Navaratri
-
క్రిస్మస్ నవరాత్రులు
క్రిస్మస్ వేడుకలు ప్రపంచమంతటా జరుగుతాయి. ఏటా డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలను దేశ దేశాల్లో ఘనంగా జరుపుకొంటారు. దక్షిణ అమెరికాలోని పలు దేశాల్లో మాత్రం క్రిస్మస్ సందడి ముందుగానే మొదలవుతుంది. క్రిస్మస్ పండుగకు ముందుగా తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ వేడుకలను ఒకరకంగా క్రిస్మస్ నవరాత్రులుగా చెప్పుకోవచ్చు. ‘లాస్ పొసాడాస్’ అనే ఈ వేడుకలు ఏటా డిసెంబర్ 16 నుంచి 24 వరకు జరుగుతాయి. ఏసుక్రీస్తు జననానికి ముందు ఆయన తల్లిదండ్రులు మేరీ, జోసెఫ్లు నజరేత్ నుంచి బేత్లహామ్కు సాగించిన ప్రయాణం, పర్ణశాలలో క్రీస్తు జననం వంటి ఘట్టాలను గుర్తు చేసుకుంటూ ఈ వేడుకలను జరుపుకొంటారు. మెక్సికో సహా పలు దక్షిణ అమెరికా దేశాల్లో ఈ సంప్రదాయం 1586 సంవత్సరం నుంచి కొనసాగుతోంది. ఈ సందర్భంగా జనాలు రాత్రివేళల్లో కొవ్వొత్తులు చేతపట్టి ఊరేగింపులు జరుపుతారు. చర్చిల్లో సామూహిక ప్రార్థనలను నిర్వహిస్తారు. కొందరు పిల్లలు, పెద్దలు వేషాలు కట్టి మేరీ, జోసెఫ్ల ప్రయాణం, క్రీస్తు జననం ఘట్టాలను అభినయిస్తారు. ఈ తొమ్మిది రోజుల్లోనూ కొన్ని వేడుకలు పురాతన ‘అజ్టెక్’ సంప్రదాయాల ప్రకారం కూడా జరుగుతాయి. ‘అజ్టెక్’ పురాణాల ప్రకారం దేవతల తల్లి అయిన టోంజాంట్జిన్కు శీతకాల ఆయానాంత దినమైన డిసెంబర్ 22న హుయిట్జిలోపోష్ట్లి (సూర్య భగవనాడు) పుట్టాడని దక్షిణ అమెరికాలో అజ్టెక్ సంప్రదాయాలను అనుసరించే వారు నమ్ముతారు. ‘లాస్ పొసాడాస్’ వేడుకల్లో భాగంగా వీరు సూర్య జయంతి వేడుకలను కూడా జరుపుకొంటారు. క్రీస్తు జననాన్ని పండుగలా జరుపుకోవడానికి ఆయన జన్మించిన పర్ణశాల వంటి పర్ణశాలలను కూడళ్లలో ఏర్పాటు చేసి, వాటి ఎదుట ప్రార్థన గీతాలను ఆలపిస్తారు. ఈ తొమ్మిది రోజులూ విందు వినోదాలతోను, ఆధ్యాత్మిక ప్రార్థనలతోను గడుపుతారు. -
ఇంద్రకీలాద్రి: శ్రీదుర్గాదేవి అలంకరణలో విజవాడ దుర్గమ్మ (ఫోటోలు)
-
దసరా మహోత్సవాల రెండో రోజు.. శ్రీ గాయత్రిదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు (ఫోటోలు)
-
చైత్ర మాసం విశిష్టత? వసంత నవరాత్రులు ఎందుకు చేస్తారు?
“ఋతూనాం కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే వసంత ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా. చైత్రమాసం అనగానే మనకి ఉగాది , శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. అవే కాదు , దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం , యజ్ఞ వరాహమూర్తి జయంతి , సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి. అలా చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక , అనేక ఆధ్యాత్మిక , పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. అంతటి విశిష్టత గల చైత్ర మాసంలో దాగున్న విశిష్టతలేంటో సవివరంగా తెలుసుకుందామా!. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు. చైత్ర శుద్ధ పాడ్యమి – ఉగాది. ప్రకృతి చిగురించే వసంతకాలాన్ని ఉత్సాహంగా స్వాగతించే పండుగ ఉగాది. చెట్లు, చేమలే కాదు, పశుపక్ష్యాదులు కూడా వసంతాగమనాన్ని స్వాగతిస్తాయి. ఏడాదికి యుగము అనే పేరు కూడా ఉంది. అందుకే యుగాది, ఉగాది అయ్యింది. చాంద్రమానాన్ని అనుసరించేవారే కాక , సౌరమానాన్ని అనుసరించే కొంతమంది కూడా ఈ రోజు నుంచి సంవత్సరాదిని జరుపుకుంటారు. చైత్ర శుద్ధ పాడ్యమి – ఉగాది నుండి చైత్ర శుద్ధ నవమి వరకూ వసంత నవరాత్రులు. మనం సంవత్సరంలో మనం మూడు సార్లు నవరాత్రులు జరుపుకుంటాం. మొదటిది చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు , రెండవది భాద్రపదమాసంలో వచ్చే గణపతి నవరాత్రులు , మూడవది ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు. సంవత్సరంలో మొదటగా వచ్చే వసంత నవరాత్రులని ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ నవరాత్రులలో లలితాదేవిని కూడా ఆరాధించాలి. అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులూ రామాయణాన్ని పారాయణ చేసి, నవరాత్రుల చివరి రోజున సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా చేసి, చూసి తరిస్తారు. రామాయణానికి ఈ వసంత నవరాత్రులకి ఎంతో అవినాభావ సంబంధం వుంది. రామాయణం లోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ తొమ్మిది రోజులలో జరిగాయి. రాముడు జన్మించినది మొదలు , వనవాసానికి వెళ్ళటం , దశరథుని మరణం , సీతాపహరణం , రావణుని సంహారానంతరం సీతారాములు అయోధ్యానగరానికి చేరటం , శ్రీరామపట్టాభిషేకము వంటివి ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఈ చైత్రమాసంలో జరిగాయి. చైత్రంలో జరపుకునే పండుగలు.. చైత్ర శుద్ధ విదియ నాడు బాలచంద్రుడిని బాలేందు వ్రతం అని పూజిస్తారు. చంద్రునికో నూలుపోగు అని విదియ నాటి బాలచంద్రునికి కొత్త నూలుపోగు అని సమర్పిస్తారు. చంద్రుడు జ్ఞానప్రదాత. ఆయనకీ నూలుపోగు సమర్పించి , మనకి జ్ఞానాన్నిమ్మని కోరుతారు. చైత్ర శుద్ధ తదియ – డోలాగౌరీ వ్రతం(సౌభాగ్య గౌరీ వ్రతం), సౌభాగ్య శయన వ్రతం, ఆ రోజున పార్వతీపరమేశ్వరులను దమనంతో పూజించి , డోలోత్సవం నిర్వహిస్తారు. చవితితో కూడిన తదియ రోజున ఈ ఉత్సవం చేస్తారు. పార్వతీ దేవి శివుడిని భర్తగా పొందటం కోసం తపస్సు చేసినప్పుడు , చైత్ర శుద్ధ తదియ నాడు ఆ తపస్సు ఫలించింది. సీతాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లు తెలుస్తోంది. సౌభాగ్యాన్ని , పుత్రపౌత్రాదులను , భోగభాగ్యాలను ప్రసాదించే ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. ఈ రోజు మత్స్య జయంతి కూడా. – శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోమకుణ్ణి వధించి , వేదాలను రక్షించిన రోజు. చైత్ర శుద్ధ పంచమి – లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు మరియు నాగులను కూడా ఈ రోజు పూజించాలి. అనంత , వాసుకి , తక్షక , కర్కోటక , శంఖ , కుళిక , పద్మ , మహాపద్మ అనే మహానాగులను పూజించి , పాలు , నెయ్యి నివేదించాలి. అశ్వములను కూడా ఈ రోజు పూజించాలి. శ్రీ మహావిష్ణువు అవతారాలలో హయగ్రీవావతారం కూడా ఒకటి. ఈ రోజు శ్రీరామ రాజ్యోత్సవం అనగా రాముల వారికి పట్టాభిషేకము జరిగిన రోజు. శ్రీరామునిగా అవతరించిన రోజు.. శ్రీరామ పట్టాభిషేకము చేయించిన మంచిది. ఒకవేళ చేయలేకపోయినా , శ్రీరామాయణంలో రామపట్టాభిషేకము ఘట్టము పారాయణము చేయడం మంచిది. చైత్ర శుద్ధ అష్టమి –భవానిదేవి ఆవిర్భవించిన రోజు మరియు అశోకాష్టమి అంటారు. ఆరోజు భవాని మాతని పూజిస్తారు. స్త్రీలు అమ్మవారిని అశోక పుష్పాలతో పూజించి, అశోకవృక్షం చిగురుని సేవిస్తే గర్భ శోకం కలుగదు అని శాస్త్రము చెప్పింది. చైత్ర శుద్ధ నవమి – శ్రీరామనవమి . శ్రీమహావిష్ణువు తన పూర్ణావతారము అయిన శ్రీరామునిగా అవతరించిన రోజు. ఈ రోజు ఊరూరా, వాడవాడలా శ్రీసీతారాముల కళ్యాణం చేస్తారు. నూతన సంవత్సరంలో సీతారాముల కళ్యాణం జరిగిన తరువాతే ప్రజలు తమ ఇంట వివాహాది శుభకార్యాలు తలపెడతారు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు జన్మించిన సంవత్సరం విళంబినామ సంవత్సరం. చైత్ర శుద్ధ ఏకాదశి – వరూధిన్యేకాదశి , కామద ఏకాదశి అని అంటారు. చైత్ర శుద్ధ పౌర్ణమి – స్త్రీలు చిత్రవర్ణాలు గల (రక రకాల రంగులు) వస్త్రాలను దానం చేయటం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. ఈ రోజు చిత్రగుప్తుని వ్రతం చేసిన మంచిది. ఉత్తర భారతదేశంలోని వారు హనుమజ్జయంతిని జరుపుకుంటారు. చైత్ర బహుళ త్రయోదశి – యజ్ఞవరాహ జయంతి. సృష్ట్యాదిలో భూమిని సుప్రతిష్ఠితం చేయడానికి యజ్ఞవరాహమూర్తి అవతరించిన రోజు. ఇలా మాసమంతా ఎన్నో విశిష్టతలు , ప్రాధాన్యతలు కలిగిన మాసం చైత్ర మాసం. ఈ మాసంలో జ్ఞాన సముపార్జన చేయమని సూచించారు. మనమంతా కూడా ఉత్సాహంతో ఉగాదిని జరుపుకుని , రామాయణ సారాన్ని గ్రహించి ఆచరించే యత్నం చేద్దాం. సీతారాముల కళ్యాణం చూసి తరిద్దాం. ఈ ఏడాది కొత్తగా అయోధ్యలో ఏర్పాటైన రామాలయంలో సీతా రాముల కళ్యాణం వైభవోపతంగా జరగనుండటం విశేషం. (చదవండి: Ugadi 2024 : ఈ ఏడాది ఉగాది పేరేంటి? ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ ) -
మరింత మెరిసిన బంగారం! దసరా అమ్మకాలు అదుర్స్..
Dussehra Gold Sales: పండుగ వేళ బంగారం మరింత మెరిసింది. ఓ వైపు గాజాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, భారత్లో పండుగ సీజన్లో పసిడి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఎకనమిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, పీఎన్జీ జ్యువెలర్స్, సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి ప్రముఖ జ్యువెలర్స్ ఈ దసరా-నవరాత్రి సమయంలో అమ్మకాలు గతేడాది కంటే 30 శాతం వరకు పెరిగినట్లుగా పేర్కొన్నాయి. ధరలు పెరుగుతున్నా.. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం చెలరేగినప్పటి నుంచి బంగారం ధరలు 5.5 శాతం పెరిగినప్పటికీ అమ్మకాలు మాత్రం తగ్గలేదు. ఇక అధిక్ మాసం కాలం (జులై-ఆగస్టు) నుంచి వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. హమాస్ దాడులకు ముందు రూ.57,415 ఉన్న 10 గ్రాముల బంగారం ధర గత రెండు వారాల్లో రూ.60,612కి చేరింది. శ్రాద్ధ మాసం నుంచి బంగారం అమ్మకాలలో పురోగతి కనిపిస్తోందని, నవరాత్రుల సమయంలో మరింత జోరందుకుందని పీఎన్జీ జువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 30 శాతం మేర అమ్మకాలు పెరిగినట్లు ఆయన అంచనా వేశారు. టైటాన్ ఆభరణాల విభాగం జులై నుంచి సెప్టెంబరు వరకు అమ్మకాలలో 19 శాతం పెరుగుదలను చూసింది. ఈ దసరా సందర్భంగా మునుపటి సంవత్సరంతో పోలిస్తే 18 శాతం అమ్మకాలు పెరిగాయని మలబార్ గోల్డ్ నివేదించింది. బలమైన వినియోగదారుల డిమాండ్, స్థిరమైన రిటైల్ విస్తరణ ఈ వృద్ధికి కారణమని మలబార్ గోల్డ్ చైర్మన్ అహమ్మద్ చెప్పారు. ధరల సున్నితత్వం ఉండే తూర్పు ప్రాంతాల్లో సెంకో గత దసరాతో పోలిస్తే బంగారు ఆభరణాల అమ్మకాల్లో 10-15 శాతం వృద్ధిని సాధించింది. వజ్రాభరణాల అమ్మకాలు 20 శాతం పెరిగాయని సెన్కో మేనేజింగ్ డైరెక్టర్ సువంకర్ సేన్ తెలిపారు. ఇదీ చదవండి: Gold Prices: మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. మొబైల్కే బంగారం ధరలు! -
Niharika Konidela Latest Photos: దసరా నవరాత్రులు.. తొమ్మిది అవతారాల్లో ముస్తాబైన నిహారిక (ఫోటోలు)
-
థాయిలాండ్లో కూడా నవరాత్రులు..రెస్టారెంట్, హోటళ్లలో ఓన్లీ వెజ్!
మనకు దసరా నవరాత్రులు జరిగే సమయంలోనే థాయ్లాండ్లో ఏటా శాకాహార సంబరాలు జరుగుతాయి. ఈ ఏడాది అక్టోబర్ 15న మొదలైన ఈ సంబరాలు అక్టోబర్ 24న ముగుస్తాయి. ఈ సంబరాలను ‘జయ్’ ఉత్సవాలు అని పిలుస్తారు. ఒకానొకప్పుడు మలయ్ సమ్రాజ్యాన్ని పరిపాలించిన తొమ్మిదిమంది చక్రవర్తుల పేరిట ఈ ఉత్సవాలను తొమ్మిదిరోజుల పాటు నిర్వహించే ఆచారం మొదలైనట్లు చెబుతారు. థాయ్లాండ్లోని మిగిలిన ప్రాంతాల కంటే ఫుకేత్ నగరంలో ఈ సంబరాలు భారీ స్థాయిలో జరుగుతాయి. థాయ్లాండ్లోనే కాకుండా మలేసియా, ఇండోనేసియా, సింగపూర్లలో పెరనాకన్ తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లోనూ ఈ సంబరాలు జరుగుతాయి. తావో మత ఆచారాల ప్రకారం తొమ్మిదిరోజుల పాటు ఈ సంబరాలను ఘనంగా జరుపుకొంటారు. ఈ తొమ్మిదిరోజులూ మాంసాహారాన్ని ముట్టరు. పూర్తిగా శాకాహారమే భుజిస్తారు. ఈ సందర్భంగా దీక్షపూనే వారిలో కొందరు నాలుకకు, బుగ్గల్లోను పదునైన సూదులు, కత్తులు వంటి ఆయుధాలను గుచ్చుకుని ఊరేగింపుల్లో పాల్గొంటారు. ఊరేగింపులు జరిగే వీథుల్లోను, ప్రార్థన మందిరాల వద్ద ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఆహారశాలలను ఏర్పాటు చేస్తారు. ఈ ఆహారశాలల్లో చైనీస్ సంప్రదాయ శాకాహార వంటకాలను విక్రయిస్తారు. ఈ సంబరాలు జరిగే తొమ్మిదిరోజుల్లోనూ థాయ్లాండ్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు కూడా శాకాహార వంటకాలనే విక్రయిస్తాయి. పూర్తి శాకాహారమే విక్రయిస్తున్నట్లుగా హోటళ్లు, రెస్టారెంట్లపై పసుపు రంగు జెండాలను ఎగురవేస్తాయి. (చదవండి: తుమ్మెదల సైన్యంతో రాక్షసుడుని అంతమొందించింది కాబట్టే..) -
సందేశాత్మకం నవరాత్రి అలంకరణం
త్రేతాయుగం, ద్వాపరయుగం...ఇలా ఏ కాలంలోనైనా, ఏ అంశంలోనైనా స్త్రీని అత్యున్నత స్థానంలో ఉంచి గౌరవించారు. ఆమెను తొలిగురువుగా, ఆది శక్తిగా భావించి ఆరాధించారు. మన పురాణాలను కూలంకషంగా పరిశీలించినట్లైతే ఈ విషయం మనకు అవగతమౌతుంది. భారతావని అంతటా వైభవోపేతంగా జరిగే దసరా నవరాత్రి ఉత్సవాల్లోనూ అమ్మవారిదే వైభోగమంతా. ఆ జగన్మాతని ఆరాధించేందుకే ఈ మహా శరన్నవరాత్రి సంరంభమంతా... విజయదశమి....పదిరోజుల పండుగ...మనిషిలో దాగిన లోభం, అలసత్వం, జడత్వం, దురాశ, పాప–చింతనలాంటి వికారాలను నశింపచేసి, సాత్వికప్రవృత్తి వైపు నడిపిస్తుంది. మనలోని శక్తిని జాగృతం చేసి శుభసంకల్పాలకు నాంది పలికి చైతన్యం వైపుగా నడిపిస్తుంది. విజయదశమి–నవరాత్రి–దుర్గాపూజ...అన్ని శబ్దాలకూ ఒకటే అర్థం....తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అవతారాలుగా భావిస్తూ ఆ జగన్మాతని పూజించుకోవటం. అసలు దసరా పండుగను తొమ్మిది రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు, అమ్మవారిని తొమ్మిది రూపాల్లో ఎందుకు కొలుస్తారు, దీని వెనుక ఉన్న పరమార్థం ఏమిటి తెలుసుకుందాం. త్రిపురసుందరి, త్రిపురేశ్వరి, పరమేశ్వరి, కామేశ్వరి, రాజరాజేశ్వరి వంటి అనేక నామాలతో పూజలందుకుంటున్న లలితాదేవి అఖిలాండకోటి బ్రహ్మాండాలకు జనని. పిపీలికాది బ్రహ్మపర్యంతమూ సకల జీవకోటికీ మాతృదేవత. తన బిడ్డలుగా భావించిన ప్రజలను పట్టి పీడిస్తున్న భండాసురుడనే రాక్షసుడినీ, వాడి ముప్ఫైమంది సంతతినీ, వారి సైన్యాన్నీ ఆదిశక్తి అవలీలగా వధించింది. అలాగే చండాసురుడు, ముండాసురుడు, మహిషాసురుడు అనే లోకకంటకులైన రాక్షసులను సంహరించి, చతుర్దశ భువనాలకూ శాంతిని ప్రసాదించింది. అందుకు ప్రతీకగా జరుపుకుంటున్నవే దసరా ఉత్సవాలు. దశహరా అంటే పది రకాల పాపాలను నశింపజేసేవని అర్థం. అదే క్రమేణా దసరాగా మారింది. విజయదశమి – వివిధ కారణాలు ఆయా రాక్షసులపై జగజ్జనని సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు జరుపుకునే పండుగే విజయదశమి. ఇవి గాక విజయదశమి జరుపుకోవడానికి మరికొన్ని కారణాలున్నాయి. మహర్నవమినాడు శ్రీరామచంద్రుడు దేవిని ధ్యానించి రావణ సంహారం చేయగా దేవతలు పరమానందభరితులై దేవీపూజ చేశారు. నాటినుండి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీనవరాత్రులను, పదవరోజున విజయదశమినీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దుర్గాదేవి మహిషారుని సంహరించిన రోజని, అజ్ఞాతవాస పరిసమాప్తి కాగానే విజయుడు (అర్జునుడు) ఉత్తర గోగ్రహణం చేసి విజయం సాధించిన రోజని మరో గా«థ ఉంది. ఐకమత్యమే ఆయుధ బలం ఎంతటి దైవమైనా రాక్షసులను సంహరించాలంటే ఒక్కరి వల్లే కాదు. ఎందుకంటే రాక్షసులు కూడ తపశ్శక్తి సంపన్నులే! కాని వారి లక్షణాలు మాత్రం సరైనవి కావు. అందుకే ఆ తల్లి ఈశ్వరుడి నుంచి త్రిశూలాన్ని, కుమారస్వామినుంచి శక్తి ఆయుధాన్ని, వినాయకుడి నుంచి విఘ్న నివారణ ఆయుధాన్ని, విష్ణువు నుంచి చక్రాయుధాన్ని, ఇంద్రుని నుంచి వజ్రాయుధాన్ని, విశ్వకర్మనుంచి డాలుని, అగ్నిదేవుని నుంచి ఆగ్నేయాస్త్రాన్ని, యుముని నుండి పాశాన్ని, వరుణుని నుంచి వారుణాస్త్రాన్ని, వీటన్నింటినీ కూడగట్టుకోవడానికి కుబేరుని నుంచి ధనరాశులతో నిండిన కుండను, దానితోబాటు వారందరి బలాన్ని కూడగట్టుకుని యుద్ధంచేసి విజయం సాధించింది. సమష్టి బలం దీనిని బట్టి మనం తెలుసుకోవలసినదేమంటే ఏ ఒక్కరూ విడిగా చేయలేని పనిని ఐకమత్యంగా ఉండి, అందరి శక్తినీ ఒక్కచోట చేర్చితే ఎంతటి క్లిష్టమైన పనినైనా సాధించగలం. విజయదశమి పండుగ మనకు సమైక్యతతో ఉండవలసిన ఆవశ్యకతను, స్త్రీ శక్తి ప్రాధాన్యతనూ చాటి చెబుతోందన్నమాట. అందరి మొరలూ ఆలకించే అసలైన అమ్మ మన మనస్సులోని తలంపులు స్వచ్ఛంగా ఉన్నప్పుడు అమ్మ ప్రసన్నవదనంతోనూ, కలుషితంగా ఉన్నప్పుడు అమ్మ భయంకరాకారంలోనూ కనిపిస్తుంది. నిశ్చల చిత్తంతో అమ్మను పూజిస్తే అభీష్టాలు నెరవేరుతాయి. దుర్గాదేవి ప్రకృతి స్వరూపిణి కాబట్టి ఆమెను ఆరాధించడమంటే ప్రకృతిని ఆరాధించడమే. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మను పూజిస్తే ఐహిక, ఆముష్మిక ఫలితాలు కలుగుతాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుతుంది. లౌకిక బంధాల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాధి పీడితులకు ఆరోగ్యం చేకూరుతుంది. చిత్తస్థై్థర్యం, శత్రు విజయం చేకూరతాయి. ఒక్కరోజు పూజతో సంవత్సర ఫలం దసరా పర్వదినాలలో సింహవాహిని అయిన అమ్మవారిని షోడశోపచారాలతో అర్చించడం వల్ల సంవత్సరమంతా పూజించిన ఫలం దక్కుతుంది. తొమ్మిది రోజులు పూజించలేనివారు మూడు రోజులు, మూడురోజులు కూడా కుదరని వారు కనీసం చివరి రోజయిన విజయ దశమినాడు ఒక్కరోజయినా సరే ఆ దివ్యమంగళస్వరూపాన్ని దర్శనం చేసుకుని తీరాలి. అలా అమ్మను దర్శించుకుని పూజ చేయడం వల్ల పాపాలన్నీ పటాపంచలవడంతోపాటు శత్రుజయం కలుగుతుంది. సకల శుభాలూ చేకూరతాయి. ఇక విజయదశమినాడు శమీవృక్షాన్ని (జమ్మిచెట్టును) దర్శించుకుని, ‘‘శమీ శమయితే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’’ అని స్తుతించాలి. జమ్మిని పెద్దలకు ఇచ్చి వారి ఆశీస్సులను అందుకోవాలి. శమీవృక్షానికీ, విజయ దశమికీ అవినాభావ సంబంధం ఉంది. శమీవృక్షం కనక ధారలు కురిపిస్తుందనే విశ్వాసం, శమీవృక్ష నీడ, శమీవృక్షపు గాలులు అన్నీ విజయ సోపానాలకు దారితీస్తాయనే నమ్మకం అనాదిగా ఉంది. శ్రీరాముడు వనవాసం చేసేటప్పుడు శమీవృక్షం కలపతోనే కుటీరం నిర్మించుకున్నాడని చెబుతారు. శమీవృక్షం విశిష్ఠతను పాండవులకు శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పి, వారి ఆయుధాలను ఆ వృక్షం మీద దాయడం వల్ల కలిగే శుభఫలితాలను వివరించడం వల్ల పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేముందు తమ దివ్యాస్త్రాలను జమ్మిచెట్టుపైనే దాచారు. మహిషాసురమర్దిని: సర్వదేవతల తేజస్సుల కలయిక అయిన ఆదిశక్తి మహిషాసుర మర్దిని. ఆశ్వయుజ శుద్ధ నవమిరోజున మహిషాసురుడిని సంహరించింది కనుక మహర్నవమినాడు అమ్మకు ఆ అలంకరణ చేస్తారు. సింహవాహన అయిన మహిషాసురమర్దిని నేటి పర్వదినాన ఉగ్రరూపంలోగాక శాంతమూర్తిగా దర్శనమివ్వడం విశేషం. మహిషాసురమర్దిని అలంకార ంలో అమ్మను దర్శించుకోవడం వల్ల సకల శుభాలూ చేకూరడమేగాక పిశాచబాధలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. శ్రీరాజరాజేశ్వరి: లోకశుభంకరి, అపరాజితాదేవి అయిన శ్రీ రాజరాజేశ్వరీదేవి దసరా ఉత్సవాల ముగింపు రోజయిన విజయదశమినాడు భక్తులకు చెరకుగడతో, అభయముద్రతో, ఆర్తితో పిలవగానే వచ్చే పాపగా దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరీ అవతారాన్ని దర్శించడం వల్ల సర్వకార్యానుకూలత, దిగ్విజయ ప్రాప్తి కలుగుతాయి. దుష్టరాక్షసులయిన రావణ కుంభకర్ణమేఘనాథులను సంహరించినందుకు గుర్తుగా కొన్ని ప్రాంతాలలో వారి దిష్టిబొమ్మలను తయారు చేసి టపాసులతో పేల్చేయడమో లేదా దహనం చేయడమో ఒక ఉత్సవంగా నిర్వహిస్తారు. దీనికే రామలీల అని పేరు. తెలంగాణ ప్రాంతం నవరాత్రులలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యమిస్తే, విజయనగరంలో పైడితల్లి వేడుకలు జరుపుతారు. ఆంధ్రప్రాంతంలోని పల్లెలలో ‘శమీశమయితే పాపం శమీ శత్రువినాశనం, అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’ అంటూ శమీపూజ చేయడం, రైతులు, వివిధ వృత్తులవారు, కళాకారులు వారి వారి పనిముట్లను పూజించడం ఆచారం. తెలంగాణలో జమ్మి ఆకును తీసుకు వచ్చి, జమ్మి బంగారాన్ని అందరికీ పంచి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం, పెద్దలకు జమ్మిని ఇచ్చి వారి ఆశీస్సులు అందుకోవడం ఒక వేడుకగా జరుగుతుంది. పెద్ద పెద్ద సంస్థలలోనూ, కర్మాగారాలలోనూ యంత్రాలను పూజిస్తారు. బాక్స్ దుర్గానవరాత్రులో ఆఖరి అవతారం శ్రీరాజరాజేశ్వరి. భక్తులకు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, ఙ్ఞానశక్తిని ప్రసాదించే అవతారం శ్రీరాజరాజేశ్వరి. ఏ దేవి రూపమైనా, ఏ శక్తి రూపమైనా అన్నిటికి మూలమైన శక్తి పరమేశ్వరి. ఈరోజు లలితా సహస్రనామ పారాయణతో పూజించాలి. చేమంతులతో ఆరాధన చేయాలి. భక్ష్య, భోజ్యాలతో మహానివేదన చేయాలి. ఈ రోజున అశ్వపూజ, ఆయుధపూజ, ఉఛ్చైశ్రవ పూజ, వాహన పూజ నిర్వహిస్తారు. శ్రీరాముడు విజయదశమి రోజున ‘అపరాజితాదేవిని’ పూజించి రావణునిపై విజయాన్ని సాధించాడు. నవరాత్రుల అనంతరం దశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయంలో శమీవృక్షం వద్ద అపరాజితాదేవిని స్మరిస్తారు. ‘‘శమీ శమయతే పాపం, శమీ శత్రువినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియ దర్శినీ’’ ఈ మంత్రంతో తమ తమ గోత్రనామాలు చెప్పుకుని జమ్మి వృక్షాన్ని పూజ చేసి మూడు ప్రదక్షిణలు చేస్తారు. శ్రీరాముడు దశకంఠుని సంహరించిన రోజు గనుక ‘దశహర’ అని కూడా పిలువబడుతోంది. దేవదానవులు క్షీరసాగర మథనం చేసి అమృతాన్ని సంపాదించినది కూడా దశమి రోజునే. తిథి, వార, నక్షత్ర గణన లేకుండా విజయదశమి రోజున చేపట్టిన సకల కార్యాలు విజయం పొందుతాయని నమ్మిక. ఇదే విషయం ‘చతుర్వర్గ చింతామణి’ అనే ఉద్గ్రంథం విపులీకరించింది. దేవీ ఉపాసకులు అంతవరకు తాము చేసిన జప సంఖ్యననుసరించి హోమాలు చేస్తారు. నవరాత్రి వ్రత సమాప్తి గావించిన వారు సర్వ సిద్ధులు పొందుతారు, సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది. చెడుపై మంచి సాధించిన విజయం దానవత్వంపై దైవం సాధించిన విజయానికి చిహ్నంగా మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనం పోరాటం చేయడానికి దానవులు లేరు –మానవులు తప్ప. కానీ మనం పోరాడి తీరవలసిన శత్రువులున్నారు. వారే అందరిలోనూ ఉండే అరిషడ్వర్గాలనే శత్రువులు. వారితోనే మనం పోరాడి విజయం సాధించాలి. జీవితాలను ఆనందమయం చేసుకోవాలి. విజయదశమి అంటే సకల విజయాలనూ కలుగ చేసే దశమి. ఆ రోజున ఆరంభించే ఏ శుభకార్యమైనా, మంచి పని అయినా, రకరకాల వృత్తులు, వ్యాపారాలు అయినా అఖండ విజయం సాధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పర్వదినాన్ని ముహూర్తంగా ఎంచుకుని మంచి పనులు ప్రారంభిద్దాం. ఈ విజయ దశమి అందరికీ సుఖ సంతోషాలను, విజయాలను ప్రసాదించాలని అమ్మను కోరుకుందాం. –డి.వి.ఆర్. భాస్కర్ (చదవండి: సింహం వద్ద సలహదారు ఉద్యోగం! ) -
అమ్మవారి నామాలే ఆ మహా నగరాలు!
విభిన్న నామాలతో, వివిధ రూపాలలో ఆయా ప్రాంతాల్లో కొలువైన ఆ ఆదిపరాశక్తి పేరు మీద ఏకంగా కొన్ని మహానగరాలే వెలిశాయంటే ఆశ్చర్యం కాక మరేమిటి? అమ్మవారి నామంతో వెలసిన అలాంటి నగరాలు కొన్ని... వాటి ప్రాశస్త్యం క్లుప్తంగా... కోల్కతా – కాళీమాత కోల్కతా పేరు చెప్పగానే ఆ మహానగరంలో వెలసిన కాళికాదేవి రూపంతోపాటు కాళీఘాట్లో ప్రతి యేటా అంగరంగ వైభవంగా జరిగే దసరా ఉత్సవాలు కళ్లకు కడతాయి. నల్లని రూపంతో, రక్త నేత్రాలతో, పొడవాటి నాలుక బయటపెట్టి ఎంతో రౌద్రంగా కనిపించే ఈ అమ్మవారు తనను పూజించే భక్తుల పాలిట కరుణామయి. కన్నతల్లిలా బిడ్డలను కాపాడుతుంది. కోల్కతాకు ఆ పేరు రావడం వెనక ప్రాచుర్యంలో ఉన్న కొన్ని పురాణ గాథలను చూద్దాం... ‘కాళీఘాట్’ అనే పదం నుంచి ఈ నగరానికి కోల్కతా అనే పేరొచ్చినట్లు చాలామంది చెబుతారు. అలాగే బెంగాలీ భాషలో కాలికా క్షేత్ర అంటే.. కాళికాదేవి కొలువై ఉన్న ప్రాంతం అని అర్థం. అమ్మవారు కొలువైన కాళీఘాట్ కాళీ దేవాలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉన్నట్లు స్థల పురాణం చాటుతోంది. మంగళాదేవి పేరు మీదుగా మంగళూరు కర్ణాటకలోని ముఖ్య పట్టణాల్లో మంగళూరు ఒకటి. ఇక్కడ కొలువైన మంగళాదేవి పేరు మీదే ఈ నగరానికి మంగళూరు అనే పేరొచ్చింది. పురాణాల ప్రకారం మంగళాదేవి ఆలయాన్ని శ్రీ మహావిష్ణు దశావతారాల్లో ఆరో అవతారమైన పరశురాముడు స్థాపించినట్లు తెలుస్తుంది. ప్రతిసారీ దసరా శరన్నవరాత్రుల సమయంలో మంగళాదేవికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో సప్తమి రోజున ‘చండీ’ లేదా ‘మరికాంబ’గా, అష్టమి రోజున ‘మహా సరస్వతి’గా, నవమి రోజు ‘వాగ్దేవి’గా పూజలందుకుంటోందీ తల్లి. మహర్నవమి రోజున అమ్మవారి ఆయుధాలకు విశేష పూజలు నిర్వహించడంతోపాటు చండీయాగం కూడా చేస్తారు. దశమిరోజు అమ్మవారిని దుర్గా దేవిగా అలంకరించిన తర్వాత నిర్వహించే రథయాత్ర ఎంతో కన్నుల పండువగా సాగుతుంది. ముంబై – ముంబా దేవి దక్షిణ ముంబైలోని బులేశ్వర్ ప్రాంతంలో కొలువైన ఈ ఆలయంలోని అమ్మవారు వెండి కిరీటం, బంగారు కంఠహారం, రతనాల ముక్కుపుడకతో అత్యంత శోభాయమానంగా దర్శనమిచ్చే ఈ అమ్మల గన్న అమ్మను దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమే అని చెప్పవచ్చు. ఇక్కడ దసరా ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి. వాణిజ్యపరంగా దేశంలోకెల్లా అత్యంత సుప్రసిద్ధమైన ముంబై మహానగరానికి ఆ పేరు రావడంలో అక్కడ వెలసిన ముంబాదేవి ఆలయమే కారణం. ఇందుకో పురాణ కథనం ఉంది. పార్వతీమాత కాళికాదేవిగా అవతారమెత్తే క్రమంలో ఆ పరమశివుని ఆదేశం మేరకు ‘మత్స్య’ అనే పేరుతో ఇప్పుడు ముంబైగా పిలుస్తున్న ప్రాంతంలో ఓ మత్స్యకారుల వంశంలో పుట్టిందట. ఆమె అవతారం చాలించే సమయంలో మత్స్యకారుల కోరిక మేరకు ‘మహా అంబ’గా వెలిసిందని, కాలక్రమేణా ఆమె పేరు‘ముంబాదేవి’గా మారినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. శ్యామలాదేవి పేరు మీదుగా సిమ్లా సాక్షాత్తూ ఆ కాళీమాతే శ్యామలా దేవిగా వెలసిన పుణ్యస్థలి సిమ్లా అని స్థలపురాణం చెబుతోంది. ఈ గుడిని 1845లో బ్రిటిష్ పరిపాలనా కాలంలో బెంగాలీ భక్తులు జకు అనే కొండపై నిర్మించారట! ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో శ్యామవర్ణంలో మెరిసే దుర్గా మాత రూపం చూపరులను కట్టిపడేస్తుంది. చండీగఢ్ – చండీ మందిర్ అటు పంజాబ్కు, ఇటు హరియాణాకు రాజధానిగా విరాజిల్లుతోన్న చండీగఢ్ నగరానికి ఆ పేరు రావడం వెనక అమ్మవారి పేరే కారణం. చండీ అంటే పార్వతీదేవి ఉగ్రరూపమైన చండీమాత అని, గఢ్ అంటే కొలువుండే కోట అని అర్థం. ఇలా ఈ నగరానికి చండీగఢ్ అని పేరు వచ్చిందంటే అక్కడ కొలువైన చండీ దేవాలయమే కారణం. చండీగఢ్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచకుల జిల్లాలో కల్క పట్టణంలో కొండపై వెలసిందీ దేవాలయం. పాటన్దేవి పేరుతో పట్నా శక్తి స్వరూపిణి ‘పాటన్దేవి’ అమ్మవారు కొలువైన ఆలయం ఉండటమే పట్నాకు ఆ పేరు రావడానికి కారణం. ఈ ఆలయం 51 సిద్ధ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. పురాణ గాథల ప్రకారం దక్షయజ్ఞం సమయంలో అగ్నికి ఆహుతైన సతీదేవి శరీరాన్ని మహావిష్ణువు ముక్కలుగా ఖండించగా, కుడి తొడభాగం ఈ ప్రాంతంలో పడిందట! అలా వెలసిన అమ్మవారిని మొదట్లో ‘సర్వానందకరి పాటనేశ్వరి’ అనే పేరుతో కొలిచేవారు. కాలక్రమంలో.. ఆ పేరు‘పాటనేశ్వరి’గా, ఇప్పుడు ‘పాటన్దేవి’గా రూపాంతరం చెందుతూ వచ్చింది. దసరా సమయంలో పది రోజులపాటు ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హారతులతో కన్నుల పండువగా ఉత్సవాలు జరుగుతాయి. నైనాదేవి పేరుతో నైనిటాల్ ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన కొండ ప్రాంతాలతో అత్యంత శోభాయమానంగా అలరారే నైనిటాల్కు ఆ పేరు రావడం వెనక ఓ అద్భుతమైన చరిత్ర ఉంది, దక్షయజ్ఞంలో దహనమైన సతీదేవి శరీరాన్ని ఖండించినప్పుడు ఆమె నేత్రాలు ఈ ప్రదేశంలో పడినట్లుగా స్థల పురాణం చెబుతోంది. మహిషాసురుడిని సంహరించిన కారణంగా నైనాదేవి కొలువైన చోటును మహిషపీuŠ‡ అని కూడా పిలుస్తారు. అలా మహిషుడిని సంహరించిన సమయంలో దేవతలందరూ అమ్మవారిని ’జై నైనా’ అంటూ నినదించడం వల్ల ఈ అమ్మవారు అప్పట్నుంచి ‘నైనాదేవి’గా పూజలందుకుంటోందట. శక్తి పీఠాలలో ఒకటైన ఈ ఆలయంలో విజయదశమి ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి. దుర్గా మాత పేరుతో విరాజిల్లే మరికొన్ని ప్రాంతాలు అంబాలా – భవానీ అంబాదేవి (హరియాణా) అంబ జోగే – అంబ జోగేశ్వరి/ యోగేశ్వరి దేవి (మహారాష్ట్ర) తుల్జాపుర్ – తుల్జా భవాని (మహారాష్ట్ర) హసన్ – హసనాంబ (కర్ణాటక) త్రిపుర – త్రిపురసుందరి (త్రిపుర) మైసూరు – మహిషాసురమర్దిని (కర్ణాటక) కన్యాకుమారి – కన్యాకుమారి దేవి (తమిళనాడు) సంబల్పూర్ – సమలాదేవి/ సమలేశ్వరి (ఒడిశా) (చదవండి: ఇంటిని పాజిటివ్ ఎనర్జీతో నింపేలా కళాత్మకంగా తీర్చిదిద్దుకోండిలా..! ) -
శోభాయమానంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ దేవీ శరన్నవరాత్రులు (ఫొటోలు)
-
తిరుమల : మోహినీ అవతారంలో తిరుమలేశుడు (ఫొటోలు)
-
Indrakeeladri : వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)
-
తిరుమల: కల్పవృక్ష వాహనంపై మలయప్ప స్వామి వైభవం (ఫొటోలు)
-
స్వాతంత్య్రానంతరం కశ్మీర్ శక్తిపీఠంలో నవరాత్రులు
కశ్మీర్ను భూతల స్వర్గం అంటారు. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారు. అయితే ఇక్కడ వేళ్లూనుకున్న వేర్పాటువాదం దశాబ్దాలుగా లోయను కట్టుబాట్లకు గురిచేసింది. అయితే భారత సైనికుల త్యాగం, ధైర్యసాహసాల కారణంగా ఇప్పుడు లోయలో ప్రశాంతత నెలకొంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు తొలిసారిగా శారదా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. పీఓకే నుండి కేవలం 500 మీటర్ల దూరంలోని కుప్వారా పరిధిలోని టిట్వాల్ గ్రామంలో శారదామాత ఆలయం ఉంది. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఈ ఆలయంలో నవరాత్రి పూజలు ఎప్పుడూ నిర్వహించలేదు. అయితే ప్రస్తుతం ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఆలయం శతాబ్దాల క్రితం నాటిదని చెబుతారు. ఈ ఆలయం దేశంలోని 18 మహా శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రస్తుతం కశ్మీర్లో టూరిజం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. దీంతో రానున్న రోజ్లులో కుప్వారాలోని ఈ దేవాలయానికి మరింత ఆదరణ దక్కనున్నదని స్థానికులు అంటున్నారు. కశ్మీర్ ఒకప్పుడు దేశానికి ఆధ్యాత్మికత రాజధాని. ప్రపంచం నలుమూలల నుండి ఆధ్యాత్మిక అభిరుచిగలవారు ఇక్కడ సమావేశం అయ్యేవారు. అందుకే ఇక్కడ ఎన్నో గొప్ప దేవాలయాలు నిర్మితమయ్యాయని చెబుతారు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న శారదామాత దేవాలయం మొదటి శతాబ్దంలో కుషాణుల సామ్రాజ్య కాలంలో నిర్మితమయ్యింది. ఇప్పటికీ ఇక్కడ అనేక దేవాలయాలు శిథిలావస్థలో కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈ దేవాలయాలను పునరుద్ధరించే పనిలో పడింది. ఇది కూడా చదవండి: యూదుల పవిత్ర గ్రంథం ‘తొరా’లో ఏముంది? బైబిల్తో సంబంధం ఏమిటి? -
చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శిమిచ్చిన శ్రీ వేంకటేశ్వరస్వామి (ఫొటోలు)
-
గుజరాత్ నవరాత్రుల ప్రత్యేకత ఏమిటి? వైష్ణోదేవి దర్శనానికి ఎంతసేపు వేచివుండాలి?
