Nature
-
టైమ్స్ విమెన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో భారతీయ మహిళకు చోటు..!
టైమ్స్ విడుదల చేసిన 2025 విమెన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో ఒకే ఒక్క భారతీయ మహిళకు చోటు దక్కింది. గురువారం విడుదల చేసిన ఈ జాబితాలో భారతీయ జీవశాస్త్రవేత్త, వన్యప్రాణులు సంరక్షణాధికారి 45 ఏళ్ల పూర్ణిమా దేవి బర్మాన్ నిలిచింది. ఈ జాబితాలో నటి నికోల్ కిడ్మాన్, ఫ్రాన్కు చెందని గిసెల పెలికాట్ కూడా ఉన్నారు. ఈ జాబితాలో ఏకైక భారతీయ మహిళగా నిలిచిన పూర్ణిమా దేవి బర్మాన్కి ఇంత పెద్ద గుర్తింపు ఎలా లభించింది..? ఆమె ఏం చేశారంటే..అసోంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న గ్రామంలో పెరిగింది పూర్ణిమ. ఆమెకు చిన్నప్పటి నుంచి పక్షులంటే మహా ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను జంతుశాస్త్రంలో పీహెచ్డీ చేసేందుకు దారితీస్తుంది. ఆ సమయంలోనే గ్రేటర్ ఆజిటెంట్ స్టార్క్ (కొంగల) గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుంది. అరుదైన జాతికి చెందిన గ్రేటర్ ఆజిటెంట్ జాతి కొంగలు ప్రమాదం అంచున ఉన్నాయని తెలుసుకుని కలవరపడింది. దీన్ని నివారించడానికి తన వంతుగా ప్రయత్నం చేయాలనుకుంది. అలా పూర్ణిమ తన పీహెచ్డీ పరిశోధనకు విరామం ఇచ్చి గ్రేటర్ ఆజిటెంట్ రక్షణకు నడుం బిగించింది. పట్టణీకరణ, బిల్డింగ్లు, రోడ్లు, మొబైల్ టవర్లు... మొదలైన ఎన్నో కారణాల వల్ల పక్షుల సంఖ్య తగ్గుతూ పోతున్నాయని గుర్తించింది. దీనికి తోడు అసోంలోని చాలాగ్రామాల్లో పక్షులను దుశ్శకునంగా భావిస్తారు. వ్యాధులను సంక్రమింపజేస్తాయని భయపడుతుంటారు.ముందు వారి ఆలోచన తీరులో మార్పు తీసుకొచ్చేలా పూర్ణిమ ఎన్నో గ్రామాలకు తిరిగి, మహిళలను సమీకరించి వాటి విలువ గురించి ఓపిగ్గా చెప్పేది. దీంతో చిన్నగా మార్పు మొదలవ్వడం ప్రారంభమైంది. అలా గ్రామీణ మహిళలతో ‘హర్గిల ఆర్మీ’ని తయారు చేసింది. అస్సామీయులు కొంగను ‘హర్గిల’ అని పిలుస్తారు. తమ కార్యాచరణలో భాగంగా ఈ ఆర్మీలోని సభ్యులు ఎల్తైన వెదురు బొంగులపై గూళ్లు నిర్మించారు. మెల్లమెల్లగా ఈ గూళ్లలోనికి కొంగలు రావడం మొదలైంది. గుడ్లు పెట్టేవి. గూళ్లు నిర్మించి పక్షులకు అనువైన వాతావరణం కల్పించడంతో పాటు, నదులు, చిత్తడి నేలల శుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించేది ఆర్మీ.తమ ఇంటి పరిసరాలలో ఉన్న చెట్లపై పక్షిగూడు నిర్మించేవారికి డబ్బులు కూడా ఇచ్చేవారు. ‘హర్గిల లెర్నింగ్ సెంటర్’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పక్షుల విలువ తెలియజేయడం వంటివిచ చేసింది ఈ హర్గిల ఆర్మీ. ఈ నెట్వర్క్ అస్సాం నుంచి భారతదేశంలోని ఇతర ప్రాంతాల తోపాటు కంబోడియాకు వరకు విస్తరించింది. చివరికి ఫ్రాన్స్ వరకు వెళ్లడమే గాక అక్కడ పాఠశాలల్లో విద్యార్థులకు కూడా ఈ పక్షుల గురించి బోధించడం వంటివి చేస్తున్నారు. ఆమె ధరించే దుస్తులు కూడా ఈ ఆర్మీ సభ్యులు నేసినవే. ఎందుకంటే వాటి వల్లే వారి జీవనోపాధి కలుగుతుంది. ఇలా పూర్ణిమ ప్రకృతిని కాపాడటమే గాక..అంతరించిపోతున్న పక్షి జాతి కోసం గ్రామీణ మహిళలతో హర్గిల ఆర్మీనిని ఏర్పాటు చేసి అంతిరించిపోతున్న కొంగల జాతి వృద్దికి కృషి చేసింది, అలాగే గ్రామీణ మహిళలకు వాటితోనే జీవనోపాధిని కూడా కల్పించింది. ఈ నేపథ్యంలోనే టైమ్స్ పూర్ణిమ కృషని గుర్తించి ఈ ఏడాది ఉమన్ ఆఫ్ది ఇయర్ జాబితాలో చేర్చి గౌరవించింది. టైమ్స్ మ్యాగ్జైన్ ప్రతి ఏడాది ఉమన్ ఆఫ్ ది ఇయర్ జాబితాను విడుదల చేస్తుంది . హిళలు, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల మధ్య మెరుగైన ప్రపంచం కోసం కృషి చేసే శక్తిమంతమైన మహిళలను గుర్తించి ఇలా విమెన్ ఆఫ్ది ఇయర్ జాబితాలో చోటు కల్పించి గౌరవిస్తుంది. కానీ ఈ ఏడాది పర్యావరణ పరంగా మన భారతీయ జీవశాస్త్రవేత్త బర్మాన్ ఆ గౌరవాన్ని దక్కించుకుంది. (చదవండి: అందాల ఆతిథ్యం..! విశ్వసుందరి జన్మించిన నగరంలో పోటీలు..) -
ఎకో టూరిజం: వీకెండ్లో నేచర్ని చుట్టొద్దామిలా..!
తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీఎఫ్డీసీ) ఆధ్వర్యంలో వీకెండ్లో ట్రెక్కింగ్, నేచర్ క్యాంప్, బర్డ్స్ వాక్ నిర్వహిస్తున్నట్లు టీజీఎఫ్డీసీ ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్ తెలిపారు. ఎకో టూరిజాన్ని ప్రోత్సహించేందుకు, అడవులు, జంతువులు, పక్షుల పట్ల అవగాహన కల్పించేందుకు ‘దక్కన్వుడ్స్, ట్రయల్ పేరుతో ప్రతి శనివారం, ఆదివారం వివిధ కార్యక్రమాలు రూపొందించామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 30 వరకూ ఎకో టూరిజం కార్యక్రమాల వివరాలు.. ఫిబ్రవరి 22న ఉదయం 6.30 – 9.30 గంటల వరకూ మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్ ఫిబ్రవరి 23న వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్లో ఉదయం 7–10 గంటల వరకూ బర్డ్ వాక్, మార్చి 1న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్ క్యాంప్ మార్చి 2న గజ్వెల్ ఫారెస్ట్లో ఉదయం 7–10 గంటల వరకూ బర్డ్ వాక్ మార్చి 8న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్ క్యాంప్ మార్చి 9న ఉదయం 6.30 – 10 గంటల వరకూ బర్డ్ వాక్ మార్చి 15న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్ క్యాంప్ మార్చి 16న ఉదయం 6.30 – 9.30 గంటల వరకూ ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్ మార్చి 22న మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్ క్యాంప్ మార్చి 23న వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్లో ఉదయం 7 – 10 గంటల వరకూ బర్డ్ వాక్, ట్రెక్కింగ్ మార్చి 29న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్ క్యాంప్ మార్చి 30న గజ్వెల్ ఫారెస్ట్లో ఉదయం 7 – 10 గంటల వరకు బర్డ్ వాక్ ఉంటుందన్నారు. అసక్తిగలవారు 94935–49399, 93463–64583 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. (చదవండి: దక్కన్ వేదికగా ఫ్రెంచ్–ఇటాలియన్) -
చిన్నారుల బర్డ్ వాక్: పక్షులతో గడిపే ఛాన్స్..!
పక్షులను చూడటం అంటే ప్రకృతితో మమేకమై గొప్ప ఆనందాన్ని పొందే అరుదైన క్షణం. ముఖ్యంగా చిన్నారులకు ఇది తెలియజేయడం అత్యంత ముఖ్యం. ఎందుకంటే వారిలా నిశితంగా గమనించడం పెద్దలకు కూడా సాధ్యం కాదు. ఎందుకంటే వారికి ప్రతీది అద్భుతంలా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బర్డ్ ఫౌండేషన్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రేట్ బ్యాక్యార్డ్ బర్డ్ కౌంట్ ఈవెంట్ పేరుతో బర్డ్ వాక్లు ఏర్పాటు చేసి చిన్నారులు వాటితో నేరుగా గడిపే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఏటా గ్రేట్ బ్యాక్యార్డ్ బర్డ్ కౌంట్ ఈవెంట్ ఫిబ్రవరిలో నాలుగు రోజులు నిర్వహిస్తారు. ఈ ఏడాది అలానే ఫిబ్రవరి 15, 16 తేదీల్లో భారతదేశంలోని మొత్తం ఎనిమిది నగరాల్లో ఎనిమిది బర్డ్ వాక్లు నిర్వహించనుంది. ఇది ఉదయం 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత్లోఇన ప్రధాన నగరాలైన బెంగళూరు (కర్ణాటక), దిమాపూర్ (నాగాలాండ్), హలోల్ (గుజరాత్), జైపూర్ (రాజస్థాన్), మంగళూరు (కర్ణాటక), రాంచీ (జార్ఖండ్), త్రివేండ్రం (కేరళ), ఉజ్జయిని (మధ్యప్రదేశ్) నగరాల్లో జరగనుంది. వీటిని ఎర్లీ బర్డ్ అండ్ అటవీ బర్డ్ ఫౌండేషన్ నిర్వహిస్తాయి. ఇది అనుభవజ్ఞులైన పర్యావరణవేత్తల నేతృత్వంలో ఈ బర్డ్ వాక్ జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారులకు పక్షులను నేరుగా వీక్షించి, గడిపే అరుదైన అవకాశం లభిస్తుంది. గ్రేట్ బ్యాక్యార్డ్ బర్డ్ కౌంట్ అనేది ఒక గ్లోబల్ సిటిజన్ సైన్స్ ప్రాజెక్ట్. ఈ పేరుతో ప్రతి ఏడాది ఫిబ్రవరిలో నాలుగు రోజులు ప్రజలు పక్షులను గమనిస్తారు. అలాగే శాస్త్రవేత్తలు ప్రపంచ పక్షుల జనాభా గురించి, వాటి విశేషాల గురించి పంచుకుంటారు. ఈ ఏడాది భారత్ అనేక నగరాల్లో దీన్ని నిర్వహించనుంది. ప్రస్తుతం నిర్వహించనున్న '8 సిటీస్ 8 బర్డ్ వాక్లు' మాత్రం చిన్న పిల్లల కోసం ఒక ప్రత్యేక ఎడిషన్. గతేడాది వైల్డ్లైఫ్ వీక్ సందర్భంగా, ఆరుగురు ప్రకృతి విద్యావేత్తల ఆధ్వర్యంలో అక్టోబర్ 6, 8, 2024 తేదీలలో మొత్తం ఆరు వేర్వేరు నగరాల్లో బర్డ్ వాక్లను నిర్వహించారు. (చదవండి: ప్రపంచంలో అత్యంత అవినీతి దేశాలివే..భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..) -
Bhagavad Gita: అసలైన ఆస్తికులు
కొండలు, కోనలు, అడవులు, పక్షులు, పశువులు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, గ్రహాలు-ఇవన్నీ మనల్ని ప్రేరేపిస్తాయి. ఏకాగ్రచిత్తంతో ప్రకృతిని పరిశీలిస్తూ పోగా, పోగా అది అద్భుతం అనిపిస్తుంది! ఎంతో విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ప్రకృతి పరిశీలకులుగా ఆరంభించి ఆ ప్రకృతి ప్రేమికులుగా, ఆరాధకులుగా మారిపోతాం. దత్తా త్రేయుని లాగా, ఆంగ్లకవి విలియం వర్డ్స్వర్త్ లాగా ప్రకృతిని మన గురువుగా, దైవంగా పరిగణిస్తాం. అయితే అక్కడే ఆగిపోతే కేవలం హేతువాదులుగా, భౌతిక వాదులుగా మిగిలిపోతాం. లేదా నాస్తికులుగా మిగిలిపోయే అపాయం కూడాఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ‘‘భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం అని నా ప్రకృతి ఎనిమిది విధాలుగా ఉది. ఈ ప్రకృతిని ‘అపరా’ లేక ‘జడ ప్రకృతి’ అని అంటారు. ఇది కాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరొకప్రకృతి ఉంది. అదే నా జీవ రూప పరాప్రకృతి’ లేక ‘చేతన ప్రకృతి’ అని తెలుసుకో’’ (భగవద్గీత 7–అ 4, 5 శ్లోకాలు).అంటే... జడప్రకృతి, చేతనా ప్రకృతి అనేవి దైవం అనే నాణేనికి రెండు వైపులన్నమాట (బొమ్మ, బొరుసు)! జడప్రకృతిని పరిశీలించి,ప్రేమించి, ఆరాధిస్తున్నవారు అంతటితో తృప్తి పడక చేతనా ప్రకృతిని కూడా పరిశీలించి, పరిశోధించటానికి పరిశ్రమిస్తే– అంటే రెండో వైపును కూడా చూడటానికి ప్రయత్నించి చూస్తే వారే దార్శనికులు, ద్రష్టలు, ఋషులు అవుతారు; పరిపూర్ణ ఆస్తికులవుతారు. అయితే తమాషా ఏంటంటే కొంతమంది కనపడే ప్రకృతిని మాత్రమే నమ్మి నాస్తికులవుతారు. మరి కొందరు కనపడని దైవాన్ని గుడ్డిగా నమ్మి ప్రత్యక్షంగా కనబడే దైవ ప్రతిరూపాలే అయిన మనుషులను దూషిస్తారు, ద్వేషిస్తారు. దైవానికి ఉన్న రెండు వైపులను చూసినవారు పరా ప్రకృతిని, అపరా ప్రకృతిని ప్రేమిస్తారు, పూజిస్తారు. దేన్నీ నిరాకరించరు. వారే నిజమైన ఆధ్యాత్మికత్వం కలవారు, స్వచ్ఛమైన ఆస్తికులు.– రాచమడుగు శ్రీనివాసులు అసలైన ఆస్తికులు -
Dock Bridge : ప్రకృతి ఆధారిత వేళ్ల వంతెన..!
ఇది వేళ్లాడే వంతెన. ఉంగాట్ నది మీద ఉంది. అభివృద్ధి చెందిన నగరాలన్నీ నగరం మధ్యలో ఉన్న చెరువు మీద ఇనుప చువ్వలతో వేళ్లాడే వంతెనలను కడుతున్నాయి. కానీ ఉంగాట్ నది మీద కనిపించేవి వేళ్లతో కట్టిన వంతెనలు. అది కూడా చెట్టు నుంచి వేరు చేసిన వేళ్లు కాదు, సజీవంగా ఉన్న వేళ్ల వంతెనలు. ఈ నైపుణ్యం ప్రపంచంలో మనదేశానికే సొంతం, అది కూడా మేఘాలయ వంటి మరికొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించిన నైపుణ్యం. ఈ నది డాకీ పట్టణం నుంచి ప్రవహిస్తోంది. వంతెన డాకీ పట్టణంలో ఉంది. అందుకే డాకీ రూట్ బ్రిడ్జిగా వ్యవహారంలోకి వచ్చింది. ఇలాంటి వంతెనలు డాకీ పట్టణంలో మాత్రమే కాదు. మేఘాలయలో చాలా చోట్ల విస్తారంగా ఉంటాయి. కానీ మేఘాలయ పర్యటనకు వెళ్లిన వాళ్లు తప్పకుండా డాకీ పట్టణంలోని రూట్ బ్రిడ్జి మీద నడిచి మురిసిపోతారు. ఎందుకంటే ఇది దేశానికి చివరి వంతెన. డాకీ దాటితే బంగ్లాదేశ్లో అడుగుపెడతాం. మనిషికి జీవన నైపుణ్యాలు అవసరాన్ని బట్టి వృద్ధి చెందుతాయనడానికి నిదర్శనం ఈ వంతెనలు. ఇనుము, సిమెంటు వంటి భవన నిర్మాణ సామగ్రిని తరలించడం సాధ్యం కాని చోట్ల ప్రకృతి ఇచ్చిన మెటీరియల్తో జనం తమకు అవసరమైన విధంగా మలుచుకోవడం అంటే ఇదే. మేఘాలయలో నివసించే ఖాసీ, జైంతియా తెగల వాళ్లు నదికి రెండు వైపులా ఉన్న రబ్బరు చెట్ల వేళ్లను ఒకదానితో మరొక దానిని జడలాగ అల్లుతూ ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుతో కలుపుతారు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరడానికి వంతెన రెడీ. సిమెంటు వంతెనలు ఎప్పుడు కూలిపోతాయో తెలియదు కానీ ఈ వేళ్ల వంతెనలను ఒకసారి అల్లితే వందేళ్లకు కూడా చెరగవు, పైగా మరింత దృఢమవుతూ ఉంటాయి. మరీ లేత వేళ్లను కాకుండా ఒక మోస్తరు ముదురు వేళ్లతో వంతెన అల్లుతారు. కాలం గడిచే కొద్దీ చెట్టు