George Soros
-
సోరోస్కు మెడల్ హాస్యాస్పదం: మస్క్
వాషింగ్టన్ : బిలియనీర్ జార్జ్ సోరోస్కు అమెరికా అత్యున్నత పురస్కారాన్ని అందించడాన్ని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తప్పుబట్టారు. వివాదాస్పద నేపథ్యమున్న వ్యక్తికి అధ్యక్షుడు బైడెన్ మెడల్ ఆఫ్ ఫ్రీడం ప్రదానం చేయడం హాస్యాస్పదమన్నారు. నిక్కీ హేలీ, సెనేటర్ టిమ్ షీహీ సహా పలువురు రిపబ్లికన్ నేతలు ఈ నిర్ణయంపై మండిపడ్డారు. ప్రధాని మోదీని జార్జ్ సోరోస్ ఇటీవల బహిరంగంగా విమర్శించడం తెలిసిందే. ఆయనతో పాటు 19 మందికి అమెరికా అత్యున్నత పురస్కారమైన మెడల్ ఆఫ్ ఫ్రీడంను బైడెన్ ప్రదానం చేశారు. మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ, ఫుట్బాల్ స్టార్ లయొనెల్ మెస్సీ, నటుడు డెంజల్ వాషింగ్టన్ తదితరులు అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. అవార్డు తీసుకునేందుకు వేదికనెక్కిన హిల్లరీకి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. సోరోస్ తరపున ఆయన కుమారుడు అవార్డును స్వీకరించారు. ఈ గౌరవం తననెంతగానో కదిలించిందని సోరోస్ ఒక ప్రకటనలో తెలిపారు. వలసదారునైన తనకు అమెరికాలో స్వేచ్ఛ లభించిందన్నారు. -
పార్లమెంట్లో అదే రగడ
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య రగడ యథాతథంగా కొనసాగింది. ప్రధానంగా రాజ్యసభలో గురువారం వాగ్వాదాలు, నిరసనలు, నినాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడం పట్ల అధికార బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అమెరికా బిలియనీర్ జార్జి సోరోస్తో కాంగ్రెస్ పెద్దలకు సంబంధాలు ఉన్నాయని, దేశాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ సభ్యుల ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము లేవనెత్తిన అంశాలపై సభలో వెంటనే చర్చ ప్రారంభించాలని కోరుతూ విపక్షాలు ఇచ్చిన ఆరు నోటీసులు చైర్మన్ ధన్ఖడ్ తిరస్కరించారు. సభలో కేంద్ర మంత్రి జె.పి.నడ్డా మాట్లాడారు. ధన్ఖడ్ బీజేపీ ప్రతినిధిగా పని చేస్తున్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ఆరోపణలను ఖండించారు. చైర్మన్ ఇచ్చిన రూలింగ్ను విమర్శించడం సభా మర్యాదను ఉల్లంఘించడమే, సభాధ్యక్ష స్థానాన్ని అగౌరవపర్చడమే అవుతుందని అన్నారు. చైర్మన్ను చీర్లీడర్ అనడం ఏమిటని కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్కు ప్రజాస్వామ్యం అంటే, పార్లమెంటరీ సంప్రదాయాలు అంటే గౌరవం లేదని ఆక్షేపించారు. జార్జి సోరోస్కు, సోనియా గాం«దీకి సంబంధాలు ఏమిటని నిలదీశారు. దీనిపై దేశ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మన దేశాన్ని ముక్కలు చేయడానికి సోరోస్ కోట్లాది డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాడని నడ్డా ధ్వజమెత్తారు. నడ్డాపై వ్యాఖ్యలపై సభలో మల్లికార్జున ఖర్గే స్పందిస్తుండగా, బీజేపీ సభ్యులు పెద్ద ఎత్తున నినదాలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓ బ్రెయిన్ మాట్లాడారు. బంగ్లాదేశ్లో మైనారీ్టలపై హింసాకాండపై ప్రధాని మోదీ స్పందించాలని, సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ సభ్యులు నినాదాలు ప్రారంభించారు. సభ ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ధన్ఖడ్ ప్రకటించారు. ముఖం దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నా: గడ్కరీ దేశంలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రమాదాల నివారణపై ఆయన లోక్సభలో గురువారం సమాధానం ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. విదేశాల్లో జరిగే సమావేశాలకు వెళ్లినప్పుడు మన దేశంలో రోడ్డు ప్రమాదాల ప్రస్తావన వస్తే తన ముఖాన్ని దాచుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. అయితే రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే ప్రజల్లో మార్పు రావాల్సిందేనని తేలి్చచెప్పారు. మరోవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్(సవరణ) బిల్లు–2024ను లోక్సభలో విపక్ష సభ్యులు వ్యతిరేకించారు. వాతావరణ మార్పులను ఎలా ఎదుర్కొంటారో ఈ బిల్లులో ప్రస్తావించలేదని విమర్శించారు. ఈ బిల్లు గురువారం లోక్సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. -
ప్రజాధనమే హారతి కర్పూరం
ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చలకు, ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, చట్టాల తయారీకి వేదిక కావాల్సిన చట్టసభలు నిష్ప్రయోజనంగా మారుతుండడం ప్రజాస్వామ్యవాదులను ఆవేదనకు గురి చేస్తోంది. పన్ను చెల్లింపుదార్ల సొమ్ముతో నడిచే పార్లమెంట్లో వారి బాగోగులపై మాట్లాడేవారే కనిపించకుండాపోవడం విస్మయం కలిగిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు, నినాదాలు, నిరసనలు తప్ప జనం ఎదుర్కొంటున్న ఇబ్బందుల, వారి కష్టాలకు చట్టసభల్లో స్థానం దక్కడం లేదు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పరిస్థితి మరింత దిగజారడం గమనార్హం. ఈ సమావేశాలు నవంబర్ 25న ప్రారంభమయ్యాయి. ఈనెల 20వ తేదీన ముగియనున్నాయి. అంటే మరో 9 రోజుల సమయమే మిగిలింది. మధ్యలో రెండు రోజులు సెలవులు ఉన్నాయి. ఇప్పటిదాకా పార్లమెంట్లో సరైన చర్చే జరగలేదు. గౌతమ్ అదానీ, జార్జి సోరోస్ వ్యవహారంపై ఇరుపక్షాలు గొడవలు పడడంతోనే సమయమంతా వృథాగా గడిచిపోయింది. దేశంలో నానాటికీ పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, వాతావరణ కాలుష్యంపై పార్లమెంట్లో చర్చ జరుగుతుందని, ప్రభుత్వం నుంచి ఏదైనా పరిష్కార మార్గం లభిస్తుందని వెయ్యి కళ్లతో ఎదురు చూసిన ప్రజలకు నిరాశే మిగులుతోంది. సొమ్ము వెచ్చిస్తున్నా ఫలితం సున్నా ప్రజలు కట్టే పన్నుల సొమ్ముతోనే పార్లమెంట్ కార్యకలాపాలు జరుగుతాయి. ఎంపీల వ్యవహార శైలికి అదే ప్రజలు బాధితులుగా మారుతున్నారు. పేదల సమస్యలు ఎప్పటికీ చర్చకు రాకుండాపోతున్నాయి. ఒక్క నిమిషం పార్లమెంట్ సమావేశాలు జరగాలంటే రూ.2.50 లక్షలు ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంత సొమ్ము వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితం మాత్రం సున్నా. చర్చించాల్సిన బిల్లులు, తీసుకురావాల్సిన చట్టాలు ఎన్నో ఉన్నప్పటికీ ఎంపీలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తూ అదానీ, సోరోస్ వివాదంతో కాలం గడిపేస్తుండడం గమనార్హం. ప్రజలను ప్రజాప్రతినిధులే శిక్షిస్తున్నారని, అందుకు మరొకరు అవసరం లేదని రాజకీయ వ్యాఖ్యాత కమలేష్ సింగ్ ఆక్షేపించారు. ఎంపీల వల్ల విలువైన ప్రజాధనం, సమయం వృథా అవుతున్నాయని విమర్శించారు. పార్లమెంట్లో అనవసర విషయాలపై సమయం వెచ్చిస్తూ ముఖ్యమైన అంశాలను పక్కనపెడుతున్నారని తప్పుపట్టారు. కొన్నిసార్లు ఎలాంటి చర్చ జరగకుండానే బిల్లులు చట్టాలుగా మారిపోతున్నాయని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మంచి పరిణామం కాదని అన్నారు. ఇదేనా జవాబుదారీతనం? ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన వేదిక పార్లమెంట్. ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. పార్లమెంట్ కార్యకలాపాలు జరగపోవడంతో ప్రజా సమస్యలపై సమాధానం చెప్పకుండా తప్పుకొనే అవకాశం పాలకులకు లభిస్తోందని, జవాబుదారీతనం ఎక్కడా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య వివాదంతో ఇతర పారీ్టల సభ్యులకు మాట్లాడే వెలుసుబాటు దక్కడం లేదు. కొత్తగా ఎన్నికైన సభ్యులు పార్లమెంట్లో మాట్లాడాలని ఆరాటపడుతున్నప్పటికీ వారిని పట్టించుకొనే నాథుడే ఉండడం లేదు. లోక్సభ, రాజ్యసభలో అదానీ అంశాన్ని కాంగ్రెస్ లేవనెత్తుతుండగా, దాని పోటీగా బీజేపీ ఎంపీలు జార్జి సోరోస్ను ప్రస్తావిస్తున్నారు. మరోవైపు అదానీ, సోరోస్ కాకుండా దేశ సమస్యలపై చర్చ జరగాలని కోరుకుంటున్నామని సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికైనా పట్టువీడాలని సూచించారు. పార్లమెంట్ను కాంగ్రెస్, బీజేపీలు హైజాక్ చేస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ మండిపడ్డారు. ప్రాంతీయ పారీ్టలు ఉన్నాయన్న సంగతే అవి మర్చిపోతున్నాయని ధ్వజమెత్తారు. బూడిదలో పోసిన పన్నీరు పార్లమెంట్ సమావేశాల్లో ఒక నిమిషం వృథా అయ్యిందంటే రూ.2.50 లక్షలు బూడిదలో పోసిన పన్నీరు అయినట్లేనని 2012లో అప్పటి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్ బన్సల్ చెప్పారు. 2021లో పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిష్టంభన కారణంగా రూ.133 కోట్ల ప్రజాధనం వృథా అయినట్లు అప్పట్లో నిపుణులు లెక్కగట్టారు. మరోవైపు పార్లమెంట్ భేటీలు నానాటికీ కుదించుకుపోతున్నాయి. 1952 నుంచి 1957 వరకు కొనసాగిన తొలి లోక్సభ కాలంలో ప్రతిఏటా సగటున 135 రోజుల చొప్పున పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. 2019 నుంచి 2024 దాకా మనుగడలో ఉన్న 17వ లోక్సభ కాలంలో సగటున ఏటా 55 రోజులపాటే పార్లమెంట్ సమావేశాలు జరిగాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పార్లమెంట్లో రచ్చ
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగే పరిస్థితి కనిపించడం లేదు. అధికార, విపక్షాల ధోరణితో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా సభలు వాయిదా పడుతున్నాయి. బుధవారం సైతం ఇదే పరిస్థితి పునరావృతమైంది. లోక్సభ పలుమార్లు వాయిదా పడింది. తొలుత డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్ట సవరణపై జరిగిన చర్చలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ మాట్లాడారు. కోవిడ్ విపత్తు సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సహకరించలేదని ఆరోపించారు. బెనర్జీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తప్పుపట్టారు. ఆయనపై బెనర్జీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ చెప్పారు. ఈ సమయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరగడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత అధికార, విపక్షాల మధ్య అరుపులు కేకలు చోటుచేసుకోవడంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. పునఃప్రారంభమైన తర్వాత జార్జిసోరోస్–కాంగ్రెస్ బంధంపై రగడ జరగడంతో సభ సాయంత్రం 5 గంటల వరకు వాయిదాపడింది. సభ ప్రారంభమైనా గొడవ సద్దుమణగలేదు. దీంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ చెప్పారు. మణిపూర్లో హింసాకాండ యథేచ్ఛగా కొనసాగుతోందని, మానవతా సంక్షోభం నెలకొందని లోక్సభలో కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ జీరో అవర్లో పేర్కొన్నారు. మణిపూర్ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రైల్వే సవరణ బిల్లుకు ఆమోదం రైల్వే చట్టాలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైల్వే సవరణ బిల్లు–2024ను లోక్సభలో ఆమోదించారు. ఈ బిల్లుపై జరిగిన చర్చకు రైల్వే మంత్రి వైష్ణవ్ సమాధానమిచ్చారు. ఈ బిల్లుతో రైల్వే శాఖను ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రాజ్యసభలో నిరసనలు, నినాదాలు ధన్ఖడ్పై విపక్షాలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడంతోపాటు సోరోస్ వ్యవహారంపై పార్లమెంట్ ఎగువ సభలో బుధవారం దుమారం రేగింది. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. చైర్మన్ ధన్ఖడ్పై తాము ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసుపై చర్చించాలని పట్టుబట్టారు. దాంతో ధన్ఖడ్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రి నడ్డా మాట్లాడారు. దేశాన్ని అస్థిరపర్చడానికి కాంగ్రెస్ పార్టీ జార్జి సోరోస్తో చేతులు కలిపిందని ఆరోపించారు. సోరోస్తో కాంగ్రెస్ పెద్దల సంబంధాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. విపక్షాలు చర్చకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు విదేశీ శక్తుల చేతుల్లో పావులుగా మారారని ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ధన్ఖడ్పై రాజకీయ విమర్శలు చేయడం ఏమిటని ప్రతిపక్షాలపై నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు తమ స్థానాల్లో నిల్చొని నడ్డాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికార పక్ష ఎంపీలు కాంగ్రెస్ తీరుపై మండిపడుతూ నినాదాలు చేశారు. తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ధన్ఖడ్ ప్రకటించారు.