శరన్నవరాత్రులు దేశంలోని తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు అన్నిచోట్లా వైభవంగా నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో దుర్గా మండపాలను అందంగా అలంకరిస్తారు. మరికొన్ని చోట్ల దాండియా నైట్ నిర్వహిస్తారు. దేశంలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరిగే ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మాతా వైష్ణో దేవి(జమ్ము) మాతా వైష్ణో దేవి ఆస్థానంలో ఏడాది పొడవునా భక్తుల రద్దీ ఉంటుంది. అయితే నవరాత్రుల ప్రత్యేక సందర్భంలో ఆలయ బోర్డు ప్రత్యేక అలంకరణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది. భక్తుల రద్దీ కారణంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు రెండుమూడు రోజుల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అమ్మవారిని దర్శించుకుని, వేడుకుంటే మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. అహ్మదాబాద్లో.. గుజరాత్ ప్రభుత్వానికి నవరాత్రి పండుగ నిర్వహణ ఎంతో ప్రతిష్టాత్మకమైనది. నవరాత్రులకు రాష్ట్రానికి పర్యాటకులు కూడా తరలివస్తుంటారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో నవరాత్రుల సందర్భంగా అనేక వేదికలు ఏర్పాటవుతాయి. ప్రముఖ గాయకులతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. సామూహికంగా గర్బా నృత్యం చేస్తారు. దాండియా నైట్ నిర్వహిస్తారు. గుజరాత్ను సందర్శించాలనుకునేవారు శారదా నవరాత్రులలో వెళితే మరింత ఎంజాయ్ చేయవచ్చని టూర్ నిపుణులు చెబుతుంటారు. గుజరాత్లోని పలు ప్రదేశాలు శారదా నవరాత్రులలో అమ్మవారి కీర్తనలతో మారుమోగుతుంటాయి. వారణాసిలో.. వారణాసిని శివుడు కొలువైన నగరం అని అంటారు. నవరాత్రి, దీపావళి తదితర పండుగల సందర్భంగా ఘాట్లపై దీపాలు వెలిగిస్తారు. పురాణాలలోని వివరాల ప్రకారం మాతా సతీదేవి మణికర్ణిక(చెవిపోగు) వారణాసిలో పడిపోయిందని చెబుతారు. దీంతో ఇది కూడా శక్తిపీఠంగా వెలుగొందుతోంది. ఇక్కడ అమ్మవారికి విశాలాక్షి, మణికర్ణి రూపాలలో పూజిస్తారు. పార్వతీ దేవి చెవి పోగు ఇక్కడి కొలనులో పడిపోయిందని, దానిని శంకరుడు కనుగొన్నాడని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి మణికర్ణిక అనే పేరు వచ్చిందని చెబుతారు. కేరళలో.. కేరళలో అమ్మవారు కొలువైన దేవాలయాలు అనేకం ఉన్నాయి. అమ్మవారి పూజా సమయంలో ఏనుగులను కూడా పూజిస్తారు. నవరాత్రి సందర్భంగా కేరళలోని కొన్ని దేవాలయాలలో జాతర నిర్వహిస్తారు. విజయదశమి రోజున కేరళీయులు తమ ఆచారాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. బంగారు ఉంగరం సహాయంతో పిల్లల నాలుకపై బీజాక్షరాలు రాస్తారు. ఆ రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. కొట్టాయంలోని పనచ్చిక్కడ్ సరస్వతి ఆలయం, మలప్పురంలోని తుంచన్ పరంబ్, తిరువనంతపురంలోని అట్టుకల్ భగవతి ఆలయం, త్రిసూర్లోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం, ఎర్నాకులంలోని చోటానిక్కర దేవి ఆలయాలలో నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఛత్తీస్గఢ్లో.. నవరాత్రుల సందర్భంగా ఛత్తీస్గఢ్లోని బస్తర్లో రథయాత్ర జరుగుతుంది. అమ్మవారికి మహువా లడ్డూలను సమర్పిస్తారు. 52 శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో ఉంది. ఈ శక్తిపీఠాన్ని దంతేశ్వరి ఆలయం అని అంటారు. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. నవరాత్రి రోజుల్లో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఇది కూడా చదవండి: ప్రధాని, రాష్ట్రపతి పదవులు వద్దన్న నేత ఎవరు? -
నవరాత్రులు ౼ నవోన్మేషాలు
ఆ ప్రాంతమంతా అంతవరకు నిశ్శబ్దంగా ఉంది. అక్కడకు ఎవరో రాబోతున్నారని అంతకుముందే సమాచారం వచ్చింది. దాంతో అక్కడకు. నేల ఈనినట్లుగా జనసందోహం చేరుకుంది. అందరూ ఒళ్ళంతా ఇంతింత కళ్లు చేసుకుని చూస్తున్నారు. చెవులను కూడా ఇంతింత చేసుకుని రాబోయే సవ్వడి కోసం నిరీక్షిస్తున్నారు. వారి మనసు ఆనందంతో పరవళ్లు తొక్కుతోంది. ఎప్పుడెప్పుడు ఆ సుమధుర సమయం ఆసన్నమవుతుందా అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఆ శుభ ఘడియ సమీపించింది అనడానికి నిదర్శనంగా పారిజాత పరిమళాలతో కూడిన ఓ సువాసన నాసికా రంధ్రాల ద్వారా మనస్సులోకి ప్రవేశించి, కన్నులు అరమోడ్పులయాయి. దూరంగా మువ్వల సవ్వడులు సన్నగా వినిపిస్తూ, అంతలోనే గుండెలను తాకేంత దగ్గరకు చేరుకుంది ఆ శబ్దం. శబ్దంతో పాటు సువాసన గుబాళింపులు కూడా దగ్గరవుతున్నాయి. గాజుల గలగలలు, కంఠాభరణాల క్వణనిక్వణాలు, కర్ణాభరణాల చిరు సవ్వడులు, రకరకాల పూల పరిమళాలు.. నెమ్మదినెమ్మదిగా దగ్గర కాసాగాయి. అందరూ దూరం నుంచి భక్తితో గమనిస్తున్నారు. ఈ సవ్వడులతో పోటీ పడుతూ వారి చిరుమందహాసపు ధ్వనులు వీనుల విందు చేస్తున్నాయి. ఆ దృశ్యం చూసేసరికి అందరికీ ఏదో మైకం కలిగింది. ఒక్కసారిగా ఎదలు పులకించాయి. మాట మూగబోయింది. అప్రయత్నంగా రెండు చేతులు ఒక్కటయ్యాయి. కనులు రెప్ప వేయడం మరచిపోయాయి. మనసులో భక్తి పరుగులు తీసింది. అక్కడకు తొమ్మిదిమంది అమ్మవార్లు వారి వారి అలంకారాలలో విహారానికి వచ్చారు. ఒకరినొకరు పలకరించుకుంటున్నారు. "ఏవమ్మా! బాలా! నీతోనేగా నవరాత్రులు ప్రారంభమవుతాయి" అంటున్నారు మిగిలిన ఎనమండుగురు.. బాల స్వచ్ఛమైన పసి మొగ్గలాంటి చిరునవ్వుతో... "నేను బాలనే.. ఎన్నటికీ బాలనే.. మీ అందరికీ చెల్లెలినే... " అంటూ ముద్దుముద్దుగా పలికింది. అందుకు రాజరాజేశ్వరి.. "నువ్వు ఆదిశక్తివి. అందుకే నిన్ను ఆదిశక్తిపరాయీ" అని స్తుతించారు. అంతేనా బాలేన్దు మౌళివి. అందులోనూ బాల పదంతోనే కీర్తించబడ్డావు చూడు" అని అంటుంటే, బాల పకపక నవ్వింది. "మీకు తెలియనిది కాదు.. మానవ జన్మ బాల్యంతోనే ప్రారంభమవుతుంది కదా. అప్పుడు వారు ఆదిశక్తిలాగే ఉంటారు కదా.." అంటూ లౌకికార్థం పలికింది బాల. అందరి దృష్టి గాయత్రీమాత వైపుగా మరలింది. "మన తొమ్మిది మందిలోనూ గాయత్రిని నిత్యం స్మరిస్తూ ఉంటారు కదా" అన్నారు. "అవును గాయత్రీమంత్రాన్ని కొందరు లక్షసార్లు లక్ష గాయత్రి పేరుతో చేస్తారు. మనందరికంటె గాయత్రీ మాతే గొప్పది.." అన్నారు. గాయత్రికి అరనవ్వు వచ్చింది. "ఎనిమిది సంవత్సరాలు నిండితే అందరూ విద్యాభ్యాసం చేస్తారు కదా. అలా 14 సంవత్సరాలు వాళ్లు చదువుకుంటారు కదా. మరి నిత్యం గాయత్రీ మంత్రాన్ని స్మరించటమంటే అదే కదా. మానవులకు చదువు ఎంత అవసరమో మనకు తెలియదా. విద్య లేని వాడు వింత పశువు అనే మాట వాడకంలో ఉండనే ఉంది కదా" మిగిలిన ఎనమండుగురు భక్తిగా గాయత్రీ మాతకు నమస్కరించారు. ఇప్పుడు అందరూ తమ కడుపులు చూసుకుంటూ అన్నపూర్ణ వైపుగా చూశారు. అప్పటికే అన్నపూర్ణ తన చేతిని గుండిగలోకి పంపింది. "మీరేమంటారో నాకు అర్థమయిందిలే. సాక్షాత్తు పరమశివుడు కూడా నన్ను భిక్ష అడిగాడనేగా. అందులో అంతరార్థం మీకు తెలియనిది కాదు. ఆకలి వేస్తే ఎవరైనా అమ్మనే కదా అడిగేది. భోజ్యేషు మాతా అని తెలియదా. అందుకే నేను పూర్ణాహారం అంటే సంపూర్ణంగా.. అదే కడుపునిండుగా సంతృప్తిగా వడ్డిస్తాను కదా. అందుకే నన్ను అన్నపూర్ణగా కొలుస్తున్నారు. మానవ మనుగడకు అన్నపూర్ణ అవసరం ఉంది కనకనే నేను అవతరించాను.." అంటూ అందరికీ తృప్తిగా వడ్డన చేసింది అన్నపూర్ణాదేవి. అవును అందుకే "నిన్ను నిత్యానందకరీ వరాభయకరీ... చంద్రార్కానల భాసమాన లహరీ.. భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ... " అంటూ ప్రస్తుతించారు.. అన్నారు ఎనమండుగురు తోబుట్టువులు. కడుపులు నిండగానే అందరూ లలితా త్రిపుర సుందరిని ప్రసన్న వదనాలతో తిలకించారు. "నీ పేరులోనే లలితం ఉంది. నువ్వు నిత్యం ప్రసన్నంగా ఉంటావు. ఇది ఎలా సాధ్యం" అన్నారు అష్టమాతలు. "ఇన్ని సంవత్సరాలు చదువుకుని, ఇంత ఆరోగ్యకరమైన ఆహారం భుజించాక ప్రసన్నత వచ్చితీరుతుంది. సాత్త్వికాహారం, సద్గురువుల దగ్గర విద్యాభ్యాసం.. ఇవే కదా మన మనసును ప్రభావితం చేసేది" అంటూ ప్రసన్నంగా పలికింది లలితాత్రిపుర సుందరి. "నిజమే! నిన్ను నిత్యం సహస్రనామాలతో కొలుస్తారు ఇందుకేనేమో. నీకు పెట్టే నైవేద్యాలు కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి కదా. నిన్ను హరిద్రాన్నైక రసికా, ముద్గౌదనాచిత్తా, హరిద్రాన్నైక రసికా.. " అంటూ ఆనందంగా లలితాదేవిని సహస్రనామాలలోని మంత్రాలతో స్తుతించారు, ఎనమండుగురు తల్లులు. "మరోమాట కూడా చెప్పాలి నీ గురించి... నీ పూజ ప్రారంభించేసమయంలో గంధం పరికల్పయామి, ధూపం పరికల్పయామి... అంటూ ఈ సృష్టి పంచభూతాత్మకం, మానవ శరీరం కూడా పంచభూతాలతోనే నిర్మితమైనదని అంతర్లీనంగా ఎంతో చక్కగా తెలియచేశావు" అంటూ లలితాదేవిని ప్రశంసించారు. ఇప్పుడు అందరూ చెట్టాపట్టాలేసుకుంటూ మహాలక్ష్మి వైపు చూస్తూ..."