not good
-
Thursday Myths: గురువారం ఆ రంగు శుభసూచికం, అదృష్టం వరిస్తుందట!
హిందూ సాంప్రదాయంలో అనేక ఆచారాలను పాటిస్తారన్న సంగతి తెలిసిందే. ప్రతిరోజుకు ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. గురువారం శ్రీమహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజని చెబుతుంటారు. అందుకే గురువారం దేవ గురువు బృహస్పతి, విష్ణుదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆయన అనుగ్రహం పొందాలంటే ఎంతో నిష్టగా పూజాక్రతువులను ఆచరించాల్సి ఉంటుంది. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం నాడు కొన్ని పనులు చేయడాన్ని నిషిద్దంగా భావిస్తారు. మరి గురువారం నాడు చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం. గురువారం ఆ రంగు శుభసూచికం గురువారం శ్రీ మహావిష్ణువును పూజించడం, ఉపవాసం చేయడం వల్ల శుభ ఫలితాలు సిద్ధిస్తాయట. పెళ్లి ఆలస్యం అవుతున్నా, వివాహంలో సమస్యలున్నా గురువారం రోజున ఉపవాసం చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు. ఇలా 11 వారాలు ఉపవాసాలు చేస్తే చాలా మంచిదట. గురువారం నాడు అరటిపండ్లను దానం చేసినా, పసుపు రంగు బట్టలు వేసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయట. గురువారం అరటి చెట్లకు పూజించడం వల్ల సత్ఫలితాలు సిద్ధిస్తాయట. గురువారం నాడు చేయకూడని పనులు ♦ గురువారం బృహస్పతికి అత్యంత ప్రీతికరమైన రోజు. బృహస్పతి ఆధిపత్యం వహించే గురువారం నాడు మహిళలు తలస్నానం చేయకూడదట. మహిళల జాతకంలో బృహస్పతి భర్త కారకం. అవుతుందట. అందుకే తలంటు పోసుకోవడం వల్ల కుజుడు బలహీనంగా మారుతాడని అంటారు. ఈ నెగిటివ్ ఎనర్జీ ముఖ్యంగా భర్త, పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని అంటారు. ఫలితంగా ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొంటారని విశ్వాసం. ♦ గురువారం శ్రీ మహా విష్ణువుకు ఇష్టమైన రోజు. ఆరోజు జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం వంటివి చేస్తే ఆయనకు కోపానికి కారణమవుతారని పండితులు విశ్వసిస్తారు. ఫలితంగా డబ్బుకు కొరత ఏర్పడుతుందని అంటారు. ♦ గురువారం నాడు బట్టలు ఉతకడం, ఇంట్లో బూజు దులపడం వంటివి చేస్తే విష్ణుమూర్తికి కోపం వస్తుందట. ♦ గురువారం నాడు అద్దాలు, కత్తెరలు వంటి పదునైన వస్తువులకు కొనుగోలు చేస్తే అరిష్టమని పండితులు చెబుతారు. ♦ గురువారం నాడు డబ్బు ఇవ్వడం లేదా రుణం తీసుకోవడం లాంటివి చేయకూడదట ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనై సంపద కొలువ ఉండదని చెబుతారు. గమనిక: పైన పేర్కొన్న అంశాలు విశ్వాసాలకు, ఆచారాలకు సంబంధించినవి. వీటికి సైంటిఫిక్ ఎవిడెన్స్, కశ్చితమైన ఆధారాలు లేవు. -
అప్పుల్లో ఇల్లు
జిల్లాలో ఎన్టీఆర్ గృహ పథకం లబ్ధిదారులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించుకోవడం కోసం నానాతంటాలు పడుతున్నారు. నిర్మాణరంగ వ్యయం అధికభారమైంది. ఇంటినిర్మాణానికి ప్రభుత్వమిస్తున్న రూ.1.5లక్షలు ఏమూలకూ సరిపోవడం లేదు. దీనికితోడు నిర్మాణాలకు వెంటనే బిల్లులు చెల్లించడం లేదు. ఫలితంగా లబ్ధిదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. బి.కొత్తకోట : ఎన్టీఆర్ గృహనిర్మాణానికి బిల్లుల చెల్లింపు శాపమైంది. విపరీత జాప్యం వెంటాడుతోంది. దీంతో పేదలు ఇంటిని నిర్మించుకోలేకపోతున్నారు. గడచిన రెండు నెలలుగా నిర్మాణాల్లో ఆశించిన స్థాయిలో ప్రగతి లేదని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. గత ఫిబ్రవరి 12 నుంచి బిల్లుల చెల్లింపులు పూర్తిగా నిలి చిపోయాయి. లబ్ధిదారులకు అందిస్తున్న సిమెంటుతో నిర్మాణాలు కొంతమేర సాగుతున్నాయి. జిల్లాలో ఎన్టీఆర్ గ్రామీణ, పట్టణ పథకాల కింద 2016–17, 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు సంబం ధించి 57,785 ఇళ్లు మంజూరు చేశారు. ఇందులో 17,817 పూర్తి చేయించగా 12,046 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమే కాలేదు. మిగిలిన వాటిలో పునాదిలోపు స్థాయిలో 9,728, పునాది స్థాయిలో 9,401, లింటిల్లెవల్ స్థాయిలో 261, రూఫ్ లెవల్ స్థాయిలో 2,208 నిర్మాణాలున్నాయి. బిల్లులు రాక క్షేత్రస్థాయిలో లబ్ధి దారులు ఇంటి నిర్మాణ పనులపై ఆసక్తి చూపడంలేదని అంటున్నారు. ఫిబ్రవరి నుంచి నిధులు విడుదల చేయడం లేదు. ఫిబ్రవరి 12 నుంచి ఆ నెలాఖరు వరకు కొద్దిపాటి బిల్లులు చెల్లించినా మార్చి ఒకటి నుంచి ఇప్పటి వరకు బిల్లుల మాటేలేదు. నిర్మాణాలు చేసినా బిల్లులు ఇవ్వరన్న అభిప్రాయంతో పనులపై లబ్ధిదారులు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. పెండింగ్లో రూ.35కోట్లు.. మార్చి ఒకటి నుంచి ఇప్పటివరకూ రూ.35కోట్లమేర పెండింగ్ బిల్లులున్నాయని అధికారిక సమాచారం. ఇది మరింత పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మండల స్థాయిలో అధికారులు రోజూ నిర్మాణ వివరాలు నమోదు చేస్తూ బిల్లుల మంజూరుకు ఆన్లైన్లో సిఫారసు చేస్తారు. ఇలా నిత్యం సిఫారసులు చేయడమే కనిపిస్తోంది తప్ప డబ్బులు రావడం లేదు. లబ్ధిదారులు గృహనిర్మాణశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మోల్డింగ్ వేసినా పునాది బిల్లే సొంతిల్లు లేకపోవడంతో ఎన్టీఆర్ గృహం మంజూ రు చేశారు. ఇంటి నిర్మాణ పనులు చేపట్టి మోల్డింగ్ చేయించాం. మూడు విడతల బిల్లులు మంజూరు కావాల్సివుండగా పునాది బిల్లు రూ.14,450 మా త్రమే మంజూరైంది. గోడలకు రూ.25వేలు, మోల్డింగ్కు రూ.40వేలు బిల్లులు మంజూరు చేయకపోవడంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. అప్పులకు వడ్డీ పెరుగుతోంది. -
ఎమ్మెల్యేల పనితీరుపై కేటీఆర్ ఫైర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదంటూ పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కుండబద్ధలు కొట్టారు. ‘అధికారులు పని చేయడం లేదంటూ సాకులు చెప్పొద్దు, ఎన్నికల పరీక్షను ఎదుర్కోబోయేది మీరేనంటూ’దిశానిర్ధేశం చేశారు. శనివారం వరంగల్కు వచ్చిన మంత్రి కేటీఆర్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రేటర్ వరంగల్ పరి«ధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్, డబుల్ బెడ్రూం పథకాలపై సమీక్ష నిర్వహించారు. పనులు ముందుకు సాగకపోవడం, బడ్జెట్లో వరంగల్కు కేటాయించిన రూ. 300 కోట్లను ఇప్పటీకీ ఖర్చు చేయకపోవడంతో మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు.. ‘సారీ... మీ వ్యవహారం ఏం బాగాలేదు. వేలకోట్ల నిధులున్నా ఒక్క పైసా ఖర్చుచేయటం లేదు. రెండున్నరేళ్ల క్రితం ముఖ్యమంత్రి.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఇంత నిర్లక్ష్యమా... ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకేం సమాధానం చెబుతామనుకుంటున్నారు. నిధులున్నా పనులు చేయించుకోలేక పోతున్నారు. అధికారులంటే అరవై ఏళ్లకు రిటైర్ అవుతారు. కానీ, మీ సంగతేంటి. మరో సంవత్సరంలో మీకు పరీక్షలు (ఎన్నికలు) ఉంటాయి. ప్రజాప్రతినిధులు సాకులు చెపుతూ తప్పించుకోవడం పద్ధతి కాదు. కొన్ని చోట్ల ప్రజలు నిర్మాణాలు వద్దంటే నోటీసులు ఇచ్చి వాటిని రద్దు చేసి ఇతర ప్రదేశాల్లో నిర్మించాలి. అంతే తప్ప పనుల్ని ఆపేస్తారా?.. అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ను ఉద్దేశించి ‘ఎమ్మెల్యే గారు, మీరు రోజూ హైదరాబాద్ వస్తారు. ఇక్కడేమో పనులు పెండింగ్లో ఉన్నాయి. నిధులకు కొదవలేదు. మీరు మాత్రం హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ విషయాలు మాట్లాడరు’ అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలతో పనిలేదని గ్రేటర్ పరిధిలో ఎక్కడ స్థలం ఉంటే అక్కడ నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. అనంతరం మరో అంశంపై చర్చను కొనసాగించేందుకు ప్రయత్నించగా, ‘ఇక చాలు ఎంతసేపు రివ్యూ చేసినా మీరిచ్చే సమాధానాలు ఇలాగే ఉంటాయి.. సమావేశం ముగిస్తున్నా’నంటూ మంత్రి వెళ్లిపోయారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకు సంబం«ధించి వెంటనే టెండర్లు పిలిచి 24వ తేదీలోగా హైదరాబాద్ వచ్చి పరిపాలన అనుమతులు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. -
కసబ్ మంచివాడో కాదో తెలియదు కానీ..
ముంబై ఉగ్రదాడుల కేసులో నిందితుడు... ఇటీవల అప్రూవర్గా మారిన పాక్ ఆమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ విచారణ రెండోరోజూ కొనసాగింది. శివసేన అధినేత బాలఠాక్రే హత్యకు ప్లాన్ చేశామని ప్రకటించి సంచలనం సృష్టించిన హెడ్లీ మరిన్ని వివరాలు వెల్లడించాడు. కసబ్ మంచివాడో కాదో తెలియదు గానీ.. అతను చేసిన పని ఎంతమాత్రం మంచిది కాదని వీడియో కాన్ఫరెన్స్ విచారణలో పేర్కొన్నాడు. 26 నవంబర్ దాడి ఘటనపై తాను ఇప్పటికే పశ్చాత్తాపం ప్రకటించానన్నాడు. ఆ పేలుళ్లలో భాగస్వామిగా నేరం చేశానని చెప్పాడు. కరాచీలోని లష్కరే తాయిబా కార్యాలయాన్ని తన జీవితంలో ఎప్పుడూ సందర్శించలేదని తెలిపాడు. 26/11 దాడుల తర్వాత కూడా భారత్పై దాడిచేసేందుకు తాను ప్రయత్నించానన్నాడు. కానీ ఈసారి అల్-కాయిదా సూచనలతో దాడి చేసేందుకు ప్రణాళిక రచించినా అది అమలుకాలేదని క్రాస్ ఎగ్జామినేషన్లో తెలిపాడు. మరోవైపు పాక్ ఐఎస్ఐ ముంబై దాడుల కోసం భారీగా నిధులు సమకూర్చినట్లు డేవిడ్ హెడ్లీ విచారణలో అంగీకరించాడని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ వెల్లడించారు. -
'కేంద్ర బడ్జెట్ ఎండమావిలా ఉంది'
కేంద్ర బడ్జెట్ ఎండమావిలా ఉందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ అభివర్ణించారు. లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక బడ్జెట్పై ప్రసంగించిన అనంతరం పార్లమెంట్ వెలుపల రాపోలు ఆనంద భాస్కర్ స్పందించారు. ఈ బడ్జెట్ కార్పొరేట్ వ్యవస్థల పరిరక్షణకు దోహదపడేదిగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉందని అభిప్రాయపడ్డారు. సామాజిక భద్రత, సంక్షేమానికి విఘాతం కలిగించేలా ఉందని వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్తో తెలంగాణకు అంతగా ఒరిగేదేమి లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి హార్టికల్చర్ (ఉద్యానవన) యూనివర్సిటీని మాత్రమే బడ్జెట్లో ప్రతిపాదించారని చెప్పారు. అలాగే హైదరాబాద్లో డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. -
కొలిక్కి రాని అభ్యర్ధుల జాబితా