వినూత్న నిరసన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగకపోవడం, తాము లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం చర్చించకపోవడంపై విపక్ష ఎంపీలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తంచేశారు. బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో బీజేపీ ఎంపీలకు జాతీయ జెండాలు, గులాబీలు అందజేసి స్వాగతం పలికారు. తమ డిమాండ్లపై దృష్టి పెట్టాలని, కీలకమైన అంశాలపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరిగేలా సహకరించాలని అధికార పక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. లోక్సభలో విపక్షనేత అయిన రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రాంగణంలో అటుగా వస్తున్న రక్షణ శాఖమంత్రి రాజ్నాథ్ సింగ్కు కార్డు రూపంలోని జాతీయ జెండాను స్వయంగా అందజేశారు. రాహుల్, ప్రియాంకా గాం«దీతోపాటు డీఎంకే, జేఎంఎం, సీపీఐ, సీపీఎం తదితర పార్టీల ఎంపీలు పార్లమెంట్ మకరద్వారం మెట్ల వద్ద జెండాలు, గులాబీలు చేతబూని నిరసన తెలిపారు. ‘దేశాన్ని అమ్మేయకండి’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. అదానీ గ్రూప్ అక్రమాలపై పార్లమెంట్లో చర్చించాలని విపక్షాలు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రతిపక్ష సభ్యులు నిత్యం పార్లమెంట్ ప్రాంగణంలో వినూత్న రీతుల్లో నిరసన వ్యక్తం చేస్తుండటం తెల్సిందే. -
పార్లమెంట్లో ‘సోరోస్’ రగడ
న్యూఢిల్లీ: కాంగ్రెస్–జార్జి సోరోస్ బంధంతోపాటు అదానీ వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికిపోయాయి. మంగళవారం ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు అదానీ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. పరిస్థితి ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో సభ మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా పడింది. సభ పునఃప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రి నడ్డా మాట్లాడారు. బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జి సోరోస్కు, కాంగ్రెస్ పెద్దలకు మధ్య సంబంధాలున్నాయని ఆరోపించారు.వారంతా చేతులు కలిపారని, ఇండియాను అస్థిరపర్చడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నడ్డా ఆరోపణలపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు ప్రారంభించారు. బీజేపీ సభ్యులు ప్రతిస్పందించారు. సోరోస్తో సంబంధాలపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. నడ్డా ఆరోపణలను కాంగ్రెస్ సభ్యుడు ప్రమోద్ తివారీ ఖండించారు. అదానీ పెద్ద ఎత్తున లంచాలు ఇచి్చనట్లు ఆరోపణలు వచ్చాయని, దీనిపై వెంటనే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నినాదాలు మిన్నంటాయి. దీంతో సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. లోక్సభలోనూ అదే దుమారం సోరోస్తోపాటు భారతదేశ వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ నాయకులు సంబంధాలు కొనసాగిస్తున్నారని లోక్సభలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కిరణ్ రిజిజు ఆరోపించం దుమారం రేపింది. మంగళవారం జీరో అవర్లో ఆయన మాట్లాడారు. తర్వాతవిపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సోరోస్తో కాంగ్రెస్కు సంబంధాలున్నాయంటూ రిజిజు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీకి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో సభాపతి స్థానంలో ఉన్న దిలీప్ సైకియా లోక్సభను మరుసటి రోజుకు వాయిదావేశారు. అంతకుముందు మర్చంట్ షిప్పింగ్ బిల్లు–2024ను కేంద్ర మంత్రి శర్భానంద సోనోవాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. మర్చంట్ షిప్పింగ్ చట్టం–1958 స్థానంలో ఈ బిల్లును తీసుకొచ్చారు. పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన అదానీ వ్యవహారంపై విపక్ష ఎంపీలు మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మోదీ, అదానీ ఫొటోలు ముద్రించి ఉన్న సంచులను ధరించారు. ఈ సంచులకు మరోవైపు ‘మోదీ అదానీ భాయి భాయి’ అని రాసి ఉంది. పార్లమెంట్ మకరద్వారం మెట్ల ముందు కాంగ్రెస్ సభ్యులు రాహుల్ గాంధీ, ప్రియాంకతోపాటు డీఎంకే, జేఎంఎం, సీపీఎం, సీపీఐ తదితర పార్టీలు నిరసన వ్యక్తంచేశారు. మోదీ, అదానీ బంధంపై పెద్ద ఎత్తున నినాదాలు కొనసాగించారు. -
పార్లమెంటులో ‘సోరోస్’
