homeless
-
బ్రెజిల్లో తుపాను బీభత్సం.. ఏడుగురు మృతి
సావోపాలో: బ్రెజిల్లోని సావోపాలోను తాకిన భారీ తుపాను బీభత్సం సృష్టించింది. తుఫాను కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. గంటకు 67 మైళ్ల (108 కిలోమీటర్లు) వేగంతో దూసుకొచ్చిన తుఫాను కారణంగా పలుచోట్ల చెట్లు నేలకూలాయని, కొన్ని ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని సావోపాలో అధికారులు తెలిపారు.తుపాను తీవ్రతకు పలుచోట్ల కార్లు, ఇతర వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. తుఫాను కారణంగా దేశంలోని పలు విమానాశ్రయాలను మూసివేశారు. అనేక ప్రాంతాల్లో తాగునీటికి అంతరాయం ఏర్పడింది. వేలాది ఇళ్లు అంధకారంలో మగ్గుతున్నాయి. సావోపాలో మహానగరంలో 2 కోట్ల 10 లక్షల మంది తుపానుకు ప్రభావితమయ్యారు. ఇది కూడా చదవండి: సాహస యాత్రల్లో దిట్ట,, అనంతపురం నివాసి సమీరా -
ఓ గూటికి చేరిన చెదిరిన అక్షరం
‘ఎవరితోనూ కలవలేను, ఎవరికీ చెందిన దానిని కాను అనే భావనతో జీవితమంతా గడి΄ాను’ అంటోంది ‘హోమ్లెస్’ రచయిత్రి కె. వైశాలి. అస్తవ్యస్తంగా పలకడం, రాయడం అనే డిస్లెక్సియా, డిస్గ్రాఫియా సమస్యలను అధిగమించి తన అనుభవాలను అక్షర రూపంగా మార్చి పుస్తకంగా తీసుకొచ్చింది. ఈ ఏడాది సాహిత్య అకాడమీ యువ పురస్కార్ (ఇంగ్లిష్) అవార్డును గెలుచుకున్న వైశాలి 22 ఏళ్ల వయసులో ముంబైలోని తన ఇంటి నుంచి బయటకు వచ్చి, హైదరాబాద్లో ఎలాంటి వసతులూ లేని హాస్టల్ రూమ్లో ఉంటూ తనలో చెలరేగే సంఘర్షణలకు సమాధానాలు వెతుక్కుంది. దేశంలో పెరుగుతున్న డిస్లెక్సియా బాధితులకు ఈ పుస్తకం ఒక జ్ఞాపిక అని చెబుతుంది. తనలాంటి సమస్యలతో బాధపడుతున్నవారిని కలుసుకుని, వారి అభివృద్ధికి కృషి చేస్తోంది.‘సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకోవడం అంటే నేను ప్రతి ఒక్కరికీ సమర్థురాలిగానే కనిపిస్తాను’ అంటూ ‘హోమ్లెస్’ పుస్తకం గురించి వైశాలి రాసిన వాక్యాలు మనల్ని ఆలోచింప చేస్తాయి. బయటకు చెప్పుకోవడం చిన్నతనంగా భావించే వ్యక్తిగత సమస్యలపై వైశాలి ఒక పుస్తకం ద్వారా తనను తాను పరిచయం చేసుకుంటుంది. వ్యక్తిగత జీవితం, సమాజం పట్టించుకోని మానసిక వైకల్యాలు ఉన్న పిల్లలకు వసతి కల్పించడంలో విఫలమయ్యే విద్యావ్యవస్థలోని లో΄ాలు, నిబంధనలను ధిక్కరించే వారి పట్ల సమాజం చూపే అసహన ం వంటి అంశాలెన్నింటినో వైశాలి కథనం మనకు పరిచయం చేస్తుంది. ‘‘నా బాల్యంలో డిస్లెక్సియా, డిస్గ్రాఫియాల (అస్తవ్యస్తంగా పలకడం, రాయడం) ప్రభావాన్ని అధిగమించడానికే ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ఈ కథను చెప్పడానికి నా బాల్యంలోని అన్ని అంశాలనూ అనేకసార్లు గుర్తుచేసుకున్నాను. పదే పదే పునశ్చరణ చేసుకున్నాను.బాధపెట్టిన బాల్యంనాలో ఉన్న న్యూరో డైవర్షన్స్ నన్ను నిరాశపరచేవి. వాటి వల్ల ఎవరితోనూ కలిసేదాన్ని కాదు. ఎప్పుడూ ఒంటరిగానే ఉండేదానిని. నాలోని రుగ్మతలను ఇంట్లో రహస్యంగా ఉంచేవాళ్లు. నిర్ధారించని రుగ్మతల కారణంగా భయంతో నా రాతలు ఎవరికీ తెలియకుండా దాచేదాన్ని. నాలోని ఆందోళనలను, రుగ్మతలను నేనే పెంచి ఉంటానా? నేను ఇం΄ోస్టర్ సిండ్రోమ్ (తమ ప్రవర్తన, తెలివి తేటలపై తమకే అనుమానాలు ఉండటం)తో బాధపడుతున్నానా?.. ఇలా ఎన్నో సందేహాలు ఉండేవి.అద్దెలేని హాస్టల్ గదిలో..