fly
-
స్పేస్లోకి వెళ్లిన అతి పిన్న వయస్కురాలిగా కర్సెన్ కిచెన్..!
ఇంతవరకు పలనా పర్యటన చేశామని గొప్పగా చెప్పుకునే వాళ్లుం. ఇక నుంచి స్పేస్గా వెళ్లమని గొప్పలు చెప్పుకుంటామేమో..!. ఇక ముందు అలాంటి రోజులే ఉంటాయేమో కాబోలు. ఈ జాబితాలో చేరిపోయింది 21 ఏళ్ల కర్సెన్ కిచెన్. 21 ఏళ్ల ఈ ఆస్ట్రానమీ స్టూడెంట్ ఇటీవలే బ్లూ ఆరిజిన్ సంస్థ నిర్వహించిన అంతరిక్ష యాత్రలో భాగమైంది. తద్వారా అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. ఈ స్పేస్ ఔత్సాహికురాలి ఎవరూ..? ఆ ఛాన్స్ ఎలా లభించింది తదితరాల గురించి తెలుసుకుందామా..!.చాపెల్ హిల్లోని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలో చదువుతున్న కర్సెన్ కిచెన్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్ అంతరిక్ష నౌకలో ప్రయాణించారు. ఆమెతో పాటు నాసా ప్రాయోజిత ఏరోస్పేస్ శాస్త్రవేత్తతో సహా మరో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. మొత్త ఆరుగురు సభ్యుల సిబ్బంది ఆగస్టు 29న స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:07 గంటలకు వెస్ట్ టెక్సాస్ సైట్ ఉప కక్ష్యలోకి దాదాపు 10 నిమిషాల తర్వాత ల్యాండ్ అయ్యారు. భూమి ఉపరితలాన్ని దాటి భార రహిత స్థితిలో సుమారు మూడు నిమిషాలకు పైగానే గడిపింది. తద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది కిచెన్.‘అంతరిక్షంలోకి వెళ్లాలన్న నా కల నెరవేరింది. రోదసీ నుంచి భూమి అందాల్ని చూసి ముగ్ధురాలినయ్యా. ఇంత అందమైన గ్రహంపై జీవించడం నా అదృష్టంగా ఫీలయ్యా. ఇలా ఇప్పటివరకు అంతరిక్షంలోకి వెళ్లిన వారిలో నేనే పిన్న వయస్కురాలిని కావడం మరింత ఆనందంగా ఉంది. ఈ యాత్రలో భాగంగా కొన్ని వేల మైళ్ల వేగంతో రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడం, అంతరిక్షంలో భార రహిత స్థితిలో తేలియాడడం, చీకటిగా ఉన్న ఆకాశం, అక్కడ్నుంచి నీలం రంగులో కనిపించే భూమి.. ఇలా ప్రతిదీ మర్చిపోలేని మధురానుభూతే!’ అంటూ తన అంతరిక్ష యాత్ర అనుభవాల్ని గూర్చి కళ్లకు కట్టినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇలా తన కుటుంబంలో స్పేస్లోకి వెళ్లోచ్చిన తొలి వ్యక్తి మాత్రం కాదు. ఎందుకంటే ఆమె తండ్రి కూడా అంతరిక్ష ఔత్సాహికుడే. అతను ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అంతరిక్షంపై ఆసక్తితో ఎప్పటికైనా స్పేస్ టూర్కి వెళ్లాలనుకున్నారాయన. ఆయనకు ఆ అవకాశం 2022లో వచ్చింది. ఆ సమయంలో బ్లూ ఆరిజిన్ సంస్థ చేపట్టిన ‘ఎన్ఎస్-20 మిషన్’లో రోదసీలోకి వెళ్లారాయన. ఇలా తన తండ్రి కల నెరవేరడంతో తానూ అంతరిక్ష యాత్ర చేయాలన్న ఆసక్తిని పెంచుకుంది కిచెన్. (చదవండి: ఆర్థరైటిస్తో బాధపడుతున్న సైనా నెహ్వాల్..క్రీడాకారులకే ఎందుకంటే..?) -
ఈగను చంపడంతో ..ఏకంగా కన్నేపోగొట్టుకున్నాడు..!
వర్షాకాలం, లేదా తీపి వంటకాల ఘుమఘమలకు ఈగలు ముసురుతుంటాయి. వాటితో సమస్య అంత ఇంత కాదు. ఈగల వల్లే పలు అనారోగ్య సమస్యలు వస్తుంటాయని మనందరికీ తెలిసిందే. వాటి నివారణ కోసం పలు క్రిమి సంహరక నివారణలు వాడుతుంటాం కూడా. అయినా ఎక్కడొక చోట ఒక్క ఈగ అయినా ఉంటూనే ఉంటుంది. ఉన్న ఒక్క ఈగ ఒక్కోసారి మన చుట్టూ తిరుగుతూ ముఖంపై వాలుతూ విసిగిస్తూ ఉంటుంది. చిర్రెత్తుకొస్తే చంపందేకు యత్నిస్తాం. ఇలానే ఓ వ్యక్తి చేసి ఏకంగా కంటినే పోగొట్టుకున్నాడు. ఎలాగంటే..వివరాల్లోకెళ్తే..చైనాలో ఈ దిగ్బ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. చైనాలోని గ్వాంగ్డాంగ్లోని దక్షిణ ప్రావిన్స్లోని షెన్జెన్లో నివశిస్తున్న వ్యక్తికి ఒకరోజు ఈగ అతడి చుట్టూ తిరుగుతూ సందడి చేస్తుంది. దీంతో విసుగొచ్చి దాన్ని చంపాడు. అంతే ఒక గంట తర్వాత ఎడమ కన్ను ఎర్రగా అయ్యి వాపు వచ్చేసింది. ఆ తర్వాత ఒకటే నొప్పిపుట్టడంతో తాళ్లలేక వైద్యులను సంప్రదించాడు. వైద్యులు మందుల ఇచ్చిన తర్వాత కూడా పరిస్థితి మెరుగవ్వకపోగ, పరిస్థితి మరింత దిగజారింది. వైద్య పరీక్షల్లో అతడికి కండ్లకలక వచ్చినట్లు నిర్థారణ అయ్యింది. అంతేగాదు అతడి కంటి చుట్టూ ఉన్న ప్రాంతం వ్రణాలు వచ్చి ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది. ఆ ఇన్ఫెక్షన్ కాస్త మెదడుకు వ్యాపించే అవకాశం ఉందని భావించి ఎడమ కనుబొమ్మను మొత్తం తొలగించారు. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..ఈగలాంటి కీటకాలు బాత్రూమ్లు, బాత్టబ్లు, సింక్లు, కిచెన్లలో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తడిప్రదేశాల్లో కనిపిస్తాయి. ఈ కీటకాలు కళ్ల దగ్గరే తచ్చాడుతున్నప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. దాని వద్దకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. బదులుగా అది తాకిన ప్రాంతాన్ని పరిశుభ్రమైన నీరు లేదా సెలైన్ ద్రావణంతో కడగాలని అన్నారు. ప్రస్తుతం ఈ ఘటన చైనా ప్రజలందర్నీ కలవరపాటుకి గురిచేసింది. ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఇది చాలా భయనకంగా ఉంది. తాము కూడా తరుచు బాత్రూంలలో ఇలాంటివి చూస్తామని, దేవుడు దయ వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: అనంత్ పెళ్లిలో హైలెట్గా ఏనుగు ఆకారపు డైమండ్ బ్రూచ్..ఆ డిజైన్లోనే ఎందుకంటే..!) -
తెగిన గాలిపటం జీవిత భాగస్వామిని చేరుతుందట!
నేడు ఫిబ్రవరి 14.. ఒకవైపు వసంత పంచమి. మరోవైపు ప్రేమికుల రోజు. ఉత్తరప్రదేశ్లో వాలెంట్సైన్స్ డే సందర్భంగా గాలిపటాలు ఎగురవేస్తుంటారు. పతంగులను ఎగురవేయడం ద్వారా తమ ప్రేమను చాటుతున్నామని యూపీలోని మీరఠ్కు చెందిన యువత చెబుతోంది. యువతీ యువకులు తాము గాలిపటం ఎగురవేసినప్పుడు దాని దారం తెగితే.. అది నేరుగా వారి జీవిత భాగస్వాముల దగ్గరికి చేరుతుందని అంటుంటారు. మీరఠ్లో వాలెంటైన్స్డే సందర్భంగా ఆకాశమంతా గాలిపటాలతో నిండిపోయింది. ఈసారి ప్రత్యేకమైన గాలిపటాలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా గుండె ఆకారంలోని గాలిపటాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. కొన్ని గాలిపటాలలో అబ్బాయి, అమ్మాయిల రూపురేఖలు చిత్రీకరించారు. వాటి మధ్యలో హృదయాకారాన్ని తీర్చిదిద్దారు. -
నిజంగా ఇది వింతే మరి.. పెద్దాయన పెద్ద పేగులో ఈగ..
వాషింగ్టన్: మానవునిలో పెద్ద పేగు దాకా ఏదైనా ఆహారం వెళ్లి దంటే అప్పటికే అది జీర్ణమైందని అర్ధం. అయితే అమెరికాలో ఓ పెద్దాయన పెద్దపేగులో ఒక ఈగ చిధ్రమవకుండా చక్కగా ఉంది. జీర్ణావస్థలోకాకుండా పేగు గోడలకు అతుక్కుని ఉన్న ఈగను చూసి అక్కడి వైద్యులు అవాక్క య్యారు. జీర్ణాశయం, చిన్నపేగును దాటి కూడా ఈ కీటకం ఎలా జీర్ణమవకుండా ఉందబ్బా? అని వైద్యులు పలు విశ్లేషణలు మొదలుపెట్టారు. అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో ఈ వింత ఘటన జరిగింది. ‘ది అమెరికన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటెరాలజీ’లో సంబంధిత వివరాలతో కథనం వెలువడింది. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా 63 ఏళ్ల పెద్దాయన ఆస్పత్రికి రాగా ఆయనకు వైద్యులు కొలొనోస్కోపీ చేశారు. అందులో ఈ విషయం వెల్లడైంది. ‘‘ కొలొనోస్కోపీకి ముందు ఘన పదార్థాలు ఏవీ నేను తీసుకోలేదు. రెండు రోజుల క్రితం మాత్రం పిజ్జా, తోటకూర తిన్నాను. అసలది ఎలా లోపలికెళ్లిందో నాకైతే తెలీదు’’ అని ఆ పెద్దాయన తాపీగా చెప్పారు. ‘‘తిన్న వాటిని జీర్ణరసాలు, పొట్టలోని ఆమ్లాలు జీర్ణం చేస్తాయి. అయినాసరే ఈగ అలాగే ఉందంటే ఆశ్చర్యమే. అయితే ఇది ఇంటెస్టినల్ మయాసిస్ అయి ఉండొచ్చు. ఈగ గుడ్లు లేదా లార్వా ఉన్న ఆహారం తిని ఉండొచ్చు. అవి లోపలికెళ్లి జీర్ణమయ్యాక కూడా జీర్ణవ్యవస్థలోని అసాధారణ వాతావరణాన్ని తట్టుకుని ఒకే ఒక్క లార్వా ఇలా ఈగగా రూపాంతరం చెంది ఉంటుంది’’ అని మిస్సోరీ విశ్వవిద్యాలయంలో గ్యాస్ట్రోఎంటెరాలజీ విభాగ సారథ మ్యాథ్యూ బెక్టోల్డ్ విశ్లేషించారు. ‘ఇలాంటి సందర్భాల్లోనూ వ్యక్తికి విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి ఉంటాయి. అయినా సరే ఈయనకు అవేం లేవంటే నిజంగా ఇది వింతే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. చనిపోయిన ఆ ఈగను కొలొనోస్కోపీ ద్వారా ఎట్టకేలకు బయటకు తీశారు. ఇంత జరిగినా పెద్దాయన ఆరోగ్యంగా ఉండటం విశేషం. చదవండి: మంచు‘మాయం’ -
ఈగలతో ప్రొటీన్ల సేద్యం!
సేంద్రియ వ్యర్థాలను ఆహారంగా తిని పెరిగే బ్లాక్ సోల్జర్ ఫ్లై (బిఎస్ఎఫ్) పిల్ల పురుగు(లార్వా)లు కోళ్లతో పాటు చేపలు, రొయ్యలకు మంచి ప్రొటీన్లతో కూడిన మేతగా ఉపయోగపడుతున్నాయి. విదేశాల్లో విస్తారంగా జరుగుతున్న బిఎస్ఎఫ్ లార్వా సాగు ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ వ్యాపిస్తోంది. కుళ్లిన పండ్లు, కూరగాయలు, వంటింట్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలతో పాటు పశువుల పేడ, కోళ్లు, మేకలు, పందుల విసర్జితాలను తిని ఈ పిల్ల పురుగులు దాదాపు నెల రోజుల్లోనే పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. బిఎస్ఎఫ్పై పరిశోధనలు మన దేశంలో శైశవ దశలో ఉన్నాయి. ఐసిఎఆర్ గ్రాంటుతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం(పిజెటిఎస్ఎయు) ఏడాది క్రితమే వేస్ట్2వెల్త్ ప్రాజెక్టులో భాగంగా దీనిపై పరిశోధనలు చేపట్టింది. అంతేకాదు, శాస్త్రవేత్తలు, ఎంటర్ప్రెన్యూర్లు, రైతుల శిక్షణకు ఇటీవలే శ్రీకారం చుట్టింది. ఇన్నోవేటివ్ ఇన్సెక్ట్ ఫార్మింగ్ వివరాలతో ఆసక్తికర కథనం... ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయిన శాకాహార, మాంసాహారోత్పత్తుల్లో 60% మాత్రమే వినియోగమవుతోంది. పొలంలో 8%, మార్కెట్కు వెళ్లే దారిలో 14%, రిటైల్ అమ్మకందారుల వద్ద 7%, ఇళ్లలో వినియోగానికి ముందు 11% మేరకు ఆహారం వృథా అవుతోంది. 