gangamma jatara
-
విశాఖపట్నం : పాలను సముద్రంలో వదిలి..గంగమ్మతల్లికి పూజాలు (ఫొటోలు)
-
కనుమరుగవుతున్న గంగమ్మ జాతర పుష్పాతో మళ్లీ తెరపైకి
-
మాతంగి ఫైరింగ్.. పూనకాలు లోడింగ్
తిరుపతి కల్చరల్: పుష్ప–2 సినిమా రాయలసీమను ఊపేస్తోంది. అల్లు అర్జున్ మాతంగి గెటప్లో నటవిశ్వరూపాన్ని చూసిన వారంతా పూనకాలతో ఊగిపోతున్నారు. సినిమా మొత్తానికి హైలైట్ ఎపిసోడ్ తిరుపతి గంగమ్మ జాతరే. ఈ సన్నివేశంలో చీరకట్టి అమ్మవారి గెటప్లో కనిపించిన అల్లు అర్జున్ని చూసిన వారంతా నిజంగా అమ్మవారు పూనిందా అనిపించేంతలా నటించాడని ఫిదా అవుతున్నారు. మాతంగి వేషధారణలో అల్లు అర్జున్ ఫైట్ సీన్లు, పాటతో కలిపి 10 నుంచి 15 నిమిషాల పాటు కనిపించాడు. సినిమా రిలీజ్కు ముందే ఈ వేషధారణ అభిమానులను ఆకట్టుకుంది. సినిమా రిలీజ్తో ఈ సీన్లు మరింతగా ఆకట్టుకుంటున్నాయి. మళ్లీ క్లైమాక్స్లో అమ్మవారి వేషధారణ అబ్బురపరిచింది. ఈ సన్నివేశాలను చూసిన వారంతా తిరుపతి గంగమ్మను పాన్ ఇండియా రేంజ్కు తీసుకెళ్లారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మాతంగి వేషంలో భక్తుడు (ఫైల్ ఫొటో) జాతరలో లేడీ గెటప్ ఎందుకంటే.. తిరుపతి గంగమ్మ జాతరలో లేడీ గెటప్ ఎందుకు వేస్తారు? మగవాళ్లంతా చీరలెందుకు కట్టుకుంటారు? ఆడవాళ్లంతా మగరాయుడు అయిపోతారెందుకు? చిన్నారులు మీసకట్టు పెడతారు.. మరికొందరు అమ్మోరుగా.. రాక్షసులుగా అనేక గెటప్స్ ఈ జాతరలో కనిపిస్తాయి. ఇలాంటి వేషధారణలు గంగమ్మకు ఇష్టమట. అందుకే ఈ వేషధారణతో అమ్మను దర్శించుకుంటే చల్లని చూపు ప్రసరిస్తుందని, ఆమె కరుణా కటాక్షాలు లభిస్తాయని తిరుపతి గంగమ్మ భక్తుల విశ్వాసం.గంగమ్మ జాతర ఏటా మే నెలలో జరుగుతుంది. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా తిరుపతి వచ్చేస్తారు. వారం రోజులు వైభవంగా జరిగే జాతరలో వివిధ వేషాలు ధరించి మొక్కులు తీర్చుకుంటారు. దీని వెనుక శతాబ్దాల నేపథ్యం ఉంది. రాయలసీమలో పాలెగాళ్ల రాజ్యం రోజుల్లో మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరిగేవి. ఆ కామాంధుల బారినుంచి తప్పించుకోలేక మహిళలు చాలాకష్టాలు పడ్డారు. తిరుపతి సమీపంలోని అవిలాలలో కైకా వంశంలో పుట్టిన ఆడబిడ్డను దత్తత తీసుకున్న తిరుపతికి చెందిన వ్యక్తి ఆమెకు గంగమ్మ అని పేరు పెట్టాడు. తనపై కన్నేసిన పాలెగాడిని ఉగ్రరూపంతో సంహరించేందుకు గంగమ్మ వెంటాడగా.. భయపడి దాక్కున్న ఆ పాలెగాడిని బయటకు రప్పించేందుకు ఆమె వివిధ వేషధారణలతో తిరిగింది. బైరాగి, మాతంగి, చివరకు దొర వేషంలో వచ్చిన గంగమ్మను పోల్చుకోలేక పాలెగాడు బయటకు రాగా.. మాతంగి వేషధారణలో వచ్చిన గంగమ్మ అతడిని సంహరించి.. ఆ పాలెగాడి భార్యకు ధైర్యం చెబుతుంది. అప్పటి నుంచి గంగమ్మను శక్తి స్వరూపంగా భావించి ఏటా జాతర చేయడం ఆనవాయితీ. శ్రీవారి సోదరిగా.. తిరుపతిలో కొలువుతీరిన ఏడుగురు అక్కా చెల్లెళ్లలో గంగమ్మ ఒకరు. ఈమెను వేంకటేశ్వరస్వామి సోదరిగా భావించి పూజలు చేస్తారు. అందుకే టీటీడీ తరఫున గంగమ్మకు పట్టువ్రస్తాలు సమరి్పస్తారు. గంగమ్మ తల్లి తిరుపతి తొలి గ్రామదేవత. శ్రీవారి భక్తుడైన తాతయ్య గంగమ్మ తల్లి తాతయ్యగుంట వద్ద నెలకొలి్పన ఆలయానికి అత్యంత ప్రాచీన, చారిత్రక, విశిష్టత ఉంది. -
తిరుపతి : గంగమ్మకు మరుపొంగళ్లతో భక్తుల మొక్కులు (ఫొటోలు)
-
తిరుపతి : గంగమ్మకు మరు పొంగళ్లు సమర్పించిన భక్తులు (ఫొటోలు)
-
Gangamma Jatara Photos: విశ్వరూపంతో ముగిసిన తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
-
Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
-
తిరుపతిలో వైభవంగా గంగమ్మ జాతర (ఫోటోలు)
-
Tataiahgunta Gangamma Jatara: వైభవంగా తాతయ్యగుంట గంగమ్మజాతర (ఫొటోలు)
-
వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర
-
గంగమ్మ తల్లికి సారె సమర్పించిన రోజా
-
వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..
-
గంగమ్మ జాతర : అమ్మా.. గంగమ్మ తల్లీ.. చల్లంగా చూడు (ఫొటోలు)
-
వైభవంగా గంగమ్మ జాతర..
-
ఘనంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
-
తిరుపతి గంగమ్మ జాతర తొలి రోజు బైరాగి వేషంతో భక్తుల సందడి (ఫొటోలు)
-
తిరుపతి : తాతయ్యగుంట గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)
-
Allu Arjun Jatara Look Secret: పుష్పరాజ్ భీకర రూపం రహస్యం ఇదేనా?
పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ పీక్కు చేరింది. ఈ మూవీకి జాతీయ ఉత్తమ అవార్డు గెలుచు కుని మరో మెట్టు ఎక్కాడు అల్లు అర్జున్. దీనికి సీక్వెల్గా వస్తున్న 'పుష్ప 2: ది రూల్' పై అంచనాలు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే పుష్ప 2 సినిమా టీజర్లో అల్లు అర్జున్ నీలి రంగు చీర, నగలు, నిమ్మకాయ దండలతో వెరైటీ లుక్ హాట్టాపిక్గా నిలిచింది. దీంతో అభిమాన హీరో కొత్త ట్రెండ్ సెట్ చేయడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. 2003లో గంగోత్రి సినిమాతో తెరంగేట్రం చేసిన అల్లు అర్జున్ ..ఈ మూవీలో లేడీ గెటప్తో కనిపించి అలరించాడు. తాజాగా పుష్ప-2 సినిమాలో కూడా అమ్మవారి భీకర రూపంతో ఫ్యాన్స్ని మరింత ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఎర్రచందనం, తిరుపతి జిల్లాలో కథ సాగుతుంది కనుక ఇది గంగమ్మ జాతర నేపథ్యమే ఈ లుక్అని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటీ గంగమ్మ జాతర తెలుసుకుందాం రండి. తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామదేవతగా అవతరించిన గంగమ్మ.. సాక్షాత్తు తిరుమల శ్రీవారి చెల్లెలని భావిస్తారు. వారం రోజుల పాటు జరిగే గంగమ్మ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. గంగమ్మ జాతర విశిష్టత పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటిరాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించి వేధించేవాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కోవడంతో అనేక వేషాలు ధరించి మూడు రోజులపాటు గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో నాలుగోరోజు గంగమ్మ-దొరవేషం వేసి, పాలెగాడిని అంత మొందించిందని భక్తుల విశ్వాసం. ఈ దుష్టశిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేసుకుంటారు. ఈ జాతరలో తొలి రోజున బైరాగివేషం ,రెండోరోజు బండవేషం,మూడోరోజు తోటివేషం,నాలుగోరోజు దొరవేషం వేసుకుంటారు. నాలుగో రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదోరోజున మాతంగి వేషం ధరిస్తారు. ఆరోరోజు సున్నపుకుండల వేషం వేస్తారు. ఏడోరోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సప్పరాలను (వెదురు బద్దలతో) తయారుచేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. అదేరోజున కైకాల కులస్థులు పేరంటాళ్ళ వేషం వేస్తారు.మగవారు ఆడవేషం వేసుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. ఇలా చేస్తే అమ్మవారు అనుగ్రహించి తమ కోర్కెలు తీరుస్తుందని భక్తుల నమ్మకం. పేరంటాలు వేషంలోఉన్న కైకాల కులస్థులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్నితయారుచేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచిమట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఎనిమిదిరోజులపాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. బన్నీ న్యూ లుక్ రహస్యం వీడాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరోవైపు పుష్ప 2: ది రూల్ టీజర్కి రెస్పాన్స్ ఒక రేంజ్లో ఉంది. బన్నీ మాతంగి లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘‘మరో బ్లాక్బస్టర్..బన్నీకి మరో జాతీయ అవార్డు పక్కా" అని కమెంట్ చేశారు. -