న్యూఢిల్లీ: దేశ వ్యతిరేక కార్యలాపాల ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్జ్ సోరోస్ ఫౌండేషన్తో కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ సంబంధాల వ్యవహారం సోమవారం పార్లమెంటును కుదిపేసింది. దీనిపై ప్రభుత్వ, ప్రతిపక్షాల ఆందోళనలు, పరస్పర ఆరోపణ, విమర్శలతో ఉభయ సభలూ అట్టుడికాయి. సోరోస్ ఫౌండేషన్ నిధులతో నడుస్తున్న ఫోరం ఆఫ్ డెమొక్రాటిక్ లీడర్స్ ఆసియా పసిఫిక్ (ఎఫ్డీఎల్–ఏపీ) అనే సంస్థకు సోనియా కో ప్రెసిడెంట్గా ఎందుకున్నారో చెప్పాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. వారి ఆరోపణలన్నింటినీ కాంగ్రెస్ సభ్యులు తోసిపుచ్చారు. అదానీ అంశంపై బదులివ్వలేకే ఉద్దేశపూర్వకంగా దీన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డాయి. ఇరు పక్షాల ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభలూ కార్యకలాపాలేవీ చేపట్టకుండానే మంగళవారానికి వాయిదా పడ్డాయి. రాజ్యసభ కార్యకలాపాలు మొదలవగానే సోరోస్ అంశంపై చర్చ జరగాలంటూ సభ నాయకుడు జేపీ నడ్డా పట్టుబట్టారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అతి ముఖ్యమైన అంశమని ఆయనన్నారు. నడ్డాకు మద్దతుగా అధికార పక్ష సభ్యులంతా లేచి నిలబడి కాంగ్రెస్కు వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో సభ కాసేపు వాయిదా పడింది. తర్వాత కూడా ఈ అంశంపైనే దుమారం సాగింది. జమ్మూ కశీ్మర్ను భారత్కు సంబంధం లేని ప్రత్యేక ప్రాంతంగా పరిగణించే ఎఫ్డీఎల్–ఏపీ సంస్థతో జార్జ్ సోరోస్ లింకులు ఆందోళన కలిగించే అంశమని నడ్డా అన్నారు. ఇలాంటి వాటి చేతుల్లో కాంగ్రెస్ పావుగా మారిందని ఆరోపించారు. ఎన్డీఏ సభ్యులంతా ఆయనతో గొంతు కలిపారు. తమ డిమాండ్లను పట్టించుకోని చైర్మన్, అధికార పక్షం లేవనెత్తగానే ఈ అంశాన్ని మాత్రం చర్చకు ఎలా అనుమతిస్తారని జైరాం రమేశ్, ప్రమోద్ తివారీ (కాంగ్రెస్) అభ్యంతరం వెలిబుచ్చారు. సభలో లేని సభ్యురాలి ప్రతిష్టకు ఇలా భంగం కలిగించడం సరికాదని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆక్షేపించారు. ‘‘దేశ ప్రతిష్టకు భంగం కలిగించజూసే శక్తులతో పొంచి ఉన్న ప్రమాదాన్ని నిర్లక్ష్యం చేయజాలం. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు దన్నుగా నిలుస్తోందని అభియోగాలున్న సంస్థకు ఈ సభలోని సభ్యురాలే కో ప్రెసిడెంట్ అన్నది మర్చిపోరాదు’’ అని చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ బదులిచ్చారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. చైర్మన్ అధికార పక్షం పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లోక్సభలోనూ ఇవే దృశ్యాలు కని్పంచాయి. అనంతరం పార్లమెంటు బయట కూడా సోరోస్ అంశంపై కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజుతో పాటు బీజేపీ నేతలు సోనియాపై విమర్శలు గుప్పించారు. వాటిని కాంగ్రెస్ నేతలు ఖండించారు.ధన్ఖడ్పై విపక్షాల ‘అవిశ్వాసం’!రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్తో విపక్షాల అభిప్రాయ బేధాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఆయన్ను ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగించే దిశగా అవి పావులు కదుపుతున్నాయి. ఈ మేరకు రాజ్యసభలో అతి త్వరలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ‘‘గత ఆగస్టులోనే విపక్ష ఇండియా కూటమి పక్షాలం ఈ దిశగా ప్రయత్నాలు చేశాం. కానీ ధన్ఖడ్కు మరో అవకాశమివ్వాలనే ఉద్దేశంతో ఊరుకున్నాం. కానీ సోమవారం సభలో ఆయన ప్రవర్తించిన తీరు చూశాక అవిశ్వాస తీర్మానం తప్ప మరో దారి లేదని తేలిపోయింది’’ అని విపక్ష నేతలు కొందరు వెల్లడించారు. ‘‘ధన్ఖడ్ ప్రవర్తన ఎంతమాత్మూ ఆమోదయోగ్యం కాదు. బీజేపీకి ఆ పార్టీ అధికార ప్రతినిధి కంటే కూడా విశ్వాసపాత్రునిగా ఆయన వ్యవహరిస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్తో పాటు సమాజ్వాదీ, తృణమూల్ తదితర పారీ్టలు ఈ విషయంలో కలిసొస్తున్నట్టు సమాచారం. ఆరి్టకల్ 67(బి) ప్రకారం తీర్మానాన్ని రాజ్యసభ సాధారణ మెజారిటీతో ఆమోదించాక లోక్సభ ఆమోదం కూడా పొందితే ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చు. -
కిమ్ కాదు, సోరోస్ కాదు.. ఉపవాసానికే నా ఓటు!
ఓవైపు అంతర్జాతీయ అంశాలపై అనర్గళంగా మాట్లాడి ఆకట్టుకునే విదేశాంగ మంత్రి ఎస్.జైశకంర్ తనలోని సరదా కోణాన్ని ఆవిష్కరించారు. వాక్చాతుర్యంతో సభికులను కడుపుబ్బా నవ్వించారు. ఒక కార్యక్రమంలో ముఖాముఖి సందర్భంగా వ్యాఖ్యాత ఆయనకు ర్యాపిడ్ఫైర్ ప్రశ్న సంధించారు. ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్, భారత్ను విమర్శించే హంగరీ అమెరికన్ కుబేరుడు జార్జ్ సోరోస్ల్లో మీరు ఎవరితో భోజనం చేస్తారని అడిగారు. జైశంకర్ ఏ మాత్రం తడుముకోకుండా, ‘దుర్గా నవరాత్రులు కదండీ! నేను ఉపవాస దీక్షలో ఉన్నా!’ అంటూ బదులివ్వడంతో అంతా పగలబడి నవ్వారు. ఐరాస.. ఓ పాత కంపెనీ ఐక్యరాజ్యసమితి ప్రస్తుత పరిస్థితిపై జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో స్థలాన్ని ఆక్రమించుకుని, మార్కెట్ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చలేని పాత కంపెనీలా మారిందంటూ ఆక్షేపించారు. ఆదివారం ఆయన కౌటిల్య ఆర్థిక సదస్సులో మాట్లాడారు. ‘‘ప్రపంచ దేశాలను నేడు రెండు తీవ్ర సంక్షోభాలు తీవ్రంగా ఆందోళన పరుస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఐరాస ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. కీలకాంశాలను పట్టించుకోకుంటే దేశాలు తమ దారి చూసుకుంటాయి. కోవిడ్ కల్లోలంలోనూ ఐరాస చేసింది చాలా తక్కువ’’ అన్నారు. – న్యూఢిల్లీ -
కార్పొరేట్లకు ‘హిండెన్బర్గ్’ తరహా షాక్!
న్యూఢిల్లీ: కొద్ది నెలల క్రితం పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ను కుదిపేసిన హిండెన్బర్గ్ రీసెర్చ్ తరహాలో మరో సంస్థ దేశీ కార్పొరేట్ గ్రూప్ల అవకతవకలను బయటపెట్టేందుకు సిద్ధమవుతోంది. రాక్ఫెలర్ బ్రదర్స్ ఫండ్, జార్జ్ సొరోస్ వంటి దిగ్గజాల దన్ను గల ఓసీసీఆర్పీ (ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోరి్టంగ్ ప్రాజెక్టు) సన్నద్ధమవుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. యూరప్, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వ్యాప్తంగా ఉన్న 24 లాభాపేక్షరహిత ఇన్వెస్టిగేటివ్ సంస్థలు కలిసి ఈ పరిశోధనాత్మక రిపోరి్టంగ్ ప్లాట్ఫాంను ఏర్పాటు చేసినట్లు వివరించాయి. అవి త్వరలోనే ఏదైనా నివేదిక లేదా వరుస కథనాలను ప్రచురించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. ముందుగా ఒక నిర్దిష్ట కార్పొరేట్ కంపెనీలో విదేశీ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి సంబంధించిన అవకతవకలను బయటపెట్టవచ్చని సంబంధిత వర్గాలు వివరించాయి. అయితే సదరు కార్పొరేట్ సంస్థ పేరును మాత్రం వెల్లడించలేదు. 2006లో ఏర్పాటైన ఓసీసీఆర్పీ వెబ్సైట్ ప్రకారం సంఘటిత నేరాలను శోధించడం సంస్థ ప్రత్యేకత. ఇన్వెస్టర్ జార్జ్ సొరోస్కి చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్, ఫోర్డ్ ఫౌండేషన్, ఓక్ ఫౌండేషన్, రాక్ఫెల్లర్ బ్రదర్స్ ఫండ్ మొదలైనవి దీనికి నిధులు సమకూరుస్తున్నాయి. -
దావోస్లో మోదీపై బిలియనీర్ సొరోస్ ఫైర్..
దావోస్ : ప్రధాని నరేంద్ర మోదీపై హంగరీ అమెరికన్ బిలియనీర్, దాతృత్వశీలి జార్జ్ సొరోస్ దావోస్ వేదికగా నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యయుతంగా అధికార పగ్గాలు చేపట్టిన మోదీ భారత్లో హిందూ రాజ్యాన్ని స్ధాపిస్తున్నారని, ముస్లిం ప్రాబల్య కశ్మీర్లో నియంత్రణలు విధిస్తూ ముస్లింల పౌరసత్వాన్ని లాగేసుకునేలా వారిని బెదరగొడుతున్నారని ఆరోపించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పైనా సొరోస్ విమర్శలు గుప్పించారు. ప్రపంచమంతా తన చుట్టూ తిరగాలని ట్రంప్ కోరుకుంటారని, అధ్యక్షుడు కావాలనే తన కోరిక నెరవేరడంతో అధ్యక్షుడికి రాజ్యాంగం నిర్ధేశించిన పరిమితులను అతిక్రమించారని వ్యాఖ్యానించారు. ట్రంప్ తన చేష్టలతో అభిశంసనను ఎదుర్కొన్నారని అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం కోసం దేశ ప్రయోజనాలను విస్మరించేందుకూ ట్రంప్ వెనుకాడరని, తిరిగి ఎన్నికయ్యేందుకు ఏదైనా చేస్తారని దుయ్యబట్టారు. చదవండి : తదుపరి ప్రధానిగా మళ్లీ మోదీకే మొగ్గు.. -
గూగుల్, ఎఫ్బీలపై సంచలన ఆరోపణలు
దావోస్ : గూగుల్, ఫేస్బుక్లపై బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సొరోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి వినూత్న ఒరవడులకు అవరోధమని, సోషల్ మీడియా కంపెనీలు ప్రజాస్వామ్యానికి చేటని ఆందోళన వ్యక్తం చేశారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఓ సదస్సును ఉద్దేశించి సొరోస్ మాట్లాడుతూ అమెరికన్ ఐటీ దిగ్గజాలకు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ప్రజల ఆలోచనాసరళి, ప్రవర్తనలపై వారికి తెలియకుండానే సోషల్ మీడియా ప్రతికూల ప్రభావం చూపుతోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల రాజకీయాలపై, ప్రజాస్వామ్య పనితీరుపై ఇవి దుష్ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రష్యా జోక్యంతో ఫేస్బుక్, ట్విట్టర్లు పోషించిన పాత్రపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో సొరోస్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సోషల్ మీడియా కంపెనీలు అవి అందించే సేవలకు యూజర్లను ఉద్దేశపూర్వకంగా కట్టిపడేస్తున్నాయని అన్నారు. ఈ పరిణామాలు యుక్తవయసు వారికి తీవ్ర హానికరమని ఆయన హెచ్చరించారు. -
ట్రంప్ వైఫ్యలం తప్పదు..మార్కెట్ల కల కల్లే..
