lpg cylingders
-
సమ్మె అయినా గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆగదు
హైదరాబాద్: సదరన్ రీజియన్ బల్క్ ఎల్పీజీ ట్రాన్స్పోర్ట్ ఓనర్స్ అసోసియేషన్కు చెందిన బల్క్ ఎల్పీజీ రవాణాదారుల సమ్మె నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్) తమ ఎల్పీజీ వినియోగదారులకు తగినంత సిలిండర్ సరఫరా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చాయి. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల బాట్లింగ్ ప్లాంట్లలో బల్క్ ఎల్పీజీ నిల్వలు తగినంత ఉన్నాయన్నారు. ఎల్పీజీ పంపిణీ కేంద్రాలు యథావిధిగా పని చేస్తాయని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన రవాణా టెండర్ను అన్ని ప్రాంతాల ట్రాన్స్పోర్టర్లతో విస్తృత చర్చల తర్వాత తుది రూపం ఇచ్చారన్నారు. ఈ ప్రక్రియలో రవాణాదారుల వివిధ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమైన సందేహాలను నివృత్తి చేసేందుకు వివరణలు ఇచ్చారన్నారు.చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతా, గువాహటి నగరాల్లో నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశాల ద్వారా వారి అభిప్రాయాలను కూడా కలుపుకున్నారన్నారు. ఈ టెండర్ నిబంధనలను ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు, కేంద్ర విజిలెన్స్ మార్గదర్శకాలను పాటిస్తూ పూర్తిగా పారదర్శకంగా రూపొందించారని పేర్కొన్నారు. ఈ నిబంధనలు పీఈఎస్ఓ, పీఎన్జీఆర్బీ, ఓఐఎస్డీ వంటి చట్టబద్ధ సంస్థల మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందాయన్నారు. ఎల్పీజీ రవాణా భద్రత, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మా ప్రయత్నాల్లో భాగంగా ఈ కొత్త టెండర్ నిబంధనలను తీసుకు వచ్చామన్నారు.ఈ చర్యలు తీసుకున్నప్పటికి కొంతమంది రవాణాదారులు సమ్మెకు పిలుపునిచ్చారన్నారు. ప్రధానంగా భద్రతా ఉల్లంఘనలకు సంబంధించిన శిక్షా నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే, ఈ భద్రతా సంబంధిత చర్యలు ట్యాంకర్ యజమానులు, డ్రైవర్లు, వినియోగదారులు సహా అన్ని స్టేక్హోల్డర్లకు లాభదాయకంగా ఉంటాయని తెలిపారు. అవి మరింత భద్రతా ప్రమాణాలు కలిగిన, విశ్వసనీయమైన ఎల్పీజీ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడంలో సహాయపడతాయని పేర్కొన్నారు.మా స్టేక్హోల్డర్ల నుంచి బాధ్యతాయుతమైన చర్యలు, అవగాహనను ఆశిస్తున్నామన్నారు. తద్వారా అవసరమైన భద్రతా ప్రోటోకాల్స్ను పాటిస్తూ ఎల్పీజీ సిలిండర్ల నిరంతర సరఫరాను నిర్ధారించవచ్చన్నారు. రవాణాదారులకు సమ్మెను విరమించాలని, అత్యవసరమైన ఎల్పీజీ సరఫరా నిల్వలను ప్రభావితం చేసే చర్యలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తద్వారా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడవచ్చన్నారు.ఓఎంసీలు ప్రధాన రవాణాదారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుందన్నారు. త్వరలో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలుగా గృహ అవసరాలు, వాణిజ్య అవసరాలు తీర్చేందుకు ఎల్పీజీ సరఫరాను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే ఎల్పీజీ సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
పేటీఎం నుంచి నవరాత్రి గోల్డ్ ఆఫర్
దసరా నవరాత్రులను పురస్కరించుకుని ఫెస్టివల్ ఆఫర్ని ప్రకటించింది పేటీఎం సంస్థ. ఇండేన్, హెచ్పీ, భారత్ గ్యాస్ ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసుకోవడం ద్వారా రూ.10,001 విలువైన బంగారాన్ని గెలుపొందే అవకాశం కల్పిస్తోంది. నవరాత్రి గోల్డ్ ఆఫర్ అక్టోబర్ 7 నుంచి 16 వరకు అందుబాటులో ఉంటుంది. బుక్ చేసుకుంటే చాలు ఈ ఫెస్టివల్ ఆఫర్ను పొందాలంటే గ్యాస్ బుకింగ్ సమయంలో పేటీఎం వాలెట్, పేటీఎం యూపీఐ, కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ లేదా పేటీఎం పోస్ట్ పెయిడ్ నుంచి చెల్లింపు విధానాల్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. క్యాష్బ్యాక్ పాయింట్లు పేటీఎం డిజిటల్ గోల్డ్ తో పాటుగా ప్రతీ బుకింగ్ పై యూజర్లు రూ 1,000 విలువైన క్యాష్ బ్యాక్ పాయింట్లు పొందే అవకాశం ఉంది. వీటితో పాటు ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన గిఫ్ట్ వోచర్ల కూడా రిడీమ్ చేసుకోవచ్చు రోజుకి ఐదుగురు గ్యాస్ బుక్ చేసుకున్నప్పటి నుంచి డెలివరీ వరకు సిలిండర్ స్టేటస్ను ఎప్పటికప్పుడు తెలుసుకునే ఫీచర్ను పేటీఎం అందిస్తోంది. దీంతోపాటు రీఫిల్స్ కు సంబంధించి ఆటోమేటెడ్ ఇంటెలిజెంట్ రిమైండర్స్ పొందే సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. నవరాత్రి ఫెస్టివ్ సీజన్లో భాగంగా ప్రతి రోజూ ఐదుగురిని ఎంపిక చేసి రూ.10,001 విలువైన బంగారాన్ని అందిస్తామని పేటీఎం ప్రతినిధులు తెలిపారు. చదవండి : షో స్టాపర్స్ బ్యూటీ హంట్ -
ఎల్పీజీ బాదుడుకు కేంద్రం బ్రేక్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్లపై ప్రతి నెల రూ.4 మేర పెంచాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఓవైపు ఉజ్వల పథకం కింద పేదలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు అందజేస్తూ మరోవైపు ధరలు భారీగా పెంచడమన్నది పరస్పర విరుద్ధంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్లు అక్టోబర్ నుంచి ఎల్పీజీ ధరల్ని పెంచలేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సిలిండర్లపై సబ్సిడీని ఎత్తివేయడానికి వీలుగా ఒక్కో సిలిండర్ ధరను ప్రతినెల రూ.4 మేర పెంచాలని గతేడాది జూన్లో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలను కేంద్రం ఆదేశించడం తెల్సిందే. -
గ్యాస్ సిలిండర్ ధరల పెంపు
-
గ్యాస్ సిలిండర్ ధరల పెంపు
నాన్ సబ్సిడీ గ్యాస్ ధరలను ఒక్కో సిలిండర్కు రూ. 37.5 చొప్పున, సబ్సిడీతో కూడిన గ్యాస్ సిలిండర్ ధరలను రూ. 2 చొప్పున పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. ఏడాదికి 12 సిలిండర్లు దాటి వాడేవారికి మార్కెట్లో ఉన్న ధరలకు అనుగుణంగా సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తారు. ఈ తరహా సిలిండర్ల ధరలే ఇప్పుడు ఒక్కోటీ రూ. 37.5 చొప్పున పెరిగాయి. 14.2 కిలోల సిలిండర్ ధరలు ఢిల్లీలో రూ. 529.50, కోల్కతాలో రూ. 551, ముంబైలో రూ. 531, చెన్నైలో రూ. 538.50 చొప్పున అవుతాయని ఐఓసీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే సబ్సిడీతో కూడిన గ్యాస్ ధరలు కూడా సిలిండర్కు రూ. 2 చొప్పున పెరిగాయి. వాటి ధరలు ఢిల్లీలో రూ. 430.64, కోల్కతాలో రూ. 432.64, ముంబైలో రూ. 460.27, చెన్నైలో రూ. 418.14 వంతున అవుతాయి.