2021 యుఎన్ఇపి ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ ప్రకారం మన దేశంలో ఏటా 6.88 కోట్ల టన్నుల ఆహార వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఈ సేంద్రియ వ్యర్థాలను చెత్తకుప్పల్లో వేసే కంటే పునర్వినియోగించి ప్రయోజనం పొందటం తెలివైన పని. ఈ పనిని ఇతర పురుగుల కన్నా బ్లాక్ సోల్జర్ ఈగలు (బిఎస్ఎఫ్) సమర్థవంతంగా చేయగలవన్నది నిపుణుల మాట. పురుగుల సేద్యం చాలా వినూత్నమైనది, పర్యావరణ హితమైనది, ఆదాయాన్ని అందించేది కూడా. మన దేశంలో కొందరు వ్యాపారవేత్తలు, కోళ్ల రైతులు బ్లాక్ సోల్జర్ ఫ్లై (బిఎస్ఎఫ్) పిల్ల పురుగుల(లార్వా) ను సాగు చేయటం ఇటీవల ప్రారంభించారు. బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల ఉత్పతి కాలం వాటికి వేసే ఆహారాన్ని బట్టి మారుతుంది. ఒక బ్యాచ్ 20 రోజుల నుంచి 40 రోజుల వరకు పడుతుంది. ఆహారం మెత్తగా, త్వరగా జీర్ణించుకునే విధంగా ఉండి ప్రొటీన్లతో కూడి ఉన్నప్పుడు తక్కువ రోజుల్లోనే పురుగులు పెరుగుతాయి. లేయర్ కోళ్ల ఫారాల్లో ఇనుప కేజ్ల కింద పోగుపడే కోళ్ల పెంటపై బిఎస్ఎఫ్ ఈగల 5 రోజుల పిల్లలను వదిలితే చాలు.. ఆ వ్యర్థాలనే ఆహారంగా తింటూ 25–30 రోజుల్లోనే పిల్ల పురుగులు వృద్ధి చెందుతాయి. బిఎస్ఎఫ్ పెంపకం ద్వారా సేంద్రియ వ్యర్థాల పరిమాణాన్ని 15–25 రోజుల్లో 70–80% మేరకు కుదించవచ్చు. అందువల్లనే నగరాలు, పట్టణాల్లో పోగుపడే సేంద్రియ వ్యర్థాల సమర్థవంతమైన నిర్వహణకు ఇవి ఉపయోగపడుతున్నాయని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) చెబుతోంది. బిఎస్ఎఫ్ లార్వా(పిల్ల పురుగులు) బరువులో 40–45% వరకు ప్రొటీన్లు ఉన్నాయి. అందువల్ల కోళ్ల మేతలో, ఆక్వా మేతల తయారీలో సోయా చిక్కుళ్లు, ఫిష్ మీల్తో పాటుగా 10 శాతం వరకు బిఎస్ఎఫ్ పురుగుల పొడిని కలుపుతున్నారు. బతికి ఉన్న పిల్ల పురుగుల (వెట్ లార్వా)ను కోళ్లకు నేరుగా మేతగా వేస్తున్నారు. రోజువారీ మేతలో పది శాతం వరకు ఈ పిల్ల పురుగులను అందిస్తూ సత్ఫలితాలు పొందుతున్న కోళ్ల ఫారాలు తెలుగునాట ఇప్పటికే అనేకం ఉన్నాయి. పిజెటిఎస్ఎయులో పైలెట్ ప్రాజెక్టు అయితే, మన దేశంలో దీనిపై పరిశోధనలు ఇంకా శైశవ దశలోనే ఉన్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పిజెటిఎస్ఎయు) ఈ దిశగా ముందడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటిగా బిఎస్ఎఫ్ పెంపకంపై పరిశోధన చేపట్టింది. నేషనల్ అగ్రికల్చర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ‘వేస్ట్2వెల్త్’ ప్రాజెక్టును మంజూరు పిజెటిఎస్ఎయుకు గత ఏడాది చేసింది. పిజెటిఎస్ఎయు పీజీ స్టడీస్ డీన్, కీటక శాస్త్ర ఆచార్యులు డా. వి. అనిత ఈ ప్రాజెక్టుకు నోడల్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాజేంద్రనగర్లోని వర్సిటీ ఆవరణలో బ్లాక్ సోల్జర్ ఫ్లైల పెంపకం కమ్ శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పారు. కూరగాయలు, పండ్ల వ్యర్థాలు, మెస్లో మిగిలిన అన్నం, గోధుమ తవుడు మిశ్రమంతో బిఎస్ఎఫ్ పిల్ల పురుగులు పెంచుతున్నారు. పరిశోధక విద్యార్థులు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో, కృషి విజ్ఞాన కేంద్రాల్లోని శాస్త్రవేత్తల మొదటి బ్యాచ్కు డా. అనిత ఇటీవలే శిక్షణ ఇచ్చారు. ఎంటర్ప్రెన్యూర్లు, రైతులకు కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు డా. అనిత ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. నగరాలు, పట్టణాల్లో వెలువడే సేంద్రియ ఆహార వ్యర్థాల కాలుష్యాన్ని తగ్గించడానికి, పనిలో పనిగా మంచి ప్రొటీన్ను అందుబాటులోకి తెచ్చుకోవడానికి బిఎస్ఎఫ్ లార్వాల పెంపకం ఉపయోగకరం. అన్నిటికీ మించి, సేంద్రియ వ్యర్థాల పరిమాణాన్ని 15–25 రోజుల్లోనే 70–80% మేరకు తగ్గించేంత ఆబగా తినగల శక్తి బిఎస్ఎఫ్ జాతికి వుంది. బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల పెంపకానికి మన దేశపు వాతావరణం చాలా అనువైనదంటున్నారు డా.అనిత. ఎంటర్ప్రెన్యూర్లకు, రైతులకు శిక్షణ ఇస్తున్నాం! బ్లాక్ సోల్జర్ ఈగలు మనకు కొత్తవి కావు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 20వ శతాబ్దం నుంచి ఉన్నదే ఈ జాతి. కొత్త తెగుళ్లు వ్యాప్తి చెందుతాయన్న భయం లేదు. ఆహార వ్యర్థాలు, పశువుల విసర్జితాలను సాధ్యమైనంత మెత్తగా చేసి, సులభంగా జీర్ణించుకునేలా మార్చి ఈ పురుగులకు వేయాలి. అందులో ప్రొటీన్లు ఉండాలి. చిన్న పిల్లల ఆహారం లాగా ఉండాలి. కూరగాయలు, పండ్ల వ్యర్థాలను సేకరించి, మెత్తగా రుబ్బి.. దానితో పాటు మెస్లో మిగిలిపోయిన అన్నం, గోధుమ తవుడు కొంచెం కలిపి మా ప్రయోగశాలలో బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను పెంచుతున్నాం. వాటికి వేసే ఆహారాన్ని బట్టి, దానిలో పోషక విలువలను బట్టి, వాతావరణంలో వేడి, గాలిలో తేమను బట్టి.. అవి ఎన్ని రోజుల్లో, ఎంత బరువు పెరుగుతాయన్న విషయం ఆధారపడి ఉంటుంది. సేంద్రియ వ్యర్థాలను సమర్థవంతంగా నాణ్యమైన సేంద్రియ ఎరువుగా మార్చుకునే మార్గం ఇది. పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. మంచి ఆదాయమూ సమకూరుతుంది. రైతులకు, ఎంటర్ప్రెన్యూర్లకు శిక్షణ ఇస్తున్నాం. సేంద్రియ వ్యర్థాలను తినే అనేక జీవులుండగా బ్లాక్ సోల్జర్ ఫ్లైలనే ఎందుకు ఎంపిక చేసినట్లు? ఇదే ప్రశ్న డా. అనితను అడిగితే ఇలా బదులిచ్చారు... రోజుకు తన బరువుకు రెట్టింపు సేంద్రియ వ్యర్థాలను తిని, సేంద్రియ ఎరువును విసర్జించగల శక్తి బిఎస్ఎఫ్ పిల్ల పురుగులకు ఉంది. దీని అర్థం ఏమిటంటే.. చెత్త కుప్పలకు తరలివెళ్లే సేంద్రియ వ్యర్థాలు తగ్గిపోతాయి. మిథేన్ ఉద్గారాలు ఆ మేరకు తగ్గుతాయి. కుళ్లిన పండ్లు/కూరగాయలు,హోటళ్లు/ఇళ్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాలతో పాటు పశువుల పేడ, కోళ్లు, మేకలు, పందుల విసర్జితాలు వంటి సేంద్రియ వ్యర్థాలను బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల పెంపకానికి వాడొచ్చు. బిఎస్ఎఫ్ జీవిత చక్రం మొత్తం 42–55 రోజులు. గుడ్లు పెట్టిన 4–5 రోజులకు పిగులుతాయి. అవి 15–25 రోజుల్లో పిల్ల పురుగులా(లార్వా)గా ఎదుగుతాయి. ఈ దశలోనే వాటిని సేకరించి కోళ్లు, ఆక్వా మేతల్లో వాడుతున్నారు. అలాగే ఉంచితే, ప్యూపాగా రూపాంతరం చెంది, 17 రోజుల తర్వాత బ్లాక్ సోల్జర్ ఈగలు పుడతాయి. మగ ఈగ 4 రోజుల్లో ఆడ ఈగను కలిసిన తర్వాత చనిపోతుంది. ఆడ ఈగ 5–8 రోజుల్లో గుడ్లు పెట్టి చనిపోతుంది. గుడ్లను సేకరించి, అతి చిన్న పురుగులను తయారు చేయట కొంచెం క్లిష్టమైన ప్రక్రియ. 5 రోజుల పిల్లలకు తగిన సేంద్రియ ఆహారం అందిస్తే 15–25 రోజుల్లో పిల్ల పురుగులు(లార్వా)గా పెరుగుతాయి. ఆ దశలో చక్కని ప్రొటీన్లతో కూడిన ఆ పిల్ల పురుగులు కోళ్లు, చేపలు, రొయ్యలకు మేతగా వాడుకోవచ్చు. 5 రోజుల పిల్లలను కొనుక్కొని రైతులు 15–25 రోజుల్లో బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను లార్వా దశకు పెంచి, కోళ్లకు, చేపలు, రొయ్యలకు మేతగా వేసుకోవచ్చు లేదా కొనుగోలుదారులకు అమ్ముకోవచ్చు. స్వయం ఉపాధిగా యువకులు బిఎస్ఎఫ్ లార్వా సాగు చేపట్టవచ్చు. ఈ లార్వాను దాణా తయారీ కంపెనీలు, సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. లార్వా దశ దాటి ప్యూపా దశకు పెరిగితే దాణాల్లో వాడకానికి పనికిరాదు. సోయా చిక్కుళ్ల సాగులో సమస్యలు, సముద్రాల్లో చేపల సంతతి తగ్గిపోతుండటం వల్ల కోళ్లు, ఆక్వా మేతలతో పాటు, పెంపకపు కుక్కల మేతల్లో కూడా బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను ప్రొటీన్ సప్లిమెంట్గా ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. దీంతో బిఎస్ఎఫ్ లార్వా సాగుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ పిల్ల పురుగులే అధిక నాణ్యత గల ప్రొటీన్లతో కూడిన దాణాకు ముడి పదార్థం. కోళ్లు, చేపలు, రొయ్యలు, పందులు, పెంపుడు కుక్కలకు వేసే మేతలో బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల పొడిని కలపవచ్చు. పిల్ల పురుగుల బరువులో 40–45% ప్రొటీన్తో పాటు ఎసెన్షియల్ అమినో యాసిడ్లు ఉంటాయి. సాధారణంగా మేతల్లో ప్రొటీన్లుగా వాడే సోయా చిక్కుడు గింజలు, ఫిష్మీల్ను కొంత తగ్గించి దీన్ని వాడుతున్నారు. కోళ్లకు రోజువారీ మేతలో పది శాతం మేరకు దీన్ని వాడుతున్నారు. పిల్ల పురుగులను బతికి ఉన్నప్పుడే ఫారం కోళ్లకు మేపవచ్చు. నాటు కోళ్లకూ ఇది మంచి ఆహారం. బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల పెంపకం క్రమంలో వెలువడే విసర్జితాలే(ఫ్రాస్) పంటలకు అత్యంత విలువైన సేంద్రియ ఎరువుగా పనికి వస్తుంది. వర్మీకంపోస్టు, పశువుల ఎరువుల్లో కంటే అధిక పోషక విలువలు ఇందులో ఉంటాయని చెబుతున్నారు. విదేశాల్లో బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల పొడిని బర్గర్లు, షేక్లలో కలుపుతున్నారు. దీని నుంచి వెలికితీసే నూనెను బయో ఇంధనంగా వాహనాలు, జనరేటర్లలో వాడుతున్నారు. బిఎస్ఎఫ్ లార్వా నుంచి వెలువడే పొలుసులు(కూటిన్) బయోడీగ్రేడబుల్ ప్యాకేజింగ్ ప్లాస్టిక్ తయారీకి వాడుతున్నారు. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలున్నందున వైద్య అవసరాలకు కూడా వినియోగిస్తున్నారు. వర్షాకాలంలో దీపం చుట్టూ చేరే ఉసుళ్లను వేపుకొని శనగపప్పుతో కలుపుకొని తినే అలవాటు మన దేశంలోనూ ఉంది. బిఎస్ఎఫ్తో పాటు మిడతలు, మీల్ వార్మ్స్, గొల్లభామలు, వంటి 1,900 జాతుల పురుగులను 113 దేశాల్లో 200 కోట్ల మంది తింటున్నారని ఎఫ్ఎఓ చెబుతోంది. --పతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: అంతరించిపోయే స్టేజ్లో అరటిపళ్లు!..శాస్త్రవేత్తలు స్ట్రాంగ్ వార్నింగ్) -
పాకిస్థాన్కు పంపండి.. ప్రియుని కోసం బాలిక బిగ్ స్కెచ్..! ఆ తర్వాత..
జైపూర్: పాకిస్థాన్కి పంపించండి అంటూ వచ్చిన ఓ మైనర్ బాలిక జైపూర్ ఎయిర్పోర్టులో అధికారులను షాక్కు గురిచేసింది. పాక్లో ఉన్న తమ ప్రియున్ని కలవడానికి వెళ్తున్నట్లు బాలిక చెప్పుకొచ్చింది. ఎలాంటి పాస్పోర్టు, వీసాగానీ లేకుండానే ఎయిర్పోర్టుకు వచ్చిన బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మూడేళ్ల క్రితమే వచ్చా.. ఎయిర్పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన బాలిక పాకిస్థాన్కు టిక్కెట్టు అడిగింది. అనుమానంతో విచారించగా.. మూడేళ్ల క్రితమే ఇస్లామాబాద్ నుంచి భారత్కు వచ్చినట్లు కట్టుకథను చెప్పింది. తన ఆంటీతో పాటే వచ్చినట్లు పేర్కొంది. ప్రస్తుతం వారితో సఖ్యతలేదని తెలిపిన బాలిక.. మళ్లీ పాకిస్థాన్కు వెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పింది. కానీ దర్యాప్తులో తేలిన విషయాలు చూసి అధికారులు షాక్కు గురయ్యారు. ఎయిర్పోర్టులో మైనర్ బాలికను అదుపులోకి తీసుకున్నాం. తన ప్రియున్ని కలవడానికి లాహోర్కు వెళ్లాలని చెప్పింది. ఎయిర్పోర్టులోని టిక్కెట్ కౌంటర్ వద్దకు వచ్చి పాకిస్థాన్కు టిక్కెట్టు ఇవ్వమని అడిగినప్పుడు అందరం షాక్గు గురయ్యాం. బాలిక మొదట జోక్ చేస్తోందని టికెట్ మాస్టర్, సెక్యూరిటీ అధికారులు అనుకున్నారు. కానీ అది నిజమని తెలిసి ఆశ్చర్యపోయాం.' అని అధికారులు తెలిపారు. ప్లాన్ ఇచ్చింది ఆయనే.. పాకిస్థాన్లో ఉన్న బాలుడు కొన్ని విషయాలు తెలిపినట్లు బాలిక దర్యాప్తులో అధికారులకు చెప్పింది. పాకిస్థాన్కు రావడానికి పాటించాల్సిన నియమాలను ఆ బాలుడు చెప్పినట్లు తెలిపింది. అధికారులతో మాట్లడేప్పుడు కొన్ని విషయాలు మైండ్లో పెట్టుకోవాలని ఆ బాలుడే తెలిపినట్లు వెల్లడించింది. అందుకు భాగంగానే ఆ కట్టుకథను అధికారులకు చెప్పినట్లు పేర్కొంది. కానీ దర్యాప్తులో బాలిక స్థానికంగా రాజస్థాన్లోని సికార్ జిల్లాలోని రత్నపుర గ్రామానికి చెందినదని అధికారులు గుర్తించారు. చివరికి తల్లిదండ్రులను పిలిచి వారి ముందే మళ్లీ ప్రశ్నించగా.. అందరూ గుర్తించాలని ఇలా చేశానని బాలిక చెప్పుకొచ్చింది. దీంతో తల్లిదండ్రులతో పాటే బాలికను ఇంటికి పంపించారు. ఇదీ చదవండి: కేరళ గవర్నర్ కాన్వాయ్లోకి దూసుకొచ్చిన కారు.. -
గాల్లో పక్షిలా చక్కర్లు కొడుతున్న కోడి.. వైరల్ వీడియో
కోడి అంటే అందరికి టక్కున గుర్తొచ్చేది కోడి పందేలు. లేదా మంచిగా మసాలా దట్టించి చికెన్ వండుకొని లాగించేయడమే. అయితే తాజాగా ఓ కోడికి వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. సాధారణంగా కోడి నేల మీద తిరుగుతూ ఉంటుందని అందరికి తెలిసిందే. వాటికి రెక్కలు ఉన్నా తక్కువ ఎత్తులో తక్కువ సమయం వరకు ఎగురుతాయి. రెక్కలతో ఎక్కువసేపు ఎగరలేవు. కానీ ఇప్పుడు చెప్పబోయే కోడి నేల మీదే కాకుండా గాల్లో పక్షిలా తెగ చక్కర్లు కొడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 52 సెకన్ల నిడివి గల ఈ వీడియోను బ్యూటెంగేబిడెన్ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ‘కోడి ఇంత దూరం విహరిస్తుంది అని నేనెప్పుడూ అనుకోలేదు’ అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ మంచు ప్రాంతంలో కోడి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగరడం కనిపిస్తోంది. చదవండి: భయానకం: మత్స్యకారుడిని వెంటాడిన వింత జీవి.. వీడియో వైరల్ దాదాపు 40 సెకన్లపాటు వందల మీటర్ల వరకూ గాల్లోనే ఎగురుతూ తిరుగుతోంది. చివరికి ఓ చోట ల్యాండ్ అయ్యింది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూవ్స్, వేలల్లో లైక్స్ వచ్చి చేరుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్లు అసులు ఇది నిజంగా కోడేనా, లేక కోడిలా కనిపిస్తోన్న వేరే జాతి పక్షా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బుసలు కొడుతూ పైకి లేచిన 14 అడుగుల కింగ్ కోబ్రా.. Never knew a chicken could fly that far.. pic.twitter.com/JU9IwfWxu6 — Buitengebieden (@buitengebieden_) January 29, 2022 -
పండు ఈగకు ‘వలపు వల!’
సాక్షి, అమరావతి బ్యూరో: పులిని బంధించడానికి బోను ఏర్పాటు చేస్తారు. అందులో మాంసాన్ని ఎరగా వేస్తారు. ఆ మాంసాన్ని తినడానికి వచ్చిన పులి బోనులో చిక్కుతుంది. ఇప్పుడు మామిడిని దెబ్బతీస్తున్న పండు ఈగల నియంత్రణకు సరికొత్త ఎరను ప్రయోగిస్తున్నారు. ఈ ఎరతో రైతులు సత్ఫలితాలు పొందుతున్నారు. ఏమిటా ఎర? ఏమా కథ? మామిడికాయ పక్వానికి వచ్చాక లోపలికి పండు ఈగ ప్రవేశిస్తుంది. లోపల తల్లి ఈగ పిల్లలను పెట్టి కాయ పండాక రసాన్ని పీల్చేస్తుంది. ఇలాంటి కాయల కొనుగోలుకు వ్యాపారులు, ఎగుమతిదార్లు ముందుకురాక రైతులు నష్టపోతున్నారు. కోతకొచ్చే దశలో సగటున నాలుగో వంతు మామిడిని ఈ పండు ఈగ దెబ్బతీస్తోంది. ఏళ్ల తరబడి వేధిస్తున్న ఈ సమస్యపై డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని నూజివీడు మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ‘ఫ్రూట్ ఫ్లై లూర్’ పేరిట ఓ ఎరను అందుబాటులోకి తెచ్చారు. ఆడ ఈగ సంపర్కానికి సన్నద్ధమయ్యే సమయంలో ఒక రకమైన వాసన విడుదల చేస్తుంది. ఆ వాసనకు ఆకర్షించిన మగ ఈగ.. ఆడ ఈగ వెంటపడుతుంది. క్రిమిసంహారకమందు, రసాయనాలతో రూపొందించిన ఈ లూర్ ఆడ ఈగ సంపర్కానికి ముందు విడుదల చేసే వాసనను పోలి ఉంటుంది. ఈ లూర్ (ఎర)ను ఒక ట్రాప్ బాక్సులో ఉంచి మామిడి చెట్టుకు కడతారు. ఆ బాక్సులో ఆడ ఈగలున్నాయని భ్రమించి మగ పండు ఈగలు ట్రాప్ బాక్సులోకి వెళ్లి ఆ క్రిమిసంహారక ద్రవంలో చిక్కుకుని చనిపోతాయి. సహజంగా ఆడ పండు ఈగలకంటే మగ ఈగల సంతతే అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని శాస్త్రవేత్తలు సంతాన ఉత్పత్తికి కారణమయ్యే మగ పండు ఈగలను నియంత్రించేందుకు ఈ లూర్ను గత మార్చి నెల నుంచి విస్తృతంగా అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పదివేల లూర్లను ఉద్యానశాఖ ద్వారా పంపిణీ చేశారు. ఒకసారి ట్రాప్ బాక్స్లో వేసిన లూర్ నెలరోజుల పాటు ప్రభావం చూపుతుంది. ఇక ఆడ పండు ఈగల నియంత్రణకు కూడా ఈ శాస్త్రవేత్తలు మరో ద్రావణాన్ని సూచిస్తున్నారు. పులిసిన కల్లు, బెల్లం, మలాథియాన్తో తయారు చేసిన ద్రావణాన్ని మామిడి తోటలో ఉంచితే ఆడ పండు ఈగలు దాన్ని ఆకర్షించి చనిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ధర కూడా స్వల్పమే.. ఇక ఈ లూర్ ధర కూడా రైతుకు అందుబాటులోనే ఉంది. లూర్ రూ.40, ట్రాప్ బాక్స్ రూ.100 చొప్పున రైతులకు అందజేస్తున్నారు. ఒక ఎకరం తోటకు నాలుగైదు ఏర్పాటు చేస్తే సరిపోతుంది. ఇలా ఒక ఎకరం మామిడి తోటకు వీటి ఖర్చు గరిష్టంగా రూ.700కు మించదు. ఎకరం తోటలో సగటున 4 టన్నుల దిగుబడి వస్తుంది. ఇందులో కనీసం ఒక టన్ను పండు ఈగ బారిన పడుతుంది. అంటే రైతుకు ఎకరానికి దాదాపు రూ.10 వేలు నష్టం వాటిల్లుతుంది. లూర్కు రూ.700 వెచ్చిస్తే రైతుకు కనీసం రూ.9 వేలు ఆదా అవుతుంది. రాష్ట్రంలో 3.74 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మామిడి ఉంది. ఏటా 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. ఇందులో కనీసం 10 లక్షల టన్నుల మామిడిని పండు ఈగ దెబ్బతీస్తోందని అంచనా. ఇలా ఏటా రాష్ట్రంలో పండు ఈగ సుమారు రూ.1,000 కోట్ల విలువైన మామిడి పంటను నాశనం చేస్తోంది. పండు ఈగతో ఏటా నష్టపోతున్న రైతు ఈ స్వల్ప ఖర్చుతో నివారణ మార్గం లభించడంతో లూర్పై ఆసక్తి పెంచుకుంటున్నారని నూజివీడు ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు ‘సాక్షి’కి చెప్పారు. రైతులకు అవగాహన కల్పిస్తున్నాం పండు ఈగతో నష్టపోకుండా అందుబాటులోకి తెచ్చిన ఫ్రూట్ ఫ్లై లూర్పై మామిడి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ ఈగ బారిన పడ్డ మామిడిని ఎగుమతిదార్లు తీసుకోక ఆశించినంతగా ఎగుమతులు జరగడం లేదు. ఎగుమతులు పెంచడంతోపాటు రైతులకు పండు ఈగ బెడద తగ్గించే ఉద్దేశంతో ఫ్రూట్ ఫ్లై లూర్ను విస్తృతం చేస్తున్నాం. ఈ ఏడాది తొలిసారిగా రాష్ట్రంలో 10 వేలకు పైగా లూర్లను అందించాం. – బీకేఎం లక్ష్మి, సీనియర్ సైంటిస్ట్, హెడ్, మామిడి పరిశోధన స్థానం, నూజివీడు లూర్తో సత్ఫలితాలు.. ఏళ్ల తరబడి పండు ఈగ బెడదను ఎదుర్కొంటున్నాం. ఏటా నాలుగో వంతు పంటను పండు ఈగ దెబ్బతీస్తోంది. ఇన్నాళ్లు వీటి నివారణకు మంటలు వేయడం, టైర్లు కాల్చడం వంటివి చేసేవాళ్లం. అయినా ఆశించిన ఫలితం ఉండేది కాదు. ఇప్పుడు లూర్తో పండు ఈగల నివారణ సాధ్యమవుతోంది. నేను 5 ఎకరాల్లో 30 ఫ్రూట్ ఫ్లై లూర్లను ఏర్పాటు చేశాను. సత్ఫలితాలివ్వడంతో పండు ఈగ బెడద తప్పింది. – చెలికాని మురళీకృష్ణారావు, రైతు, కోటపాడు, కృష్ణాజిల్లా చదవండి: ఏపీ: 400 మంది ప్రాణాలను కాపాడిన పోలీసులు ఏలూరు: కార్పొరేషన్ ఎలక్షన్ కౌంటింగ్కు హైకోర్టు అనుమతి -
ఈగను చంపబోయి.. ఇంటిని తగలబెట్టాడు
పారిస్: ఈగ చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది. కానీ పగబడితే ఎలా ఉంటుందో.. ఎంత విధ్వంసం చేస్తుందో దర్శక ధీరుడు జక్కన్న తన ఈగ చిత్రంలో బ్రహ్మండంగా చూపించాడు. ఈ సినిమాలో విలన్ ఈగను చంపడానికి ప్రయత్నించి ఏకంగా ఇంటిని తగలబెట్టుకోవడమే కాక.. తాను చస్తాడు. అయితే ఇదంతా రీల్లో. కానీ రియల్గా కూడా ఇదే సన్నివేశం రిపీట్ అయ్యింది. అయితే అది మన దగ్గర కాదు.. ఫ్రాన్స్లో. ఈగను చంపడానికి ప్రయత్నించి ఇంటినే తగలబెట్టుకున్నాడు ఓ వృద్ధుడు. ఈ సంఘటన గత శుక్రవారం పార్కుల్-చెనాడ్ అనే గ్రామంలో జరగింది. స్థానిక పత్రిక కథనం ప్రకారం.. 80 ఏళ్ల వృద్ధుడు రాత్రి భోజనం చేద్దామని కూర్చున్నాడు. ఇంతలో ఓ ఈగ గుయ్మని ఆయనని విసిగించడం ప్రారంభించింది. ఆగ్రహం పట్టలేక ఈగని చంపడం కోసం ఎలక్ట్రిక్ రాకెట్ను ఉపయోగించాడు. అయితే అప్పటికి అతని ఇంట్లో గ్యాస్ లీకవ్వడం ప్రారంభమయ్యింది. అది గమనించని వృద్ధుడు ఈగని చంపడం కోసం ఎలక్ట్రిక్ రాకెట్ని ఉపయోగించడం.. ఈగ తప్పించుకోవడం.. వంట గదిలో పేలుడు సంభవించడం అన్ని ఏకకాలంలో జరిగిపోయాయి. దాంతో అతడి ఇంటి పై కప్పు పాక్షికంగా దెబ్బతిన్నది. అయితే ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. 2018 లో, కాలిఫోర్నియాలోని ఒక వ్యక్తి కొన్ని సాలెపురుగులను కాల్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తల్లిదండ్రుల ఇంటికి నిప్పంటించాడు. అదే సంవత్సరంలో, బొద్దింకలను కాల్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక ఆస్ట్రేలియన్ తన ఇంటిని పేల్చేశాడు. -
స్పెషల్ మిషన్తో చోక్సీకి చెక్?
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకింగ్ రంగంలో సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కుంభకోణంలో ప్రధాన నిందితులైన వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీని స్వదేశానికి రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా ఒక ప్రత్యేక మిషన్ ద్వారా గీతాంజలి గ్రూపు అధినేత మెహుల్ చోక్సీని భారత్కు రప్పించే పనిలో ఉన్నాయి. ఇందుకోసం ఎయిర్ ఇండియాకు లాంగ్ రేంజ్ బోయింగ్ విమానంలో సీబీఐ, ఈడీ అధికారులు వెస్ట్ ఇండీస్కు తరలి వెళ్లనున్నాయని తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. అంతేకాదు తిరుగు ప్రయాణంలో యూరప్ నుంచి నీరవ్ మోదీని తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. పీఎన్బీ స్కాంలో కీలక నిందితులైన వజ్రాల వ్యాపారులు, నీరవ్ మోదీ, మోహుల్ చోక్సీలను తిరిగి దేశానికి రప్పించేందుకు కేంద్రం అష్టకష్టాలు పడుతోంది. ఇప్పటికే వీరిద్దరి పాస్పోర్టులను రద్దు చేయడంతోపాటు ఇంటర్పోల్ ద్వారా రెడ్కార్నర్ నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు పీఎన్బీ కుంభకోణం వెలుగులోకి రావడానికి ముందే నిందితులిద్దరూ విదేశాలకు చెక్కేశారు. నీరవ్ మోదీ లండన్లో తలదాచుకోగా, చోక్సీ వెస్టిండిస్లోని ఆంటిగువా అండ్ బార్బుడా దేశ పౌరసత్వం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేసు విచారణకు రాలేనంటూ కుంటి సాకులు చెబుతూ, ఇటీవల కేసులనుంచి తప్పించుకునే ఎత్తుగడలో భాగంగా భారతీయ పౌరసత్వాన్ని కూడా వదులుకున్నట్టు చోక్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఆకాశ వీధిలో అద్భుత రెస్టారెంట్!
బెంగళూరు: ఆకాశంలో.. అల్లంత ఎత్తులో గాల్లో వేలాడుతూ విందు ఆరగిస్తే.. భలే థ్రిల్గా ఉంటుంది కదూ. ఈ సాహోసోపేత ‘ఫ్లై డైనింగ్’ ఎక్స్పీయరెన్స్ కోసం బెంగళూరు వెళ్లాల్సిందే. దేశంలో తొలిసారి ప్రారంభించిన ఈ ‘ఫ్లై డైనింగ్’ మాన్యతా టెక్ పార్క్లోని నాగవర లేక్ ఒడ్డున ఉంది. గాల్లో వేలాడే ఈ రెస్టారెంట్ ఎత్తు 160 అడుగులు. బెంగళూరుకు చెందిన జంపింగ్ ఇండియా అనే అడ్వేంచర్ స్పోర్ట్స్ కంపెనీ ఈ రెస్టారెంట్ ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా సంస్థ సీఈవో నేహా గుప్తా మట్లాడుతూ.. ‘‘గత ఐదేళ్ల నుంచి ఈ ఫ్లై డైనింగ్ ప్రారంభించాలని చూస్తున్నాం. ఈ మేరకు మూడేళ్ల క్రితం పనులు ప్రారంభించాం. గత వారమే దీన్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చామ’’ని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 65 ఫ్లై డైనింగ్లు ఉండగా, ఇండియాలో ఏర్పాటు చేసిన తొలి ఫ్లై డైనింగ్ రెస్టారెంట్ ఇదే. 24 కుర్చీలు, పెద్ద డైనింగ్ టేబుల్తో ఉండే ఈ రెస్టారెంట్ను క్రేన్ ద్వారా పైకి లేపుతారు. ఇందులో ఒక ఫొటోగ్రాఫర్, నలుగురు రెస్టారెంట్ సిబ్బంది ఉంటారు. ఎత్తు నుంచి పడిపోకుండా మూడు సీట్ బెల్టులు ఉంటా యి. ఈ రెస్టారెంట్లోకి గర్భవతులు, 14 ఏళ్ల లోపు చిన్నారులకు అనుమతి ఉండదు. కనీస ఎత్తు 4.5 అడుగులు ఉండాలి. బరువు పట్టింపులు లేవు. వర్షం కురిసినా తడవకుండా డెక్లో ఏర్పాట్లు ఉన్నాయి. అయితే, తీవ్రమైన గాలులు వీచినప్పుడు మాత్రం ఈ రెస్టారెంట్ను కిందికి దించుతారు. మరింకెందుకు ఆలస్యం? బెంగళూరు వెళ్తే.. తప్పకుండా ‘ఫ్లై డైనింగ్’ ఎక్స్పీయరెన్స్ పొందండి. -
చంపేస్తున్న ఈగ
ఈగల గోల మేం భరించలేకపోతున్నాం అని 8 గ్రామాల ప్రజలు లబోదిబోమంటున్నారు. రాజమౌళి ఈగ సినిమా చూశాక చాలామందికి ఈగను తక్కువగా అంచనా వేయరాదనే ఒక భావన వచ్చి ఉంటుంది. కానీ ఈ గ్రామాల వాసులకు ఆ సినిమాలో చూపించిన కష్టాల కంటే ఎక్కువే చుట్టుముట్టాయి. ఈగలు 24 గంటలూ వెంటాడి వేధిస్తున్నాయి. దొడ్డబళ్లాపురం: దొడ్డబళ్లాపురం తాలూకాలోని హుస్కూరు చుట్టుపక్కల ఉన్న సుమారు 15 కోళ్లఫారాల కారణంగా ఉత్పత్తవుతున్న ఈగలు దండయాత్ర మాదిరిగా పరిసర గ్రామాలపైబడి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దీంతో ఓపిక నశించిన హుస్కూరు సహా 8 గ్రామాల ప్రజలు సోమవారంనాడు ఆ కోళ్లఫారాల ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఈగలనైనా అరికట్టండి, లేదా ఊరు వదిలి వెళ్లిపోండి అని కోళ్లఫారాల యజమానులకు స్పష్టంచేశారు. మా కష్టాలు అన్నీఇన్నీ కావు బాధితులు మాట్లాడుతూ ‘15 సంవత్సరాలుగా హుస్కూరు చుట్టుపక్కల పలు కోళ్లఫారాలు నడుస్తున్నాయి, అక్కడి చెత్త వల్ల ఉత్పత్తవుతున్న ఈగలు మా గ్రామాలపైబడి అనేక సమస్యలు సృష్టిస్తున్నాయి, ఇంట్లో, బయట, గోడల మీద, పాత్రలమీద, వాహనాలమీద ఈగలు ముసురుకుంటున్నాయి. ఇటీవలి వర్షాలకు మరింత ముదిరాయి. నడుస్తున్నా, కూర్చున్నా, నిద్రపోతున్నా ఈగలు ముసురుకుంటున్నాయి. కనీసం టాయ్లెట్లోనూ ప్రశాంతత కరువైంది. చేతులతో నిర్విరామంగా ఈగలను తోలుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. భోజనం చేయాలంటేనే బేజారెత్తిపోయింది. అన్నం పెట్టుకుని కంచం ముందు పెట్టుకుంటే చేతికన్నా ముందు ఈగలే అన్నం మీద వాలుతున్నాయి. దీంతో గ్రామంలో చాలామంది అంటురోగాల బారినపడ్డారు. మనుషుల పరిస్థితి ఇదయితే పశువుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. పశువులపై ఈగలు వాలి ఇబ్బందులు పెడుతున్నాయి. ఈగల పీడ వల్ల గత వారం రోజుల్లోనే పదికి పైగా పశువులు మృత్యువాతపడ్డాయి’ అని బాధితులు ఆవేదనను ఏకరువు పెట్టారు. పట్టించుకోని నేతలు, అధికారులు పశువుల కళ్ళల్లోకి, ముక్కుల్లోకి వేళ్లే ఈగలు ఒంటిమీద గాయాలు ఉంటే రక్తాన్ని పీల్చి చంపుతున్నాయన్నారు. ఈగల సమస్యపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయిందన్నారు. ఈగల బాధ ఇలాగే కొనసాగితే గ్రామాలు వదలి వెళ్లిపోవాల్సిందేనని వాపోయారు. ఈ ఘటనపై స్పందించిన ఒక కోళ్లఫారం మేనేజర్ మాట్లాడుతూ ఈగల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
గగన విహారానికి బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: గగనతలం నుంచి భాగ్యనగరం అందాలను వీక్షించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన హెలీ టూరిజం-జాయ్ రైడ్స్ ప్రాజెక్టు దాదాపుగా అటకెక్కింది. కనీసం ఒక్క బుకింగ్ కూడా రాకపోవటంతో ప్రాజెక్టును పర్యాటక శాఖ తాత్కాలికంగా రద్దు చేసుకుంది. హుస్సేన్సాగ ర్ తీరంలో నెక్లెస్రోడ్డు వైపు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ను మూసేసింది. మరోసారి హెలికాప్టర్ ట్రిప్పుల ను పునరుద్ధరించాలని పర్యాటక శాఖ చేసిన ప్రయత్నాలు ఫలితమివ్వలేదు. ఒక్కరంటే ఒక్క ప్రయాణికుడు కూడా స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. డోలాయమానంలో సీ ప్లేన్ ప్రాజెక్టు... జాయ్ రైడ్స్ విఫలం కావటంతో దాని ప్రభావం ‘సీ-ప్లేన్’ ప్రాజెక్టుపైనా పడింది. నీళ్లు, భూమి.. రెంటినీ రన్వేగా చేసుకొని గాలిలోకి ఎగిరే చిన్నవిమానాల (సీ ప్లేన్)ను కూడా పరిచయం చేయాలని పర్యాటక శాఖ భావించింది. తెలంగాణలో ఒక్క హైదరాబాద్ మినహా మరెక్కడా విమానాశ్రయాలు లేవు. దీంతో ఈ ప్రాంతంలోని పట్టణాలకు తొందరగా వెళ్లాలనుకునేవారికి ఇది ఎంతో సౌలభ్యంగా ఉంటుందని ఆశించింది. హుస్సేన్సాగర్ నుంచి గాలిలోకి ఎగిరే సీ ప్లేన్ కరీంనగర్ ఎల్ఎండీ నీళ్లలో, వరంగల్ వడ్డేపల్లి చెరువులో సులభంగా దిగే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్, వరంగల్ పట్టణాలకు వెళ్లేవారు దీనిపై ఆసక్తి చూపుతారని అధికారులు అంచనా వేశారు. ఏర్పాట్లన్నీ చేశాక జాయ్ రైడ్ తరహాలోనే ఇది విఫలమైతే ఏంచేయాలన్న ఆలోచనతో ఈ ప్రాజెక్టునూ తాత్కాలికంగా పక్కనపెట్టారు. టికెట్ ధర ఎక్కువగా ఉందనే... పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే క్రమంలో హెలిటూరిజానికి పర్యాటక శాఖ రూపకల్పన చేసింది. అయితే కేవలం 10 నిమిషాల పర్యటనకు రూ.3,500 వరకు చెల్లించాల్సి రావటం, కనీసం ఆరుగురు ఉం టేనే ట్రిప్పు ఉండే మెలిక దానికి ఇబ్బందిగా మారింది. అంత ధర పెట్టడం మధ్య, దిగువ తరగతుల వారి కి ఇబ్బందిగా మారింది. ఎగువ తరగతి ప్రజలకు విమాన ప్రయాణాలు సాధారణమే అయినందున హెలి కాప్టర్లో చక్కర్లు కొట్టాల్సిన అవసరం లేదు. ఫలితంగా ప్రాజెక్టు విఫలమైంది. గత ఫిబ్రవరిలో మేడారం జాతర సమయంలో బేగంపేట నుంచి మేడారానికీ సర్వీసు ప్రారంభించారు. ఆరుగురు సభ్యుల ప్యాకేజీ ధర రూ.2.75 లక్షలు ప్లస్ సర్వీసు చార్జీ అదనంగా నిర్ధారించటంతో ఒక్కరూ ముందుకు రాలేదు. -
కార్లో తేలినట్టుందే...
గాల్లో కాదు నీళ్లల్లో! ఏకంగా సముద్రంలోనే తేలే సొరంగం ఇది. ఆ సొరంగంలో కార్లు, ఇతర వాహనాల్లో ప్రయాణించవచ్చు... కార్లో తేలిపోవచ్చు. మీరు ఫై లవోవర్లు చూసుంటారు. సస్పెన్షన్ బ్రిడ్జిలు, కొండల్ని తొలిచి కట్టిన టన్నెల్స్నీ చూసుంటారు. కానీ ఫొటోలో కనిపిస్తోందే.. అది అండర్వాటర్ బ్రిడ్జి. ఇది ప్రపంచంలోనే తొలి తేలియాడే బ్రిడ్జి కూడా. నార్వే దేశంలో కట్టనున్నారు ఈ హైటెక్ బ్రిడ్జీని. భలే అందంగా ఉంటుందీ దేశ సముద్రతీర ప్రాంతం! తీరం వెంబడి కొండలు, కోనలు.. బ్యాక్వాటర్స్ అబ్బో అదరహో అనుకోండి! అయితే ఓ చిక్కుంది. ఈ తీరం వెంబడి ఒక పక్క నుంచి ఇంకోపక్కకు వెళ్లాలంటే బోలెడు కష్టం. కొంతదూరం రోడ్డుపై మరికొంత దూరం పెద్దపెద్ద నౌకలపై మళ్లీ కొంత దూరం రోడ్డుపై ప్రయాణించాలి. ఆ దాందేముంది.. ఎక్కడికక్కడ బ్రిడ్జీలు కట్టేయవచ్చు కదా అనుకోవద్దు. అక్కడున్న నేల స్వభావానికీ, బ్యాక్వాటర్ చానెళ్ల వెడల్పుకూ బ్రిడ్జీలు కట్టడం అసాధ్యమని తేల్చేశారు. దీంతో నార్వే పబ్లిక్ రోడ్స్ కంపెనీ ఈ అండర్వాటర్ సస్పెన్షన్ సొరంగం ఆలోచనకు శ్రీకారం చుట్టింది. సముద్రంలో దాదాపు వంద అడుగుల లోతులో ఉండే ఈ సొరంగాలను బలమైన సిమెంట్ దిమ్మెల సాయంతో వేలాడదీస్తారు. ఫలితంగా నీటిపైన ఈ దిమ్మెల మధ్యలో నౌకలు, ఫెర్రీలు మామూలుగా ప్రయాణించవచ్చునన్నమాట. కొండలకు రెండు పక్కల బలమైన ఉక్కుతాళ్లతో సొరంగాలను అనుసంధానిస్తారు. దాదాపు 4000 అడుగుల పొడవైన సొరంగాన్ని కట్టేందుకు 2500 కోట్ల డాలర్ల వ్యయం అవుతుందట. అన్నీ సవ్యంగా సాగితే మరో 19 ఏళ్లకు నిర్మాణం పూర్తవుతుందని అంచనా! -
హెలికాప్టర్లా టేకాఫ్.. విమానంలా ప్రయాణం!
హెలికాప్టర్లా ఉన్నచోటు నుంచే నిట్టనిలువుగా పైకి లేచి.. విమానంలా వేగంగా దూసుకెల్లే బుల్లి మానవరహిత విమానం(డ్రోన్) ఇది. ‘గ్రీస్డ్ లైట్నింగ్ లేదా జీఎల్-10(అంటే మెరుపు వేగం)’ అని పేరుపెట్టిన ఈ విమానానికి రెక్కలపై 8, తోక వద్ద 2 మొత్తం పది ఇంజిన్లు ఉంటాయి. ఎలక్ట్రిక్ బ్యాటరీ, డీజిల్తోనూ నడుస్తుంది. 6.1 మీటర్ల పొడవున్న రెక్కలతో ప్రాథమిక నమూనాగా తయారుచేసిన ఈ బుల్లి డ్రోన్ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పరీక్షించగా, హెలికాప్టర్ కన్నా నాలుగు రెట్లు సమర్థంగా ప్రయాణించింది. వ్యవసాయ పర్యవేక్షణకు, నేలను మ్యాపింగ్ చేయడానికి, ఇతర పనులకు జీఎల్-10 ఉపయోగపడనుందని నాసా వెల్లడించింది. నాలుగు సీట్లుండే ప్రైవేటు విమానంగానూ దీనిని అభివృద్ధిపర్చనున్నట్లు తెలిపింది. -
పాల ప్యాకెట్లలో ఈగ!
-
ఈ బైక్తో ఎంచక్కా గాల్లో ఎగరొచ్చు..!