ఇంట్లో ఆడపిల్ల పుడితే చాలా మహాలక్ష్మి పుట్టింది అనేస్తుంటారు. ఇంతమందిమి ఉండగా నీకే ఆ ఘనత దక్కింది.." అన్నారు. మహాలక్ష్మి... సిరులచిరునవ్వులు కురిపిస్తూ..."ఒక్కసారి సావధానంగా ఆలోచించండి. బాలగా అవతరించి, గాయత్రిగా చదువుకుని, అన్నపూర్ణగా అందరి కడుపులు నింపి, లలితగా పూజలు అందుకున్న తరవాతేగా నేను అవతరించాను. అప్పుడు నన్ను అందరూ ఆ ఇంటి దైవంగా కొలవకుండా ఎలా ఉంటారు. ఇన్నిసత్కర్మలు తరవాతే కదా నేను మహాలక్ష్మిగా ప్రభవించాను.". అంటూ నిరాడంబరంగా పలికింది మహాలక్ష్మి. "నిజమేలే...అందుకేగా నిన్ను సర్వపాపహరే దేవీ, సర్వదుఃఖ హరే దేవీ అంటూ కొనియాడుతున్నారు "అన్నారు అంతా ముక్తకంఠంతో. పక్కనే ధవళ వర్ణ శోభితంగా ఉన్న సరస్వతి వీణ వాయిస్తోంది. "ఇప్పటిదాకా మా పక్కనే ఉన్నావు, అంతలోనే వీణ అందుకున్నావా.. అందుకేగా నిన్ను యా వీణా వర దండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా అంటూ పిలుస్తున్నారు. నిత్యం తెల్లటి వలువలతో, తెల్లని హంస మీద కూర్చుని దర్శనమిస్తావు. సరస్వతీ నమస్తుభ్యం ... విద్యారంభం కరిష్యామి.. అంటూ నీ ప్రశంసతోనే విద్యాభ్యాసం ప్రారంభిస్తారు కదా...నీ మెడలో స్పటిక మాల కాంతులు వర్ణించలేము" అంటూ పలికారు. తెల్లటి కాంతులు వెదజల్లే చిరునవ్వుతో సరస్వతీ దేవి.." ఇందాక మహాలక్ష్మి చెప్పినట్లుగా ఇంత మంచి చేసుకుంటూ రావటంతో పాటు, నాకు మరికాస్త జీవితానుభవం వచ్చినట్లే కదా. చదువు చెప్పేవారికి చదువుతో పాటు జీవితానుభవం, వయస్సు కూడా ఉండాలి. నాకు అవి వచ్చాయి కదా. బాలగా ప్రారంభమై... మహాలక్ష్మి దాకా ఎంతో మంచి జరిగిన తరువాత కదా నేను ప్రభవించాను. ఆ జీవితానుభవమే నన్ను చదువుల తల్లిగా నిలబెట్టింది. తెలుపు స్వచ్ఛతకు చిహ్నం. పారదర్శకంగా ఉండడానికి స్పటిక మాల" అంది వీణ మీద సరస్వతీ రాగాన్ని మీటుతూ ఆ శారదామాత. ఇప్పుడు అందరికీ దుర్గమ్మ వైపు చూడాలంటే భయంగా ఉంది. దుర్గమాసురుడిని సంహరించి దుర్గామాతగా అందరి పూజలు అందుకుంటూ.. దుర్గాష్టమిగా నవరాత్రులలో ఎనిమిదో రాత్రిని తన పేరు మీదుగా తెచ్చుకుంది. ఇంతవరకు వారితోనే కలసిమెలసి తిరిగిన దుర్గమ్మకు.. వారిలోని భయాన్ని చూస్తే నవ్వు వచ్చింది. "ఎందుకు మీరంతా భయపడతారు. స్త్రీ శక్తి స్వరూపిణి. దుష్ట సంహారం చేయగలదని కదా నేను నిరూపించినది. నాకు ఈ శక్తి ఎక్కడ నుంచి వచ్చిందో మళ్లీ నేను చెబితే చర్వితచర్వణమే అవుతుంది. బాలగా అవతరించి, ఇంత చక్కగా చదువుకుని, శక్తిమంతమైన ఆహారం తిని, అందరి స్తుతులు అందుకుని, సంపదలు పొంది, విద్యాధి దేవతను అయ్యాక... నాకు వచ్చే మనోబలం, బుద్ధిబలం, శరీర బలంతో దుష్ట సంహారం చేయటం పెద్ద కష్టమైన విషయం కాదు కదా.." అంటూ అదంతా తన గొప్పతనం కాదన్నట్లుగా పలికింది దుర్గమ్మ. అందరూ దుర్గమ్మను చేరి, గుండెలకు హత్తుకుని ముద్దాడారు. అక్కడితో భయం పోయిందా అనుకుంటే పోలేదు.. ఇప్పుడు భయం రెట్టింపయ్యింది.. తమలోనే ఉన్న మహిషాసురమర్దినిని చూస్తూ భీతిల్లిపోతున్నారు అందరూ దుర్గమ్మను చూసి. "నన్ను చూసి భయపడకండి. దుష్ట సంహారం చేసే శక్తి ఏ విధంగా వచ్చిందో ఇంతకుముందే దుర్గమ్మ విపులీకరించింది కదా. నేనూ అదే మాట చెప్తాను.." అంటూ అతి వినయంగా పలికింది, అంతటి మహిషుడిని సంహరించిన తల్లి. అందరూ తమ భయాన్ని విడిచిపెట్టి... "నిజమే.. నీ గొప్పదనాన్ని చూసే కదా ఆది శంకరాచార్యుడు నీ మీద అద్భుతమైన స్తోత్రం రచించాడు. అయిగిరి నందిని నందిత మేదిని... అంటూ... ఆ స్తోత్రం చదువుతుంటే చాలు అందరిలోనూ తన్మయత్వం కలుగుతుంది. ఆదిశంకరుడికి కలిగిన తన్మయమే ఈ స్తోత్ర రూపంలో అప్రయత్నంగా వెలువడి ఉంటుంది " అన్నారు అందరూ. ఇప్పుడు చివరగా అందరి చూపులు ఆ రాజరాజేశ్వరి మీదకు మళ్లాయి.. "ఇన్ని రోజులుగా మమ్మల్ని అందరూ ఒక్కోరోజు ఒక్కో రకంగా పూజించారు. చిట్టచివరగా అందరూ నిన్ను శ్రీరాజరాజేశ్వరిగా కొలుస్తారు. ఈ రోజును విజయదశమిగా కూడా పిలుస్తారు" అంటూ ప్రశ్నార్థకంగా అంటుంటే.." తొమ్మిది రోజుల పాటు నెమ్మదిగా శక్తి సమకూర్చుకుంటూ ఎదిగాక.. ఇక చివరగా విజయం లభించినట్లే కదా. ఈ విజయదశమి నా ఒక్కదానిదే కాదు కదా. తొమ్మిదిరోజుల పాటు విజయవంతంగా సకల శుభాలు సమకూర్చినందుకే ప్రతీకగానే కదా నేను రాజరాజేశ్వరిని అవుతున్నాను. విజయదశమి పండుగకు దేవతనవుతున్నాను.మనమందరం అరిషడ్వర్గాలకు అతీతంగా ఉన్నాం. ఐకమత్యంగా ఉన్నాం. విజయం సాధించాం. భిన్నత్వంలో ఏకత్వం అంటే మనమే కదా. అందుకే విజయదశమి అనే పేరు వచ్చింది కదా. మన మంచితనమే విజయానికి కారణం అని మానవులకు తెలియచేయడానికే కదా ఈ పండుగను వారికి ప్రసాదించాం... " అంది రాజరాజేశ్వరి. దూరం నుంచి ఈ తల్లుల అమర సంభాషణను గమనిస్తున్న వారి మనసులు భక్తితో నిండిపోయాయి. గుండెలు ఆర్ద్రమయ్యాయి. ఓహో ఇందుకేనా ఒక బిడ్డను నవమాసాలు గర్భంలో మోసి, ఆ తరవాత ప్రసవించేది అనుకున్నారు. ఈ నవరాత్రుల అంతరార్థం ఇదా అనుకున్నారు. అందులోనే ఒక పండితుడు మరో విషయం వివరించాడు.. "గ్రామ ప్రజలారా... ఒక్క విషయం అర్థం చేసుకోండి... ఈ సృష్టికి కారణం ప్రకృతి పురుషుడు అని అందరికీ తెలుసు. వారు తొమ్మిది మంది ఆడపిల్లలకు జన్మనిచ్చారు. ఆ ఆడపిల్లల పేరు మీదే వేల సంవత్సరాలుగా నవరాత్రులు ఘనంగా జరుపుకుంటున్నాం. మనం కూడా ఆడపిల్లను గౌరవంగా పెంచుదాం. వారికి మన గుండెల్లో గుడి కడదాం. ఆడపిల్లను చులకన చేయకూడదని మనకి తెలుస్తోంది కదా. బాలగా మన ఇంట అడుగుపెట్టిన ఆడపిల్ల, మనకు చేదోడు వాదోడుగా ఉంటూ తల్లిగా ఆదరిస్తూ, మరో ఇంటికి వెళ్లి అందరినీ కనిపెట్టుకొని ఉండి, తాను తల్లిగా మారి జనని అవుతోంది. ఈ తొమ్మిది మంది జగన్మాతలు వేరు వేరు రూపాలతో, వేరు వేరు నామాలతో మనని ఆదరిస్తున్నారు. ఏ పేరుతో పిలిచినా తల్లి తల్లే అని గ్రహించండి. అమ్మా...అని పిలిస్తే పలికే చల్లని తల్లి ఆ జగన్మాత. అమ్మని పూజిద్దాం, ఆడపిల్లను అమ్మగా ఆదరిద్దాం" అంటూ ఆవేశంగా తన మాటలు ముగిస్తూ అందరికీ నమస్కరించాడు. అందరూ ఆ పెద్దాయన మాటలలోని అంతరార్థాన్ని ఆలోచించటం ప్రారంభించారు. - వైజయంతి పురాణపండ(సృజన రచన) -
కోటి రూపాయలతో అమ్మవారికి అలంకరణ
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజులు వివిధ రూపాల్లో సందరంగా అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్నికల్పించారు. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాల్లో భాగంగా జోగులాంబ గద్వాల్లోని వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో దుర్గమాతను కరెన్సీ నోట్లతో అలంకరించారు. వీటి విలువ అక్షరాలా కోటీ రుపాయలు. భారతీయ కరెన్సీ నోట్లను కాగితపు పువ్వులలాగా తయారు చేసి వాటిని దుర్గమాతకు సమర్పించారు. 10,20, 100,200,500 వంటి వివిధ రకాల నోట్లతో దండలు, పుష్పగుచ్ఛాలుగా తయారు చేసి మొత్తం 1,11,11,111 రూపాయలను ధనలక్ష్మీ అవతారంలో అమ్మవారికి అలంకరించారు. చదవండి: రానా, మిహికల మొదటి దసరా వేడుకలు దీనికి సంబంధించిన వీడియోను ఉమ సుధీర్ అనే మహిళ జర్నలిస్టు ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా కోటి రుపాయల మొత్తాన్ని ఇలా అమ్మవారికి సమర్పించడం భక్తులు ఆశ్చార్యానికి లోనవుతున్నారు. అయితే మూడేళ్ల క్రితం అదే ఆలయంలో అమ్మవారికి 3,33,33,333 కోట్ల రూపాయల విలవైన కరెన్సీని ఉపయోగించి అలంకరించారు. రెండేళ్ల క్రితం కిలో బంగారుకిరీటం కూడా సమర్పించారు. కానీ ఈ ఏడాది కోవిడ్ కారణంగా కొంచెం తక్కువ మొత్తంలో అమ్మవారిని అంకరించినట్లు తెలుస్తోంది. చదవండి: శక్తికి యుక్తిని జోడించి ముందుకు.. -
నాలుగోరోజు అన్నపూర్ణాదేవిగా అమ్మవారు
-
గణపతి నవరాత్రోత్సవాలకు శ్రీకారం
- శ్రీశైలంలో సెప్టెంబర్ 3 వరకు విశేష పూజలు - అప్పటి వరకు ఆర్జిత రుద్రహోమాలు రద్దు ·- నాలుగు అడుగులకుపైగా మృత్తికా (మట్టి) గణపతి శ్రీశైలం: వినాయక చవితి పురస్కరించుకొని శుక్రవారం శ్రీశైలంలో గణపతి నవరాత్రోత్సవాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఆలయ ప్రాగణంలో ఉదయం 8.10 గంటలకు యాగశాలప్రవేశం, వేదస్వస్తి, శివసంకల్పం, గణపతి పూజతో అత్యంత వైభవంగా ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈఓ భరత్ గుప్త .. ఉభయదేవాలయాల అర్చకులు, ప్రధాన అర్చకులు, వేదపండితుల స్వస్తిపుణ్యా హవచం, కంకణపూజ, ఋత్విగ్వరణం, కంకణదారణలతో ప్రత్యేక పూజలు ప్రారంభించారు. సెప్టెంబర్ 3 వరకు గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ తెలిపారు. అప్పటి వరకు ఆలయ ప్రాంగణంలో రత్నగర్భగణపతి, శ్రీశైలానికి మూడు కిలోమీటర్ల దూరంలోని సాక్షి గణపతికి నిత్యం వ్రతకల్పం విశేషార్చనలుంటాయన్నారు. అలాగే గత ఏడాది తరహాలోనే ఆలయప్రాంగణంలో మృత్తిక(మట్టి) గణపతిని నెలకొల్పి వ్రత కల్ప పూర్వకంగా పూజాధికాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ప్రారంభ పూజల అనంతరం యాగశాలలో అఖండస్థాపన, మండపారాధన, కలశస్థాపన నిర్వహించారు. సాయంకాలం అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన, ఉపాంగహవనాలు, గణపతి హోమం జరిపించారు. చివరిరోజు సెప్టెంబర్ 3 ఉదయం 10 గంటలకు గణపతిపూజ, మండపారాదనలు, కలశార్చనలు, గణపతిహోమం, రుద్రహోమం అనంతరం పూర్ణాహుతితో ఉత్సవాలకు ముగింపు పలుకుతామన్నారు. ఆ తర్వాత అలంకార మండపంలోని మృత్తికా గణపతిని నిమర్జనం చేస్తామన్నారు. నవరాత్రులలో ఆర్జిత రుద్రహోమాలు నిలుపుదల.. గణపతి నవరాత్రులను పురస్కరించుకొని శుక్రవారం నుంచి సెప్టెంబర్ 3 వరకు గణపతి హోమం, ఆర్జిత రుద్రాభిషేకం, ఆర్జిత మృత్యుంజయ హోమం, ఆర్జిత నవగ్రహ హోమం నిలుపుదల చేస్తున్నట్లు ఈఓ ప్రకటించారు. అమ్మవారి ఆలయంలో నిర్వహించే చండీహోమాలు మాత్రం ఉత్సవ సమయంలో కూడా కొనసాగుతాయన్నారు. భక్తులకు సదావకాశం:.. గణపతి నవరాత్రోత్సవాల్లో ఆలయంలో చేపడుతున్న పుష్పాలంకరణలో భక్తులకు అవకాశం కల్పించాలని దేవస్థానం సంకల్పించిందని ఈఓ తెలిపారు. ఆసక్తి కల్గిన వారు పుష్పాలంకరణ కోసం విడిపూలు విరాళంగా సమర్పించవచ్చన్నారు. -
నవరాత్రి ఉత్సవాల్లో మంత్రి తలసాని
-
ముగిసిన గణపతి నవరాత్రోత్సవాలు
శ్రీశైలం: శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో ఈ నెల 5న ప్రారంభమైన గణపతి నవరాత్రోత్సవాలు బుధవారం పూర్ణాహుతితో ముగిశాయి. ముగింపు పూజల్లో భాగంగా స్వామివార్ల రుద్రయాగశాలలో జయాదిహోమం, పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబధోత్సవం, కలశోద్వాసన నిర్వహించారు. నారికేళాలు, సుగంధద్రవ్యాలు, ముత్యం, పగడం, బంగారం, వెండి, నూతనవస్త్రాలు తదితర ద్రవ్యాలను ఈఓ నారాయణ భరత్ గుప్త,జెఈఓ హరినాథ్రెడ్డి, అర్చకులు, వేదపంyì తులు హోమగుండానికి సమర్పించారు. అనంతరం యాగశాలలో నెలకొల్పబడిన పంచలోహ వరసిద్ధి వినాయకుడికి వ్రతకల్పపూర్వక ప్రత్యేకపూజలు చేశారు.ఆలయప్రాంగణంలోని మల్లికాగుండంలోఅభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. తొమ్మిదిరోజులపాటు ఆగమ శాస్త్రానుసారం గణపతికి వేదపండితులు, అర్చకులు మండపారాధనలు, ఉపనిషత్తు పారాయణలు, జపానుష్టానాలు, హోమం, సాయంకాల పూజలు నిర్వహించినట్లు ఈఓ తెలిపారు. -
శ్రీవారికి కొత్త ముత్యపు పందిరి వాహనం
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారికి కొత్త ముత్యపు పందిరి వాహనాన్ని సిద్ధం చేశారు. దీనితోపాటు సూర్యప్రభ వాహనాన్ని అధికారులు మంగళవారం ప్రయోగాత్మకంగా పరిశీలించారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 3 నుంచి 11వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు కొత్త ముత్యపు పందిరి వాహనం, సర్వభూపాల వాహనాలను కొలువుదీర్చేందుకు టీటీడీ సిద్ధమైంది. గతంలో ఈ వాహనాలపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఊరేగుతుండగా భక్తులకు అంతగా కనిపించేవారు కాదు. ఈ నేపథ్యంలో కొత్త వాహనాలను బర్మాటేకుతో సిద్ధం చేశారు. మంగళవారం ముత్యపు పందిరివాహనాన్ని పరిశీలించారు. అనంతరం తిరుపతి జ్యువెలరీ విభాగానికి తరలించి రాగిరేకుతో బంగారుమలాం చేయించనున్నారు. సర్వ భూపాల వాహనాన్ని త్వరలోనే పరిశీలించనున్నారు. వాహన సేవల్లో అత్యంత బరువైన సూర్యప్రభ వాహనాన్ని కూడా ముందుజాగ్రత్తగా పరిశీలించి లోటుపాట్లు గుర్తించారు. ఈ కార్యక్రమంలో పారుపత్తేదారు జయరామ్నాయక్, బొక్కసం ఇన్చార్జి గురురాజు, ఏవీఎస్వో మల్లికార్జున్ పాల్గొన్నారు. -
మూడిళ్ల పండగ
ఉండేవి ఉంటాయి. ఉంటూనే ఉంటాయి. అంతమాత్రాన... పండగలు లేకుండా పోతాయా? పలకరింపులు బంద్ అయిపోతాయా? రాకపోకలు తెగిపోతాయా? ఇచ్చిపుచ్చుకోవడం ఆగిపోతుందా? ఒకనాటి సంస్కృతా, ఒకనాటి సంప్రదాయమా? ఒకనాటి ఆత్మీయతలా, ఒకనాటి అనుబంధాలా? ప్రాంతాలు లెక్క కాదు... అంతరంగం ముఖ్యం. పరమాన్నాలు ఎన్నిరకాలని కాదు... తియ్యదన మే ప్రధానం. భక్ష్యాలు, బొబ్బట్లు, ఓలిగలు... వేర్వేరు కావచ్చు. అదే బెల్లం, అదే పంచదార, అదే పిండి... అందరం ఒక్కటే... నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు. కలిసి జరుపుకుందాం... కలిసి తీపిని పంచుకుందాం. శుభాకాంక్షలు తెలుపుకుందాం. పాలముంజలు కావలసినవి: శనగపప్పు - ముప్పావు కప్పు; బెల్లంతురుము - కప్పు; పచ్చికొబ్బరి తురుము - 3 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - పావు టీ స్పూను; బొంబాయిరవ్వ - ఒకటిన్నర కప్పులు; పాలు - మూడు కప్పులు; నూనె-డీప్ ఫ్రైకి సరిపడా తయారి: శనగపప్పును శుభ్రంగా కడిగి తగినంత నీరు పోసి కుకర్లో ఉడికించాలి ఉడికిన తర్వాత నీరు ఎక్కువగా ఉంటే వడపోసి, పప్పు చల్లారాక, మిక్సీలో వేసి పొడిపొడిగా వచ్చేలా చేయాలి ఒక పాత్రలో బెల్లం తురుము, కొద్దిగా నీరు వేసి స్టౌ మీద ఉంచి, బెల్లం కరిగి, మరిగేవరకు ఉంచాలి శనగపప్పు పొడి, కొబ్బరి తురుము, ఏలకుల పొడి వేసి కలపాలి మిశ్రమమంతా దగ్గర పడేవరకు ఉడికించి దించేయాలి చల్లారాక, ఉండల్లా చే సి పక్కన ఉంచాలి గిన్నెలో పాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి బొంబాయిరవ్వ నెమ్మదిగా వేస్తూ, కలుపుతుండాలి మంట తగ్గించి, మిశ్రమం దగ్గర పడేవరకు రెండు నిముషాలు ఉడికించాలి చల్లారిన తరవాత మిశ్రమం బాగా మెత్తగా అయ్యేవరకు కలపాలి చేతికి నూనె లేదా నెయ్యి రాసుకుని, ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని ఉండలు చే సుకోవాలి ఒక్కో ఉండను చేతిలోకి తీసుకుని పూరీ షేప్లోకి ప్రెస్ చేయాలి శనగపప్పు మిశ్రమాన్ని మధ్యలో ఉంచి అంచులను మూసేయాలి బాణలిలో నూనె వేసి కాగాక ఒక్కో ఉండను నూనెలో వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి. కొబ్బరి సద్ది కావలసినవి: అన్నం - మూడు కప్పులు; కొబ్బరి ముక్కలు - కప్పు; పచ్చిమిర్చి - 3 (మధ్యకు కట్ చేయాలి); ఎండుమిర్చి - 3; పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు - పది పలుకులు; ఆవాలు - టీ స్పూను; శనగపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు; నూనె - టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; నువ్వులపొడి - రెండు టేబుల్ స్పూన్లు. తయారి: కొబ్బరిముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచాలి బాణలిలో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి వేయించాలి జీడిపప్పు, పచ్చిమిర్చి తరుగు, ఎండుమిర్చి, కరివేపాకు జత చేసి రెండు నిముషాలు వేయించాలి కొబ్బరిపేస్ట్ వేసి బాగా కలిపి, వేయించాలి అన్నం, ఉప్పు వేసి కలపాలి మంట తగ్గించి రెండు నిముషాలు ఉంచి దించేయాలి. కజ్జి కాయలు కావలసినవి: మైదా - 250 గ్రా; బొంబాయిరవ్వ - కప్పు; పంచదార - ఒక కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; ఎండుకొబ్బరి తురుము - అరకప్పు; ఏలకుల పొడి - అర టీ స్పూను; ఉప్పు - చిటికెడు; నెయ్యి - 2 టీ స్పూన్లు; నూనె - డీప్ ఫ్రైకి తగినంత తయారి: ఒక పాత్రలో బొంబాయిరవ్వ, ఎండుకొబ్బరి తురుము, ఏలకులపొడి, పంచదార వేసి కలిపి పక్కన ఉంచాలి వేరే పాత్రలో మైదా, నెయ్యి, ఉప్పు వేసి చపాతీపిండిలా కలిపి, పైన వస్త్రం వేసి, సుమారు గంటసేపు నాననివ్వాలి నానిన పిండిని చిన్నచిన్న ఉండలు చేసి, పూరీలా ఒత్తి కజ్జికాయ మౌల్డ్ మీద ఉంచాలి టేబుల్ స్పూను బొంబాయిరవ్వ మిశ్రమాన్ని ఇందులో ఉంచి మౌల్డ్ని మూసి, అంచులు తీసేయాలి బాణలిలో నూనె వేసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న కజ్జికాయలను వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి. గుమ్మడి హల్వా కావలసినవి: తీపిగుమ్మడికాయ తురుము - 2 కప్పులు; పాలు - 2 కప్పులు; పంచదార - కప్పు; నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు; బాదంపప్పులు - 15; ఏలకులపొడి - అర టీ స్పూను తయారి: బాణలిలో నెయ్యి వేసి కరిగాక బాదంపప్పుల తరుగు వేసి వేయించి, తీసి పక్కన ఉంచాలి అదే బాణలిలో గుమ్మడికాయ తురుము వేసి పచ్చివాసన పోయేవరకు సుమారు ఐదు నిముషాలు వేయించాలి రెండు కప్పుల పాలు పోసి బాగా కలిపి, పాలు ఇగిరిపోయేవరకు ఉడికించాలి పంచదార వేసి కలపాలి అన్నీ బాగా ఉడికిన తరవాత దించేయాలి ఏలకులపొడి, బాదంపప్పు ముక్కలు వేసి కలిపి సర్వ్ చేయాలి. పెరుగన్నం కావలసినవి: అన్నం - రెండు కప్పులు; ఉప్పు - కొద్దిగా; పెరుగు - రెండు కప్పులు; కొత్తిమీర - చిన్న కట్ట; దానిమ్మ గింజలు - పావుకప్పు; కిస్మిస్ ద్రాక్ష - రెండు టీస్పూన్లు; జీడిపప్పులు - టేబుల్ స్పూను; తయారి: ఒకపాత్రలో అన్నం, పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి దానిమ్మ గింజలు, కిస్మిస్ ద్రాక్ష వేసి కలపాలి కొత్తిమీర, జీడిపప్పులతో గార్నిష్ చేయాలి. మురుకులు కావలసినవి: బియ్యప్పిండి - 3 కప్పులు; వేయించిన శనగపిండి - కప్పు ; వాము - టీ స్పూను; కారం - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత; నూనె - తగినంత తయారి: ఒక పాత్రలో బియ్యప్పిండి, శనగపిండి, ఉప్పు, కారం, వాము వేసి కలపాలి ఒక గిన్నెలో రెండు కప్పుల నీరు, రెండు టేబుల్స్పూన్ల నూనె వేసి మరిగించి, ఆ నీటిని పిండిలో వేసి కలపాలి అవసరమనుకుంటే కొద్దిగా చన్నీరు వేస్తూ పిండి మెత్తగా అయ్యేవరకు కలపాలి పిండిని కొద్దికొద్దిగా తీసుకుని, మురుకుల గొట్టంలో ఉంచి, ఒక ప్లేట్ లాంటి దాని మీద గుండ్రంగా మురుకు ఆకారం వచ్చేలా తిప్పుతుండాలి బాణలిలో నూనె పోసి కాగాక, వీటిని జాగ్రత్తగా నూనెలో వేసి, మంట తగ్గించి వేయించాలి బంగారు వర్ణంలోకి వచ్చాక తీసేయాలి. పాల్ పోలీ కావలసినవి: మైదా - కప్పు; పాలు - అర లీటరు; కండెన్స్డ్ మిల్క్ - 3 టేబుల్ స్పూన్లు; నూనె - టీ స్పూను; నీరు - పావు కప్పు; నూనె - డీప్ఫ్రైకి సరిపడా; పంచదార - 4 టేబుల్ స్పూన్లు; ఉప్పు - చిటికెడు; బాదంపప్పులు - కొద్దిగా; కుంకుమపువ్వు - చిటికెడు; ఏలకులపొడి - పావు టీ స్పూను తయారి: ఒక పాత్రలో మైదా వేసి నీరు పోస్తూ పూరీ పిండిలా క లిపి, మూత పెట్టి గంటసేపు నాననివ్వాలి కడాయిలో పాలు మరిగించి, మంట తగ్గించి, కండెన్స్డ్ మిల్క్ పోయాలి చిన్న గ్లాసులో కొద్దిగా నీరు, కుంకుమపువ్వు వేసి బాగా కలిపి, మరుగుతున్న పాలలో వేయాలి పంచదార, ఏలకుల పొడి వేసి కలపాలి ఈ పాలను వెడల్పాటి పాత్రలో పోయాలి పిండిని చిన్నచిన్న ఉండలుగా తీసుకుని, పూరీల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి వేయించాలి పూరీలన్నీ తయారుచేసుకుని, పాలలో వేయాలి గంటసేపు నానినతర్వాత పూరీలను బయటకు తీసి, బాదంపప్పులతో గార్నిష్ చేసి, చల్లగా సర్వ్ చేయాలి. సజ్జ ముద్దలు కావలసినవి: సజ్జపిండి - 2 క ప్పులు; బెల్లంతురుము - కప్పు; నీరు - తగినంత; ఏలకులపొడి - చిటికెడు; డ్రైఫ్రూట్స్ - (బాదం, జీడిపప్పు, కిస్మిస్) - 2 టీ స్పూన్లు; నెయ్యి - 2 టే బుల్ స్పూన్లు తయారి: తగినన్ని నీరు మరిగించాలి ఒక గిన్నెలో సజ్జపిండి వేసి, వేడినీరు కొద్దికొద్దిగా పోస్తూ కలిపి ముద్ద చేయాలి కావలసిన పరిమాణంలో ముద్ద తీసుకొని, కొద్దికొద్దిగా నీరు చిలకరిస్తూ, రొట్టె చేసి, పెనం మీద వేసి రెండువైపులా కాల్చాలి వేడిగా ఉన్నప్పుడే సజ్జ రొట్టెలకు నీళ్లు అద్దుకుంటూ చేత్తో ముక్కలు ముక్కలు చేసి, రోట్లో వేసి దంచాలి స్టౌ మీద బాణలి ఉంచి అందులో నెయ్యి, బెల్లం, ఏలకులపొడి, సజ్జరొట్టె ముక్కల పొడి వేసి కొద్దిగా వేయించి దించాలి కావలసిన పరిమాణంలో ఈ పొడిని తీసుకొని బాదం, జీడిపప్పులు, కిస్మిస్లు అద్దుకుంటూ ముద్దలు చేయాలి. ఓలిగలు కావలసినవి: కందిపప్పు - కప్పు; బెల్లంతురుము - కప్పు; నీరు - 3 కప్పులు. పైన కవరింగ్ కోసం: మైదా - కప్పు; నువ్వుపప్పు - 2 టేబుల్స్పూన్లు; నూనె - అర కప్పు; నీరు - అరకప్పు; పసుపు - అర టేబుల్ స్పూను తయారి: ఒక పాత్రలో కందిపప్పు, తగినంత నీరు వేసి కుకర్లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చాక దించేయాలి చల్లారాక అధికంగా ఉన్న నీరు తీసేసి, పప్పును మెత్తగా చిదిమి, బెల్లం తురుము జత చేసి స్టౌ మీద ఐదు నిముషాలు ఉంచి దించి చల్లారనివ్వాలి ఏలకులపొడి జత చేసి, ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి ఒక పాత్రలో మైదా, నీరు, పసుపు, నూనె వేసి చపాతీపిండిలా కలిపి మూడుగంటలసేపు నాననివ్వాలి ఈ పిండిని చిన్న ఉండలా తీసుకుని చేతితో ఒత్తి, పూర్ణం ముద్దను ఇందులో ఉంచి, అప్పడాల పీట మీద ఉంచి అప్పడాల కర్రతో నెమ్మదిగా ఒత్తాలి స్టౌ మీద పెనం ఉంచి, కొద్దిగా నూనె వేసి, తయారుచేసి ఉంచుకున్న ఓలిగను పెనం మీద వేసి చుట్టూ నూనె వేసి, రెండువైపులా నూనె వేసి కాలాక తీసేయాలి. సేకరణ డా.వైజయంతి పిండివంటలు రుచిగా ఉండాలంటే... బొంబాయిరవ్వ వేయించి వాడితే పిండివంటలు రుచిగా ఉంటాయి. ఎండుకొబ్బరి వాడితే స్వీట్లు ఎక్కువరోజులు నిల్వ ఉంటాయి. మైదాపిండిని కలిపిన తరవాత చిన్నగిన్నెడు నూనె వేసి చేత్తో బాగా మర్దన చేసి, గిన్నె మీద తడి వస్త్రం కప్పి, గంటసేపు నాననిస్తే పిండివంటలు గుల్లగా వస్తాయి. గుమ్మడికాయ వంటి వాటిని స్వీట్లలో ఉపయోగించేటప్పుడు, వీటిలోని నీరు బాగా పిండేసి, నేతిలో దోరగా వేయించాలి. మిల్క్ స్వీట్లు తయారుచేసేటప్పుడు... పాల బదులు కండెన్స్డ్ మిల్క్ ఉపయోగిస్తే స్వీట్లు రుచిగా ఉంటాయి. ఏ పిండివంటలనైనా నూనెలో వేయించేటప్పుడు మంట తగ్గిస్తే, వంటకాలు మాడిపోకుండా, దోరగా వేగుతాయి.