ఇరవై ఏళ్ల వయస్సులో చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం ్ర΄ారంభించాను. నాదైన మార్గం అన్వేషించడానికి మా ఇంటిని వదిలేశాను. అటూ ఇటూ తిరిగి హైదరాబాద్ చేరుకున్నా. నా దగ్గర డబ్బుల్లేవు. మొత్తానికి మురికిగా, ఈగలు దోమలు ఉండే ఓ హాస్టల్లో గది ఇవ్వడానికి ఒప్పుకున్నారు అక్కడి యజమాని. ఆ హాస్టల్ గదికి తలుపులు కూడా సరిగ్గా లేవు. అలాంటి చోట నా అనుభవాల నుంచి ఒక పుస్తకం రాస్తూ, నా పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి ప్రయత్నించాల్సి వచ్చింది. డిస్లెక్సియా బాధితురాలిని, స్వలింగ సంపర్కం, ప్రేమలో పడటం, బాధాకరంగా విడి΄ోవడం, చదువులో ఫెయిల్, అనారోగ్యం, నిరాశ, జీవించడం అంటే ఏంటో అర్థం కాని ఆందోళనల నుంచి నన్ను నేను తెలుసుకుంటూ చేసిన ప్రయాణమే హోమ్లెస్ పుస్తకం.కోపగించుకున్నా.. కుటుంబ మద్దతుఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణకు మా అమ్మ హాజరైంది. ఆమె నాకు ఇచ్చిన ఆసరా సామాన్య మైనది కాదు. అయితే, మొదట నా పుస్తకంలోని రాతల వల్ల అమ్మ మనస్తాపం చెందింది. కానీ, నేనెందుకు అలా నా గురించి బయటకు చె΄్పాల్సి వచ్చిందో ఓపికగా వివరించాను. అవార్డు రావడంతో నాపై ఉన్న కోపం ΄ోయింది’’ అని ఆనందంగా వివరిస్తుంది వైశాలి.సమాజంలో మార్పుకుఅనిశ్చితి, దుఃఖం, గజిబిజిగా అనిపించే వైశాలి మనస్తత్వం నుంచి పుట్టుకు వచ్చిన ఈ పుస్తక ప్రయాణం ఒక వింతగా అనిపిస్తుంది. సైమన్, ఘుస్టర్, యోడా ప్రెస్ సంయుక్తంగా వైశాలి పుస్తకాన్ని మన ముందుకు తీసుకువచ్చాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సెక్రటరీ ్ర΄÷ఫెసర్ మనీష్ ఆర్ జోషీ రాసిన అభినందన లేఖ వైశాలికి ఎంతో ఓదార్పునిచ్చింది. ‘డిస్లెక్సిక్ వ్యక్తుల గురించిన విధానాలు, చట్టం, మార్గదర్శకాలపై నా పుస్తకం ప్రభావం చూపగలదని ఆశాజనకంగా ఉంది. గదిలో ఒంటరిగా కూర్చుని రాసుకున్న పుస్తకం సమాజంలో మార్పుకు దారితీస్తుందని తెలిసి ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది’ అని చెబుతుంది వైశాలి. తన పుస్తకం తనలాంటి సమస్యలు ఉన్న వారితో ఓ ‘గూడు’ను కనుగొన్నట్టు చెబుతుంది వైశాలి. -
పాత జీన్స్ ప్యాంటులతో స్లీపింగ్ బ్యాగ్లు..ఒక్కో జీన్స్కి ఏకంగా..!
మన ఉపయోగించే బట్టల వల్ల కాలుష్యం ఏర్పడుతుందని తెలుసా..!. ఏటా వేల బట్టలు చెత్త కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. వాటిని కాల్చడం వల్ల మరింత కాలుష్యం ఏర్పడుతుంది. అవి మట్టిలో కలిసిపోయేందుకు చాలా టైం పడుతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం పర్యావరణవేత్తలు పలు మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు కూడా. ముఖ్యంగా జీన్స్ లాంటి దుస్తులు అంతతేలిగ్గా మట్టిలో కలిసిపోవు. పైగా దీని తయారీ కోసం ఎన్ని నీళ్లు ఖర్చుఅవుతాయో వింటే షాకవ్వుతారు. అలాంటి పాత జీన్స్ రీసైకిల్ చేసి ఉపయోగపడేలా చక్కగా రూపాందిస్తున్నాడు 16 ఏళ్ల యువకుడు. అంతేగాదు పర్యావరణ సంరక్షణలో తన వంతు పాత్ర పోషిస్తూ అందిరిచేత శెభాష్ అని ప్రశంలందుకుంటున్నాడు. అతనెవరంటే..ఢిల్లీకి చెందిన 16 ఏళ్ల నిర్వాన్ సోమనీ మన ఇంట్లో ఉండే దుస్తులు, వాటికి ఉపయోగించే రంగులు వల్ల ఎంత కాలుష్యం ఏర్పడతుందో తెలుసుకున్నాడు. అదీగాక ఏటా ఈ దుస్తులు వ్యర్థాలు ఎంతలా కుప్పలుగా పేరుకుపోతున్నాయో గమనించాడు. పర్యావరణ సమస్యకు చక్కటి పరిష్కారం చూపించ్చేలా ఏదైనా చేయాలనుకున్నాడు. అలా అతడి దృష్టి జీన్స్ దుస్తులపై పడింది. అప్పుడే.. ఒక్కో జీన్స్ తయారీకి ఏకంగా పదివేల లీటర్లు అవుతుందని, తెలుసుకుని షాక్ అవ్వుతాడు. ఐదు జతల జీన్స్కి ఏకంగా 50 వేల లీటర్ల అవుతాయా అని విస్తుపోయాడు. అంత నీటిని ఖర్చు చేస్తున్న ఈ జీన్స్లు సౌకర్యవంతంగా వినియోగించేలా రీ సైకిల్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలోనే ప్రాజెక్ట్ జీన్స్ పేరుతో స్లీపింగ్ బ్యాగ్లు తయారు చేయడం ప్రారంభించాడు. కొన్ని కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు సహాయంతో నిర్వాణ్ వేల జతలు జీన్స్లు సేకరించాడు నిర్వాన్. వాటితో దాదాపు 900 స్లీపింగ్ బ్యాగ్లను రూపొందించాడు. అవి ఎవరికీ ఇస్తారంటే..ఢిల్లీలో చలికాలంలో రోడ్లపై నిద్రించే నిరాశ్రయులకు స్లిపింగ్ బ్యాగ్లు అందిస్తున్నాడు నిర్వాన్. సాధారణంగా మనం వారికి దుప్పట్లు ఇస్తుంటాం. అయితే అది పరిష్కారం కాదు. అవి కొంతకాలం తర్వాత చిరిగిపోతాయి. నిద్రపోయేలా పరుచుకుని పడుకోవడం కుదరదు కూడా. దీంతో ఈవిషయమై లోతుగా ఆలోచించి మరీ ఇలా స్లీపింగ్ బ్యాగ్లు రూపొందించాడు. అవి బెడ్ మాదిరిగా ఉండి..దాని లోపల పడుకోవచ్చు. ఎలా అంటే.. పడుకునే బెడ్ కమ్ దుప్పటిగా ఉంటుంది. ఇది వారికి సౌకర్యవంతంగా, ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది. మిగతా దుస్తులు కంటే జీన్స్ చాలా దృఢంగా ఉంటుంది. అంత ఈజీగా చీరగదు కాబట్టి నిరాశ్రయులకు, అభాగ్యులకు ఇది బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నాడు నిర్వాన్. తనకు ఈ ఆలోచన రావడానికి కారణం వాళ్లమ్మ దుస్తుల దుకాణమేనని చెబుతున్నాడు. అక్కడ చాలా మెటీరియల్లు కుట్టగా చాలా దుస్తుల వేస్టేజ్ వస్తుంది. వాటిలో కొంత మేర ఏదో రకంగా ఉపయోగిస్తాం. మిగతా చాలా వరకు వేస్ట్ అయ్యేది. దాన్ని ఉపయోగిస్తూ ఏదైనా చేయగలనా అనుకున్నాను అలా ఈ స్లీపింగ్ బ్యాగ్లు తయారు చేసినట్లు వివరించాడు. గతేడాది టర్కీలో భూకంపం వచ్చి నిరాశ్రయులుగా మారిన ప్రజల కోసం దాదాపు 400 స్లీపింగ్ బ్యాగ్లను అందజేశాడు నిర్వాన్. మన అలమార్లో వృధాగా పడి ఉన్న జీన్స్ని అతడి కంపెనీకి అందజేస్తే మన వంతుగా పర్యావరణ సంరక్షణలో బాధ్యత తీసుకున్నట్లే అవుతుంది. ఈ పర్యావరణ కోసం అందరూ ఇలాంటి పలు కార్యక్రమాలు చేసి మన పుడమతల్లిని కాలుష్యం కోరల నుంచి కాపాడుకుందాం!.(చదవండి: ఆరు తరాలు, 185 మంది సభ్యులు..ఇప్పటికి ఒకే ఇంటిలో..) -
ఆరేళ్ల క్రితం ఇల్లు లేదు... ఇప్పుడు మిలియనీర్
కాలిఫోర్నియా: ఆరేళ్ల క్రితం నిలువ నీడలేని అమెరికన్ మహిళ నక్కతోక తొక్కారు. అదృష్టం లాటరీ రూపంలో తలుపు తట్టి రాత్రికి రాత్రి కోట్లకు పడగలెత్తారు. లాటరీలో 50 లక్షల డాలర్లు గెలుచుకున్నానని తెలియగానే ఆమె మొదట నమ్మలేదు. అది నిజమేనని అర్థమయ్యాక ఆమె ఆనందానికి అంతేలేదు. కాలిఫోర్నియాకు చెందిన లూసియా ఫోర్సెథ్ను చాలా కాలంగా ఆర్థిక కష్టాలు వేధిస్తున్నాయి. ఆరేళ్ల క్రితం ఇల్లు కూడా లేదు. కష్టపడి చదివి డిగ్రీ సంపాదించారు. చిన్న ఉద్యోగం వచ్చింది. కారులో ఆయిల్ కొట్టించినప్పుడు చిల్లర లేక అయిష్టంగానే లాటరీ టిక్కెట్ తీసుకున్నారు. దాంతోనే ఆమె ఇంట డాలర్ల వర్షం కురిసింది. ఈ ఏడాది లూసియా పెళ్లి చేసుకోనున్నారు. జీవిత భాగస్వామితో పాటు ఈ లాటరీ టిక్కెట్ తన జీవితాన్నే మార్చేసిందని సంబరపడుతున్నారు. -
Sister Lissy Chakkalakkal: ఈ స్కూల్లో పిల్లలకు ఇళ్లులేకపోతే టీచర్లే ఇళ్లు కట్టిస్తారంట!!
