makka masjid
-
కనిపించె నెలవంక.. రంజాన్ వేడుక
సాక్షి,సిటీబ్యూరో: నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు పాటించిన ముస్లింలు మంగళవారం రాత్రి నెలవంక దర్శనంతో దీక్షలు విరమించారు. బుధవారం రంజాన్ పండగ జరుపుకునేందుకు సకల ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకోసం నగరంలోని మసీదులు, ఈద్గాలను ముస్తాబు చేశారు. ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరూ ఈరోజు మసీదులు, ఈద్గాల్లో ‘ఈద్ ఉల్ ఫితర్’ నమాజ్ చేస్తారు. ఈద్ నమాజ్కు ఇస్లాంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ రోజు దైవదూతలు ఉపవాస దీక్షలు పాటించిన వారికి స్వాగతం పలుకుతారని ముస్లింల విశ్వాసం. సిద్ధమైన మసీదులు ఇస్లాంలో మసీదులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రపంచంలో పరిశుద్ధమైన ప్రదేశం మసీదు అని మహ్మద్ ప్రవక్త బోధించినట్టు రచనలు చెబుతున్నాయి. మసీదు నిర్వాహణతో దేవుడి కరుణ లభిస్తుందని, మసీదు సమానత్వనికి, న్యాయానికి ప్రతీక అని మత గురువులు చెబుతారు. ఇంతటి పవిత్రమై వందల మసీదులు, ఈద్గాలకు మహానగరం నిలయం. మసీ–ఎ–సుఫా దక్కన్లోని అతిపురాతనమైన ‘మసీ–ఎ–సుఫా’ మసీదు బహమనీ సుల్తాన్ల పాలనా కాలంలోనే నగరంలో నిర్మించారు. అంటే గోల్కొండ కోట నిర్మిణానికి ముందే ఈ మసీదును నిర్మించారని చరిత్రకారుల కథనం. ఇందులో ప్రస్తుతం మూడు వందల మంది నమాజ్ చేసుకునేందుకు అనుకూలంగా ఉంది. జామా మసీదు చార్మినార్ చెంతన ఉన్న మక్కా మసీదు గురించి అందరికీ తెలిసిందే. అయితే, దీని నిర్మాణానికి పూర్వమే 1597లో జామా మసీదును సుల్తాన్ కులీ కుతుబ్షా రాజ్యాధికారి మీర్జుమ్లా అమీనుల్ ముల్క్ అతీఫ్ ఖాన్ బహదూర్ నిర్మించారు. ఆ రోజుల్లో ఇదే అతి పెద్ద మసీదు. ఇందులో 1500 మంది నమాజ్ చేసుకునే సౌకార్యం ఉంది. మక్కా మసీదు మక్కా మసీదు మత సామరస్యానికి ప్రతీక. అద్భుతమైన ఇరానీ శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడే ఈ మసీదు నిర్మాణానికి 1617లో సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా శంకుస్థాపన చేశారు. అయితే, ఆయన పాలనలో నిర్మాణం పూర్తి కాలేదు. తర్వాత అబ్దుల్లా కుతుబ్షా, తానీషా కాలంలో కూడా పూర్తి కాలేదు. చివరికి 1694లో ఔరంగజేబు పాలనలో మసీదు నిర్మాణం పూర్తయింది. మహ్మద్ ప్రవక్త మక్కాలో నిర్మించిన మసీదు నుంచి కొన్ని రాళ్లు, మట్టి తీసుకొచ్చి ఇక్కడ మసీదు నిర్మాణంలో వాడినందుకు దీనికి ‘మక్కా మసీదు’గా పేరొచ్చింది. ఇందులో దాదాపు 10 వేల మంది నమాజ్ చేసుకోవచ్చు. ఖైరతాబాద్ జామియా మసీదు జామియా మసీదును 1626లో సుల్తాన్ ∙కులీ కుతుబ్షా కుమారుడు సుల్తాన్ మహ్మద్ కుతుబ్æషా నిర్మించాడు. ఈ మసీదు ఖైరతాబాద్ చౌరస్తాకు అనుకొని ఉంది. కొత్త నగరంలోని అతిపెద్ద మసీదు ఇదే. ఇందులో 4 వేల మంది నమాజ్ చేసుకోవచ్చు. హయత్నగర్ మసీదు హయత్నగర్ మసీదును 1626లో కులీ కుతుబ్æషా సోదరి హయత్ బక్షి బేగం నిర్మించారు. ఇందులో సుమారు 1200 మంది నమాజ్ చేసుకోవచ్చు. మజీదే కలాన్ గోల్కొండ కోట ఆవరణలో మజీదే కలాన్ పేరుతో 1666లో హయత్ బక్షి బేగం మరో మసీదును నిర్మించారు. ఇందులో ప్రస్తుతం 1500 మంది నమాజ్ చేకోవచ్చు. ∙గోల్కొండ కోటలో 1668లో సుల్తాన్ అబ్దుల్లా ఈ మసీదును నిర్మించాడు. ఇందులో 1000 మంది నమాజ్ చేసుకోవచ్చు. టోలి మసీదు దమ్మిడి మసీదుగా మరో పేరున్న ‘టోలి మసీదు’ను కార్వాన్లో 1671లో సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్షాæ నిర్మించాడు. దాదాపు నాలుగున్నర శతాబ్దాలుగా ఈ మసీదులో ఎలాంటి మార్పులు లేకుండా అద్భుతంగా ఉంది. ఇందులో 5 వేల మంది వరకు నమాజ్ చదువుకోవచ్చు. మసీదే మియా ముష్క్ పురానాపూల్ సమీపంలో ‘మసీదే మియా ముష్క్’ మసీదును 1674లో సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్షాæ ధార్మిక పండితుడైన మియా ముష్క్ పేరు మీద నిర్మించారు. రెండు అంతస్తుల్లో ఉన్న మసీదు ఇదొక్కటే. అయితే, కాలానుగుణంగా రోడ్డు ఎత్తు పెరగడంతో ప్రస్తుతం పై అంతస్తులోనే నమాజ్ చేస్తున్నారు. ఇందులో 1500 మంది నమాజ్ చేసుకోవచ్చు. -
భద్రతా వలయంలో భాగ్యనగరం
సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీలోని మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగిన రోజైన మే 18 (శనివారం) నేపథ్యంలో నగర పోలీసు విభాగం పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేపట్టింది. చార్మినార్ సమీపంలోని మక్కా మసీదులో 2007 మే 18న బాంబు పేలుడు జరిగిన విషయం విదితమే. నగరంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో గతానికి భిన్నంగా జాగ్రత్తలు తీసుకుంటోంది. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బందోబస్తు కోసం సీసీఎస్, సిట్, స్పెషల్ బ్రాంచ్, టాస్క్ఫోర్స్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, టీఎస్ఎస్పీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్ఏఎఫ్, క్యూఆర్టీ బలగాలను మోహరిస్తున్నారు. బందోబస్తు ఏర్పాట్ల నేపథ్యంలో నగర పోలీసు విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. వీరికి తోడు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న సాయుధ బలగాలను రంగంలోకి దింపుతున్నారు. సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేశారు. అనుమానిత ప్రాంతాలు, వ్యక్తులపై నిఘా ఏర్పాటుకు పెద్ద ఎత్తున పోలీసులను మఫ్టీలో మోహరిస్తున్నారు. గతంలో సమస్యాత్మక పరిణామాలకు ఒడిగట్టిన వ్యక్తులను అనునిత్యం వెంటాడేందుకుగాను షాడో టీమ్లను ఏర్పాటు చేశారు. క్విక్ రియాక్షన్ టీమ్తో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రైకింగ్ ఫోర్స్లను అన్ని వేళలా అందుబాటులో ఉంచుతున్నారు. లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తూ నిఘా ఉంచారు. పాతబస్తీతో పాటు దక్షిణ మండలం, పశ్చిమ మండలం, తూర్పు మండలాల్లోనూ అడుగడుగునా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఇందుకుగాను అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. నగర వ్యాప్తంగా బాంబు నిర్వీర్య బృందాలు తనిఖీలు చేయనున్నాయి. ఈ బందోబస్తు పర్యవేక్షణ కోసం కొందరు ఐపీఎస్ అధికారులు, ఇతర సీనియర్ అధికారులకు ప్రాంతాల వారీగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీనికి సంబంధించిన జాబితాను కమిషనర్ కార్యాలయం సిద్ధం చేసింది. వీరు శనివారం ఆద్యంతం ఆయా ప్రాంతాలకు బాధ్యత వహించనున్నారు. అధికారి ఇన్చార్జ్ శికా గోయల్, అదనపు సీపీ ⇔ సౌత్ జోన్ డీఎస్ చౌహాన్, అదనపు సీపీ ⇔ నగరం మొత్తం పర్యవేక్షణ టి.మురళీకృష్ణ, అదనపు సీపీ⇔ మాదన్నపేట, సైదాబాద్ అవినాష్ మహంతి, సంయుక్త సీపీ⇔ గోషామహల్, ఆసిఫ్నగర్ డివిజన్లు బీఎస్పీ రవికుమార్, కమాండెంట్⇔మీర్చౌక్, చార్మినార్ డివిజన్లు ఐఆర్ఎస్ మూర్తి, కమాండెంట్ ⇔సంతోష్నగర్ డివిజన్ ఎంఏ బారీ, అదనపు డీసీపీ ⇔ అంబర్పేట జి.జోగయ్య, అదనపు డీసీపీ ⇔ మొఘల్పుర, భవానీనగర్ ఎంఆర్ బేగ్, కమాండెంట్ ⇔ చార్మినార్/మక్కా మసీదు ఎం.కృష్ణారెడ్డి, అదనపు డీసీపీ ⇔ టప్పాచబుత్ర, కుల్సుంపుర వి.దేవేందర్కుమార్, అదనపు డీసీపీ ⇔ బాంబు నిర్వీర్య బృందాలు మద్దిపాటి శ్రీనివాసరావు, అదనపు డీసీపీ ⇔ మంగళ్హాట్, షాహినాయత్గంజ్ కేఎన్ విజయ్కుమార్, ఏసీపీ⇔ అంబర్పేట్ ఎన్బీ రత్నం, ఏసీపీ ⇔ హుస్సేనిఆలం, షాలిబండ -
హే.. అల్లా
సాక్షి సిటీబ్యూరో: చారిత్రక మక్కా మసీదు పరిరక్షణలో నిర్లక్ష్యం కొట్టచ్చినట్టు కనబడుతోంది. నిధుల విడుదలలో జాప్యం, అధికారుల మధ్య కొరవడిన సమన్వయలేమి శాంపంగా మారింది. సకాలంలో మరమ్మతు పనులు చేయకపోవడంతో మసీదు పైకప్పు నుంచి నీరు కారుతోంది. నీరు ప్రవేశించి మసీదు గోడలు బీటలు వారుతున్నాయి. దీంతో వర్షకాలంలో మసీదు పై నుంచి నీరు కారుతోంది. మసీదు కుడి వైపు ముందు భాగంలో రెండో నిజాం నుంచి ఆరో నిజాం వరకు సమాధులున్నాయి. ఈ సమాధులపై ఉన్న కప్పు శిథిలావస్థకు చెరుకుంది. కప్పు కూలే పరిస్థితి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సందర్శకులకు అటు వెళ్లకుండా బారికేట్లు పెట్టారు. రెండేళ్ల క్రితం ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురిచడంతో అధికారులు స్పందించి మక్కా మసీదు మర్మమ్మతు పనులను 2017 ఆగస్టు 23న రూ. 8.48 కోట్లు నిధులు కేటాయించారు. నత్తనడకన పనులు.. 1694లో నిర్మాణం పూర్తి చేసుకున్న మక్కా మసీదు హైదరాబాద్ చరిత్రలో చెరగని ముద్రవేసుకుంది. ఇస్లామిక్ నిర్మాణశైలితో ఇరానీ అర్కిటెక్చర్ నైపుణ్యంతో నిర్మించారు. మసీదును ఆర్కియాలజీ శాఖ హెరిటేజ్ బిల్డింగ్గా గుర్తించింది. అయితే కాలక్రమేణా మసీదు దెబ్బతినడం ప్రారంభమైంది. పైకప్పు నుంచి నీరు లీకవ్వడం, పగుళ్లు ఏర్పడడం లాంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకున్న రాష్ట్ర ప్రభుత్వం మక్కా మసీదు పునరుద్ధరణ, సంరక్షణకు చర్యలు చేపట్టింది. రూ. 8.48 కోట్ల నిధులు కేటాయించింది. కానీ కేవలం రూ. 2 కోట్లు విడదల చేయడంతో మరమ్మతు పనులు నత్తనడకన సాగుతున్నాయి. పురావస్తు శాఖ పర్యవేక్షణలో పనులు మక్కా మరమ్మతు పనులను వక్ఫ్ బోర్డు ద్వారా రాష్ట్ర పురావస్తు శాఖ పర్యవేక్షణలో చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో మసీదు పైకప్పు మరమ్మతులతో పాటు గోడల్లో నీరు రాకుండా పనులు కొనసాగాయి. పురావస్తు శాఖ సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో పనులు ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ నుంచి వర్కర్లను తెప్పించినట్లు అధికారులు తెలిపారు. పనులను టెండర్ ద్వారా కేటాయించారు. నిధులు విడుదల కాకపోవడంతోనే కాంట్రాక్టర్ పనులను నిలిపి వేసినట్లు సమాచారం. శాఖల మధ్య సమన్వయ లోపం మరమ్మతు పనులు పురావస్తు శాఖ పర్యవేక్షణలో జరుగుతున్నా నిధులు మాత్రం మైనార్టీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు ద్వారా చెల్లిస్తోంది. అడపదడపా మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారులు, కార్యదర్శి, వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీదు పనులను పరిశీలించి వారం రోజుల్లో పనులు పూర్తవుతాయని మరికొంత మంది నెల రోజుల్లో పనులు పూర్తవుతాయని ప్రకటనలు చేస్తున్నారు. పురావస్తు శాఖ అధికారులతో సంప్రదించకుండా ప్రకటనలు చేస్తున్నారు. ఇరు శాఖల మధ్య సమన్వయం లేక పోవడంతోనే పనుల్లో జాప్యం జరగుతుందని సమాచారం. ఇప్పటికైనా ఇరు శాఖల అధికారులు సమావేశం ఏర్పాటు చేసి మసీదు పనులు ఎప్పుడు పూర్తవుతాయే చెప్పాలని ఇటు పర్యాటకులు, ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. -
సాక్షులకు ఏదీ భరోసా!
సాక్షి,సిటీబ్యూరో: గతేడాది టాస్క్ఫోర్స్ కార్యాలయంపై మానవబాంబు దాడి కేసు... సోమవారం మక్కా మసీదులో పేలుడు కేసు... ఈ రెండూ వీగిపోవడానికి సాక్షులు ఎదురు తిరగడం కూడా ఓ ప్రధాన కారణం. నిందితులను దోషులుగా నిరూపించడంలో కీలకపాత్ర పోషించే సాక్షులకు భరోసా కల్పించడంలో పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు విఫలం అవుతున్నాయి. నేరాల నియంత్రణ (ప్రివెన్షన్), నిందితులను పట్టుకోవడం (డిటెక్షన్), నిందితులను కోర్టులో దోషులుగా నిరూపించడం (కన్వెక్షన్)... ఈ మూడు పోలీసింగ్లో ప్రధాన అంశాలు. అయితే మొదటి రెండింటిలో పోలీసుల వైఫల్యం మాత్రమే ప్రధాన కారణం కాగా, మూడో అంశానికి సాక్షులు ప్రభావితం కావడం కూడా దోహదం చేస్తోంది. పోలీసులు ఎంత శ్రమించినా, ఆధారాలు సేకరించినా అనేక కేసుల్లో సాక్షులు ఎదురు తిరగడంతోనే శిక్షల శాతం గణనీయంగా తగ్గిపోతోంది. ఫలితంగా నమోదైన కేసుల్లో 30 శాతం కూడా కోర్టుల్లో నిరూపితం కావడం లేదు. ఈ పరిస్థితిలో మార్పులు తీసుకురావాలని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ 2013లో భావించింది. అయితే ఇప్పటి వరకు ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ‘ప్రత్యేక’ కేసుల్లో మాత్రమేఅదనపు చర్యలు... ప్రతి కేసునూ పోలీసులు ఒకే దృష్టిలో చూడాల్సి ఉంది. దర్యాప్తు, ఆధారాల సేకరణతో పాటు సాక్షుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వడం, భద్రతపై భరోసా కల్పించడం, న్యాయస్థానానికి ధైర్యంగా హాజరై సాక్ష్యం చెప్పేలా చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంది. అయితే ప్రస్తుతం పోలీసు విభాగంలో సిబ్బంది కొరత నేపథ్యంలో అధికారులపై పని భారం ఎక్కువగా ఉంటోంది. ఏడాదికి గరిష్టంగా 60 కేసులను మాత్రమే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయగలిగే దర్యాప్తు అధికారులు కనిష్టంగా 200 కేసులను పర్యవేక్షించాల్సి వస్తోంది. ఈ కారణంగా వీటిలో సాక్షులు ఎవరన్నది గుర్తుపెట్టుకోవడం, తరచూ వారిని సంప్రదించడం సాధ్యం కావట్లేదు. కేవలం కొన్ని ప్రత్యేకతలు, ప్రాధాన్యం కలిగి ఉన్న వాటిలో మాత్రమే పోలీసు అధికారులు సాక్షుల కోణం పైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ పరిస్థితులు మారాలంటే సాక్షుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు ఉండాలన్న వాదన ఏళ్లుగా ఉన్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ‘నిద్రలేపిన’ జెస్సికా కేసు... సాక్షుల రక్షణకు చట్టం తీసుకురావాలని కేంద్రానికి ఆలోచన కలగడానికి ప్రధాన కారణం జెస్సికాలాల్ కేసే. ప్రముఖ మోడల్స్లో ఒకరైన జెస్సికా 1999 ఏప్రిల్ 29న ఢిల్లీలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు అప్పట్లో దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అనేక మంది వీఐపీలతో ముడిపడిన దీని విచారణే కేంద్రం కళ్లు తెరిపించింది. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులపై నేరం నిరూపించడం కోసం 101 మంది సాక్షులను ఎంపిక చేశారు. వీరిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా... ఏకంగా 32 మంది ఎదురు తిరిగారు. దీనికి ప్రధాన కారణం నిందితుల తరఫున కొందరు రంగంలోకి దిగి సాక్షులను భయపెట్టడం ద్వారా ప్రభావితం చేసినట్లు గుర్తించారు. దీంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన కేంద్ర హోం శాఖ కోర్టు విచారణలో ఉన్న కేసుల్లో సాక్షులుగా ఉన్న వారికి రక్షణ కల్పించాలని నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రతిపాదించింది. అటకెక్కిన అంతర్జాతీయ అధ్యయనం.. సాక్షి రక్షణ సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన కేంద్రం అందుకు అంతర్జాతీయంగా అధ్యయనం చేపట్టాలని నిర్ణయించింది. ఆయా దేశాల్లో అమలులో ఉన్న పద్దతులు, చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి, వీటన్నింటిలోంచి ఉత్తమ పద్దతులను క్రోడీకరించి, మన దేశంలో ఉన్న పరిస్థితులు, ఇతర అంశాలను పరిగణలోని తీసుకుంటూ ప్రత్యేక చట్టం రూపొందించాలని భావించింది. అయితే ఆ తర్వాత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో అధికారం చేతులు మారడంతో ప్రతిపాదనల స్థాయిలోనే ఈ చట్టం అటకెక్కింది. ఇది అమలులోకి వస్తే ప్రతి కేసులోనూ సాక్షుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉండేది. ఫలితంగా శిక్షల శాతం పెరిగి నేరాలు సైతం తగ్గుముఖం పడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే కేంద్రం ఈ విషయాన్ని మర్చిపోవడం, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఫలితంగా సాక్షులకు భరోసా లేక అనేక కేసులు వీగిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
వీరి సాహసానికి గుర్తింపేదీ?
సాక్షి, సిటీబ్యూరో: ఆ ముగ్గురూ నగర పోలీసు విభాగంలో పని చేసిన/చేస్తున్న అధికారులు... 2007 మే 18న మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగిందని తెలిసిన మరుక్షణం అక్కడికి చేరుకున్నారు... మసీదు ప్రాంగణంలో ఉన్న మరో బాంబును గుర్తించి, రక్షణ సాధనాలు లేకపోయినా ధైర్యంగా నిర్వీర్యం చేశారు... నగర పోలీసు ఉన్నతాధికారులు వీరిని పొగడ్తలతో ముంచెత్తడమేగాక పదోన్నతులు ఖాయమనీ ప్రకటించారు. అంతే... కథ అక్కడితో ఆగిపోయింది... ఇది జరిగి పదకొండేళ్లు అయినా... కేసు విచారణ పూర్తై వీగిపోయినా... వీరి పదోన్నతుల ఫైలు మాత్రం ఒక్క అడుగూ ముందుకు పడలేదు. మక్కా మసీదులో ఉగ్రవాదులు అత్యంత శక్తిమంతమైన సెల్ఫోన్ బాంబులను అమర్చారు. ఆర్డీఎక్స్, టీఎన్టీ మిశ్రమంతో కూడిన ఈ బాంబులతో ఉన్న ఓ బ్యాగ్ను మసీదు ప్రాంగణంలోని ఆరంగుళాల మందమున్న రాతి బల్ల కింద పెట్టారు. ఈ పేలుడు ధాటికి బండ తునాతునకలైంది. నిపుణుల అంచనా ప్రకారం పేలుడు తీవ్రతలో బయటకు వచ్చింది కేవలం 30 శాతం మాత్రమే. అయినా ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతే శక్తివంతమైన మరో బాంబును మసీదు పరిపాలనా కార్యాలయం సమీపంలో గ్రిల్స్కు వేలాడదీశారు. ఇది పేలి ఉంటే ప్రాణనష్టం అపారంగా ఉండేది. మసీదులో తొలి బాంబు పేలిన వెంటనే అప్రమత్తమైన నగర పోలీసులు సిటీ సెక్యూరిటీ వింగ్ (సీఎస్డబ్ల్యూ)లోని బాంబు నిర్వీర్య బృందాలతో పాటు... క్లూస్ టీమ్ను ఘటనా స్థలికి పిలిపించారు. అప్పట్లో సిటీ క్లూస్ టీమ్ అధికారిగా ఉన్న తరువు సురేష్, సీఎస్డబ్ల్యూలో పనిచేస్తున్న రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సీహెచ్.ఎన్.ఎస్.వి.రమణ, కానిస్టేబుల్ హెచ్.అనిల్కుమార్ ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే మసీదు ప్రాంగణంలో అనుమానాస్పదంగా ఉన్న మరో బ్యాగును గుర్తించిన మసీదు సిబ్బంది వీరి దృష్టికి తెచ్చారు. అయితే బాంబ్సూట్, మరే ఇతర రక్షణ సాధనాలు లేకపోయినా వేగంగా స్పందించారు. బాంబును మసీదు సమీపంలోని కిల్వత్ గ్రౌండ్లోకి తరలించి అందుబాటులో ఉన్న సాధారణ పరికరాలతోనే నిర్వీర్యం చేశారు. ఆ సందర్భంగా వీరి సాహసాన్ని అందరూ కొనియాడారు. పోలీసు ఉన్నతాధికారులు హామీల వర్షం కురిపించారు. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో అప్పట్లో ప్రతి నెలా ఇచ్చే రివార్డులను ఇచ్చి సరిపుచ్చారు. రమణ, అనిల్లకు పదోన్నతికి సిఫారసు చేస్తూ అదే ఏడాది జూన్లో అప్పటి కమిషనర్ బల్వీందర్సింగ్ ప్రభుత్వానికి లేఖ (నెం. ఎల్ అండ్ ఓ ఎం 7ఆర్ఆర్255907) రాశారు. ఈ ప్రతిపాదన ఇప్పటికీ పెండింగ్లో ఉంది. ఆ లేఖలో క్లూస్ అధికారి సురేష్ ప్రస్తావన సైతం లేకపోవడం గమనార్హం. ఈ ఫైల్కు ఇప్పటికీ మోక్షం లభించలేదు. దర్యాప్తులో ఎన్ఐఏ విఫలం చాదర్ఘాట్: మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తులో ఎన్ఐఏ విఫలమైనందున దర్యాప్తు బాధ్యతలు మరో సంస్థకు అప్పగించాలని ఎంబీటీ అధికార ప్రతినిధి, మాజీ కార్పొరేటర్ అంజదుల్లాఖాన్ అన్నారు. సోమవారం చంచల్గూడ లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా పేర్కొన్న వారిని నిర్ధోషులుగా విడుదల చేసిన నేపథ్యంలో కేసుపై హైకోర్ట్లో అప్పీల్ వేయాలన్నారు. ఈ పేలుళ్లతో ఎలాంటి సంబంధం లేకపోయినా వంద మంది మైనారిటీ యువకులను నెలలు జైళ్లల్లో నిర్భందించారన్నారు. అసలు నిందితులను పట్టుకోవటంలో ఎన్ఐఏ విఫలమైందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత కూడా కారణమని ఆరోపించారు. తమను అన్యాయంగా జైల్లో ఉంచి తమ జీవితాలతో ఆడుకున్నారని బాధితుడు సయ్యద్ ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. -
‘మక్కా’ నుంచే మారాడు..
సాక్షి, సిటీబ్యూరో: వికారుద్దీన్ అహ్మద్... తెహరీక్–గల్బా–ఏ–ఇస్లాం (టీజీఐ) లోకల్ ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసి... మరో నలుగురితో కలిసి మాడ్యుల్ తయారు చేసి... 2009–10 మధ్య ఏడాదిన్నర కాలంలో మూడుసార్లు పోలీసులపై తుపాకీ ఎక్కుపెట్టిన ఉగ్రవాది ఇతడు. హైదరాబాద్తో పాటు గుజరాత్లోనూ అనేక నేరాలు చేసిన వికార్... ఉగ్రవాద బాటపట్టడానికి ‘మక్కా కాల్పులే’ కారణం. 2006 మే 18న మక్కా మసీదులో జరిగిన పేలుడులో మృతుల సంఖ్య తొమ్మిది అయినప్పటికీ... ఘటనాస్థలిలో చనిపోయింది ఐదుగురు. ఈ సందర్భంగా చెలరేగిన ఘర్షణలను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో దర్స్గా జిహాద్ ఏ షెహదత్ (డీజేఎస్) అనే సంస్థలో పని చేస్తున్న వికారుద్దీన్ ఈ ఘటనతో పోలీసులపై కక్ష పెంచుకున్నాడు. ఓల్డ్ మలక్పేట ప్రాంతానికి చెందిన ఇతడు కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. సులేమాన్ తదితరులతో కలిసి ముఠా కట్టి హఠాత్తుగా 2008 డిసెంబరు 3న సంతోష్నగర్లో ప్రత్యక్షమై నిఘా విభాగం అధికారులపై కాల్పులు జరిపాడు. ఆపై టీజీఐ పేరులో ఏకంగా సంస్థనే ఏర్పాటు చేసి 2009 మే 18న ఫలక్నుమాలో, మరికొన్ని రోజులకు శాలిబండలో హోంగార్డు బాలస్వామి, కానిస్టేబుల్ రమేష్లను పొట్టనపెట్టుకున్నాడు. ‘మక్కా కాల్పులకు’ ప్రతీకారంగా అంటూ పోలీసులను టార్గెట్గా చేసుకున్నాడు. ఈ గ్యాంగ్ను 2010 జూలైలో అరెస్టు చేసిన పోలీసులు వరంగల్ కారాగారానికి తరలించారు. 2015 ఏప్రిల్లో విచారణ నిమిత్తం నగరానికి తీసుకువస్తుండగా పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించగా... పోలీసులు జరిపిన కాల్పుల్లో వికారుద్దీన్ సహా ఐదుగురు హతమయ్యారు. ‘మక్కా’ కారణంగానే ఐఎం విధ్వంసం.. దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) హైదరాబాద్ను రెండుసార్లు టార్గెట్గా చేసుకుంది. 2007 ఆగస్టు 25న గోకుల్చాట్, లుంబినీ పార్క్ల్లో, 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చ్ సెంటర్ల వద్ద విధ్వంసాలు సృష్టించింది. 2002 నుంచి ఐఎం దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడింది. ఈ సంస్థలో మీడియా సెల్ ఇన్చార్జ్గా వ్యవహరించిన పుణే వాసి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మన్సూర్ అస్ఫర్ పీర్భాయ్ బంజారాహిల్స్లోని ఓ సంస్థలో ఎథికల్ హ్యాకింగ్లో శిక్షణ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మక్కా పేలుడు జరిగినప్పుడు హైదరాబాద్లోనే ఉన్న అతను మసీదు వద్దకు వెళ్ళి చూసి వచ్చాడు. ఆ తర్వాత ఐఎంకు చెందిన కీలక ఉగ్రవాదులు రియాజ్ భత్కల్, యాసీన్ భత్కల్ తదితరుతో పుణేలో సమావేశమై ‘భవిష్యత్తు కార్యాచరణ’పై చర్చించారు. ఇందులో పాల్గొన్న పీర్భాయ్ ‘మక్కా’ ఉదంతాన్ని వివరించడంతో రియాజ్ అందుకు ప్రతీకారంగా హైదరాబాద్ను టార్గెట్గా చేసుకుందామని నిర్ణయించాడు. 2007 ఆగస్టులో సిటీకి వచ్చిన రియాజ్, అనీఖ్, అ క్బర్ అదే నెల 25న జంట పేలుళ్లకు పాల్పడి పారిపోయారు. ప్రస్తు తం ఈ కేసు విచారణ సైతం తుది దశకు చేరుకుంది. ఈ కేసునూ మక్కా పేలుడు కేసును దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థే ఇన్వెస్టిగేట్ చేయడం కొసమెరుపు. ఈ కేసు కూడా అనేక చేతులు మారిన తర్వాతే ఎన్ఐఏకే చేరింది. -
డిటో పేలుళ్లు!
మే 18న... రాజస్థాన్లోని అజ్మీర్లో ఉన్న హజ్రత్ ఖాజా మొయినుద్దీన్ చిస్టీ దర్గాలో అదే ఏడాది అక్టోబర్ 11న జరిగిన బాంబు పేలుళ్లను ఒకే మాడ్యుల్ చేసిందన్నది దర్యాప్తు సంస్థల మాట. నిందితులు సైతం దాదాపు ఒకరే. ఈ రెండు పేలుళ్ల మధ్యా అనేక సారూప్యతలు ఉన్నాయి. మక్కా మసీదులో సెల్ఫోన్ అలారంతో పేల్చిన షేప్డ్ బాంబు పేలుడు ధాటికి తొమ్మిది మంది మరణించారు. ఇదిజరిగిన దాదాపు అయిదు నెలలకు రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాలో పేలుడు జరిగింది. అక్కడ వినియోగించిన బాంబులు, ‘మక్కా’లో వాడిన బాంబుల మధ్య సారూప్యత ఉంది. మక్కా పేలుళ్లపై సోమవారం కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ‘డిటో పేలుళ్ల’ అంశం చర్చనీయాంశమైంది. ఇక మక్కా కేసులో నిందితులు నిర్దోషులుగా బయటపడ్డారు. అజ్మీర్ దర్గా కేసులో మాత్రం పలువురు నిందితులకు అక్కడి కోర్టు శిక్ష విధించింది. కొందర్ని నిర్దోషులుగా ప్రకటించింది. సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీలో ఉన్న మక్కా మసీదులో 2007 మే 18న... రాజస్థాన్లోని అజ్మీర్లో ఉన్న హజ్రత్ ఖాజా మొయినుద్దీన్ చిస్టీ దర్గాలో అదే ఏడాది అక్టోబర్ 11న జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి చాలా విషయాల్లో పోలికలున్నాయి. కాకపోతే మక్కా కేసు సోమవారం ఎన్ఐఏ కోర్టులో వీగిపోగా...అజ్మీర్ దర్గా కేసులో మాత్రం నిందితులు కొందరికి శిక్ష పడింది. 2017, మార్చి 22న అజ్మీర్ దర్గాలో పేలుళ్ల కేసుకు సంబంధించి కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో దేవేందర్గుప్తా (మక్కా మసీదు కేసులో కూడా ఉన్నాడు), భూపేష్కుమార్, తీర్పు నాటికే హత్యకు గురైన సుశీల్ జోషి (మక్కా కేసులోనూ నిందితుడు)లను దోషులుగా తేల్చింది. సుశీల్ కాకుండా మిగతా ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. అసిమానందతో పాటు మరికొందర్ని నిర్దోషులుగా అక్కడి కోర్టు పేర్కొంది. ఎన్నో పోలికలు... కాగా ఈ రెండు పేలుళ్లకు పాల్పడింది ఒకరే అన్న అనుమానాలను బలపరిచేందుకు చాలా పోలికలు ఉన్నాయి. రెండు చోట్లా బాంబు సర్క్యూట్ పూర్తి కావడానికి ఏర్పాటు చేసిన సెల్ఫోన్లోని సిమ్ కార్డులను ఒకే ప్రాంతంలో కొనుగోలు చేశారు. ఈ ఘాతుకాలకు పాల్పడిన ఉగ్రవాదులు నోయిడాలోని కాలేజ్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో పని చేసే తారఖ్ నాథ్ ప్రమాణిక్ ఫొటోను వినియోగించి బాబూలాల్ యాదవ్ పేరుతో జార్ఖండ్ నుంచి నకిలీ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డులు పొందారు. వీటి సాయంతో రాంచీలో సిమ్కార్డులు, ఫరీదాబాద్లో నోకియా 6030 సెల్ఫోన్లు కొనుగోలు చేశారు. వీటినే ఇటు ‘మక్కా’, అటు ‘అజ్మీర్’ పేలుళ్లలో వినియోగించారు. ఈ రెండు చోట్లా ఉగ్రవాదులు వినియోగించిన బాంబులను సాంకేతికంగా షేప్డ్ బాంబ్స్ అని పిలుస్తారు. ప్రత్యేకంగా తయారు చేసిన అచ్చుల్లో ఆర్డీఎక్స్, టీఎన్టీ మిశ్రమం నింపి సెల్ఫోన్ అలారం ద్వారా సర్క్యూట్ ఏర్పాటు చేశారు. వీటిని ప్రత్యేకంగా తయారు చేసిన ఇనుప పెట్టెల్లో పెట్టారు. వీటిపై సీరియల్ నెంబర్లు సైతం వేశారు. మక్కా మసీదులో దొరికిన పేలని బాంబు పెట్టెపై 2, అజ్మీర్ దర్గాలో దొరికిన పేలని బాంబు ఉన్న పెట్టెపై 3 అంకెలు ఉన్నాయి. వీటిని పరిశీలించిన అధికారులు ఈ రెండు ఉదంతాలకూ పాల్పడింది ఒకే సంస్థకు చెందిన వారని, వారు తయారు చేసిన బాంబుల్లో 1,4 నెంబర్లున్నవి పేలగా... 2,3 నెంబర్లవి దొరికాయని నిర్థారించారు. -
దోషులు ఎవరు?
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కా మసీదు బాంబు పేలుడు ఘటనపై ఇప్పటికీ సందిగ్ధత వీడని పరిస్థితి నెలకొంది. ఆదిలోనే ఈ కేసులో పోలీసులు అత్యుత్సాహం చూపడం, దర్యాప్తు నాలుగు చేతులు మారడం, సాక్షులు ఎదురు తిరగడం వంటివెన్నో ప్రాసిక్యూషన్ విఫలం కావడానికి కారణమయ్యాయి. అసలు మక్కా మసీదు బాంబు పేలుడు కేసులో దోషులు ఎవరనేది ‘మిస్టరీ’గా మారిపోయింది. పోలీసుల అత్యుత్సాహంతో.. మక్కా మసీదులో.. అదీ శుక్రవారం ప్రార్థనల తర్వాత బాంబు పేలుడు జరగడంతో పోలీసు విభాగం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ ఘాతుకానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హర్కతుల్ జిహాద్ అల్ ఇస్లామీ (హుజీ) కారణమని.. హైదరాబాద్కు చెందిన ఉగ్రవాది బిలాల్ అలియాస్ షాహెద్ బాధ్యుడని ప్రాథమికంగా భావించారు. తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలో.. కేసును త్వరగా ఓ కొలిక్కి తీసుకురావాలన్న అత్యుత్సాహంతో పోలీసులు దాదాపు రెండు వందల మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారంతా ఒక వర్గానికి చెందిన వారే కావడం, అందులోనూ కొందరికే బిలాల్తో సంబంధాలు ఉన్నట్టు తేలడంతో మొదటి ఎదురుదెబ్బ తగిలింది. అనుమానితుల్లో 38 మందిని మక్కా మసీదు పేలుడులో బాధ్యుల్ని చేస్తూ అరెస్టు చేయగా.. మరో 180 మందిపై గోపాలపురం పోలీసుస్టేషన్లో కుట్ర కేసు నమోదు చేశారు. కుట్ర కేసు వీగిపోగా.. పేలుడు కేసులో అనుమానితులుగా పేర్కొన్న వారికి కోర్టులో క్లీన్చిట్ లభించింది. దాంతో వారికి నష్టపరిహారం చెల్లిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చింది. ఇలా పోలీసుల అత్యుత్సాహంతో కేసు దర్యాప్తుపై ప్రభావం పడింది. గందరగోళంగా దర్యాప్తు.. మక్కా మసీదులో పేలుడు కేసు దర్యాప్తు సైతం కలగాపులగంగా సాగింది. ఆ ఘటనపై ప్రాథమికంగా స్థానిక హుస్సేనీఆలం ఠాణాలో కేసులు నమోదయ్యాయి. అనంతరం అప్పట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్కు మార్చారు. కానీ హైదరాబాద్ పోలీసుల దర్యాప్తు, అరెస్టుల తీరుపై విమర్శలు రావడంతో.. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ను రంగంలోకి దింపారు. అజ్మీర్ దర్గాలో పేలుడు ఘటనకు సంబంధించి రాజస్తాన్ పోలీసులు చేసిన అరెస్టులతో మక్కా మసీదు పేలుడు కేసు చిక్కుముడి వీడింది. కొందరు నిందితులను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు.. వారిపై చార్జిషీట్ సైతం దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు వచ్చేలోగా కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను ఏర్పాటు చేయడంతో.. కేసులు దాని పరిధిలోకి వెళ్లాయి. దర్యాప్తు చేసిన ఎన్ఐఏ మరికొందరు నిందితులను అరెస్టు చేసి, మూడు సప్లిమెంటరీ చార్జిషీట్లను దాఖలు చేసింది. ఒక్కొక్కరు ఒక్కో తీరులో, వివిధ కోణాల్లో దర్యాప్తు చేయడం కేసులో ఓ స్పష్టత లేకుండా చేసింది. ప్రత్యక్ష సాక్షులు కరువు ఈ కేసులో ఎక్కడా ప్రత్యక్ష సాక్షులు లేకుండా పోయారు. 2007లో పేలుడు జరగగా.. 2010లో కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఆ లోపు అనేక సాక్ష్యాధారాలు మాయమైపోయాయి. 2007లో హైదరాబాద్లో ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడంతోపాటు పలు ఇతర కారణాల నేపథ్యంలో పక్కా సాంకేతిక ఆధారాలు లభించలేదు. కేవలం సందర్భానుసారం నిందితులను చూసిన, పరిణామాలు తెలిసిన సాక్షులు మాత్రమే ఈ కేసులో కీలకంగా మారారు. వారిలోనూ 50 మందికిపైగా కోర్టులో దర్యాప్తు సంస్థకు ఎదురు తిరిగారు. బాంబు పేలుళ్లకు వాడిన సెల్ఫోన్లను ఉగ్రవాదులకు విక్రయించిన దుకాణం యజమాని, ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన వారితో పాటు అనేక మంది కీలక సాక్షులు ప్రతికూలంగా మారారు. ఈ కేసులో ఆరో నిందితుడు స్వామి అసీమానంద ఇచ్చిన నేరాంగీకార వాంగ్మూలంపైనా అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. చివరికి ఇవన్నీ తీర్పు ప్రతికూలంగా రావడానికి కారణమయ్యాయి. మొత్తంగా అసలు 2007లో మక్కా మసీదులో పేలుడుకు పాల్పడింది ఎవరనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. కోర్టు తీర్పు ప్రతిని అధ్యయనం చేశాక.. ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని ఎన్ఐఏ ప్రకటించింది. ఆ కమిషన్ నివేదిక ఏమైంది? మక్కా మసీదు పేలుడు ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు పోలీసు కాల్పుల వరకు వెళ్లాయి. మొఘల్పుర పెట్రోల్ పంపు ప్రాంతంలో ఐదుగురు కన్నుమూశారు. తీవ్రంగా విమర్శలు రావడంతో.. పోలీసు కాల్పుల ఉదంతంపై విచారణ కోసం ప్రభుత్వం జస్టిస్ వి.భాస్కర్రావు నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించింది. సుదీర్ఘ విచారణ జరిపిన ఆ కమిషన్ 2010లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయితే ఆ నివేదికలోని పూర్తి వివరాలు ఏమిటి, దాని ఆధారంగా తీసుకున్న చర్యలేమిటన్నది ఇప్పటికీ గోప్యంగానే ఉండిపోయింది. -
మక్కమసీదు పేలుడు కేసు: జడ్జి రాజీనామా
-
హైదరాబాద్లో పర్యటించనున్న ఇరాన్ ప్రసిడెంట్
-
ఇరాన్ అధ్యక్షుడి పర్యటనకు పక్కా ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ అధ్యక్షుడు డా.హసన్ రౌహనీ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. గురు, శుక్రవారాల్లో(15, 16 తేదీల్లో) రౌహనీ హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయంలో కస్టమ్స్ మరియు ఇమిగ్రేషన్ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను సీఎస్ జోషి ఆదేశించారు. రౌహనీకి బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి ఆర్పీ సింగ్ స్వాగతం పలుకుతారని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఇరానియన్లతో సమావేశం.. హైదరాబాద్లోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ మహ్మద్ హఘ్బిన్ ఘోమీ మాట్లాడుతూ, తమ దేశాధ్యక్షుడి పర్యటనకు తెలంగాణ ప్రభుత్వం అతితక్కువ సమయంలో ఏర్పాట్లు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అధ్యక్షుడి పర్యటనలో 21 మంది ప్రతినిధులు కూడా పాల్గొంటారన్నారు. పర్యటనలో భాగంగా హైదరాబాద్లో స్థిరపడ్డ ఇరానియన్లతో రౌహనీ సమావేశమవుతారని సీఎస్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా, నగర పోలీస్ కమిషనర్ వి.వి.శ్రీనివాసరావు, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి దానకిషోర్, హైదరాబాదు కలెక్టర్ యోగితారాణా, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్చంద్, అడిషనల్ డీజీ అంజనీ కుమార్, ప్రోటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీందర్, రీజినల్ పాస్పోర్టు ఆఫీసర్ ఈ.విష్ణువర్థన్రెడ్డి, ఫైర్ సర్వీసెస్ డీజీ రాజీవ్ రతన్ తదితరులు పాల్గొన్నారు. -
మక్కాలో సిరిసిల్ల వాసి మృతి
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణానికి చెందిన మహిళ మక్కా మదీనాలో మృతిచెందింది. స్థానిక పోస్టాఫీసు వద్ద నివసించే అహ్మది బేగం తన స్నేహితురాలితో కలిసి పది రోజుల క్రితం మక్కా మదీనాకు వెళ్లారు. అక్కడ యాత్ర పూర్తి చేసుకుని ఆదివారం సాయంత్రం తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. ఇంతలోనే ఉదయం ఆమె గుండె పోటుతో మరణించారు. ఈమేరకు ఆమె మృతి సమాచారం అందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
‘మక్కా’ మృతుల్లో ఇద్దరు భారతీయులు
107కు చేరిన మృతులు.. క్షతగాత్రుల్లో ఐదుగురు హైదారాబాద్ వాసులు సహా 19 మంది భారతీయులు మక్కా: సౌదీ అరేబియాలోని ముస్లింల పవిత్రస్థలం మక్కా మసీదులో శుక్రవారం భారీ క్రేన్ కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య శనివారానికి 107కు, క్షతగాత్రుల సంఖ్య 238కి చేరింది. మృతుల్లో ఇద్దరు భారత మహిళలు, క్షతగాత్రుల్లో ఐదుగురు హైదరాబాదీలు సహా 19 మందిభారతీయులు ఉన్నారు. చనిపోయిన భారత మహిళలను కేరళకు చెందిన మామీనా ఇస్మాయిల్, పశ్చిమబెంగాల్కు చెందిన మోనిజా అహ్మద్గా గుర్తించినట్లు జెడ్డాలోని భారత కాన్సులేట్ తెలిపింది. క్షతగాత్రుల్లో హైదరాబాద్ వాసులతోపాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ల నుంచి ముగ్గురు చొప్పున ఉన్నారని, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరు చొప్పున, పంజాబ్, బిహార్, అస్సాంల నుంచి ఒకరు చొప్పున ఉన్నారని వెల్లడించింది. దుర్ఘటనలో తమ రాష్ట్రంలోని అసాన్సోల్కు చెందిన మునిజా చనిపోయినట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఫేస్బుక్లో తెలిపారు. జెడ్డాలోని భారత కాన్సులేట్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారని, హెల్ప్లైన్ కూడా ఏర్పాటు చేశారని భారత విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ ఢిల్లీలో చెప్పారు. గాయపడిన భారతీయులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. క్షతగాత్రులకు రక్తదానం చేయడానికి మాక్కా ఆస్పత్రుల వద్ద పలువురు బారులు తీరారు. పెనుగాలులు, వర్షాలతో కూలిన క్రేన్ మక్కా మసీదు ప్రాంగణ విస్తరణకోసం వాడుతున్న భారీ క్రేన్ పెనుగాలులు, భారీ వర్షం కారణంగా కుప్పకూలిందని స్థానిక అధికారులు తెలిపారు. క్రేన్ అల్ తవాఫ్ మార్గంలో కాకుండా వేరే చోట పడి ఉంటే మృతుల సంఖ్య భారీగా పెరిగేదని మసీదులో పనిచేసే ఉద్యోగి ఒకరు చెప్పారు. మక్కా ప్రాంత గవర్నర్ ప్రిన్స్ ఖలీద్ అల్ ఫైజల్ ఆదేశంతో ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అధికారుల నిర్ల్యక్షమే ఈ దుర్ఘటనలకు కారణమని మక్కాలోని ఇస్లామిక్ హెరిటేజ్ రీసెర్చ్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు ఇర్ఫాన్ అల్ అలావీ ఆరోపించారు. ప్రణబ్, అన్సారీ, మోదీ సంతాపం.. : ఈ ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రపంచ దేశాల అధినేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైఎస్ జగన్ సానుభూతి సాక్షి, హైదరాబాద్: ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ట్విటర్ ద్వారా ఆకాక్షించారు. హైదరాబాదీ క్షతగాత్రులు..: ఈ ప్రమాదంలో తమ కమిటీ ద్వారా వెళ్లిన ముగ్గురు హైదరాబాదీ లు గాయపడినట్లు రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్.ఎం. షుకూర్ తెలిపారు. పాతబస్తీ భవానీ నగర్కు చెందిన షేక్ ముజీబ్(38) తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారని, రెడ్హిల్స్కు చెందిన మహ్మద్ హమీద్, అనీస్ ఖాతూన్లు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపారు. మహమ్మద్ యానస్, సఫర్బీ అనే హైదరాబాద్ వాసులు గాయపడినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. -
డీఆర్డీఓ సైంటిస్ట్పై దుండగుడి దాడి