పెద్దదవుతుంది, వేళ్లు శక్తిపుంజుకుంటూ ఉంటాయి. మరో విచిత్రం ఏమిటంటే... ఈ వేళ్లు నది నీటిని అందుకోవడానికి మాన్గ్రోవ్లాగ పిల్ల వేళ్లను పెంచుకుంటాయి. కొత్త వంతెనలు మనం నడిచేటప్పుడు బరువుకు తగినట్లు ఊగుతుంటాయి. ముదురు వంతెనలు కదలవు. ఈ వంతెనల మీద నుంచి రాకపోకలు సాగించేది మనుషుల మాత్రమే కాదు, జింకలు, చిరుతపులులతోపాటు ఇతర జంతువులు కూడా ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు వంతెనల మీదనే వెళ్తాయి. ఇప్పటి వరకు వంతెన గొప్పదనాన్నే మాట్లాడుకున్నాం. కానీ ఉంగాట్ నదికి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన విశేషణం ఉంది. మనదేశంలో అత్యంత పరిశుభ్రమైన నదుల్లో ఉంగాట్ నది ఒకటి. ఈ నదిలో పడవలో విహరిస్తుంటే నీటి కింద నేల అద్దంలో కనిపించినంత స్వచ్ఛంగా ఉంటుంది. వేళ్ల వంతెన మీద నడవడంతోపాటు పడవ ఎక్కి ఈ నదిలో విహరించడం కూడా గొప్ప అనుభూతి.రాముడు కూడా కట్టాడునది మీద చెట్ల వేళ్లతో వంతెన నిర్మించే నైపుణ్యం ఇతిహాస కాలం నాటిదని చెబుతారు. వనవాస కాలంలో సీతారామ లక్ష్మణులు అడవుల్లో నివసించినట్లు చెప్పుకుంటాం. గంగానది తీరాన నివసించిన రోజుల్లో ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు చేరడానికి రాముడు, లక్ష్మణుడు నదిలో ఈదుతూ వెళ్లేవారని, ప్రతిరోజూ నది దాటడం సీతమ్మకు కష్టం కావడంతో ఆమె కోసం వంతెన నిర్మించారని చెబుతారు. గంగానది మీద రిషికేశ్ దగ్గర రామ్ఝాలా, లక్ష్మణ్ ఝాలా ఉన్నాయి. బ్రిటిష్ పాలన కాలంలో ఈ వంతెనలను ఇనుముతో పునర్నిర్మించారు. రిషికేశ్లో గంగానది మీద ఇప్పుడు మనకు కనిపించేవి కొత్త నిర్మాణాలు. వాకా మంజూలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: తాత మొండి పట్టుదల ఎంత పనిచేసింది..! ఏకంగా ఇంటి చుట్టూ..) -
ఆగర్భ శత్రువులం కాదు.. భూగర్భవాసులం : అబ్బురపర్చే వెంకటేష్ చిత్రాలు
శాలు, జాతులు, మతాలు, కులాల పేరిట విద్వేషాల కుంపట్లు పెరిగిపోతున్న నేపథ్యంలో మానవులందరూ సహోదరులేనని, అందరి అమ్మఒడి భూగర్భమేననే విషయాన్ని గుర్తు చేస్తూ ఓ అద్భుత చిత్రాన్ని రూపొందించారు నగరవాసి. త్వరలోనే ఆ చిత్రాన్ని అంతర్జాతీయంగా ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యువ చిత్రకారుడు వెంకటేష్ కందునూరి(35) తన చిత్రం వివరాలను సాక్షితో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే.. – సాక్షి, సిటీబ్యూరో మాది మహబూబ్నగర్ జిల్లా.. ప్రస్తుతం నగరంలోని చైతన్యపురిలో ఉంటున్నా.. చిన్నప్పటి నుంచీ కళల పట్ల ఉన్న ఆసక్తితో నగరంలోని జేఎన్టీయూలో బీఎఫ్ఏ చేసి ప్రస్తుతం ఫ్రీలాన్స్ ఆరి్టస్ట్గా పనిచేస్తున్నాను. తరచూ సామాజిక అంశాలపై చిత్రాలను గీయడం నాకు అలవాటు. అదేవిధంగా ఈ ఆర్ట్ వర్క్ రూపొందించాను. భూమి.. బలిమి.. ఈ చిత్రంలో ప్రధానంగా భూమి, మనుషులు, జెండాలు, తుపాకులు అనే నాలుగు అంశాలు కనిపిస్తాయి. ఒక మహిళ తన గర్భంలో భూమిని మోస్తూ ఉంటే, ఆ భూమి లోపల తుపాకీతో కాలుస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ తుపాకీ భూమి లోపల దించి ఉండటం వల్ల ఆ మట్టిని తాకిన తుపాకీకి ఉన్న చెక్క జీవం పోసుకుని, చిగురు ఆకులతో కనిపిస్తుంది. మరోవైపు వివిధ రకాల జెండాలు, తుపాకులను చేతబట్టిన ప్రజలు యుద్ధ వాతావరణాన్ని ప్రతిబింబిస్తారు. ‘ఓ మనిషి నువ్వు నన్ను ఎన్ని రకాలుగా చిత్రవధ చేసినా నేను మాత్రం చివరి వరకూ నిన్ను కాపాడుతూనే నీకు జీవాన్ని పోస్తూనే ఉంటా’ అని చెబుతున్న భూమి విలువ గుర్తించమనేదే ఈ చిత్రంలోని అంతరార్థం. ఆరు అడుగుల పొడవు, ఆరున్నర అడుగుల వెడల్పు కలిగిన ఈ భారీ చిత్రాన్ని దేశ రాష్ట్రపతితో ప్రారంభించి, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించాలని, అలాగే ఐక్యరాజ్యసమితి వరకు చేర్చాలని ప్రయత్నిస్తున్నాను అన్నారాయన.ఆగర్భ శత్రువులం కాదు.. భూగర్భవాసులం జాతి కుల మత విద్వేషాలు వదిలితేనే బలం ఆలోచింపజేసే సందేశం అందిస్తున్న అద్భుత చిత్రం అంతర్జాతీయంగా ప్రదర్శించేందుకు సన్నాహాలు -
Cimate Change : అడాప్టేషన్
