రకారం ఇరు జట్లలో ఒకరిని ఎంపిక చేశారు. గ్రూప్ దశలో జపాన్ 4 ఎల్లో కార్డులకు గురి కాగా (–4 పాయింట్లు), సెనెగల్ ఆటగాళ్లు 6 ఎల్లో కార్డులు (–6 పాయింట్లు) అందుకున్నారు. ఫలితంగా జపాన్దే పైచేయి అయింది. అయితే పేరుకు ‘ఫెయిర్ ప్లే’ అయినా పోలాండ్తో మ్యాచ్లో జపాన్ క్రీడా స్ఫూర్తిపై అన్ని వైపులనుంచి విమర్శలు వచ్చాయి. స్కోరులో వెనుకబడిన తర్వాత కూడా ఆ జట్టు పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిని ప్రదర్శించింది. మ్యాచ్ తర్వాత ఎల్లో కార్డుల లెక్క ముందుకు వస్తుందని గుర్తించిన జపాన్ చివరి పది నిమిషాల్లో అతి జాగ్రత్తగా, అసలు ఏమాత్రం ఆసక్తి లేనట్లుగా ఆడింది. అటు గోల్స్ సంఖ్య పెరిగినా ఫలితం లేదని భావించి పోలాండ్ కూడా దాడులు చేయకపోవడంతో ఆఖర్లో ఆట ట్రైనింగ్ సెషన్లా సాగింది. వరల్డ్ కప్ ఫుట్బాల్లో నేడు విశ్రాంతి దినం -
ఇక 'వడ్డిం'పు షూరూ..!
వడ్డీరేట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) మరోసారి అందరి అంచనాలను తలకిందులు చేసింది. దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత అనూహ్యంగా కీలక పాలసీ రేట్లను పెంచింది. అంతర్జాతీయంగా అంతకంతకూ పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావంతో దేశీయంగా ద్రవ్యోల్బణం ఎగబాకే ప్రమాదం పొంచి ఉండటమే వడ్డీరేట్ల పెంపునకు ప్రధాన కారణంగా పేర్కొంది. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లు కూడా పెరగనున్నాయి. ఖాతాదారులు చెల్లించే నెల వాయిదాలు (ఈఎంఐ) భారం కానున్నాయి. కాగా, మోదీ సర్కారు హయాంలో ఇది ఆర్బీఐ మొట్టమొదటి రేట్ల పెంపు కావడం విశేషం. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి కట్టడి చేస్తాం... రిటైల్ ద్రవ్యోల్బణాన్ని మధ్యకాలికంగా 4 శాతానికి (రెండు శాతం అటు ఇటుగా) కట్టడి చేయాలన్నదే తమ లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. వృద్ధి ఊతమిస్తూనే ఈ లక్ష్యానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. దీనికి అనుగుణంగానే ప్రస్తుతానికి తటస్థ పాలసీనే కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించినట్లు ఆయన వివరించారు. ‘దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు కొద్ది నెలలుగా పుంజుకున్నాయి. ఉత్పాదకతకు సంబంధించిన తగ్గుముఖం ధోరణి దాదాపు ముగిసినట్లే. కార్పొరేట్ల పెట్టుబడుల్లో కూడా మెరుగైన రికవరీయే కనబడుతోంది. దివాలా చట్టంతో మొండిబకాయిలకు సత్వర పరిష్కారం లభించే అవకాశం ఉంది. భౌగోళిక–రాజకీయ రిస్కులు, ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు, రక్షణాత్మక వాణిజ్య విధానాలు దేశీ ఆర్థిక వ్యవస్థ రికవరీకి అడ్డంకులు సృష్టించే ప్రమాదం పొంచి ఉంది’ అని ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుదల రిస్కులపై ఆర్బీఐ అప్రమత్తత కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.7%కి(ఏడు క్వార్టర్ల గరిష్టం), పూర్తి ఏడాదికి 6.7%కి వృద్ధి చెందిన సంగతి తెలిసిందే. ఎగవేతదారులపై మరో అస్త్రం.. పీసీఆర్! రుణ ఎగవేతదారులను గుర్తించడం ప్రధాన లక్ష్యంగా ‘పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ (పీసీఆర్)’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. రుణ గ్రహీతల సమాచారం అంతా పీసీఆర్లో నమోదవుతుంది. వారి రుణ చరితను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ... అప్రమత్తం చేయడం రిజిస్ట్రీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. యశ్వంత్ ఎం దేవస్థాలి నేతృత్వంలోని ఒక ఉన్నతస్థాయి కమిటీ సిఫారసులకు అనుగుణంగా పీసీఆర్ను ఏర్పాటుచేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. రిజిస్ట్రీ విధివిధానాలు, పనితీరు వంటివి ఖరారుకు తొలిదశలో ఒక ప్రత్యేక టాస్క్ఫోర్స్ (ఐటీఎఫ్) ఏర్పాటవుతుంది. ప్రస్తుతం దేశంలో పలు క్రెడిట్ సమాచార విభాగాలున్నా.. కొన్ని నిర్దిష్ట కార్యకలాపాలు, లక్ష్యాల మేరకే ఇవి పనిచేస్తున్నాయి. చిన్న బ్యాంకులుగా సహకార బ్యాంకులు! సహకార బ్యాంకులకు త్వరలో చిన్న తరహా బ్యాంకుల హోదా(స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్) లభించే అవకాశాలు ఉన్నాయి. చిన్న బ్యాంకులుగా పట్టణ సహకార బ్యాంకుల(యూసీబీ) మార్పిడికి సంబంధించి ఆర్బీఐ త్వరలో ఒక పథకాన్ని ఆవిష్కరిస్తుందని డిప్యూటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్ సూచించారు. దీనికి సంబంధించి కొన్ని వర్గాల నుంచి ఆర్బీఐకి విజ్ఞప్తులు వస్తున్నట్లు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా పేమెంట్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేయడానికి, ఇందులో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఆర్బీఐ ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. ఈ విషయంలో ప్రజాభిప్రాయం సేకరణకుగాను సెప్టెంబర్ 30న ఆర్బీఐ ఒక విధాన పత్రాన్ని విడుదల చేస్తుందని డిప్యూటీ గవర్నర్ తెలిపారు. ఆర్థిక వృద్ధికి విఘాతం: పరిశ్రమ వర్గాలు ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయంపై పారిశ్రామిక రంగం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలకు గండిపడుతుందని పేర్కొన్నారు. ‘సరఫరాపరమైన అడ్డంకులే ప్రస్తుత ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణం. రేట్ల పెంపుతో వృద్ధికి విఘాతం కలుగుతుంది. రానున్న కాలంలో వృద్ధికి మద్దతుగా ఆర్బీఐ మళ్లీ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని భావిస్తున్నాం’ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ‘పరిశ్రమతోపాటు చాలా మందికి ఆర్బీఐ కఠిన వైఖరి రుచించకపోవచ్చు. అయినా, స్వల్పకాలానికి ఆర్బీఐ వడ్డీరేట్లలో పెరుగుదల కొనసాగే అవకాశం ఉంది’ అని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ చెప్పారు. ‘ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వడ్డీరేట్ల ధోరణి, క్రూడ్ ధరల జోరు, అధిక ద్రవ్యోల్బణం వల్లే ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. రియల్టీ రంగంపై (ఇళ్ల కొనుగోళ్లు) ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. దీర్ఘకాలంలో రేట్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది’ అని నరెడ్కో జాతీయ అధ్యక్షుడు నిరంజన్ హిరనందాని వ్యాఖ్యానించారు. ముఖ్యాంశాలు ఇవీ... ►బ్యాంక్ రేటు 6.5 శాతం, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) 4 శాతంగా కొనసాగుతాయి. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు 6.5 శాతంగా ఉంటుంది. ►కార్పొరేట్ పెట్టుబడుల్లో రికవరీ మెరుగ్గానే ఉంది. దివాలా చట్టంతో మొండిబకాయిల పరిష్కారానికి తోడ్పాటు. ►ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పిత్తి(జీడీపీ) వృద్ధి రేటు గతంలో అంచనా వేసిన విధంగానే 7.4 శాతంగా ఉంటుంది. ►అంతర్జాతీయంగా పొంచిఉన్న రాజకీయ–భౌగోళికపరమైన రిస్కులు, ఫైనాన్షియల్ మార్కెట్లలో కుదుపులు, అమెరికాతో సహా పలు దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక వాణిజ్య విధానాలు మన ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ►తదుపరి పాలసీ సమీక్ష నిర్ణయం ఆగస్టు 1న వెలువడుతుంది. సరైన దిశలో చర్యలు.. అందుబాటు గృహాలకిచ్చే రుణాలకు పరిమితులను పెంచడం, ఎంఎస్ఎంఈ సంస్థలు సంఘటిత రంగంలో భాగమయ్యేలా ప్రోత్సహించే చర్యలు సరైన దిశలో తీసుకున్నవే. ఎస్డీఎల్ వేల్యుయేషన్ నిబంధనల్లో మార్పులు.. దీర్ఘకాలికంగా సానుకూలమైనవి. ఎఫ్ఏఎల్ఎల్సీ నిష్పత్తిని పెంచడం వల్ల బ్యాంకులకు మరింత లిక్విడిటీ లభిస్తుంది. – రజనీష్ కుమార్, చైర్మన్, ఎస్బీఐ ఆర్థిక స్థిరత్వానికి తోడ్పాటు ఆర్బీఐ సరైన సమయంలో తీసుకున్న నిర్ణయాలు.. ద్రవ్యోల్బణ అంచనాలు స్థిరంగా ఉండేలా చూసేందుకు తోడ్పడతాయి. ఇవి ఆర్థిక స్థిరత్వం సాధించడానికి ఉపయోగపడగలవు. – చందా కొచర్, ఎండీ, ఐసీఐసీఐ బ్యాంక్ ద్రవ్యోల్బణ కట్టడి.. రేట్ల పెంపు నిర్ణయం.. ద్రవ్యోల్బణాన్ని 4%స్థాయిలో కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది. పెరుగుతున్న ముడి చమురు రేట్లు వంటి అంశాలతో అంతర్జాతీయంగా అనిశ్చితి కారణంగానే రేట్ల పెంచి ఉంటారని భావిస్తున్నా. – రాణా కపూర్, ఎండీ, యస్ బ్యాంక్ -
అడ్డంకులు ఎదురైనా జనగర్జన నిర్వహిస్తాం
∙జనగామ జిల్లా కోసం నేడు అన్ని గ్రామాల్లో డప్పుచాటింపు ∙సభ అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించాం ∙21న 50వేల అభ్యంతరాలను కలెక్టర్కు అప్పగిస్తాం దశమంతరెడ్డి జనగామ : జనగామ జిల్లా సాధన కోసం ఈ నెల 20న తలపెట్టిన జనగర్జన సభకు ఎన్ని అడ్డం కులు ఎదురైనా నిర్వహించి తీరుతామని జేఏసీ చైర్మ¯ŒS ఆరుట్ల దశమంతరెడ్డి అన్నారు. స్థానిక జూబ్లీఫంక్ష¯ŒS హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిలపక్ష నాయకులు ఆముదాల మల్లారెడ్డి, మేడ శ్రీనివాస్, బెడిదె మైసయ్యలతో కలిసి ఆయన మాట్లాడారు. శాంతియుతంగా జరుపుకునే సభకు అనుమతి లేదనడం హాస్యాస్పదమన్నారు. డివిజ¯ŒSలోని 16 మండలాల నుంచి లక్షకు పైగా జనం స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సభ నిర్వహణ కోసం హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. నేడు అన్ని గ్రామాల్లో డప్పు చాటింపు చేయాలని పిలుపునిచ్చారు.19న ఇంటింటికి బొట్టు పెట్టి ఆహ్వానం పలుకుతామన్నారు. పట్టణంలో వార్డుల వారీగా కమిటీలు వేసి, వందశాతం ప్రజలు సభకు తరలివచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఆయా రాజకీయ పార్టీలు, అనుబంధ సంస్థలను ఏకతాటిపైకి తీసుకు వచ్చి, సభకు వచ్చేందుకు ఏకగ్రీవ తీర్మానాలు సైతం చేస్తున్నారన్నారు. సభ విజయవంతానికి పట్టణం నుంచి చేర్యాల, పాలకుర్తి నియోజకవర్గాల వైపు వెళ్లిన బైక్ ర్యాలీకి అనూహ్య స్పందన లభించిందన్నారు. సిద్దిపేట జిల్లాపై వస్తున్న అభ్యంతరాల వివరాలు రాత్రికి రాత్రే మార్చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 21న జిల్లా కలెక్టర్కు 50 వేల అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా అందజేస్తామని చెప్పారు. ఆ¯ŒSలై¯ŒS, రాతపూర్వకంగా లక్ష అభ్యంతరాలను ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. సమావేశంలో నాయకులు పజ్జూరి గోపయ్య, ఆకుల వేణుగోపాల్రావు, మాశెట్టి వెంకన్న, ఆలేటి సిద్దిరాములు, బూడిద గోపి, నక్కల యాదవరెడ్డి, మంగళ్లపల్లి రాజు, మోకు కనకారెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, జక్కుల వేణుమాధవ్, మాజీద్, పిట్టల సురేష్, నవీ¯ŒS, నర్సింహులు, యాదగిఇర, మల్లేష్ తదితరులు ఉన్నారు. వినూత్న నిరసన ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి, జనగామను జిల్లా చేయాలని కోరుతూ ఓ యువకుడు శనివారం వినూత్నంగా నిరసన తెలిపాడు. పట్టణానికి చెందిన గండి నాగరాజు జనగామ జిల్లా కోసం జరుగుతున్న కట్రలను నిరసిస్తూ ఒంటి నిండా నల్లరంగుతో నిరసన తెలుపుతూ, అధికారికంగా విమోచనం కోసం జాతీయ జెండాతో పాటు బీజేపీ బ్యానర్ పట్టుకుని పట్టణంలోని పలు వార్డులో పర్యటించాడు. -
హామీలను విస్మరించిన ప్రభుత్వం
అర్వపల్లి : ఎన్నికల సమయంలో దళితులకు టీఆర్ఎస్ ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందని బీజేపీ దళితమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గోలి ప్రభాకర్ విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భూమిలేని దళితులకు ఒక్కో కుటుంబానికి మూడు ఎకరాలు ఉచితంగా ఇస్తామని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ రెండేళ్ల కాలంలో కేవలం 3వేల కుటుంబాలకు మాత్రమే భూమి పంపిణీ చేశారని చెప్పారు. రాష్ట్రంలో భూమిలేని దళితులు 2.91లక్షల కుటుంబాలు ఉన్నారని, అలాగే ఎకరంకన్న తక్కువ ఉన్న కుటుంబాలు 1.48లక్షల కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య వాగ్ధానాలు ఎప్పటికీ తీరవన్నారు. దళితులకు చేసిన హామీలను ప్రభుత్వం నెరవేర్చక పోతే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎ.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
సొంత ఊళ్లకు తర లుతున్న జనం...
-
పేలిన టపాసులు
-
ఉత్కంఠభరితంగా ఎన్నికలు
బడంగ్పేట నగర పంచాయతీ చైర్మన్గా సామ నర్సింహాగౌడ్, వైస్ చైర్మన్గా చిగురింత నర్సింహారెడ్డి పెద్దఅంబర్పేట్ చైర్పర్సన్గా ధనలక్ష్మి, వైస్ చైర్మన్గా సిద్ధంకి కృష్ణారెడ్డి సరూర్నగర్/పెద్ద అంబర్పేట్/ఆటోనగర్ : నగర శివార్లలోని బడంగ్పేట్, పెద్ద అంబర్పేట్ నగర పంచాయతీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగాయి. గురువారం అల్మాస్గూడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన బడంగ్పేట్ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికలో 20 మంది వార్డు సభ్యులతో పాటు, ఎక్స్ అఫీషియో హోదాలో మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కష్ణారెడ్డి పాల్గొన్నారు. మొదట ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి చక్రధర్రావు వార్డు సభ్యులతో పమాణ చేయించారు. అనంతరం చైర్మన్ ఎన్నిక జరిగింది. ఎనిమిదవ వార్డు సభ్యుడు సామ నర్సింహాగౌడ్ను ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నుకున్నారు. ఆ తరువాత వైస్ చైర్మన్ ఎన్నికలో కొద్ది సేపు ఉత్కంఠ నెలకొంది. ఎవరిని ఎన్నుకోవాలనే అంశంపై సభ్యులు తర్జనభర్జనలు పడ్డారు. కొద్దిసేపటికి చిగురింత నర్సింహారెడ్డి కాంగ్రెస్,టీడీపీ,స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో వైస్చైర్మన్గా ఎన్నికయ్యారు.అనంతరం చైర్మన్ నర్సింహాగౌడ్, వైస్చైర్మన్ నర్సింహారెడ్డిలు మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద అంబర్పేట్లో రసాభాస పెద్దఅంబర్పేట నగర పంచాయితీ చైర్ పర్సన్ ఎన్నిక ఏకగ్రీవంగానే జరిగినప్పటికీ వైస్ చైర్మన్ ఎన్నికలో రసాభాస చోటుచేసుకుంది. మొదటిసారిగా ఏర్పడ్డ పెద్దఅంబర్పేట నగర పంచాయతీకి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగాయి. ప్రిసైడింగ్ అధికారి యాదగిరిరెడ్డి, నగర పంచాయతీ కమిషనర్ కోట రాంరెడ్డిలు ఈ ఎన్నికలు నిర్వహించారు. తొలుత 20 మంది సభ్యులతో ప్రమాణం చేయించారు. అనంతరం తెలుగుదేశం, కాంగ్రెస్ సభ్యుల మద్దతుతో ఈదమ్మల ధనలక్ష్మిని చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తరువాత వైస్ చైర్మన్ పదవికి టీడీపీ నుంచి చామ సంపూర్ణారెడ్డి, కాంగ్రెస్ నుంచి సిద్ధంకి కృష్ణారెడ్డి పోటీకి దిగారు. తొమ్మిది మంది మద్దతుతోకృష్ణారెడ్డి గెలుపొందారు.