-
‘దానికోసం ఇంత చేయాలా’
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలోని శబరిమల ఆలయంలోకి హిందూ మహిళలే కాదు.. అన్ని మతాల స్త్రీలు వెళ్లొచ్చునని కేరళ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో కేంద్రమంత్రి కేజే అల్ఫోన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నడూ మసీదులు, చర్చిలకు వెళ్లని మహిళలు శబరిమలకు వెళ్లేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. 10 సెకండ్లపాటు టీవీలో కనిపించడానికి, కెమెరాలకు పోజుల్విడానికి పవిత్రమైన అయ్యప్ప గుడిమెట్లు ఎక్కడానికి పూనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ పవిత్రతను కాలరాయాలా? ‘ఎన్నడూ మసీదువైపు కన్నెత్తి చూడని ఒక ముస్లిం యువతి శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లి తీరతానని అంటోంది. చర్చ్ అంటే ఏంటో తెలియని మరో క్రిస్టియన్ అమ్మాయి శబరిమల యాత్ర చేస్తానంటోంది. ఎంత విడ్డూరం. పాపులర్ అయిపోవడానికీ, కెమెరాల్లో కనిపించడానికి ఇంత చేయాలా? దానికోసం ఆలయ పవిత్రతను కాలరాయాలా’అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్ 19న శబరిమల యాత్ర చేపట్టిన రేహానా ఫాతిమాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 5 కిలోమీటర్లు యాత్ర చేసి అయ్యప్ప ఆలయ ప్రాంతానికి చేరుకున్న అనంతరం తీవ్ర ఉద్రికత్తలు తలెత్తడంతో ఫాతిమాను పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. కాగా, అన్ని వయసుల మహిళలు శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లొచ్చునని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత ఇప్పటి వరకు 12 మంది మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే, తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో భద్రతాబలగాలు వారిని వెనక్కి పంపించివేశాయి. బెదిరింపులు రావడంతో మరి కొందరు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. (చదవండి : శబరిమలకు వెళ్లనున్న అమిత్ షా!) -
కేరళను మినహాయించండి
న్యూఢిల్లీ: ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో విదేశీ సాయం తీసుకోరాదన్న పాలసీ నుంచి కేరళకు ఒక్కసారి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి అల్ఫోన్స్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కేరళకు అందించాలనుకున్న రూ.700 కోట్ల సాయానికి కేంద్రం మోకాలడ్డటంపై ఆయన ఈ మేరకు స్పందించారు. ‘గత 50 ఏళ్లలో కేరళ కారణంగా దేశానికి భారీ విదేశీ మారకద్రవ్యం లభించింది. 2017లో మలయాళీలు స్వదేశానికి రూ.75,000 కోట్ల విదేశీ మారకాన్ని పంపారు. దేశంలో అతిపెద్ద పర్యాటక కేంద్రాల్లో కేరళ ఒకటి. ఈ కారణాలరీత్యా కేరళ వరదలను ప్రత్యేక పరిస్థితిగా పరిగణించి, విదేశీ సాయంపై ఒక్కసారి మినహాయింపు ఇవ్వాలని జూనియర్ మంత్రిగా నా సీనియర్లకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని అల్ఫోన్స్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దాదాపు 2 లక్షల కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నాయనీ, వాళ్లకు కనీసం దుస్తులు, ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదని పేర్కొన్నారు. ఇలాంటివారిని ఆదుకోవడానికి పెద్దమొత్తంలో నగదు అవసరమని వ్యాఖ్యానించారు. కాగా, అంతకుముందు కేరళ ఆర్థికమంత్రి థామస్ ఐజాక్ మాట్లాడుతూ.. తాము రూ.2,200 కోట్లు సాయం కోరితే కేంద్రం మాత్రం రూ.600 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వ్యవహారశైలి ‘అమ్మ తాను అన్నం పెట్టదు. అడుక్కుని అయినా తిననివ్వదు’ రీతిలో ఉందని ఘాటుగా విమర్శిచారు. మరోవైపు, యూపీఏ హయాంలో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న శివశంకర్ మీనన్ మాట్లాడుతూ.. దీర్ఘకాలిక పునరావాస కార్యక్రమాలకు విదేశీ సాయం స్వీకరించడంపై ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. కేవలం సహాయ కార్యక్రమాలకు విదేశీ సాయం తీసుకోకూడదని మాత్రమే 2004లో మన్మోహన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. విదేశీ సాయం స్వీకరించొచ్చు: ఎన్డీఎంఏ అత్యవసర పరిస్థితుల్లో విదేశాలు మానవతా దృక్పథంతో అందించే ఆర్థిక సాయాన్ని కేంద్రం ఆమోదించొచ్చని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) 2016లో రూపొందించిన ఓ పత్రం వెల్లడించింది. కేరళ వరద బాధితులకు యూఏఈ సాయం ప్రకటించడంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ విషయం వెలుగుచూసింది. జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక(ఎన్డీఎంపీ) పేరిట తెచ్చిన ఆ పత్రంలో ‘ఏదైనా విపత్తు తలెత్తినప్పుడు విదేశీ సాయానికి అర్థించకూడదనేది జాతీయ విధానంలో భాగం. కానీ విదేశాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విపత్తు బాధితులకు అండగా ఉంటామంటే, ఆ సాయాన్ని కేంద్రం ఆమోదించొచ్చు’ అని ఉంది. దానిలో ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్నాథ్ల సందేశాలు ఉన్నాయి. విదేశీ సాయాన్ని ఎలా వినియోగించుకోవాలో విదేశాంగ శాఖతో కలసి హోం శాఖ నిర్ణయిస్తుందని పత్రం తెలిపింది. ఎన్డీఎంపీపై వ్యాఖ్యానించేందుకు హోంశాఖ అధికారులు నిరాకరించారు. -
రిలీఫ్ క్యాంప్లో నిద్రించిన ఫోటో : మంత్రికి చీవాట్లు
తిరువనంతపురం : వరదలతో తల్లడిల్లిన కేరళలో సోమవారం రాత్రి సహాయ పునరావాస శిబిరంలో కేంద్ర మంత్రి కేజే ఆల్ఫోన్స్ నిద్రించిన వ్యవహారం ప్రహసనంలా మారింది. ట్విటర్లో ఆయన పోస్ట్ చేసిన పరుపుపై నిద్రిస్తున్న ఫోటోకు ప్రశంసలు రాకపోగా నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. ఆల్ఫోన్స్ ఈ ఫోటోను ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా సహా పలువురిని ట్యాగ్ చేయగా ఈ పోస్ట్పై నెటిజన్ల స్పందన ఆయనకు షాక్ ఇస్తోంది. సార్..ఇది పబ్లిసిటీ చేసుకునేందుకు సరైన అవకాశం కాదని ఓ ట్విటర్ యూజర్ వ్యాఖ్యానించగా, సార్ ఇది జోక్ కాదు..ఇలాంటి ప్రదర్శనలకు ఇది సమయం కాదని మరో యూజర్ కామెంట్ చేశారు. కేంద్ర మంత్రిగా కేరళకు ఇతోధిక సాయం చేయాల్సిన మీరు ఇలాంటి చవకబారు ప్రచార ఎత్తుగడకు పాల్పడటం సరైంది కాదని మరొకరు ట్రోల్ చేశారు. సహాయ శిబిరంలో మీరు నిద్రించినా రేపటిపై బెంగతో చాలా మంది నిద్రకు నోచుకోలేదనే విమర్శలు ఆల్ఫోన్స్పై వెల్లువెత్తాయి. మరోవైపు వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళ ప్రస్తుతం సహాయ, పునరావాస చర్యలు ముమ్మరం చేయడంపై దృష్టిసారించింది. -
నాలుగేళ్లలో అభివృద్ధిలో ముందంజ: ఆల్ఫోన్స్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పడిన నాలుగేళ్ల కాలంలోనే అభివృద్ధిలో రాష్ట్రం అద్భుతమైన పురోగతిని సాధించిందని కేంద్రమంత్రి కేజే ఆల్ఫోన్స్ కితాబిచ్చారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు అందజేశారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఆదివారం ఢిల్లీ తెలంగాణ భవన్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేస్తే అభివృద్ధిలో దేశం ముందడుగు వేస్తుందన్నారు. ఆ దిశగా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం పనిచేయాలని ఆయన సూచించారు. అందరికీ తిండి, వైద్యం, విద్య, ఉపాధి లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోందని, ఈ లక్ష్యసాధనకు అందరూ కలసి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, తెలంగాణ భవన్ ఆర్సీ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ముఖంతోనూ ఆధార్ ధ్రువీకరణ
న్యూఢిల్లీ: వృద్ధాప్యంతో వేలిముద్రలు చెరిగిపోయిన, మసకబారిన వారికి ఆధార్ ధ్రువీకరణ సమయంలో ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ముఖంతోనూ ఆధార్ ధ్రువీకరణ చేపట్టేందుకు ఆధార్ ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) సమాయత్తమవుతోంది. జూలై 1 నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది. అయితే ఆధార్ ధ్రువీకరణకు ముఖం ఒక్కటే సరిపోదని యూఐడీఏఐ పేర్కొంది. దీనికి అదనంగా వేలిముద్రలు, కంటిపాప, వన్టైం పాస్వర్డ్(ఓటీపీ)ల్లో ఒకదాన్ని కూడా సరిపోల్చాల్సి ఉంటుందని స్పష్టతనిచ్చింది. తెల్లోడి ముందు దుస్తులు విప్పగా లేనిది... కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి కేజే ఆల్ఫోన్స్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆధార్ సమాచారం దుర్వినియోగమవుతోందని ప్రచారం చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఆదివారం వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. వీసా కోసం విదేశీయుల ముందు దుస్తులు విప్పడానికి కూడా సిద్ధపడే భారతీయులు..ప్రభుత్వం వ్యక్తిగత వివరాలు అడిగితే మాత్రం ప్రైవసీ దెబ్బతింటుందని రాద్ధాంతం చేస్తున్నారని చురకలంటించారు. ‘ అమెరికా వీసా కోసం నేను కూడా 10 పేజీల దరఖాస్తును నింపా. తెల్లవాడికి మన వేలిముద్రలు ఇవ్వడానికి, వారి ముందు నగ్నంగా నిలబడటానికి మనకేం అభ్యంతరం ఉండదు. కానీ మన ప్రభుత్వమే పేరు, చిరునామా లాంటి వివరాలు అడిగితే మాత్రం గోప్యతను ఉల్లంఘిస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు’ అని ఆల్ఫోన్స్ వ్యాఖ్యానించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement