mother and 3 kids
-
'నా ఇన్స్పిరేషన్ మా అమ్మ'..!: సొనాలీ బెంద్రే
ప్రతి ఆడపిల్ల ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే మనం ఏం చెప్పిన నెగ్గుతుంది. ఎంతటి ధనవంతుడిని పెళ్లి చేసుకున్న ధైర్యంగా ఉండలేం. ఆర్థికంగా బాగుంటేనే స్థైర్యం దాతనంతటే అదే తన్నుకుంటూ వస్తుంది. ఆ విషయంలో నాకు మా అమ్మే స్ఫూర్తి అంటోంది బాలీవుడ్ నటి సొనాలీ బెంద్రే. అదెలాగో ఆమె మాటల్లో చూద్దామా..!.ఎలాగంటే...‘మేము ముగ్గురం అక్కచెల్లెళ్లం. ఆడపిల్లలకు చదువు, ఆర్థిక స్వాతంత్య్రం చాలా ముఖ్యమని నమ్ముతుంది మా అమ్మ (పేరు.. రూప్సీ బెంద్రే). నేను మోడలింగ్ ట్రయల్స్లో ఉన్న రోజుల్లో ఒకసారి.. నన్ను, నా సిస్టర్స్ని కూర్చోబెట్టుకుని చెప్పి ‘మీరు ఎంత సంపన్నులను తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పినా నేను పర్మిషన్ ఇవ్వను. మీ కాళ్ల మీద మీరు నిలబడి.. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యాకే.. పెళ్లి! ఆర్థిక స్వాతంత్య్రం ఉంటేనే మీకు వాయిస్ ఉంటుంది.. గుర్తుపెట్టుకోండి’ అని చెప్పింది. ఆ మాట మంత్రంలా పనిచేసింది మాకు. కెరీర్లో ఎదగడానికి స్ఫూర్తినిచ్చింది. నేనీ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే స్ఫూర్తి అమ్మే! నిజంగానే ఆడపిల్లకు ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలి. దాని వల్ల ఒక భరోసా వస్తుంది. ఆ భరోసా మనల్ని స్ట్రాంగ్గా నిలబెడుతుంది!’.(చదవండి: ఆ చేప పోరాటానికి ఫిదా కావాల్సిందే..!) -
తల్లి కష్టాన్ని చూడలేక.. భుజం కాసిన బిడ్డలు!
అమ్మ కష్టాన్ని చూడలేక ఈ చిన్నారులు(అక్కా, తమ్ముడు) చలించిపోయారు. పొట్ట కూటి కోసం వలస వచ్చిన ఈ తల్లి పొలం నుంచి వస్తూ వంటకు పుల్లలు పోగు చేసుకుని, ఆ పుల్లల మోపు తలపై పెట్టుకుని, మరో పెద్ద కట్టెను భుజాన వేసుకుని వస్తోంది. తల్లి కష్టాన్ని చూడలేక ఆమె భుజాలపై ఉన్న పెద్ద కట్టెను చిన్నారులిద్దరూ తమ భుజాలపైకి తీసుకుని దాదాపు నాలుగు కిలోమీటర్లు నడిచారు. గుంటూరు జిల్లా (Guntur District) వట్టిచెరుకూరు మండలం ఐదో మైలు సమీపంలో కనిపించిన ఈ దృశ్యం చూపరులను కట్టిపడేసింది. – ప్రత్తిపాడుమంచు జల్లులో తడిసి ప్రకృతి పులకిస్తోంది.. వెండి చినుకులు ఆకుల అంచులపై నుంచి సుతారంగా జాలువారుతూ నేలను మురిపెంగా ముద్దాడుతుంటే.. మట్టి తడిసి ముద్దవుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోన సీమ జిల్లా మలికిపురం మండలం గుడిమళ్ల లంకగ్రామంలో మంగళవారం ఉదయం మంచు కురుస్తున్న దృశ్యం అబ్బురపరిచింది.– సాక్షి ఫొటోగ్రాఫర్, రాజమండ్రిహెల్మెట్ ధరించి వాహనాలు నడిపి ప్రాణాలు కాపాడుకోవాలని, ఫిబ్రవరి 1 నుంచి తప్పనిసరిగా హెల్మెట్ (Helmet) వాడాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కే.వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. ఆమె ఏలూరులో (Eluru) హెల్మెట్ ధరించని వాహనదారులకు మంగళవారం అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించని పలువురికి చలానా విధించారు. – సాక్షి ఫోటోగ్రాఫర్, ఏలూరు కీడల్లో రాణించాలన్న వారి పట్టుదల ముందు రన్నింగ్ ట్రాక్ చిన్నబోయింది. ఉత్తి కాళ్లపై విద్యార్థినులు పోటీల్లో పరుగు పెట్టిన తీరు ఆకట్టుకుంది. విశాఖపట్నంలో మంగళవారం రాష్ట్ర స్థాయి రన్నింగ్ పోటీలు నిర్వహించగా... ఇందులో కొంత మంది విద్యార్థినులు కాళ్లకు షూ లేనప్పటికీ.. పోటీల్లో ఇలా పాల్గొన్నారు. – సాక్షి ఫోటోగ్రాఫర్, విశాఖపట్నం ఫిషింగ్ హర్బర్లో భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ, విశాఖపట్నం (Visakhapatnam) ఆధ్వర్యంలో రెండు పరిశోధనా నౌకల్లో ప్రజలు, విద్యార్థులు సందర్శన కోసం ఓపెన్ హౌస్ నిర్వహించారు. మత్స్య షికారి, మత్స్య దర్శిని నౌకల సందర్శనకు విద్యార్థులు భారీగా బారులు తీరారు. – సాక్షి ఫోటోగ్రాఫర్, విశాఖపట్నంచదవండి: అమ్మకడుపులో రాచపుండు -
కంటిరెప్ప ఆగ్రహం, కనుపాపలు దూరం
సాక్షి, బళ్లారి: కన్నపిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి కుటుంబ కలహాలతో ఆవేదన చెందింది. తానొక్కటే ప్రాణాలు తీసుకుంటే పిల్లలు అనాథలవుతారని అనుకుని, ముందు వారిని నీటిలోకి పడేసి తరువాత తాను దూకింది. ఈ విషాద ఘటన శనివారం రాత్రి విజయపుర జిల్లా తికోటా తాలూకా జాలిగేర గ్రామ సమీపంలోని విఠలవాడి తండాలో జరిగింది. తరచూ కుటుంబ కలహాలు వివరాలు... తండాకు చెందిన రాముచౌహాన్కు సింధగి తాలూకాకు చెందిన గీత (32)తో 8 సంవత్సరాల క్రితం వివాహమైది. వీరికి సృష్టి (6), కిషన్ (3), సమర్థ (4) అనే పిల్లలున్నారు. కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి కూడా దంపతులు గొడవ పడ్డారు. ఈ పరిణామాలతో ఆగ్రహించిన గీత ముగ్గురు పిల్లలను సంప్లోకి తోసి ఆమె కూడా దూకింది. కొద్ది సేపటికి ఇరుగుపొరుగు గమనించేటప్పటికీ నలుగురు విగతజీవులుగా కనిపించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో తికోట పోలీసులు వచ్చి మృతదేహాలను వెలికితీసి కేసు నమోదు చేశారు. (చదవండి: భార్యను హత్య చేసి ఢిల్లీకి పరార్..విచారణలో అతడు..) -
ముగ్గురు పిల్లలతో సహా సాగర్ లో దూకిన మహిళ
హైదరాబాద్: తన ముగ్గురు పిల్లలు సహా ఓ తల్లి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మల్కాజ్గిరికి చెందిన అవినాష్, జసంత ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వీరికి సంతానం ముగ్గురు కాగా, అందరూ ఆడపిల్లలే పుట్టారన్న సాకుతో భర్త ఆమెను వదిలేశాడు. దీంతో ఏం చేయాలో పాలుపోలేదని ముగ్గురు పిల్లలతో సహా జసంత సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేయగా, లేక్ పోలీసులు వారిని కాపాడారు. ఇదే విషయంపై ఆమె ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.