ప్రకృతి వైపరిత్యాలు, సముద్ర నీటిమట్టం పెరుగుదల, జీవవైవిధ్యం క్షీణత, ఆహార – నీటి అభద్రత వంటి వాతావరణ మార్పుల వల్ల ప్రస్తుతం ఎదురవుతున్న, భవిష్యత్తులో ఎదురయ్యే దుష్ప్రభావాలను తట్టుకునే శక్తిని పెంపొందించే రక్షక చర్యలనే అడాప్టేషన్ అంటారు. వాతావరణ మార్పుల నష్టాన్ని సాధ్యమైనంత వరకు స్థానిక స్థాయిలో అమలు చేయాలినవి అడాప్టేషన్ చర్యలు. అంటే, అడాప్టేషన్ చర్యలను అమలుపరచటంలో గ్రామీణ ప్రజలు, నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రజలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ప్రకృతి / సేంద్రియ వ్యవసాయ పద్ధతుల వంటి పునరుజ్జీవన వ్యవసాయ పద్ధతులను అనుసరించటం.. కరువును తట్టుకునే వంగడాలను సాగు చేయటం.. నీటి నిల్వ – వినియోగ పద్ధతులను మెరుగుపరచటం.. అడవులు తగులబడకుండా అడ్డుకునే రీతిలో భూముల నిర్వహణ చర్యలు చేపట్టడం.. వరదలు, వడగాడ్పులు వంటి తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు బలమైన రక్షణ వ్యవస్థలను నిర్మించటం.. ఇవన్నీ అడాప్టేషన్ చర్యలే. అయితే, స్థానికంగా చర్యలు తీసుకుంటే అడాప్టేషన్ పూర్తి కాదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వాతావరణ మార్పుల దుష్ప్రభావాన్ని తగ్గించుకునేందుకు దారితీసే విధానాల రూపకల్పనతో పాటు ప్రభుత్వాలు అనేక భారీ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సముద్ర నీటి మట్టాలు పెరగటం వల్ల దెబ్బతిన్న కోస్తా ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటం లేదా వేరే సురక్షిత ప్రాంతానికి తరలించటం.. మరింత తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నా తట్టుకునే విధంగా మౌలిక సదుపాయాలను పటిష్టం చేయటం.. ప్రకృతి వైపరిత్యాల గురించి ముందస్తు హెచ్చరికలు చేసే వ్యవస్థలను విస్తరింపజేసి వైపరిత్యాల సమాచారాన్ని అందుబాటులోకి తేవటం.. ప్రత్యేకించి వాతావరణ మార్పులకు సంబంధించిన నష్టాలను పూచ్చేందుకు బీమా సదుపాయాలను అభివృద్ధి చేయటం.. ప్రకృతిసిద్ధమైన పర్యావరణ వ్యవస్థలకు, వన్యప్రాణులకు సరికొత్త రక్షణ చర్యలు చేపట్టం.. ఇవన్నీ క్లైమెట్ ఛేంజ్ అడాప్టేషన్ చర్యలే! ఇదీ చదవండి : తాతగారి సెన్సేషనల్ విడాకులు : భరణం ఎంతో తెలిస్తే అవాక్కే! -
నేచర్.. లవర్స్
నిత్యం తీరిక లేని నగర జీవన విధానం.. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ, అసహజ ఆహారం.. ఈ కాంక్రిట్ జంగిల్లో ఆరోగ్యకరమైన జీవన విధానానికి అనువైన ఒక్క అంశం కూడా లేకపోవడం దుదృష్టకరం, అనివార్యం. అలా అని అనారోగ్యాన్ని ఎవరు కోరుకుంటారు.., కాసింతైనా వ్యాయామం, జాగింగ్ ఇంకేవో ఫిట్నెస్ క్రియలకు నగరవాసులు ఆసక్తి చూపిస్తుండటం విధితమే. అయితే.. ఈ మధ్య కాలంలో ఫిట్నెస్ కోసం సహజ వాతావరణాన్ని కోరుకుంటున్నారు. ఫిట్నెస్, వ్యాయామం ఇలా ఎవైనా సరే జిమ్లోనే వెతుక్కునే వారు. ఈ సంస్కృతిలో భాగంగా నగరంలో ప్రతి ఏరియాకు కనీసం ఒకటి, రెండైనా జిమ్లు వెలిశాయి. కానీ.. నేచురాలిటీ, పచ్చని ప్రకృతి పారవశ్యాన్ని కోరుకునే నగరవాసులు ఈ మధ్య పెరిగిపోతున్నారు. వీరి ఆలోచనలు, అవసరానికి తగిన కొన్ని నేచురల్ స్పాట్స్ను సైతం ఎంపిక చేసుకుని.. ఆరోగ్య, ఆహ్లాదం, ఆనందం పొందుతున్నారు. ఇందులో భాగంగా నగరం నలుమూలలా ఉన్న పార్కులు, ఉద్యానవనాలు ఇతర ప్రాంతాల గురించి ఓ లుక్కేద్దామా..?!! హిల్ పార్క్.. కేబీఆర్ చుట్టంతా కాంక్రిట్ జంగిల్.. ఎడతెరిపిలేని వాహనాల రద్దీ.. పొగతో వాయు కాలుష్యం, వాహనాల శబ్దాలతో శబ్ద కాలుష్యం. ఇలాంటి నెగిటివిటీ మధ్య కొలువైన పచ్చని పారవశ్యంతో, అద్భుతమైన జీవవైవిధ్యంతో కొలువై ఉన్న మినీ ఫారెస్ట్ కేబీఆర్ పార్క్. ప్రకృతిలో జాగింగ్ అనగానే సిటీజనులకు మొదట గుర్తొచ్చేది కేబీఆర్ పార్క్ మాత్రమే.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి తదితర ప్రాంతాలకు చెందిన వ్యాయామ–ప్రకృతి ప్రియుల స్వర్గధామంలా మారింది కేబీఆర్ పార్క్. సువిశాలమైన విస్తీర్ణం, నెమళ్లు, కుందేళ్లు, పక్షులతో ప్రకృతి పారవశ్యాన్ని పంచడంతో పాటు.. నగర రద్దీకి అనుగుణంగా పార్కింగ్కూ అవకాశం ఉండటంతో ఈ హైటెక్ పీపుల్స్ అంతా ఈ పార్క్ బాట పడుతున్నారు.