కొందరు టీచర్లు స్టూడెంట్స్ పట్ల దయతో బుక్స్ కొనిస్తారు. బూట్లు కొనిస్తారు. ఫీజులు కడతారు. బట్టలు కుట్టిస్తారు. కాని కేరళలో ఈ టీచర్ కథ వేరు. ఆమె ఏకంగా ఇల్లే కట్టించి ఇస్తుంది. ఇది నిజం. గత 7 సంవత్సరాలలో 150 ఇళ్లు స్టూడెంట్స్కు కట్టి ఇచ్చింది. టీచర్ల విశాలమైన మనసుకు గిన్నెస్ రికార్డు ఉంటే అది ఈమెకే దక్కుతుంది. ఒక టీచర్గా పని చేస్తే ఆ టీచర్కు ఒక సైన్యం తయారవుతుందని ‘సిస్టర్ లిజీ చక్కలకల్’ను చూస్తే అర్థమవుతుంది. కొచ్చిలో ‘అవర్ లేడీస్ గర్ల్స్ స్కూల్’ ప్రిన్సిపాల్గా పని చేస్తున్న ఈ 53 ఏళ్ల నన్ తన విద్యార్థినులపై కురిపిస్తున్న దయ అసామాన్యమైనది. 2012 నుంచి నేటి వరకు ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఆమె తన విద్యార్థినుల కోసం మొత్తం 150 ఇళ్లు కట్టించింది. ప్రభుత్వమో, వ్యవస్థో, సంస్థో చేయాల్సిన పని కేవలం ఒక టీచర్గా ఆమె సాధించింది. ఎలా? ఎందుకు? ఇంటికి వెళ్లి చూడాలి త్రిశూర్లో ఎనిమిది మంది సంతానంలో ఒకదానిగా జన్మించిన లిజీ మిగిలిన తోబుట్టువులందరూ పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అవగా తాను మాత్రం దైవ మార్గంలో మానవ సేవ చేయడానికి అంకితమైంది. కేరళలోని ‘ఫ్రాన్సిస్కన్ మిషనరీస్’లో సభ్యురాలయ్యి తమ మిషనరీ నడిపే స్కూలు ఉపాధ్యాయనిగా పని చేయడం మొదలెట్టింది. కాని టీచర్ పని కేవలం పాఠాలు చెప్పడం కాదు. విదార్థికి సంబంధించిన బాగోగులు కూడా గమనించడం. అందుకే లిజీ స్కూల్ అయ్యాక ‘విద్యార్థుల ఇంటికి వెళ్లి పరిశీలించే’ కార్యక్రమాన్ని స్వీకరించింది. కాని ఆ పరిశీలనలు ఆమెను విపరీతంగా డిస్టర్బ్ చేశాయి. ‘చాలామంది విద్యార్థినులకు అసలు ఇళ్లే లేవు. చాలామంది ఒక్క గది అద్దె ఇళ్లలో ఉంటున్నారు. వయసొచ్చిన అమ్మాయిలకు చాటు లేదు. భద్రత లేదు. వీరికోసం ఏదైనా చేయాలి అనిపించింది’ అంటుంది లిజీ. 2012లో ఒక విద్యార్థిని ఇంటికెళితే ఆ విద్యార్థిని కుటుంబం ఒక పాలిథిన్ షీట్ కప్పుతో ఉన్న గుడిసెలో జీవిస్తున్నట్టు ఆమె గమనించింది. తాగుడు వల్ల తండ్రి చనిపోగా తల్లి పిల్లలను సాకుతోంది. ఆ స్థలం వారిదే అని తెలుసుకుని అక్కడ ఇల్లు కట్టించి ఇవ్వడానికి ఆమె సంకల్పం తీసుకుంది. 2014 నుంచి హౌస్ ఛాలెంజ్ అందరూ మొక్కలు నాటే ఛాలెంజ్, ఐస్ బకెట్ ఛాలెంజ్ లాంటివి చేస్తుంటే లిజీ ‘హౌస్ ఛాలెంజ్’ తీసుకుంది. అవును. ఇల్లు లేని తన విద్యార్థినులకు ఇల్లు కట్టించే ఛాలెంజ్ అది. కాని అందుకు డబ్బు? ఇక్కడే ఆమెకు తన ప్రస్తుత విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఒక సైన్యంగా పనికొచ్చారు. ‘మా స్కూల్లో చదువుకునే విద్యార్థినులు వారానికి ఒకసారి ఒక రూపాయి డొనేట్ చేయాలి. అలాగే పుట్టినరోజులు జరుపుకోకుండా అందుకు అయ్యే ఖర్చును డొనేట్ చేయాలి. ఆ డబ్బును ఇల్లు కట్టేందుకు ఉపయోగిస్తాను. అంతే కాదు... మా పూర్వ విద్యార్థులను సహాయం అడుగుతాను. ఊళ్లోని దాతలను సంప్రదిస్తాను. నా ఉద్దేశంలోని నిజాయితీని అర్థం చేసుకుని అందరూ సాయం చేస్తారు. అంతెందుకు.. నేను ఇల్లు కట్టివ్వమంటే మేస్త్రీలు కూడా తక్కువ కూలి తీసుకుని పని చేస్తారు. అలా ఒక్కో ఇల్లు కట్టుకుంటూ వస్తున్నాను’ అంటుంది లిజీ. అయితే ఆ ఇళ్లు హల్కాడల్కా ఇళ్లు కాదు. కచ్చితమైన మంచి రూపం, నాణ్యత ఉంటాయి. ఒక సెంట్ లేదా రెండు సెంట్ల స్థలంలో 500 చ.అడుగుల నుంచి 600, 700 చదరపు అడుగుల ఇళ్లను ఆమె కట్టి ఇస్తుంది. 5 లక్షల నుంచి 10 లక్షల వరకూ ఒక్కో ఇంటికి వెచ్చిస్తుంది. ఎలా ఎంపిక? సరే. ఒక స్కూల్లో ఎంతో మంది విద్యార్థినులకు సొంత ఇల్లు ఉండదు. మరి సిస్టర్ లిజీ ఎవరికి ప్రాధాన్యం ఇస్తుంది అనంటే దానికి ఆమె ఒక పద్ధతి పెట్టుకుంది. ‘నేను కట్టిచ్చే ఇళ్లు చాలామటుకు వితంతు స్త్రీలకు అయి ఉంటాయి. లేదా భర్త మంచం పట్టి పిల్లలు దివ్యాంగులు అయితే వారికి ప్రాధాన్యం ఇస్తాను. దారుణమైన పేదరికంలో ఉంటే వారికి కట్టి ఇస్తాను. వారి పరిస్థితులు చూడగానే మనకు తెలిసిపోతుంది ఇళ్లు కట్టించి ఇవ్వాలా వద్దా అని’ అంటుందామె. లిజీ కట్టించి ఇచ్చే ఇళ్లలో హాల్, కిచెన్, షాపు పెట్టుకుని బతకాలంటే ఆ ఇంటిలోనే వీధిలోకి ఒక గది ఇలా ప్లాన్ చేసి కట్టి