తుఫాన్ భయం సముద్రపు నీటితో గంగమ్మ జాతర
-
తిరుపతి : ఘనంగా తాతయ్య గుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
-
తిరుపతి గంగజాతర అమ్మవారి విశ్వరూప దర్శనం (ఫొటోలు)
-
తిరుపతి : ఘనంగా గంగమ్మ జాతర మహోత్సవాలు (ఫొటోలు)
-
తిరుపతి గంగమ్మను దర్శించుకున్న మంత్రి అంబటి రాంబాబు
-
తాత్యాగుంట గంగమ్మ జాతర వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర
-
గంగమ్మ జాతర: ‘పుష్ప-2’ అల్లు అర్జున్ గెటప్లో ఎంపీ గురుమూర్తి (ఫోటోలు)
-
Gangamma Jaatara: వేషధారణతో గంగమ్మను దర్శించుకున్న భక్తులు..(ఫొటోలు)
-
Tirupati : ఘనంగా తాతయ్య గుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
-
తిరుపతిలో అంగరంగా వైభవంగా గంగమ్మ జాతర
-
Gangamma Jatara: వైభవంగా ప్రారంభమైన తిరుపతి గంగమ్మ జాతర (ఫొటోలు)
-
గంగమ్మ తల్లికి సారె సమర్పించిన ఎమ్మెల్యే భూమన
-
తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయంలో మహా కుంభాభిషేకం
-
చిత్తూరు జిల్లా కుప్పంలో రెచ్చిపోయిన టిడిపి కార్యకర్తలు
-
గంగమ్మ జాతర పాట పాడిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
-
చల్లంగ చూడు... గంగమ్మ తల్లీ
తిరుపతి కల్చరల్: చల్లంగ చూడు... గంగమ్మ తల్లీ అంటూ భక్తులు మంగళవారం తాతయ్యగుంట గంగమ్మకు మరు పొంగళ్లు పెట్టి, మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి గంగజాతర తర్వాత ఐదు మంగళవారాలు గంగమ్మకు మరుపొంగళ్లు పెట్టి, మొక్కులు తీర్చుకోవడం భక్తుల ఆనవాయితీ. ఇందులో భాగంగా గంగజాతర తర్వాత వచ్చిన తొలి మంగళవారం కావడంతో వేకువజాము నుంచే భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి విచ్చేసి, పొంగళ్లు పెట్టి, అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీతో తాతయ్యగుంట గంగమ్మ ఆలయం కిక్కిరిసింది. ఈ సందర్భంగా అమ్మవారి మూలవిరాట్కు అభిషేకం చేశారు. అనంతరం మొక్క జొన్న కంకులు, వివిధ పుష్పాలతో అమ్మవారికి విశేషాలంకరణ చేశారు. జాతరలో వేషాల మొక్కులు చెల్లించని భక్తులు చిన్నా పెద్దా తేడా లేకుండా మంగళవారం వేషాలు వేసి, భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. మరి కొందరు భక్తులు వేయికళ్ల దుత్తలు నెత్తిన పెట్టుకొని ఆలయ ప్రదక్షిణ చేసి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పాలక మండలి చైర్మన్ కట్టా గోపియాదవ్, ఈఓ మునికృష్ణయ్య దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
తిరుపతి గంగమ్మ తల్లి వారి విశ్వరూప దర్శనం (ఫొటోలు)
-
కనుల పండువగా గంగమ్మ జాతర
తిరుపతి తుడా: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని చెల్లెలుగా భాసిల్లుతున్న తిరుపతి గ్రామదేవత గంగమ్మ ఉత్సవాలు కనుల పండువగా ముగిశాయి. గత నెల 10వ తేదీ మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో ప్రారంభమైన గంగమ్మజాతర మంగళవారంతో ముగిసింది. బుధవారం తెల్లవారుజామున అమ్మవారి విశ్వరూప చెంప తొలగింపుతో జాతర పరిసమాప్తమవుతుంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పర్యవేక్షణలో తొలిసారిగా భారీ ఏర్పాట్లతో దగ్గరుండి జాతరను నిర్వహించారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లు జాతరను ఏకాంతంగా నిర్వహించారు. కరోనా తర్వాత 900 ఏళ్లనాటి చరిత్రను చాటిచెప్పేలా తిరుపతి శ్రీతాతయ్యగుంట చిన్న గంగమ్మ జాతర ఉత్సవాలను నిర్వహించారు. మంగళవారం లక్ష మందికి పైగా భక్తులు పొంగళ్లు పెట్టి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర రోజున ప్రతి ఏటా వరుణుడు కరుణించడం పరిపాటి. గత సంప్రదాయాలతో పాటు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తొలిసారి అమ్మవారికి తన ఇంటి నుంచి సారె తీసుకురావడంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యుల చేత ఊరేగింపుగా అమ్మవారికి సారెను సమర్పించారు. జాతర రోజున మునుపెన్నడూ లేని విధంగా లక్షమందికి పైగా భక్తులకు మటన్ బిరియానీని పంచిపెట్టారు. -
బెడిసికొట్టిన ‘పచ్చ’ ప్రచారం
సీన్–1 టీడీపీ కార్యకర్త దెబ్బకు ఎల్లో మీడియా అభాసుపాలు సాక్షి ప్రతినిధి, గుంటూరు: సోమవారం (16వ తేదీ) ఉదయం గుంటూరు కలెక్టరేట్ దగ్గర ఓ ఒంటరి మహిళ హఠాత్తుగా రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు బూతులు లంఘించుకుంది. ఆమె ఎవరని ఆరా తీస్తే.. తెలుగుదేశం కార్యకర్త అని చివరికి తేలింది. ఈ వ్యవహారంలో ‘పచ్చ’ ప్రచారం బెడిసికొట్టగా టీడీపీ, దాని భజన బ్యాచ్ అయిన ఎల్లో మీడియా అభాసుపాలయ్యాయి. ఏం జరిగిందంటే.. : ► గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన కర్లపూడి వెంకాయమ్మ సోమవారం గుంటూరు కలెక్టరేట్కు వెళ్లి తన స్థలాన్ని సర్వే చేయడంలేదంటూ అధికారులపై ఫిర్యాదు చేసింది. ► బయటకొచ్చి సీఎం జగన్మోహన్రెడ్డి పాలన బాగోలేదంటూ మీడియా ఎదుట సంబంధం లేకుండా నానా మాటలు అనేసింది. ► తన పూరిగుడిసెకు రూ.18 వేల కరెంట్ బిల్లు వచ్చిందని, అందుకే పెన్షన్ ఆపేశారని, అధికారులు అడిగినా పట్టించుకోవడంలేదంటూ నోటికొచ్చిన ఆరోపణలు చేసింది. ► ఇంకేముంది.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అక్కసుతో రోజూ రగిలిపోతున్న టీడీపీ, దాని భజన బ్యాచ్ అయిన ఎల్లో మీడియా కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు వెంకాయమ్మ వ్యాఖ్యలను ముందూవెనక ఆలోచించకుండా తెగ వైరల్ చేసేశాయి. ► పెన్షన్ అందకపోవడాన్ని తెలుసుకుందామని వలంటీరు మిక్కిలి మంజరి వెంకాయమ్మ వద్దకు వెళ్లగా.. వెంకాయమ్మతో పాటు టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు పాల్బాబు మరికొందరు మంజరిపై దాడిచేశారు. ► అంతటితో వెంకాయమ్మ ఆగకుండా.. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి స్థానిక వైఎస్సార్సీపీ నేతలు తన మీద దాడిచేశారని.. తనకు, తన కుమారునికి ప్రాణహాని ఉందని మరోసారి మీడియాకెక్కింది. ► టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ అయితే.. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై దాడులు చేస్తారా? రాష్ట్రంలో ఐదు కోట్ల మందిపై దాడిచేస్తారా అంటూ ట్వీట్ చేసేశారు. అసలు నిజాలివీ.. వెంకాయమ్మ ఆరోపణల్లోని నిజానిజాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపితే అవన్నీ అవాస్తవాలని తేలింది. ► వెంకాయమ్మకి వైఎస్సార్ పెన్షన్ కానుక కింద ఒంటరి మహిళ పెన్షన్ అందుతోంది. ఈ నెల ఒకటో తేదీ ఉ.5.49 గంటలకే వలంటీరు ఆమె ఇంటికెళ్లి పెన్షన్ అందించింది. ► ఆమె ఇంటి కరెంట్ సర్వీస్ నెంబర్ 9232309001236. ఎస్సీ కోటా కింద ఆమె రాయితీ పొందుతోంది. ఆరు నెలలుగా ఒక్క పైసా కూడా కరెంట్ బిల్లు చెల్లించలేదు. ► ఆమెకు భర్త ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఒంటరి మహిళ పెన్షన్ పొందుతోంది. భర్తతో విభేదాల కారణంగా విడిగా ఉంటోంది. ► ఇక వైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా గ్రూపులో తీసుకున్న డబ్బులు చెల్లించకపోవడంతో ఆమె గ్రూపునకు రుణం మంజూరు కాలేదు. ► అంతేకాదు.. కలెక్టరేట్లో వెంకాయమ్మ ఫిర్యాదు చేసిన ఇంటి స్థలం వ్యవహారం మంగళగిరి కోర్టు పరిధిలో (146/2015) ఉంది. ఈ సమయంలో అధికారులు తనకు సర్వే చేయడంలేదంటూ తప్పుడు ఫిర్యాదు చేసింది. ► ఇవన్నీ బయటపడడంతో చివరికి వెంకాయమ్మ మంగళవారం సాయంత్రం తాను టీడీపీ కార్యకర్తనంటూ వ్యాఖ్యానించడంతో టీడీపీ, ఎల్లో మీడియా వారి గోతిలో వారే పడినట్లయింది. ► కొసమెరుపు.. వలంటీర్ మంజరి ఫిర్యాదుతో తాడికొండ పోలీసులు వెంకాయమ్మతోపాటు టీడీపీకి చెందిన మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. సీన్–2 గంగమ్మ జాతరపైనా అదే పైత్యం తిరుపతి మంగళం : గుంటూరు జిల్లాలో అభాసుపాలైనట్లుగానే ఎల్లో మీడియా మంగళవారం తిరుపతిలోనూ బొక్కబోర్లా పడి పరువు పోగొట్టుకుంది. భక్తుల తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఇక్కడ ఏమైందంటే.. తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా గత కొద్దిరోజులుగా గంగజాతరను అంగరంగ వైభవంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. వివిధ రకాల వేషధారణలు, మేళ తాళాలు, డప్పులతో నగరమంతా మార్మోగింది. కానీ, మొదటి నుంచీ ఏబీఎన్ ఛానల్ దీనిపై విషం కక్కుతోంది. ఎంతలా అంటే.. ఏకంగా జాతర పర్వదినం రోజున ‘చెత్తకుప్పలో గంగమ్మలు, గంగజాతరలో అపశ్రుతి’.. అంటూ దుష్ప్రచారం చేసింది. కార్పొరేషన్ లలిత కళాప్రాంగణంలో నిమజ్జనానికి ఉంచిన గంగమ్మ ప్రతిమలు కానీ, వాస్తవం ఇదీ.. ► ఏడు రోజులపాటు విశేష పూజలందుకున్న గంగమ్మ ప్రతిమలను జాతర అనంతరం నిమజ్జనం చేస్తారు. ► ఇందులో భాగంగా గంగమ్మ ప్రతిమలను సంప్రదాయం ప్రకారం ఊరేగింపుగా తీసుకొచ్చి ఆదివారం రాత్రి కార్పొరేషన్లోని లలిత కళాప్రాంగణం వద్ద ఉంచారు. బుధవారం నిమజ్జనం చేయాల్సి ఉంది. ► కానీ, గత రెండ్రోజులుగా గాలి, వాన బీభత్సంతో లలిత కళాప్రాంగణం వద్ద ఉన్న చెట్ల నుంచి ఆకులు రాలి గంగమ్మ విగ్రహాలపై పడ్డాయి. ► దీనిని ఏబీఎన్ చానల్ వక్రీకరించి చెత్త కుప్పలో గంగమ్మ ప్రతిమలు అంటూ అమ్మవారి భక్తుల మనోభావాలను దెబ్బతినేలా తప్పుడు కథనాలతో నానాయాగీ చేసింది. ► దీంతో లక్షలాది మంది భక్తులు ఆ చానల్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎంతో వైభవంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించిన గంగమ్మ జాతరపై ఏబీఎన్ ఛానెల్ దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని కార్పొరేటర్ నరేంద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ► అలాగే, దీనిపై కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ స్పందిస్తూ.. గంగమ్మ ప్రతిమలను చెత్త కుప్పల్లో ఎలా పడేస్తామని.. ఎవరైనా అలా చేస్తారా అంటూ ప్రశ్నించారు. కార్పొరేషన్ కార్యాలయాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుతామని.. దురదృష్టవశాత్తూ కురిసిన భారీ వర్షం, గాలి బీభత్సంతో చెట్ల నుంచి ఆకులు రాలాయని.. దానిని చెత్తకుప్ప అంటూ రాద్ధాంతం చేస్తారా అంటూ మండిపడ్డారు. -
తిరుపతి గంగమ్మ జాతర- ఏడవ రోజు ( ఫొటోలు )
-
తిరుపతి గంగమ్మ జాతర- ఆరో రోజు ( ఫొటోలు )
-
తిరుపతి గంగమ్మ జాతర- ఐదో రోజు ( ఫొటోలు )
-
గుంట గంగమ్మకు సారె సమర్పించిన చెవిరెడ్డి భాస్కర్రెడ్డి
సాక్షి, తిరుపతి: తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లికి తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, లక్ష్మీ దంపతులు సారె సమర్పించారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డితో కలిసి, అమ్మవారి ఆలయానికి విచ్చేసిన చెవిరెడ్డి దంపతులకు పాలక మండలి చైర్మన్ కట్టా గోపీ యాదవ్ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న ఆయన సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అంగరంగ వైభవంగా గంగమ్మ జాతర జరగడం చాలా సంతోషకరమని, గంగమ్మ తల్లి అమ్మవారి కృప అందరికీ కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెవిరెడ్డి చెప్పారు. తిరుపతి: బసవన్నకు ‘వీక్లీ ఆఫ్’.. ఎక్కడంటే? -
తిరుపతి గంగమ్మ జాతర- నాలుగవ రోజు ( ఫొటోలు )
-
గుంట గంగమ్మకు సారె సమర్పించిన మంత్రి ఆర్కే రోజా
తిరుపతి: తాతయ్య గుంట గంగమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా మంత్రి ఆర్కే రోజా సారె సమర్పించారు. గంగమ్మ ఆలయానికి భారీ ఎత్తున ఊరేగింపుగా వచ్చిన మంత్రి రోజా.. సారెతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ..‘ గంగమ్మ ఆలయానికి సారె తీసుకురావడం పూర్వజన్మ సుకృతం,అదృష్టంగా భావిస్తున్నా. 900 ఏళ్ల చరిత్ర కల్గిన పురాతన ఆలయం గంగమ్మ తల్లి ఆలయం. గతంలో తిరుమలకు వెళ్ళే భక్తులు గంగమ్మ ను దర్శించుకున్న తర్వాత కొండకు వెళ్ళేవారు. రాష్ట్రం లో ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించాను’ అని పేర్కొన్నారు. గంగమ్మ జాతరకు ప్రత్యేక కళా బృందాలు: భూమన మంత్రి రోజా సాంస్కృతిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గంగమ్మ జాతరకు ప్రత్యేక కళా బృందాలతో కార్యక్రమాలు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున గంగమ్మ ఆలయం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించేందుకు సహకారం అందించాలని కోరినట్లు భూమన పేర్కొన్నారు. చదవండి👉 తగ్గేదేలే అంటున్న టమాటా ధరలు -
తిరుపతి గంగమ్మ జాతర- మూడో రోజు ( ఫొటోలు )
-
వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర ( ఫొటోలు )
-
జాతర శోభ: తాతయ్యగుంట గంగమ్మ జాతరలో తొలిరోజు
-
ఘనంగా గంగమ్మ జాతర
-
తిరుపతి గంగమ్మ జాతరలో అపశ్రుతి
-
చిత్తూరులో గంగమ్మ జాతర ప్రారంభం
-
గంగమ్మా.. బండ వేషం చూడమ్మా
-
గంగమ్మా.. చల్లంగా చూడమ్మా
-
దీవించు మాత
-
గంగమ్మ జాతర మహోత్సవం
-
గంగమ్మ జాతరలో విషాదం
రామకుప్పం: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం వీర్ణమల గంగమ్మ జాతరలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఘటనకు గల కారణాలు, బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు. -
తిరుపతిలో ముగిసిన గంగమ్మ జాతర
-
లారీ, ఆటో ఢీ..పది మందికి గాయాలు
చిత్తూరు : చిత్తూరు జిల్లా సత్యవేడులో గంగమ్మ జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులంతా వరదయ్యపాలెం గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుపతిలో ప్రారంభమైన గంగమ్మ జాతర
-
చల్లని తల్లి గంగమ్మ
పుంగనూరుటౌన్, న్యూస్లైన్: గంగజాతర సందర్భంగా పుంగ నూరు జనసంద్రమైంది. ప్యాలెస్లో పూజ ల అనంతరం సుందరంగా అలంకరించిన ట్రాక్టర్పై రాత్రి 10 గంటల ప్రాంతంలో అమ్మవారిని ఉంచి పట్టణంలోని తేరువీధి, సెంటర్లాడ్జి, సుబేధారువీధి, బేస్తవీధి, తూర్పుమొగశాల, కుమ్మరవీధి, కట్టకిందపాళెంవీధి ప్రాంతాల మీదుగా తీసుకొచ్చి సుగుటూరు గంగమ్మ ఆలయంలో అమ్మవారిని కొలువుదీర్చారు. తమిళుల భీకరపోరాట నృత్యాలు, మేళతాళాలు, బాణసంచాలతో పట్టణం మారుమోగింది. సుమారు 8 గంటల సేపు పట్టణంలో అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. అలాగే పట్టణంలో 8 ప్రాంతాల్లో అష్ట గంగమ్మలకు పూజలు నిర్వహించారు. బజారువీధిలో నడివీధి గంగమ్మ, తూర్పు మొగసాలలో తలుము గంగమ్మ, బాలాజీ థియేటర్ వద్ద మలారమ్మ గంగమ్మ, మైసూర్ బ్యాంకు వద్ద నలగంగమ్మ, బస్టాండులో విరూపాక్షి మారెమ్మ, నల్లరాళ్లపల్లె వద్ద నలగంగమ్మ, కోనేరు వద్ద బోయకొండ గంగమ్మ, నానాసాహెబ్పేటలోని నడివీధి గంగమ్మను ఉంచి భక్తులు పూజలు నిర్వహించారు. విరూపాక్షి మారెమ్మ ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి వేడుకగా ఊరేగించారు. నేడు భక్తుల సందర్శన పుంగనూరు ప్యాలెస్ ఆవరణంలోని సుగుటూరు గంగమ్మ ఆలయంలో బుధవారం వేకువజాము నుంచి భక్తులకు అమ్మవారి దర్శనభాగ్యం కల్పిస్తారు. ఆలయం వద్ద బ్యారీకేడ్లు నిర్మించి, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గెరిగెలు తీసుకొచ్చే భక్తులకు అంతరాయం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గంగ మ్మ జాతరకు కర్నాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివస్తారు. పెద్దిరెడ్డి మొక్కులు సుగుటూరు గంగమ్మ జాతర సందర్భం గా ప్రముఖులు ప్రత్యేక పూజలు చేసి, గంగమ్మ చల్లని ఆశీస్సుల కోసం మొక్కు లు చెల్లించుకున్నారు. అమ్మవారికి పూజ లు చేసిన వారిలో మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలమనేరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత ఎన్.అమరనాథరెడ్డి గంగమ్మకు సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే టీడీపీ నాయకులు శ్రీనాథరెడ్డి, ఆయన సతీమణి అనీషారెడ్డి మొక్కులు చెల్లించుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలు జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, కొం డవీటి నాగభూషణం, ఆవుల అమరేం ద్ర, పూలత్యాగరాజు, రాజేష్, అశోక్రా జ్, విశ్వనాధంశెట్టి, నాగరాజారెడ్డి, వెంకటరెడ్డి యాదవ్ కూడా పూజలు చేశారు.