ప్రకృతి పారవశ్యం.. కృత్రిమ హంగులుప్రకృతి అందాలకు తోడు కృత్రిమ హంగులకు తోడైన జాగింగ్ స్పాట్ కాజాగూడ పెద్ద చెరువు. ఈ మధ్య కాలంలో ఈ చెరువు పూడిక తీసి, చుట్టూ అదనపు ఆకర్షణలతో పాటు విశాలమైన రోడ్లు సైతం వేయడంతో.. సమీప ప్రాంతాలకు చెందిన జాగింగ్ ఔత్సాహికులు ఈ వేదికపై వాలిపోతున్నారు. ఇక్కడ పెద్దగా కమర్షియల్ భవనాలు, ట్రాఫిక్ రద్దీ వంటి సమస్యలు లేకపోవడంతో జనాలు ఎక్కువగానే వస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆకర్షణీయమైన బొమ్మలతో సెల్ఫీ స్పాట్గానూ మారింది. దీనికి సమీపంలోనే కొంత కాలం క్రితమే అభివృద్ధి చేసి జాగింగ్, వ్యాయామం వంటి ప్రియులకు అనువైన ప్రదేశంగానూ మారింది ‘మల్కం చెరువు’. ఇక లండన్, సిడ్నీని తలపించే రాయదుర్గం, మాదాపూర్ మధ్యలో కొలువైన అందాల చెరువు ‘దుర్గం చెరువు’. పొద్దున్నే వాహనాల రాకపోకలు ప్రారంభమైనప్పటికీ ఇక్కడ జాగింగ్ను ఎంజాయ్ చేసేవారు ఎందరో.. కేబుల్ బ్రిడ్జ్ దీనికి అదనపు ఆకర్షణ. కొండాపూర్ సమీపంలో ఎప్పటి నుంచో ప్రకృతి ప్రియులను జాగింగ్కు పిలుస్తున్న వనాలు బొటానికల్ గార్డెన్, పాలపిట్ట పార్క్. పాలపిట్ట పార్క్లో ప్రత్యేకంగా సైక్లింగ్ ట్రాక్ కూడా ఉండటం విశేషం.వందల ఎకరాల్లో.. సువిశాల వాతావరణంలో.. నగర శివారుల్లోనే కాదు.. నగరంలో మధ్యలో వందల ఎకరాల్లో ఆవరించి ఉన్న ప్రకృతి సంపద ఉస్మానియా యూనివర్సిటీ. ఎన్నో ఏళ్లుగా నగరవాసులకు జాగింగ్, వ్యాయామం, యోగా, క్రీడలకు కేంద్రంగా సేవలందిస్తోంది ఉస్మానియా క్యాంపస్. చుట్టుపక్కల నుంచి దాదాపు 10, 15 కిలోమీటర్ల నుంచి సైతం ఇక్కడి వాతావరణం కోసం నగరవాసులు వస్తుంటారు. నగరం నడి»ొడ్డున, అసెంబ్లీ ఆనుకుని ఉన్న పబ్లిక్ గార్డెన్ కూడా నగరవాసులతో ఏళ్లుగా మమేకమైపోయింది. దీంతో పాటు నారాయణగూడ, హిమాయత్నగర్కు సమీపంలోని మోల్కోటే పార్క్ కూడా ఉదయం–సాయంత్రం వాకర్లకు అనువైన ప్రదేశంతో పాటు అద్భుతమైన వాతావరణాన్ని అందిస్తోంది. జలగం వెంళరావుపార్క్, నెహ్రూ పార్క్ ఇలా నగరం నలుమూలలా అక్కడక్కడా విశాలమైన విస్తీర్ణంలో ఉన్న ఎన్నో పార్కులు నగరవాసుల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.మినీ ఫారెస్ట్.. జింకల సందడిరెసిడెన్షియల్ ఏరియా ఎక్కువగా ఉన్న బోడుప్పల్ వంటి ప్రాంతాలవాసులకు ప్రశాంతత అందిస్తోంది స్థానిక ‘శాంతి వనం’. వాకింగ్, జాగింగ్, రన్నింగ్ వంటి అన్ని వ్యాయామాలకు అనువైన విశాల అటవీ ప్రాంతం ఉండటం దీని ప్రత్యేక. ఇక్కడ ఒక కిలోమీటర్, అంతకు మించి వాకింగ్ ట్రాక్లు కూడా ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఎల్బీనగర్ దాటుకుని నగర శివార్లలో కనుచూపుమేర పచ్చని చీర కట్టుకుని ఉదయాన్నే జాగింగ్కు ఆహ్వానిస్తోంది నారపల్లి సమీపంలోని ‘నందనవనం’. జింకలు, నెమళ్లు, అరుదైన పక్షిజాతులు ఇక్కడ దర్శమిస్తూ మరింత ఉత్సాహం, ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. నగరవాసులను ఆకర్షించడానికి ఇందులో బల్లలు, హట్స్, ముఖ్యంగా తీగల వంతెనలను సైతం నిర్మించారు. -
ఫ్యామిలీ ఫార్మింగ్ : విద్యార్థులకు ప్రకృతి సేద్య శిక్షణ
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను హైస్కూలు నుంచి యూనవర్సిటీ స్థాయి వరకు విద్యార్థులకు అలవాటు చేయటం ఎంతో అవసరమనే విషయంతో ఇప్పుడు ఏకీభవించని వారు బహుశా ఎవరూ ఉండరు. రసాయనిక అవవేషాల్లేని ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తి ద్వారానే మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. అయితే, ఈ బృహత్ కార్యక్రమాన్ని వ్యాప్తిలోకి తేవటానికి విద్యాసంస్థలతో కలసి పనిచేస్తూ స్ఫూర్తిని నింపుతూ విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయ పనులను అలవాటు చేయటంలో ప్రత్యక్ష కృషి చేస్తున్న వారిని వేళ్లపై లెక్కించవచ్చు. ఈ కోవలో మొదటి పేరు డాక్టర్ గంగాధరం. దాదాపు రెండు దశాబ్దాలుగా సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ విజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక శిక్షణ ద్వారా విశేష కృషి చేస్తున్న ప్రకృతి సేద్య ప్రేమికుడు డాక్టర్ వర్డ్ గంగాధర్. ఇప్పటికే వేలాది మంది రైతులకు, విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఘనత వర్డ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తిరుపతికి చెందిన డాక్టర్ ఎం గంగాధర్కే దక్కుతుంది. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకునే పద్ధతులను ఆయన గత కొన్ని నెలలుగా నేర్పిస్తున్నారు. 20 అడుగుల వెడల్పు “ 20 అడుగుల ΄÷డవు విస్తీర్ణంలో చిన్న చిన్న ఎత్తుమడులు ఏర్పాటు చేసి విద్యార్థుల చేత 15 రకాల ఆకుకూరలు, 4 రకాల కూరగాయల సాగు చేయిస్తున్నారు. ఈ నమూనాకు కుటుంబ వ్యవసాయం (ఫ్యామిలీ ఫార్మింగ్) అని పేరు పెట్టారు. డాక్టర్ గంగాధరం యూనవర్సిటీలో కొందరికి ముందుగానే శిక్షణ ఇచ్చి ‘గ్రీన్ టీమ్’లను ఏర్పాటు చేశారు. డా. గంగాధరం మార్గదర్శకత్వంలో ఈ గ్రీన్ టీమ్ల ఈ కుటుంబ వ్యవసాయాన్ని పర్యవేక్షిస్తున్నారు. గ్రీన్ టీం సభ్యులు ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులను ఇంటింటల కుటుంబ వ్యవసాయ నమూనా మడుల దగ్గరకు ఆహ్వానించి వారికి అవగాహన కల్పిస్తున్నారు.ప్రకృతి సేద్య వ్యాప్తికి దోహదంఈ ఫ్యామిలీ ఫార్మింగ్ నమూనా ముఖ్య ఉద్దేశం గురించి వివరిస్తూ డా. గంగాధరం (98490 59573) ఇలా అన్నారు.. ‘ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆరోగ్యకరమైన 15 రకాల కూరగాయలను ఏ విధంగా సాగు చేయవచ్చో నేర్పిస్తున్నాం. ఈ నమూనా ద్వారా విశ్వవిద్యాలయ విద్యార్థులందరూ పూర్తిస్థాయిలో నమూనాపై అవగాహన తెచ్చుకోగలుగుతారు. వివిధ ప్రాంతాలలో వారి సొంత పొలాల్లో కూడా కొంచెం విస్తీర్ణంలో అయినా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అమలు చేయటం ప్రాంరంభిస్తారు. ఆ విధంగా గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం ప్రాంచుర్యానికి ఎంతో దోహదపడుతుంది. అట్లే తిరుపతి పట్టణంలో ప్రజలందరికీ ఉపయోగపడుతుందని ఆశాభావం..’ అన్నారు. (గార్బేజ్ ఎంజైమ్ : పండ్లు, కూరగాయ మొక్కలకు ఈ ద్రవం ఇచ్చారంటే!)తిరుపతి పట్టణంలోని ప్రజలు కూడా సాయంత్రం 4–5 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనవచ్చని, తమ ఇంటి వద్ద తక్కువ స్థలంలో వివిధ రకాల కూరగాయలు సాగుచేసే పద్ధతులను తెలుసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో యువత విశ్వవిద్యాలయం నుంచి హైస్కూల్ వరకు ఈ నమూనా వ్యాప్తి చెంది రాష్ట్రమంతా యువత ప్రకృతి వ్యవసాయంపై పట్టు సాధించగలరని భావిస్తున్నానన్నారు. ఈ కృషి ఫలించాలని ఆశిద్దాం. డా. గంగాధరం -
అడవిలో అమ్మప్రేమ!
పులి – ఆవు.. పాము – కాకి నీతి కథలుఅందరికీ తెలిసే ఉంటాయి. కథల సారాంశం ఏదైనా.. అందులో తల్లి ప్రేమ కనిపిస్తుంది. మనుషుల్లోనే కాదు పశుపక్షాదుల్లో కూడా కమ్మనైన అమ్మతనం ఎంతో మధురం. తల్లి జంతువు ప్రేమ ముందు ఏ ప్రాణి అయినా, జీవి అయినా తలవంచక తప్పదు.తన కళ్లముందు తన బిడ్డకు కష్టం వస్తే తిరగబడి పోరాడుతుంది. ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా అడవుల్లో కనిపిస్తాయి. అతి చిన్న ప్రాణి అయిన గిజిగాడు మొదలు అతి క్రూరమైన జంతువులుగా చెప్పుకునే పులి, చిరుత, ఎలుగుబంటి వంటి జంతువుల వరకు వాటి పిల్లల లాలన చూస్తే ‘తల్లి ప్రేమ అడవంతా’ అని అనకమానరు.– ఆత్మకూరు రూరల్పశుపక్షాదుల్లో తల్లి ప్రేమను దగ్గరిగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. కోతి, పిల్లులు తమ పిల్లల పెంపకం అందరికీ తెలిసే ఉంటుంది. మాతృప్రేమలో మాత్రం మర్కటాలు మనుషులకే పాఠాలు చెబుతాయి. ఇక పిల్లి నిండు గర్భంతో ఉన్నపుడే తను ప్రసవించే ప్రదేశాన్ని ఎంచుకుని ప్రసవానంతరం కొంత సమయ వ్యత్యాసంతో పిల్లలను కనీసం ఏడు చోట్లకు మార్చడం దాని విశిష్ట లక్షణం. కీటకాలు, పక్షులు, జంతువుల్లో తల్లి ప్రేమ నిశితంగా పరిశీలిస్తే ఔరా.. అనాల్సిందే.నల్లమల అడవుల్లో పెద్దపులులు ప్రధాన రక్షిత జీవి. అంతరించి పోయే దశకు చేరుకుంటున్న వాటి సంతతిని పెంచి పోషించడంలో ఆడ పులులు ఒక యుద్ధ్ధమే చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఈతలోనూ రెండు నుంచి నాలుగు పిల్లలకు జన్మనిచ్చే ఆడపులి వాటిని పెంచడంతో ఎంతో క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. పులి పిల్లలకు ప్రధాన ముప్పు మగపులుల నుంచే ఉంటుంది. సాధారణంగా పులి తన పిల్లలకు మూడేళ్ల వయçస్సు దాటేంత వరకు అవి స్వయంగా తమ ఆహారం సంపాదించుకునే నైపుణ్యం పొందే వరకు తిరిగి సమాగానికి సిద్ధపడదు. అందుకే మగ పులులు ఈ పిల్లలను అడ్డు తొలగిస్తే ఆడపులితో సమాగానికి సిద్ధ పడవచ్చనే ధోరణే పులి పిల్లలకు ప్రమాదం తెచ్చి పెడుతుంది.అందుకే తన సంతానం సమీపంలోకి మగపులి రాకుండా ఆడపులి తరిమి కొడుతుంది. పులిపిల్లలకు మరో ప్రమాదం నక్క, తోడేలు, కొండ్రాసిగాడుగా పిలువబడే దొమ్మలగొండి (హైనా)వంటి స్కావెంజర్ జంతువుల నుంచి కూడా పొంచి ఉంటుంది. తల్లి పులి ఆహారం కోసం వెళ్లినప్పుడు ఈ జంతువులు పులి పిల్లలకు హాని కలిగిస్తాయి. అందుకే తల్లి పులి తన పిల్లలను గుహల్లో, చెట్టు బొరియల్లో ఉంచి వాటి ఉనికి బయటకు తెలియనంతగా జాగ్రత్త పడుతుంది. ఆహార సేకరణ కోసం పెద్దగా పిల్లలను విడిచి దూరం వెళ్లదు. పిల్లలు కాస్త తిరుగాడే వయస్సు వచ్చినపుడు వాటిని వెంట పెట్టుకునే వేటకు ఉపక్రమిస్తుంది. అప్పుడు పులి పిల్లలు మొదట తల్లి చేసే వేట పద్ధతులను పరిశీలిస్తూ మెల్లమెల్లగా వేటాడేందుకు సిద్ధమవుతాయి.ఆహారం భద్రపరిచి.. కూనల కడుపు నింపిపిల్లి కుటుంబానికే చెందిన చిరుతపులి (లెప్పర్డ్) కూడా రెండు నుంచి మూడు పిల్లలను పెడుతుంది. ఇది కూడా పెద్దపులిలాగే పిల్లల కోసం అత్యంత అప్రమత్తంగా సంచరిస్తుంది. పిల్లి జాతిలో పిల్లి తరువాత చెట్టు ఎక్కగలిగే సామర్థ్యం ఉన్న ఏకైక పులి చిరుత మాత్రమే.ఈ ప్రత్యేకతను తన పిల్లలకు ఆహారం దాచి పెట్టే విషయంలో ఉపయోగించుకుంటుంది. పిల్లలను భధ్రమైన చోట దాచి వేటకు వెళ్లి తాను చంపి తెచ్చిన వేట జంతువు కళేబరాన్ని పిల్లల ముందు ఆహారంగా వేస్తుంది. అవి తినగా మిగిలిన భాగాన్ని చెట్టు కొమ్మపై భద్రపరచి మరుసటి రోజు మళ్లీ ఆకలిగొన్న పిల్లలకు పెడుతుంది.అంతా.. ఏకాంతం..ఎత్తైన, ముదిరిన వృక్షాల కాండాలపై సహజంగా ఏర్పడ్డ తొర్రలను ఆడ హార్న్బిల్ గూడుగా ఎంపిక చేసుకుంటుంది. వయస్సు కొచ్చిన మగపక్షి తనతో జతగట్టేందుకు అంగీకరించిన ఆడపక్షితో కలసి ఇలాంటి తొర్రల్లో ప్రవేశిస్తు్తంది. ఆపై ఆడపక్షి తొర్ర ప్రవేశ మార్గాన్ని చెట్ల బెరళ్లు, కర్ర పుల్లలు, బంక మట్టితో కలిపి మూసివేస్తుంది. గాలి చొరబడేందుకు మాత్రం చిన్న రంధ్రాన్ని మాత్రం ఉంచుకుంటుంది. సమాగమనంతరం మగ పక్షి మూసిన ప్రవేశ మార్గాన్ని తిరిగి తెరుచుకుని బయటకు వస్తుంది.ఆడపక్షి మాత్రం గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలను చేసే వరకు గూటిలోనే జైలు జీవితం గడుపుతుంది. మూసివేయబడిన తొర్ర ప్రవేశ మార్గానికి ఏర్పరచిన చిన్నపాటి రంధ్రం ద్వారానే ఆడపక్షికి.. మగపక్షి ఆహారాన్ని అందిస్తుంది. అనంతరం ఆడపక్షి గూటి వెలుపలికి వచ్చి పిల్లలున్న గూటిని తిరిగి మూసి వేస్తుంది. ఆ తరువాత పక్షి దంపతులు కలసి పిల్లల పోషణ భారం వహిస్తాయి. పిల్లలకు రెక్కలొచ్చి గాలిలో ఎగిరే వరకు ఈ తరహా రక్షణలోనే వాటి పోషణ సాగుతుంది.నీ ప్రేమ భల్లూకం గాను..వన్యప్రాణుల్లో తల్లులన్నింటిలోను ఎలుగుబంటి అమితమైన ప్రత్యేక శైలి కలిగినది. ఆడ ఎలుగు బంటి తన పిల్లలను వాటికి వేగంగా పరిగెత్తగల వయçస్సు వచ్చే వరకు తన మూపున మోసుకుని తిరుగుతూ ఉంటుంది. పుట్టలు తవ్వి చెదపురుగులను, చెట్టు ఎక్కి తేనె పట్టును తెచ్చి పిల్లలకు పెడుతూ ఎంతో ప్రేమ పూర్వకంగా పిల్లలను సాకుతుంది. పిల్లలున్న ఎలుగు బంటి మరింత క్రోధంతో సమీపంలోకి వచ్చే జంతువును, మనిషిని చీల్చి చెండాడుతుంది. ళీ నల్లమలలోని హనీబాడ్జర్ నేల బొరియలలో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. తమ పిల్లలు ఇతర జంతువుల బారిన పడకుండా బొరియలో ప్రత్యేక గదులు తవ్వుకుని రక్షణ కల్పిస్తాయి. గిజిగాడు పక్షి అందమైన గూళ్లను అత్యంత భధ్రమైన ప్రదేశాలలో (చిటారు కొమ్మలకు నీటి తలం అంచున) కట్టి అందులో గుడ్లను పొదిగి పిల్లలకు నిరంతరం కీటకాలను, ధాన్యం గింజలను ఆహారంగా అందించి పెంచుతుంది.కందిరీగలు వివిధ కీటకాల లార్వాలను తీసుకు వచ్చి గూడులో ఉన్న పిల్లలకు ఆహారంగా పెడతాయి.తేనె టీగలు తెట్టెలో షడ్భుజాకారంలో ఉండే గదుల్లో ఉండే పిల్ల ఈగలకు అవి సేకరించిన మకరందాన్ని ఆహారంగా అందిస్తాయి.రేచుకుక్కలు (వైల్డ్ డాగ్స్) వేట జంతువులను చంపి మాంసాన్ని కడుపులో నిల్వ చేసుకుని తమ పిల్లల వద్దకు వెళ్లి వాటి ముందు మాంస కండలను కక్కి తినిపిస్తాయి.