ఒక పక్క అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతోంటే.. మరోపక్క కోటీశ్వరుడు, పెట్టుబడిదారుడు జార్జ్ సోరోస్ మాత్రం ట్రంప్ విఫలం కావడం తధ్యమని జోస్యం చెప్పారు. అంతేకాదు మార్కెట్ల కల ఇక ముగిసినట్టే నని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ చేపటనున్న విధానాలతో అంతర్జాతీయ మార్కెట్లలో మరింత అనిశ్చితి కొనసాగనుందని బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ అభిప్రాయపడ్డారు. స్విట్జర్లాండ్ లోని దావూస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన వార్షిక సమావేశంలో బ్లూమ్ బర్గ్ తో మాట్లాడిన సోరస్ గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మార్కెట్ల అనిశ్చితి పీక్ స్టేజ్ లోఉందన్నారు. ఇకముందు మార్కెట్టు మరింత తడబాటుకు గురవుతాయని, ఇంతకంటే బావుంటాయని తాను భావించడంలేదన్నారు. మొత్తంమీద ట్రంప్ విఫలం కానున్నాడని తాను వ్యక్తిగతంగా విశ్వశిస్తున్నానన్నారు. ముందు ముందు ఎలా వ్యవహరించనున్నాడనే దాన్ని అంచనావేయడం కష్టమని పేర్కొన్నారు. అమెరికా వాస్తవ ఆర్థిక వ్యవస్థ మరింత ఆర్థిక మాంద్యంలోకి కూరుకు పోనున్నదని సొరోస్ హెచ్చరించారు. ఇతర దేశాల ప్రజలు.. చైనీయులు, చమురు ఉత్పత్తి దేశాల ప్రజలు డాలర్ నిల్వలను పోగేసుకున్నారని, ఈ సంక్షోభ కాలంలో వీటిని వాస్తవ సంపదలుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని సోరోస్ చెప్పారు. కాబట్టే ఈ దేశాలు ఇప్పుడు సంపన్నదేశాలుగా మారుతుండడతో, అమెరికన్లకు మరింత రుణాభారం మీదపడుతోందని పేర్కొన్నారు. ఇంధనం, భూతాపం, ఇంధన పరాధీనతకు సంబంధించిన సమస్యలపై తలపడేందుకు భారీస్థాయిలో పెట్టుబడులు అవసరమని సోరోస్ పేర్కొన్నారు. ఆర్థికవృద్ధిలో చైనా దూసుకుపోతుందన్నారు. నవంబర్ 8 ట్రంప్ గెలుపు తర్వాత అమెరికా మార్కెట్లు భారీగా లాభపడిన సంగతి విదితమే. అలాగే బ్రిటన్ ప్రధాని థెరిసా మే పదవిలో కొనసాగుతారని వ్యాఖ్యానించారు. ప్రధాని మే మంగళవారం బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి నిష్క్రమణ చర్చలు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో, బ్రెగ్జిట్ పరిణామాలు రెండు వైపులా ప్రభావితం చేయనున్నాని చెప్పారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డెమొక్రటిక్ పార్టీ హిల్లరీ క్లింటన్ కి జార్జ్ సోరోస్ సుమారు13 మిలియన్ డాలర్లు (సుమారుగా రూ.86 కోట్లు) విరాళం ప్రకటించారు. వైట్హౌస్లోకి రిపబ్లికన్నేత ఎవరూ రావడానికి వీల్లదేని ఆయన తెగేసి చెప్పారు. వలసవాదానికి, ఇస్లాంకు వ్యతిరేకంగా తీవ్రమైన విధానాన్ని వారు ఎంచుకున్నారంటూ రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ల ప్రచార తీరుతెన్నులపై అప్పట్లో మండిపడిన సంగతి తెలిసిందే. -
పౌండు చరిత్రాత్మక పతనం..
బిలియనీర్ ఇన్వెస్టరు జార్జ్ సరోస్ అంచనాలకు అనుగుణంగానే అమెరికా డాలరుతో బ్రిటన్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ విలువ 11 శాతం పతనమయ్యింది. క్రితం రోజు 1.5 డాలర్లకు ఒక పౌండు లభించేది. తాజాగా 1.32 డాలర్లకే వచ్చేంతగా విలువ తగ్గిపోయింది. ఈ మారకపు విలువ 1970వ దశకంలో పౌండు ట్రేడింగ్ కరెన్సీగా మారిన తర్వాత ఇంతలా పతనం కావడం ఇదే ప్రధమం. పైగా గురువారం ప్రపంచంలో అధికంగా నష్టపోయిన కరెన్సీ ఇదే. యూరోతో పోలిస్తే పౌండు 6 శాతం నష్టపోయింది. పౌండు బేర్గా ప్రసిద్ధిగాంచిన జార్జ్ సరోస్ పాతికేళ్ల క్రితం 1992లో ఈ పతనాన్ని అంచనావేసి ఒక బిలియన్ డాలర్ల లాభాన్ని సంపాదించారు. బ్రెగ్జిట్ జరిగితే పౌండ్ భారీగా పతనమవుతుందంటూ రెండు రోజుల క్రితమే సరోస్ వెల్లడించిన అభిప్రాయాన్ని పలు ప్రపంచ ప్రసిద్ధ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు తోసిపుచ్చాయి. అయితే చివరకు ఆయన అంచనాలే నిజమై, 1992లో జరిగిన పతనంకంటే ఈ దఫా మరింత ఎక్కువగా పౌండు పడిపోయింది. సరోస్ మరో ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేశారు. బ్రిటన్ వైదొలిగితే యూరో విలువతో కూడా పౌండు పతనమై, కొద్ది రోజుల్లో యూరోతో సమానమైపోతుందని, ఇది బ్రిటన్వాసులు ఇష్టపడని పరిణామమని అన్నారు.