illegal Weapons
-
ఆప్ ఎమ్మెల్యే, సహచరుల ఇళ్లపై ఎసీబీ దాడులు.. భారీగా నగదు, ఆయుధాలు స్వాధీనం
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, అతని సహచరులకు చెందిన పలు ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసు విభాగం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) శుక్రవారం దాడులు నిర్వహించింది. 2020లో ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఉద్యోగాల భర్తీలో జరిగిన అవకతవకలపై ఏసీబీ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు సంబంధించి రెండేళ్లనాటి అవినీతి కేసులో ఓక్లా నియోజకవర్గ ఎమ్మెల్యే అనమతుల్లా ఖాన్ను ఏసీబీ శుక్రవారం ప్రశ్నించింది. ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, అతని వ్యాపార భాగస్వామి హమీద్ అలీఖాన్ మసూద్ ఉస్మాన్కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ఎమ్మెల్యే సహచరుడి నుంచి అక్రమంగా కలిగి ఉన్న ఓ పిస్తోల్, బుల్లెట్లు, 12 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆప్ కార్యకర్త, అమానతుల్లా ఖాన్కు సన్నిహితుడు అయిన కౌసర్ ఇమామ్ సిద్ధిఖీ వద్ద నుంచి రూ. 12 లక్షల రూపాయల నగదుతో పాటు ఆయుధం, కొన్ని కాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: Delhi Liquor Scam: 18 కంపెనీలతోపాటు 12 మందికి ఈడీ నోటీసులు -
మాదాపూర్ ఫైరింగ్తో ఉలికిపాటు.. హైదరాబాద్లో పెరుగుతున్న గన్ కల్చర్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వరుస స్నాచింగులకు పాల్పడి తమను పట్టుకోవడానికి ప్రయత్నించిన హెడ్–కానిస్టేబుల్ను కత్తితో పొడిచిన కలబురిగి స్నాచర్లు ఇషాన్, రాహుల్ తమ వెంట రెండు తుపాకులు తెచ్చుకున్నారు. ఈ విషయం గురువారం వారిని అరెస్టు చేసిన సందర్భంలో వెలుగులోకి వచ్చింది. సోమవారం మాదాపూర్ ఠాణా పరిధిలోని నీరూస్ చౌరస్తాలో రియల్టర్లుగా మారిన ఇద్దరు నేరచరితుల మధ్య రేగిన వివాదం కాల్పులకు దారి తీసింది. ఇలా రాజధానిలో తరచూ తుపాకీ వినియోగమనేది కలకలం సృష్టిస్తోంది. ఇటీవల కాలంలో చిన్న వివాదానికీ తుపాకులు, తూటాలు ‘తెరపైకి’ వస్తున్నాయి. తుపాకులకు సంబంధించిన అత్యధిక నేరాలు అక్రమాయుధాలతోనే జరుగుతున్నాయి. రాజధానిలో ఉన్న లైసెన్స్డ్ ఆయుధాలకు వాటికి రెండు రెట్లకుపైగా అక్రమ ఆయుధాలు వినియోగంలో ఉన్నాయన్నది అనధికారిక అంచనా. ఇవి అనేక ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అక్కడ కుటీర పరిశ్రమలుగా... బిహార్, ఉత్తరప్రదేశ్ల్లోని అనేక ప్రాంతాల్లో తుపాకుల తయారీ ఓ కుటీర పరిశ్రమగా సాగుతోంది. నగరానికి సరఫరా అవుతున్న నాటు తుపాకుల్లో దాదాపు 90 శాతం ఇక్కడ నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. ఒకప్పుడు కేవలం తపంచాలకు మాత్రమే పరిమితమై ఉన్న ఈ ‘పరిశ్రమలు’ ఇప్పుడు అత్యాధునికమైనవీ తయారు చేస్తున్నాయి. బిహార్లోని ముంగేర్, గయ, యూపీలోని నాన్గల్, హసన్పూర్ తదితర ప్రాంతంలో తయారవుతున్న నాటు తుపాకులకు సేఫ్టీలాక్ వంటి ఆధునిక ఫీచర్స్ కూడా ఉంటున్నాయి. కేవలం కంపెనీ మేడ్ పిస్టల్స్కు మాత్రమే ఇది ఉండేది. ఇక్కడ తయారయ్యే వాటిలో రివాల్వర్లకు సైతం సేఫ్టీ లాక్ ఏర్పాటు చేస్తున్నారు. బిహార్, యూపీల నుంచి నగరానికి సరఫరా అవుతున్న వాటిలో ఆటోమేటెడ్, సెమీ– ఆటోమేటెడ్ రకాలతో పాటు అతి చిన్న సైజులో ఉండే సింగిల్ షార్ట్ గన్స్ కూడా ఉంటున్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. కేవలం డిఫెన్స్, పోలీసు శాఖలు మాత్రమే వాడే ప్రొహిబిటెడ్ బోర్గా పిలిచే పాయింట్ 9 ఎంఎంలనూ అక్కడి వ్యక్తులు నాటు పద్ధతిలో తయారు చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇదీ నాటు ఆయుధాల ‘మెనూ’.. తపంచా: రూ.1000 నుంచి రూ.2 వేలు రివాల్వర్: రూ.5 వేల నుంచి రూ.10 వేలు పిస్టల్: రూ.12 వేల నుంచి రూ.15 వేలు సింగిల్ షార్ట్ గన్: రూ.17 వేల వరకు ఆటోమేటెడ్ పిస్టల్: రూ.18 వేల నుంచి రూ.20 వేలు ఆటోమేటెడ్ రివాల్వర్: రూ. 20 వేలకు పైగా తేలిగ్గా నగరానికి రవాణా.. నగరానికి ఉత్తరాది నుంచి తుపాకులు సరఫరా చేయడానికి ఆయా ముఠాలు ఏమాత్రం కష్టపడట్లేదు. ఈ అక్రమ రవాణా కోసం ప్రత్యేక ముఠాలు కూడా పని చేస్తున్నాయి. వీరికీ రైలు మార్గం ఓ వరంగా మారింది. రైల్వేస్టేషన్లు, జనరల్ బోగీల్లో తనిఖీలు అంతంత మాత్రంగా ఉండటంతో వీటిలోనే ఆయుధాలు రవాణా చేస్తున్నాయి. వీటికి తోడు ట్రాన్స్పోర్ట్ లారీల్లోనూ ఇవి నగరానికి వస్తున్నాయి. ఓ పక్క ముఠాలే కాకుండా... అక్కడ నుంచి వచ్చే దినసరి కూలీలు సైతం ఆయుధ వ్యాపారాన్ని అదనపు ఆదాయ మార్గంగా భావిస్తున్నారు. పనుల కోసం నగరంలో స్థిరపడిన బిహారీలు రాకపోకలు సాగించే సమయంలో తమతో పాటు కొన్ని ఆయుధాలు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. నగరంలోని పాతబస్తీతో పాటు శివార్లలో ఉన్న అనేక ప్రాంతాల్లో వీటిని విరివిగా అమ్ముతున్నారు. నిఘా అంతంత మాత్రమే.. ఎప్పటికప్పుడు ఆయుధాలు, వాటిని విక్రయించేందుకు ప్రయత్నించిన, కొనుగోలు చేసిన వారిని పట్టుకుని చేతులు దులుపుకొంటున్న పోలీసులు వీటి మూలాలను కనుక్కోవడంలో మాత్రం విఫలమవుతున్నారు. సిటీలో అక్రమ ఆయుధ వ్యాపారంపై పోలీసు నిఘా సైతం అంతంత మాత్రంగానే ఉందని చెప్పవచ్చు. ఈ ఆయుధాలు బిహార్, ఉత్తరప్రదేశ్ల నుంచి వచ్చి చేరుతున్నాయని చెబుతున్న అధికారులు అవి వస్తున్న మార్గాలపై మాత్రం కన్నేసి ఉంచలేకపోతున్నారు. ఫలితంగా ఈ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ఓ ముఠా దొరికినప్పుడు వారిని అరెస్టు చేయడంతో సరిపెట్టాల్సి వస్తోంది. ఎవరైనా చొరవ తీసుకుని కాస్త ముందడుగు వేసి దర్యాప్తు కోసం రాష్ట్రం దాటినా... వారికి అక్కడి పోలీసుల నుంచి సరైన సహకారం అందుతుందని ఆశించలేం. ఒక్కోసారి ఎదురుదాడులు జరిగే పరిస్థితి ఉంది. బిహార్, ఉత్తరప్రదేశ్ల్లో ఈ పరిస్థితులు మరీ ప్రమాదకరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆసక్తి ఉన్న అధికారులు సైతం మిన్నకుండి పోవాల్సి వస్తోంది. చదవండి: మాదాపూర్లో కాల్పుల కలకలం.. రియల్టర్ మృతి -
ఆర్డర్ చేస్తే ఇంటికే డాగర్లు, తల్వార్ల డెలివరీ
-
ఆయుధం కావాలా..? ఆన్లైన్ ఉందిగా!
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో లభిస్తున్న అక్రమ ఆయుధాల మెనూ ఇదీ. క్యాష్ ఆన్ డెలివరీ, నెలవారీ వాయిదాల పద్ధతుల్లోనూ ఇంటర్నెట్ కేంద్రంగా ఆయుధ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీనిపై కన్నేసిన హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం 12 మందిని పట్టుకుని, 13 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఈ నిందితులు స్నాప్డీల్ నుంచి ఖరీదు చేసినట్లు తేలిందని, ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్పైనా కేసులు నమోదు చేస్తున్నామని డీసీపీ పి.రాధా కిషన్రావు తెలిపారు. ఉత్తరాదిని కాపీ కొడుతూ.. పెళ్లిళ్లు, బారాత్లతో పాటు పుట్టినరోజు వేడుకల్లో కత్తుల్ని ప్రదర్శించే, డాగర్లను వెంట ఉంచుకుని సంచరించే సంస్కృతి ఒకప్పుడు ఉత్తరాదికి మాత్రమే పరిమితమై ఉండేది. ఇటీవల నగరంలోనూ ఈ విష సంస్కృతి విస్తరిస్తోంది. గతంలోనూ సిటీలో కత్తుల్ని స్వాధీనం చేసుకున్న ఉదంతాలు ఉన్నా వాటిని నిందితులు బీదర్, గుల్బర్గా నుంచి తీసుకొచ్చేవారు. అయితే ఇప్పుడు ఈ–కామర్స్ సైట్ల కారణంగా ఆన్లైన్లోనూ ఆయుధాలు దొరికేస్తున్నాయి. దీంతో అనేక మంది యువకులు అవసరం ఉన్నా లేకున్నా, చట్టవిరుద్ధమని తెలిసో తెలియకో వీటిని ఖరీదు చేసి తమ వద్ద ఉంచుకుంటున్నారు. పెళ్లిళ్లు, బారాత్లు, బర్త్డే పార్టీల్లో(కేక్ కటింగ్ కోసం) వాటితో పోజులిస్తూ ఆ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే రాయదుర్గం పోలీసుస్టేషన్ పరిధిలో ఈ నెల మొదటి వారంలో ఓ ఎంగేజ్మెంట్ బారాత్ ఊరేగింపులో కత్తి విన్యాసం 15 ఏళ్ల సయ్యద్ హమీద్ ప్రాణం తీసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. వీటి క్రయవిక్రయాలు, వినియోగంపై నిఘా పెట్టారు. అరెస్టు అయింది వీరే.. మంగళ్హట్ పరిధికి చెందిన సూద్ అమన్ సింగ్, తుసాంకునాల్సింగ్, సుధీర్సింగ్, మహ్మద్ సల్మాన్, హుస్సేనిఆలం పరిధికి చెందిన మహ్మద్ ముజీబ్, ముస్తాఫా హుస్సేన్, ఛత్రినాక పరిధికి చెందిన శశికాంత్ సింగ్, గోల్కొండకు చెందిన మహ్మద్ యాసీన్అహ్మద్, మహ్మద్ రవూఫ్, హుమాయున్నగర్ వాసి సల్మాన్ ఖాన్, బహదూర్పురకు చెందిన మహ్మద్ సిరాజుద్దీన్, అంబర్పేట వాసి మహ్మద్ సోహైల్ను టాస్క్ఫోర్స్ పట్టుకుంది. వీరిలో తొమ్మిది మంది పెళ్లిలో అలంకారానికి, సరదా కోసం వీటిని ఖరీదు చేశారు. మహ్మద్ ముజీబ్ సోదరుడిని ఇటీవల కొందరు హత్య చేశారు. దీంతో ఆయుధం కొని తన వద్ద ఉంచుకున్నాడు. మహ్మద్ రవూఫ్పై గతంలో హత్యాయత్నం కేసు, సల్మాన్పై హుక్కా సెంటర్ నిర్వహణ కేసులు ఉన్నాయి. ‘ఆన్లైన్’ జాబితాలు అధ్యయనం చేసి.. రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ ఆన్లైన్ దందాపై దృష్టి పెట్టారు. మూడు నెలల కాలంలో ఆయుధాలను ఆన్లైన్లో ఎవరు ఆర్డర్లు ఇచ్చారు? ఎవరెవరు డెలివరీ తీసుకున్నారు? అనే అంశాలను ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు పి.చంద్రశేఖర్రెడ్డి, బి.శ్రవణ్కుమార్, కేఎస్ రవి, కె.శ్రీకాంత్ సోమవారం ఏడు ఠాణాల పరిధిలో దాడులు చేశారు. 12 మంది యువకుల్ని అరెస్టు చేసి 13 మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వీటిని విక్రయించిన స్నాప్డీల్ మేనేజింగ్ డైరెక్టర్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. హరియాణాలోని గుర్గావ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్నాప్డీల్ ఎండీకి నోటీసులు జారీ చేయనున్నామని డీసీపీ రాధాకిషన్రావు తెలిపారు. చిక్కిన వారంతా 20–25 ఏళ్ల మధ్య వయస్కులని, ఇలాంటి వారి దగ్గర ఆయుధాలు ఉంటే బెదిరింపులకు దిగడమే కాకుండా కీలక సందర్భాల్లో వాటిని వినియోగించి ఉద్రిక్తతలకు కారణమవుతారని వివరించారు. ఏ సైట్లో చూసినా.. స్నాప్డీల్ మాత్రమే కాదు.. ఏ ఈ–కామర్స్ సైట్లో చూసినా కత్తులు విక్రయానికి సిద్ధంగా ఉంటున్నాయి. రూ.వెయ్యి నుంచి రూ.10 వేల వరకు వివిధ ఆకృతులు, సైజుల్లో వీటిని విక్రయిస్తున్నారు. ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే చాలు పార్శిల్స్ ఇంటికి చేర్చేస్తున్నారు. కొన్ని సైట్లు క్యాష్ ఆన్ డెలివరీ అవకాశాన్నీ ఇస్తున్నాయి. ఆయుధ చట్టం ప్రకారం ఇలా ఆయుధాలను అమ్మడం నేరం. ప్రస్తుతం స్నాప్డీల్పై ఆధారాలు చిక్కినందుకు దానిపై చర్యలు తీసుకుంటున్నామని, భవిష్యత్తులో ఇతర సైట్లకు సంబంధించి ఆధారాలు లభిస్తే చర్యలు తప్పవని డీసీపీ అన్నారు. ఆయుధ చట్టం ప్రకారం 9 అంగుళాల కంటే ఎక్కువ పొడవు, రెండు అంగుళాలకు మించి వెడల్పుతో కూడిన కత్తులు తదితరాలు కలిగి ఉండటం, విక్రయించడం, ఖరీదు చేయడం నేరమే అని ఆయన స్పష్టం చేశారు. వంశపారంపర్యంగా వస్తున్న వాటినీ ఇంట్లో ఉంచుకోవాలంటే అనుమతి తప్పనిసరి అని అన్నారు. -
కెన్యాలో అక్రమాయుధాల్ని తగులబెట్టేశారు
-
అక్రమ ఆయుధాలు పట్టివేత : నలుగురి అరెస్ట్
సంగారెడ్డి : మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ఫసల్వాదిలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో 2 తుపాకులు, 2 కత్తులు, 3 బుల్లెట్లు లభ్యమయ్యాయి. వీటిని తరలిస్తోన్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంపన్నులను బెదిరించి తేలికగా డబ్బుగా సంపాదించాలనే ప్రయత్నంలో భాగంగా వారు ఇక్కడ వచ్చినట్లు విచారణలో తేలింది. అరెస్టైన వారిలో ఒకరు స్థానికుడు కాగా.. మిగతా ముగ్గురు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్నతెలిపారు. -
అక్రమ ఆయుధాలు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
చార్మినార్: హైదరాబాద్ పాతబస్తీలో అక్రమంగా ఆయుధాలు విక్రయిస్తున్న ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్రినాక పోలీస్స్టేషన్ పరిధిలో 9ఎంఎం పిస్టల్తో పాటు రెండు బుల్లెట్లను సౌత్జోన్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అక్రమంగా ఆయుధం కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్
నల్గొండ: నల్గొండ జిల్లాలో అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉన్న ఓ వ్యక్తిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడలో కిషన్కుమార్ యాదవ్ అనే వ్యక్తి హమాలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నాటు తుపాకి ఉందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ఓ నాటు తుపాకి, బుల్లెట్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కిషన్కుమార్ బీహార్ నుంచి వలస వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమ ఆయుధాలు పట్టివేత
-
సంజయ్ దత్ పెరోల్పై పిల్
సాక్షి, ముంబై: అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో దోషిగా యేర్వాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్కు తరుచూ పెరోల్ ఎలా మంజూరు చేస్తున్నారని బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ప్రదీప్ భాలేకర్ అనే సామాజిక కార్యకర్త దత్కు తరుచూ కోర్టు పెరోల్ మంజూరు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దత్కు ఇప్పటివరకు మూడుసార్లు పెరోల్ మంజూరైంది. కాని దత్తోపాటు శిక్ష అనుభవిస్తున్న మిగతా ఖైదీలపై జైలు పరిపాలన విభాగం ఎందుకు దయ చూపించడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం అదే జైలులో పెరోల్ కోసం 438 మంది ఖైదీల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని బాలేకర్ పిల్లో స్పష్టం చేశారు. దత్ 1993లో జరిగిన సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో ఖైదీగా ఉన్నారు. ఆయనకు తరుచూ పె రోల్ మంజూరుచేస్తే ఇతర ఖైదీలూ పెరోల్ మంజూరుచేయాలని డిమాండ్ చేసే ప్రమాదం ఉంది. కాగా, ఈ వ్యాజ్యంపై వచ్చే వారం విచారణ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖైదీల్లో దోషులుగా తేలిన వారి సంఖ్య 27,740 ఉంది. అదే విధంగా జ్యుడీషియల్ కస్టడీలో 99,036 మంది ఉన్నారు. -
బ్యాలెట్ బరి.. బుల్లెట్ గురి
ఎన్నికల వేళ కుటీర పరిశ్రమగా మారిన ఆయుధాలు, తూటాల తయారీ ఉత్తరాదిన యథేచ్ఛగా విక్రయాలు పన్యాల జగన్నాథదాసు: బ్యాలెట్ పోరు కోసం బుల్లెట్లకు గిరాకీ పెరిగింది. సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ ముహూర్తాన్ని ప్రకటించిన నాటి నుంచి ఉత్తరాది రాష్ట్రాల్లో అక్రమ ఆయుధాల అమ్మకాలు ఊపందుకున్నాయి. అక్రమ ఆయుధాలపై అధికార యంత్రాంగం ఎంతగా నిఘా పెట్టినా, సోదాలు సాగిస్తున్నా, వాటి అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అక్రమ ఆయుధాలకు బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు పేరుమోసిన సంగతి తెలిసిందే. ఈసారి తృణమూల్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ పాలనలోని పశ్చిమ బెంగాల్లోనూ అక్రమ ఆయుధాలు హల్చల్ చేస్తున్నాయి. ఈ రాష్ట్రాలోని మారుమూల ప్రాంతాల్లో అక్రమ ఆయుధాల తయారీ కుటీర పరిశ్రమగా కొనసాగుతోంది. ఇదివరకు నాటు తుపాకులను మాత్రమే తయారు చేసే ముఠాలు, ఇప్పుడిప్పుడే అధునాతన ఆయుధాలనూ సొంతంగా తయారు చేస్తున్నాయి. మాఫియా ముఠాలకు, తీవ్రవాదులకు అక్రమంగా ఆయుధాలను సరఫరా చేసే ఈ ముఠాలు, ఎన్నికల సీజన్లో రాజకీయ పార్టీలకూ సరఫరా చేస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అక్రమ ఆయుధాల ధరలు కూడా పెరిగాయి. అయినా, రాజకీయ పార్టీలు ఏమాత్రం వెనుకాడకుండా ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల సీజన్లో వివిధ ప్రాంతాల్లో చలామణీ అవుతున్న ఆయుధాలు, వాటి ధరవరల వివరాలు... కట్టా (నాటు పిస్టల్): దీంతో ఒకసారి ఒకే తూటా కాల్చేందుకు అవకాశం ఉంటుంది. నిన్న మొన్నటి వరకు రూ.1,500 వరకు ఉండే దీని ధర కొన్నిచోట్ల రూ.5 వేల వరకు ఎగబాకింది. పౌనీ తమంచా: ఇది పిస్టల్ కంటే పెద్దగా, రైఫిల్ కంటే చిన్నగా ఉండే నాటు తుపాకీ. దీంతోనూ ఒకసారి ఒకే తూటా కాల్చగలరు. ఇది రూ.1,500 నుంచి రూ.4,500 వరకు పలుకుతోంది. మొరేనా పిస్టల్: దాదాపు ఆధునిక రివాల్వర్ను పోలిన ఆయుధం, దీనికి కూడా రివాల్వర్ మాదిరిగానే తూటాలతో కూడిన మ్యాగజైన్ ఉంటుంది. ఇది రూ.6 వేల వరకు పలుకుతోంది. 7 ఎంఎం హ్యాండ్గన్: పిస్టల్ తరహాలోనే ఉండే దీని ధర గడచిన ఏడాది వ్యవధిలోనే రూ.15 వేల నుంచి రూ.25 వేలకు ఎగబాకింది. 9 ఎంఎం హ్యాండ్గన్: ఈ హ్యాండ్గన్లో వాడే తూటాలు కాస్త పెద్దగా ఉంటాయి. దీని ధర రూ.24 వేల నుంచి రూ.45 వేలకు పెరిగింది. సింగిల్ బ్యారెల్ గన్: ఏడాది కిందట రూ.8 వేలకే లభించే ఈ తుపాకీ ధర ఇప్పుడు రూ.20 వేలు పలుకుతోంది. డబుల్ బ్యారెల్ గన్: దీని ధరకూ రెక్కలొచ్చాయి. రూ.30 వేల నుంచి రూ.60 వేలకు చేరుకుంది. .9ఎంఎం పిస్టల్ జేబులో తేలికగా ఇమిడిపోయే దీని ధర రూ.18 వేల నుంచి రూ.25 వేలు పలుకుతోంది. తూటాలు: .303 బుల్లెట్ ఒక్కోటి రూ.250-రూ.450, .15 బుల్లెట్ రూ.150-రూ.350, 7ఎంఎం హ్యాండ్గన్ బుల్లెట్ రూ.300-రూ.500, 9ఎంఎం హ్యాండ్గన్ బుల్లెట్ రూ.400-800 వరకు పలుకుతున్నాయి. మారిన ట్రెండ్... అక్రమ ఆయుధాల వాడకంలోనూ ఇటీవల శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అక్రమ ఆయుధాలను తయారు చేసే ముఠాలు ఇదివరకు ఎక్కువగా నాటురకం ఆయుధాలనే తయారు చేసేవారు. ఇప్పుడు ఈ ముఠాలు సైతం ఆధునికమైన ఆయుధాలను తయారు చేస్తున్నాయి. ఇదివరకు లాంగ్రేంజ్ ఆయుధాలను ఎక్కువగా తయారు చేసే ముఠాలు, ఇటీవలి కాలంలో 9 ఎంఎం, .76 బోర్ పిస్తోళ్లు వంటి షార్ట్ రేంజ్ ఆయుధాలను ఎక్కువగా తయారు చేస్తున్నాయని బీహార్ ఐజీ (ఆపరేషన్స్) అమిత్ కుమార్ చెప్పారు. హౌరా సమీపంలోని దాస్నగర్లో అక్రమ ఆయుధాల కర్మాగారంపై బెంగాల్ పోలీసుల సాయంతో జరిపిన దాడిలో ఇలాంటి ఆయుధాలే ఎక్కువగా దొరికినట్లు ఆయన తెలిపారు. ఆయుధాలూ ఆస్తులే! ‘సార్వత్రిక’ సమరంలో తలపడుతున్న చాలామంది అభ్యర్థులకు ఆయుధాలూ ఆస్తులే! అందుకే, వివిధ పార్టీలకు చెందిన దాదాపు వంద మంది అభ్యర్థులు తమ ఆస్తుల జాబితాలో పిస్టళ్లు, రైఫిళ్లు, రివాల్వర్లు వంటి వాటిని చేర్చారు. వీరిలో బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, బీజేపీ అభ్యర్థులు మేనకా గాంధీ, మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్, షూటర్ రాజ్యవర్ధన్ రాథోడ్, కాంగ్రెస్కు చెందిన కేంద్ర మంత్రి శ్రీకాంత్ జెనా, కర్ణాటక మాజీ సీఎం సదానంద గౌడ తదితరులు ఉన్నారు. వీరికి మించిన మరికొందరు అరబ్ జాతి అశ్వాలను, అరుదైన కళాఖండాలను, శిల్పాలను తమ ఆస్తులుగా ప్రకటించారు. లావాదేవీలన్నీ ‘కోడ్’లోనే... అక్రమ ఆయుధాల వ్యాపారం బహిరంగ రహస్యమే అయినా, వీటి లావాదేవీలు బాహాటంగా జరగవు. నమ్మకస్తుల ద్వారా వచ్చే వ్యక్తులు ‘బ్యాటరీ, చార్జర్, సామాన్’ అంటూ ‘కోడ్’లో అడుగుతారు. లావాదేవీలన్నీ ‘కోడ్’లోనే జరుగుతాయని, బేరసారాలూ మామూలేనని బీహార్లో ఒకప్పుడు నాటు తుపాకీలను తయారు చేసే ఒక వ్యాపారి చెప్పాడు. బీహార్, యూపీలతోపాటు పశ్చిమ బెంగాల్లో పలు జిల్లాల్లో అక్రమ ఆయుధాల కర్మాగారాలు ఉన్నాయి. ఎందరో స్వతంత్రులు.. 1996 లోక్సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ల సంఖ్య ఏకంగా పదివేలకు మించి పోయింది. లోక్సభకు ఏ సంవత్సరంలో ఎందరు స్వతంత్రులు.. పోటీ పడ్డారంటే..? -
అక్రమ ఆయుధాల వ్యాపారం పెరిగింది: సీపీ