ఇస్తుంది. ‘ఈ దేశంలో ఇల్లు లేని వారే ఉండకూడదు అని నా కోరిక’ అంటుంది సిస్టర్ లిజీ. స్థలాలు కూడా ఇస్తున్నారు సిస్టర్ లిజీ ఇంత వరకూ స్థలాలు ఉండి అక్కడ ఇళ్లు కట్టుకోలేని వారికి ఇల్లు కట్టి ఇచ్చేది. ఇప్పుడు ఆమె ప్రయత్నం చూసి స్థలదాతలు కూడా ముందుకు వస్తున్నారు. ‘మేము భూమి ఇస్తాం. మీరు పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వండి’ అని ఇస్తున్నారు. తాజాగా రంజన్ వర్గీస్ అనే దాత 70 సెంట్ల స్థలం దానం చేస్తే సిస్టర్ లిజీ ఆ స్థలంలో 12 ఇళ్లు కట్టించి తన పేద విద్యార్థినులకు ఇచ్చింది. సొంత ఇంటిలో అడుగుపెట్టేటప్పుడు ఆ కుటుంబాల కళ్లల్లో కనిపించే ఆనందం వర్ణనకు అతీతం. ఆ విద్యార్థినులు సిస్టర్ లిజీని సాక్షాత్తు దైవదూతలా చూస్తారు. ఇంతకాలం గురుదక్షిణ గురించి విన్నాం. కాని సిస్టర్ లిజీ సేవ చూస్తే గురుదక్షిణ అనేది చిన్నమాట అనిపిస్తుంది. ఇలాంటి గురువులకు ఎటువంటి దక్షిణ ఇవ్వలేం. కాని ఈ స్ఫూర్తిని కొనసాగించి చేయగలిగిన శక్తి వచ్చినప్పుడు ఇలా లేని వారికి గూడు ఏర్పాటు చేయడమే అసలైన గురుదక్షిణగా భావిస్తే లిజీ ఆశించినట్టు ఇళ్లు లేనివారే ఉండని రోజు తప్పక వస్తుంది. చదవండి: Zinc Rich Diet: వీటిలో జింక్ పుష్కలంగా ఉంటుంది.. ఇవి తింటే! -
అమ్మమ్మ లాంటి ప్రభుత్వం ఉండాలి
ఒడిశా: తండ్రి చనిపోతాడు. తల్లి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. వాళ్లు ఐ.ఏ.ఎస్.లు, ఐ.పి.ఎస్.లు అవుతారు. (లేదా) తల్లి చనిపోతుంది. తండ్రి పిల్లల్ని వదిలేసి వెళ్లిపోతాడు. వాళ్లను అమ్మమ్మ చేరదీస్తుంది. చాలావరకు ఇలాగే జరుగుతుంది. తండ్రికి పిల్లలెందుకు పట్టరో తల్లిని తీసుకెళ్లిన ఆ దేవుడికే తెలియాలి. మూడేళ్ల క్రితం తల్లి చనిపోయి, తండ్రి వదిలేసి పోతే విమలమ్మే ఇద్దరు మనవరాళ్లను (8 ఏళ్లు, 4 ఏళ్లు) మనవడిని (6 ఏళ్లు) సాకుతోంది. ఏ ప్రభుత్వ రికార్డులలో లేని ఈ కుటుంబం ఒడిశాలోని అంగుల్ జిల్లా, కిషోర్ నగర్ తాలూకా, బైసాన గ్రామంలో ఉంది. మొన్నటి వరకు మట్టి గుడిసెలో ఉండేవారు. వర్షాలకు అది మెత్తబడి, కూలిపోవడంతో గ్రామ శివారులో కొత్తగా కట్టిన స్వచ్ఛ భారత్ మరుగుదొడ్డిలో తల దాచుకుంటున్నారు. తలే దాచుకుంటున్నారు. చదవండి: (ఈ చిన్నారులకు దిక్కెవరూ...! ) వంట, స్నానాలు ఆరు బయట. ఆ నలుగురే ఒకరికొకరు నా అన్న వాళ్లు. పిల్లల్ని ఇంట్లో వదిలేసి ఏ రోజుకారోజు పని వెతుక్కోడానికి వెళ్లొస్తుంటుంది విమలమ్మ. వయసు మీద పడి ఇప్పుడు ఏ పనీ చేయలేకపోతోంది. ఆ కష్టాలను ఊహించుకోవలసిందే. పై నుంచి తల్లి తన తల్లిని, బిడ్డల్ని చూసిందో ఏమో, ఆమే పంపినట్లుగా ఒక సామాజిక కార్యకర్త వాళ్లను చూశాడు. పంచాయితీ ఆఫీసులో తాత్కాలికంగా గూడు ఏర్పాటు చేయించాడు. ఆ నలుగురు పొట్టల్ని నింపడానికి ప్రభుత్వం దగ్గర బియ్యం, పప్పులు ఉప్పులు ఉన్నాయి. ఆమెకు పింఛను ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి. పిల్లల్ని చేర్చడానికి బడులు ఉన్నాయి. నివాసం ఉంచేందుకు షెల్టర్లు ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర ఇన్ని ఉన్నా, తీసుకోడానికి వీళ్ల దగ్గర పౌరులుగా ఏ గుర్తింపూ లేదు. కనీసం ఆధార్ కార్డు లేదు. అవన్నీ వచ్చేవరకు పంచాయితీ కార్యాలయం లో ఉండేందుకైతే అనుమతి వచ్చింది. అక్కడికే సంతోషంగా ఉంది విమలమ్మ. విమలా ప్రధాన్ పూర్తి పేరు. పిల్లలకు ఇవేమీ తెలియదు. తల్లి లేకపోవడం పేదరికం. అమ్మమ్మ దగ్గర ఉండటం రాజరికం. పేదలందరికీ అమ్మమ్మ లాంటి ప్రభుత్వం ఉండాలి. వారిని ప్రభుత్వం దగ్గరకు చేర్చేందుకు అమ్మ లాంటి యాక్టివిస్ట్ లు ఉండాలి. -
వరద విషాదం..43 మంది మృతి
న్యూఢిల్లీ/బెంగళూరు/తిరువనంతపురం/సాక్షి, ముంబై/ పింప్రి: కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్నాయి. మహారాష్ట్రలో వరదల కారణంగా 27 మంది మరణించారు. ముఖ్యంగా సాంగ్లీ జిల్లాలోని పలుస్ తాలూకాలో వరద బాధితులతో వెళ్తున్న బోటు బోల్తా పడటంతో 9 మంది మృత్యువాత పడ్డారు. కర్ణాటకలో 9 మంది, కేరళలో నలుగురు, తమిళనాడులోని కోయంబత్తూరులో ఇద్దరు, ఒడిశాలో ఒకరు వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు చరిత్రలోనే అత్యధికంగా నీలగిరి జిల్లా అవలాంచి అడవుల్లో 82 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. వివిధ రాష్ట్రాల్లో వరదల్లో చిక్కుకున్న లక్షలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇళ్లు నేలమట్టం కావడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వానలు, వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్డు, రైల్వే రవాణా స్తంభించింది. వరద బాధిత రాష్ట్రాల్లో సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ నేత రాహుల్ పిలుపునిచ్చారు. ఐదు జిల్లాల్లో అత్యధిక ప్రభావం మహారాష్ట్రలోని పుణే, సతారా సాంగ్లీ, కొల్హాపూర్, షోలాపూర్ జిల్లాల్లో వరదల కారణంగా ఇప్పటి వరకు 27 మంది మరణించినట్టు పుణే డివిజన్ కమిషనర్ దీపక్ మైసేకర్ తెలిపారు. ముఖ్యంగా సాంగ్లీ పలుస్ తాలుకాలో కృష్ణా, యేర్లా నదీ సంగమంలో వరద తీవ్రతకు పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గురువారం ఉదయం పలుస్ గ్రామస్తులను తరలిస్తున్న బోటు బోల్తా పడింది. దీంతో 14 మంది గల్లంతు కాగా 15 మంది సురక్షితంగా బయటపడ్డారు. సహాయక సిబ్బంది 9 మృతదేహాలను వెలికితీశారు. సాంగ్లీ జిల్లా జైలు వరద నీటిలో చిక్కుకుంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆ ప్రాంతానికి విమానంలో వెళ్లి రక్షణ, సహాయక చర్యలను పర్యవేక్షించారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో ఫోన్లో మాట్లాడారు. సాంగ్లీలో పరిస్ధితిని అదుపులోకి తెచ్చేందుకు ఆల్మట్టి డ్యాం నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కోరారు. వరదల కారణంగా కొల్హాపూర్–మిరజ్ మార్గంలో రైళ్లను రద్దు చేశారు. పుణే–బెంగళూర్ జాతీయ రహదారి దెబ్బతినడంతో పుణే–షోలాపూర్ రహదారి మీదుగా వాహనాలను మళ్లించారు. సాయం అందించండి: యడియూరప్ప కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు 9 మంది చనిపోగా 43 వేల మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యమంత్రి యడియూరప్ప బెళగావిలో మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు రూ.5వేల కోట్లు అవసరమవుతాయని, దాతలు ముందుకు రావాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సీఎం సహాయ నిధికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ సుధామూర్తి రూ.10 కోట్లు అందజేయనున్నట్లు ప్రకటించారు. కేరళలోని ఇడుక్కి జిల్లాలో భారీ వర్షాలు, కొండచెరియాలు విరిగిపడటంతో ఏడాది చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. -
చిన్నారులకు కేటీఆర్ సాయం
సాక్షి, హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉండే తెలంగాణ అపద్ధర్మ మంత్రి కేటీఆర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలపై వేగంగా స్పందించే కేటీఆర్.. గతంలో పలువురికి సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కష్టాల్లో ఉన్న చిన్నారులకు తనవంతు సాయం అందించడానికి ముందుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే హెల్పింగ్ హ్యాండ్స్ హ్యూమానిటీ పేరుతో ఓ వ్యక్తి నిరాశ్రయులైన చిన్నారులను చేరదీసి వారికి అండగా నిలబడ్డాడు. చాలా కాలంగా పిల్లల బాగోగులు చూసుకుంటున్న ఆ వ్యక్తికి ఇటీవల కాలంలో నిధుల కొరత తలెత్తడంతో వారి పోషణ భారంగా మారింది. దీంతో ఆ పిల్లలు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యలను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. అయితే ఆ పోస్టు చూసిన కేటీఆర్ స్పందించారు. ఆ పిల్లలకు తన వ్యక్తిగతంగా 10 లక్షల రూపాయలు అందజేయనున్నట్టు ప్రకటించారు. అలాగే ఆ మొత్తానికి సంబంధించిన చెక్ను ఎవరికి అందజేయాలో తెలుపాల్సిందిగా ఆ నెటిజన్ను కోరారు. దీంతో ఆ నెటిజన్ వారి వివరాలను కేటీఆర్కు పంపించారు. I’ll contribute 10 lakhs in personal capacity. Who & where do I send the cheque to? https://t.co/t5bNu3GFKk — KTR (@KTRTRS) 6 November 2018 -
యోగి.. సడెన్ విజిట్
సాక్షి, లక్నో : ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం రాజధానిలోని బలరామ్ పూర్ ప్రభుత్వాసుత్రి, నిరుపేదల కోసం కొత్తగా నిర్మించిన షెల్టర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిచారు. అంతేకాక ప్రభుత్వ షెల్టర్లలో రాత్రిపూట తలదాచుకుంటున్న నిరుపేదలతో మాట్లాడారు. ప్రభుత్వ షెల్టర్లలోని మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు. ఉత్తర్ ప్రదేశ్లో ఈ ఏడు చలి తీవ్రంగా ఉండడంతో పేదల కోసం సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఇండ్లులేని, ఇతర పేదల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా షెల్టర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చలి నుంచి కాపాడుకునేందుకు అవసరమైన దుస్తులు, దుప్పట్లను ప్రభుత్వం అందించింది. ప్రభుత్వం అందించిన వసతులు పేదలకు అందుతున్నాయో? లేదో? తెలసుకునేందుకు ఇలా వచ్చానని యోగి చెప్పారు. షెల్టర్లను పరిశీలించాక.. అందులో హీటర్లను ఏర్పాటు చేయాలని ఆయన జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. -
అల్లాడుతున్న తెలుగు కుటుంబాలు
-
అల్లాడుతున్న తెలుగు కుటుంబాలు
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో ఇర్మా హరికేన్ ధాటికి వేల సంఖ్యలో తెలుగు కుటుంబాలు అల్లాడుతున్నాయి. ఒక్క ఫ్లోరిడాలోనే దాదాపు ఆరు వేల వరకు తెలుగు కుటుంబాలున్నాయి. తీర ప్రాంతాల్లో ఇర్మా ప్రభావం తీవ్రంగా ఉండటంతో అక్కడి అధికారులు ప్రజలను వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో నిరాశ్రయు లైన తెలుగు ప్రజలకు ఇతర రాష్ట్రాలు, నగరాల్లోని తెలుగువారు బాసటగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఫ్లోరిడా నుంచి దాదాపు వెయ్యి తెలుగు కుటుం బాలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడి తెలుగు సంఘాలు అప్రమత్తమై ఇర్మా బాధితుల్లో ఉన్న తెలుగువారి జాడ కోసం ప్రయత్నిస్తున్నాయి. సమీపంలోని ఇతర నగరాల్లో ఉన్న తెలుగువారితో సంప్రదించి వీలైనంత ఎక్కువ మందికి ఆశ్రయం కల్పించేలా చూస్తున్నాయి. ఇక వేరే నగరాల్లోని స్నేహితులు, బంధువుల వద్దకు వెళ్తున్నవారి సంఖ్యా ఎక్కువగానే ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక గవర్నర్ రిక్ స్కాట్ పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సురక్షిత కేంద్రాల్లో దాదాపు 50 వేల మంది వరకు తలదాచుకుంటున్నారు. ఇందులో కొన్ని తెలుగు కుటుంబాలు కూడా ఉన్నాయి. ప్రాణనష్టం లేకుండా యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. -
సోషల్ మీడియాలో తాజా సంచలనం
-
జోగిపేటలో ఉద్రిక్తత
జోగిపేట - సంగారెడ్డి జాతీయ రహదారి పక్కన మార్కెట్ కమిటీ ముందు ఉన్న వడ్డెరుల గుడిసెల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం ఉదయం పోలీసు, రెవెన్యూ, మార్కెటింగ్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో గుడిసెల తొలగింపు జరిగింది. దీంతో నిరాశ్రయులైన 30 కుటుంబాలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమకు ప్రత్యామ్నయ స్థలం చూపించకుండా.. తమ గుడిసెలు కూల్చేశారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. వీరికి వేరొక చోట స్థలాలు చూపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తహశీల్దార్ హామీ ఇచ్చారు. భారీ పోలీసు పహారా.. రెండు జేసీబీలు కార్యక్రమంలో పాల్గొనటంతో.. పెద్ద ఎత్తున రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. -
ఫోన్ చేస్తే.. సాయం
సాక్షి,న్యూఢిల్లీ: చలితో వణుకుతూ అపాయకరస్థితిలో ఎవరైనా రోడ్లపక్కన, ఫుట్పాత్లపై కనిపిస్తే ‘మనకెందుకులే..’ అనుకోకుండా ఒక్క ఫోన్కాల్ చేస్తే ఆ బాధితుడి ప్రాణాలు నిలపవచ్చు. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాట్స్ అంబులెన్స్లు మీరు ఫోన్ చేసిన నిమిషాల్లో అక్కడి వచ్చి అవసరమైన వైద్యసాయం అందిస్తాయి. పరిస్థితి బట్టి శరణార్థుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెంట్ల వరకు తరలిస్తారు. చలికారణంగా ఢిల్లీలోని అనాథలు మరణించ కుండా చూడడం క్యాట్స్అంబులెన్స్ (సెంట్రలై జ్డ్ అంబులెన్స్ ట్రామా సర్వీస్-సీఏటీఎస్) సిబ్బంది ముఖ్యవిధి. క్యాట్స్ సిబ్బంది చెబుతున్న ప్రకారం రాత్రి చలిలో ఫుట్పాత్లపై పడుకునే నిరాశ్రయులకు అవసరమైన వైద్యసహాయం అందించడంతోపాటు వారిని దగ్గర్లోని నిరాశ్రయుల శిబిరాలకు తరలించడం వీరి ముఖ్య విధుల్లో ఒకటి. ఎవరు 102కి ఫోన్ చేసినా తాము స్పందించి అక్కడికి చేరుకుంటామని వారు పేర్కొంటున్నారు. అందుబాటులో 150 అంబులెన్స్లు: ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో మొత్తం 150 క్యాట్స్ అంబులెన్స్లను అందుబాటులోకి తెచ్చారు. వీటన్నింటినీ 102 అత్యవసర నంబర్కు అనుసంధానం చేశారు. ఏడాది పొడవునా అందుబాటులో ఉండే ఈ అంబులెన్స్లు రోగులతోపాటు రోడ్డు ప్రమాదాల బారిన పడినవారిని సైతం ఆస్పత్రులకు చేరవేస్తుంటాయి. గర్భిణులను ఆస్పత్రులకు చేర్చడం, ప్రసవం అనంతంర ఇళ్లకు తీసుకెళ్లడం వంటి సేవలు కూడా ఉపయోగించుకోవచ్చు. ఢిల్లీ హైకోర్టు ఆదేశంతో అమలు: చలికాలంలో ఢిల్లీలో నిరాశ్రయులైన అనాథలు చలికి వణుకుతూ మరణి స్తున్న కేసులు పెరగడంతో ఢిల్లీ హైకోర్టు ప్రత్యేకంగా చొరవ తీసుకుని వారి సంరక్షణార్థం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. చలి కారణంగా ఎవరైనా అనాథ మరణిస్తే దానికి ఢిల్లీ నగర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. కోర్టు ఆదేశాలతో ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో మొత్తం 150 వరకు రాత్రిపూట వసతి శిబిరాలను ఏర్పాటు చేశారు. అనాథలకు రక్షణ కల్పించడంలో భాగంగానే ప్రభుత్వం క్యాట్స్ అంబులెన్స్లను అందుబాటులోకి తెచ్చింది. -
నిర్భాగ్యులకు వసతి
నిజామాబాద్ కార్పొరేషన్, న్యూస్లైన్: మూడు, నాలుగు రోజులుగా కార్పొరేషన్ అధికారులు నగరంలో తిరుగుతూ నిరాశ్రయుల వివరాలను సేకరిస్తున్నారు.సుప్రీంకోర్టు సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఏ నీడా లేనివారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ‘షెల్టర్ ఫర్ హోం లెస్’ నిర్వహణ బాధ్యతను నగర, పురపాలక సంస్థలకు అప్పగించింది. ఈ మేరకు సెప్టెంబర్లోనే మార్గదర్శకాలు జారీ అయ్యాయి. నగరాలలో వాడకుండా వదిలేసిన ప్రభుత్వ భవనాలు, సామాజిక భవనాలను నివాసయో గ్యంగా తీర్చిదిద్ది అభాగ్యులకు వసతి కల్పిస్తారు. అలాంటి భవనాలు లేకపోతే కొత్తవాటిని నిర్మిస్తారు. వీటిలో తాగునీరు, స్నానం గదులు, మరుగుదొడ్లను ఏర్పాటు చే స్తారు. భోజన వసతి కూడా కల్పిస్తారు. నిర్వహణకు కమిటీలు షెల్టర్ల నిర్వహణకు కమిటీలను నియమిస్తారు. ఈ కమిటీలకు నగరపాలక సంస్థ, మున్సిపాలిటీ కమిషనర్లు చైర్మన్లుగా వ్యవహరిస్తారు. టౌన్ప్లానింగ్ అధికారులు, ఎంహెచ్ఓ, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మెప్మా పీఆర్పీలు, మహిళా సంఘాలకు చెందిన పట్టణ సమాఖ్యల బాధ్యులు, ఎన్జీఓలతో కూడిన పదిమంది సభ్యులతో కార్యనిర్వా హక కమిటీ ఉంటుంది. ఒక్కో వసతి గృహంలో 50 మందికి సరిపడా వసతులు కల్పించేందుకు ప్లేట్లు, బకెట్లు, దుప్పట్లు, మంచాలు కొనుగోలు చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వం రూ. 3.50 లక్షలు ఖర్చు చేయనుంది. భోజన వసతులకు ఏడాదికి రూ. 9.42 లక్షలు కేటాయించనున్నారు. ఇందుకోసం అయ్యే వ్యయంలో 75 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం, 25 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించవలసి ఉంటుంది. వసతి గృహంలో ఇద్దరు కేర్ టేకర్లను నియమించి ఒక్కొక్కరికి రూ.5000 వేతనాలు చెల్లిస్తారు. నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు నగరంలో రాత్రి వేళలో బస్టాండ్లు, రైల్వేస్టేషన్, రైల్వేబ్రిడ్జి కింది, పార్కులలో ఉన్న వారి వివరాలను సేక రి స్తున్నారు. ఇప్పటి వరకు 90 మంది వివరాలు సేకరించామని, నగరం మొత్తం సర్వే చేసి నిరాశ్రయులను గుర్తిస్తామని అన్నారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక పం పిస్తామని అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ అధికారి మల్లికార్జున్ తెలిపారు. జనాభా లక్షకు పైగా ఉన్న నగరాలు, పట్టణాలలో ఎస్యూహెచ్ పథకాన్ని అమలు చేయనున్నటు ఆయన తెలిపారు. జిల్లాలోని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ మున్సిపాలిటీలకు ఈ మేరకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి.