organization
-
‘స్ట్రోక్’ను దెబ్బతీద్దాం
చాలా మందిలో స్ట్రోక్ అంటే ఇప్పటికీ గుండెపోటు అనే అపోహ ఉంది. పరిభాషలో పలకాలంటే స్ట్రోక్ అంటే మెదడు పోటు. పూర్తిగా మెదడుకి సంబంధించిన అత్యయిక స్థితి. ఈ స్ట్రోక్ ప్రస్తుతం కలవరపెడుతోంది. స్ట్రోక్కి గురువుతున్న వారి సగటు వయసు నానాటికీ తక్కువవుతోంది. పదేళ్ల క్రితం కనీసం 40 ఏళ్లు సరాసరిగా ఉన్న బాధితుల వయసు.. ప్రస్తుతం 26కి చేరిందంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అవగతమవుతోంది.కాకినాడ క్రైం: ప్రజల్లో ఈ విపత్తుపై అవగాహన పెంచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏటా అక్టోబర్ 29న వరల్డ్ స్ట్రోక్ డేగా ప్రకటించింది. ప్రజల్లో విస్తృత అవగాహన పెంపొందించి, స్ట్రోక్కు స్టాప్ చెప్పడమే ప్రస్తుతం ప్రపంచం ముందున్న లక్ష్యం. స్ట్రోక్ అంటే.. స్ట్రోక్ను వాడుక భాషలో పక్షవాతం అంటారు. బ్రెయిన్ అటాక్ అని కూడా పిలుస్తారు. మెదడులో రక్తనాళాలు పూడుకున్నా, పగిలినా, ధమనులు, సిరల్లో ఆటంకాలు ఏర్పడినా, మెదడుకు రక్తం సరఫరా నిలిచిపోతుంది. తద్వారా స్ట్రోక్ వస్తుంది. అప్పటివరకు చురుగ్గా ఉన్న మనిషి జీవచ్ఛవమవుతాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, జీవితమంతా నరకప్రాయమవుతుంది. స్ట్రోక్ సంభవిస్తే.. మెదడుకు ప్రవహించే రక్తంలో అంతరాయం ఏర్పడుతుంది. దీంతో మెదడు పనితీరు క్షీణిస్తుంది. 80 శాతానికి పైగా స్ట్రోక్ బాధితుల్లో మూతి వంకర్లు పోవడం, నత్తి, కాళ్లు చేతులు చచ్చుబడటం, మాట్లాడలేకపోవడం, కళ్లు మసకబారడం, చూపు శాశ్వతంగా కోల్పోవడం వంటి లక్షణాలుంటాయి. 15 శాతం మందికి పైగా బాధితుల్లో మెదడులో నరాలు చిట్లి, అంతర్గత రక్తస్రావం అవుతుంది. ఈ స్థితి మరణానికీ దారితీయవచ్చు. లక్షణాలివీ.. మాటల్లో తడబాటు, అకస్మాత్తుగా ముఖం, చేయి, కాలు తిమ్మిర్లు, బలహీనంగా లేదా పట్టు వదిలేసినట్లు అనిపించడం. ఒకటి లేదా రెండు కంటి చూపుల్లో ఇబ్బందులు ఏర్పడి.. చూడడంలో సమస్య, శరీరాన్ని బ్యాలెన్స్ చేయలేకపోవడం, అకారణంగా విపరీతమైన తలనొప్పి స్ట్రోక్ లక్షణాలు. రావడానికి కారణాలు ⇒ ఆడవారితో పోలిస్తే మగవారిలో ఎక్కువగా స్ట్రోక్ వచ్చే ప్రమాదం అధికం. ⇒ ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, ఇష్టానుసారంగా మత్తు పానీయాల వినియోగం, రక్తపోటు, ఏట్రియల్ ఫిబ్రిలిఏషన్, అధిక కొలె్రస్టాల్ స్థాయి, ఊబకాయం, జన్యుపర నిర్మాణంతో పాటు, మానసిక సమస్యలు కూడా స్ట్రోక్కు కారణమవుతాయి. గురి కాకూడదంటే.. స్ట్రోక్కి గురి కాకూడదంటే జీవన శైలిలో సానుకూల మార్పులను ఆహా్వనించాలి. సమయానుగుణంగా ఆహారం, నిద్ర అవసరం. ధూమపానం, మద్యపానం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. పోషకాహారం తీసుకోవాలి. ఆహారంలో మంచి మార్పుల వల్ల స్ట్రోక్ నుంచి తప్పించుకోవచ్చు. సీజనల్ పండ్లు, తృణధాన్యాలు, చేపలు, కొవ్వు తక్కువగా ఉండే పాల పదార్థాలు, వ్యాయామం, నడక, ధ్యానం దోహదం చేస్తాయి.ఫాస్ట్ ఫార్ములాతో సేఫ్ స్ట్రోక్ వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. రోగి వయసు, హెల్త్ హిస్టరీకి అనుగుణంగానే స్ట్రోక్ నుంచి తేరుకోవడం అన్నది ఆధారపడి ఉంటుంది. రక్తనాళాల్లో బలహీన ప్రాంతాన్ని అన్యూరిజం అంటారు. బయటికి ఉబికిన ఈ ప్రాంతంలో పగుళ్లు ఏర్పడితే మెదడు పూర్తిగా దెబ్బతింటుంది. దీనికి అత్యవసర చికిత్స చేయాల్సి ఉంటుంది. ‘బి గ్రేటర్ దేన్ స్ట్రోక్’ అన్న నినాదాన్ని ఈ ఏడాది థీమ్గా వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ నిర్ణయించింది. స్ట్రోక్కు మించిన మనోధైర్యాన్ని పెంపొందించుకుని, ముందుకు వెళ్లాలన్నది ఈ థీమ్ ఉద్దేశం. డాక్టర్ ఆర్.గౌతమ్ ప్రవీణ్, న్యూరో ఫిజీషియన్, కాకినాడ -
నిండా ముంచిన జయభేరి సంస్థ..
-
హమాస్ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అర్జెంటీనా
అర్జెంటీనా తాజాగా హమాస్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంతో పాటు దాని ఆర్థిక మూలాలను జప్తు చేయాలని అధికారులను ఆదేశించింది. అమెరికా, ఇజ్రాయెల్తో తమ దేశ సంబంధాలను బలోపేతం చేసేదిశగా యోచిస్తున్న అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మెయిలీ ఈ విధమైన ప్రకటన చేశారు.గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో పాలస్తీనా గ్రూపు జరిపిన దాడిని అర్జెంటీనా ఖండించింది. ఇజ్రాయెల్ 76 ఏళ్ల చరిత్రలో ఈ దాడి మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఆర్జెంటీనా దేశంలోని యూదులు ఉంటున్న ప్రాంతాలపై హమాస్ ఉగ్రదాడులు చేసిందని, ఈ సంస్థకు ఇరాన్తో సన్నిహిత సంబంధాలున్నాయని అర్జెంటీనా ఆరోపించింది.ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ తరచూ హమాస్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. గాజాలో జరిగిన ఈ దాడుల్లో 70 మందికి పైగా పాలస్తీనియన్లు మృతిచెందారు. హమాస్ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఇజ్రాయెల్ ఇక్కడి ప్రజలను ఊచకోత కోస్తున్నది ఆరోపించారు. తూర్పు గాజా నగరంలోని వేలాది మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ దళాలు పశ్చిమ, దక్షిణ ప్రాంతాలకు తరిమికొట్టాయని, అయితే వారు అక్కడికి రాగానే వారిపై కాల్పులు జరిపారని హమాస్ ప్రభుత్వ మీడియా కార్యాలయం డైరెక్టర్ జనరల్ ఇస్మాయిల్ అల్ తౌబ్తా పేర్కొన్నారు.పాలస్తీనియన్లంతా గాజా సిటీని ఖాళీ చేసి దక్షిణం వైపు వెళ్లాలని ఇటీవల ఇజ్రాయెల్ ఆర్మీ ఆదేశించింది. ఇజ్రాయెల్ దళాలు గాజా నగరంలో హెచ్చరికల కరపత్రాలను జారవిడిచాయి. అక్కడి ప్రజలంతా దక్షిణం వైపుకు వెళ్లాలని దానిలో కోరాయి. -
NRI: ఘనంగా.. 'నేషనల్ ఇండియా హబ్' ప్రారంభోత్సవం!
ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ కమ్యూనిటీ సెంటర్ గా నేషనల్ ఇండియా హబ్ ప్రారంభమైంది. అమెరికాలోని చికాగోలో పలువురు ప్రముఖుల సమక్షంలో నేషనల్ ఇండియా హబ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కాన్సుల్ జనరల్ సోమనాథ్ ఘోష్ ముఖ్య అతిథిగా హాజరై.. ప్రసంగించారు. ఇంద్రాణి ఫేమ్ అంకిత ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. తెలుగువారు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.నేషనల్ ఇండియా హబ్ గురించి వ్యవస్థాపకులు హరీష్ కొలసాని, వ్యవస్థాపక సభ్యులు కేకే రెడ్డి వివరించారు. అలాగే ఈ హబ్ ను స్థాపించటానికి గల కారణాలు కూడా వెల్లడించారు. 'Unite, Celebrate, Help Each Other' ప్రధాన సూత్రాలుగా ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు వివరించారు. నేషనల్ ఇండియా హబ్ ద్వారా అన్ని సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ లను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.ఇలా ఎక్కువ ఆర్గనైజేషన్స్ ఒకే రూఫ్ కిందకు రావటం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు చేసుకునే విషయం అన్నారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టే పలు సేవా కార్యక్రమాలను వివరించారు. ఎడ్యూకేషన్, హెల్త్ కేర్, CPR ట్రైనింగ్, ఇమిగ్రేషన్ వంటి ఎన్నో రకాల సేవ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.ఈ సంస్థను ప్రారంభించటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ కమ్యూనిటీ సెంటర్ గా నేషనల్ ఇండియా హబ్ ను ఏర్పాటు చేయటం పట్ల పలు సంఘాల నాయకులు, ప్రవాసులు అభినందించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.ఇవి చదవండి: -
సీ–ఓటర్ నేతిబీర సర్వే
సాక్షి, అమరావతి: ప్రజల మనోగతం పేరుతో సీ–ఓటర్ సంస్థ నిర్వహిస్తున్న సర్వేలకు ఏమాత్రం విశ్వసనీయత లేదనేందుకు ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికలతోపాటు 2019 ఎన్నికల్లో ఆ సంస్థ లెక్కలు తప్పడమే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. గత నవంబర్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో సీ ఓటర్ అంచనాలు గల్లంతయ్యాయి. టైమ్స్ నౌ లాంటి డజనుకుపైగా జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించడం తథ్యమని, టీడీపీ ఉనికి కోల్పోవడం ఖాయమని ఇప్పటికే వెల్లడించాయి. ఎలాంటి విశ్వసనీయత లేని సీ–ఓటర్ మాత్రం తనకు అలవాటైన రీతిలో సర్వే చేసినట్లు పేర్కొనగా దాన్ని పట్టుకుని టీడీపీ, ఎల్లో మీడియా చంకలు గుద్దుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కోతికి కొబ్బరి చిప్ప మాదిరిగా సీ–ఓటర్ సర్వే పేరుతో హడావుడికి తెర తీశారని పేర్కొంటున్నారు. 2019లో ఎన్నికల్లో టీడీపీ 14 లోక్సభ, 90–100 శాసనసభ స్థానాల్లో విజయం సాధిస్తుందని తన సర్వేలో వెల్లడైనట్లు సీ–ఓటర్ ప్రకటించింది. చివరకు ఫలితాలను చూస్తే 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ చారిత్రక విజయాన్ని నమోదు చేయగా టీడీపీ 23 శాసనసభ, మూడు లోక్సభ స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. చెప్పిందంటే.. జరగదంతే! దేశంలో ఇప్పటిదాకా జరిగిన అధిక శాతం ఎన్నికల్లో సీ–ఓటర్ నిర్వహించిన ప్రీ–పోల్, ఎగ్జిట్ పోల్ సర్వేలు లెక్కలు తప్పాయి. ఏదైనా ఓ పార్టీ అధికారంలోకి వస్తుందని సీ–ఓటర్ తేలి్చందంటే కచ్చితంగా మరో పారీ్టనే అధికారంలోకి వస్తుందని పలు సందర్భాల్లో రుజువు కావటాన్ని బట్టి ఆ సంస్థ విశ్వసనీయత ఎంతన్నది వెల్లడవుతోంది. -
చవక నగరాల్లో అహ్మదాబాద్, చెన్నై
ప్రపంచంలో తక్కువ ఖర్చుతో బతుకు వెళ్లదీయగల పెద్ద నగరాల్లో మన దేశానికి చెందిన రెండు సిటీలు అహ్మదాబాద్, చెన్నైలకు చోటు దక్కింది. ప్రఖ్యాత ‘ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్’ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 175 దేశాల్లోని పెద్ద నగరాలను ఎంపిక చేసి, సర్వే నిర్వహించి ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. ఆయా నగరాల్లో నిత్యావసరాల నుంచి ఇంటి అద్దెల దాకా వివిధ ధరలను పరిశీలించి.. జీవించడానికి అయ్యే ఖర్చును తేల్చామని పేర్కొంది. ఇందులో సింగపూర్, స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ నగరాలు అత్యధిక జీవన వ్యయంలో టాప్లో నిలిచాయి. నిత్యావసరాలు, వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం గణనీయంగా ఉండటంతో యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లోని నగరాల్లో జీవన వ్యయం పెరుగుతోందని తెలిపింది. ఇక తక్కువ వ్యయం ఉండే నగరాల్లో ఆసియా ఖండానికి చెందినవే ఎక్కువగా ఉన్నా యని నివేదిక వెల్లడించింది. – సాక్షి సెంట్రల్డెస్క్ -
వీకే నరేష్కి డాక్టరేట్ ప్రదానం
నటుడు వీకే నరేష్కి అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ‘ఐఎస్ సీఏహెచ్ఆర్’ నుంచి ఆయన ‘సార్’ అనే బిరుదుతోపాటు డాక్టరేట్ని అందుకున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో తాజాగా జరిగిన 5వ ప్రపంచ కాంగ్రెస్ సమావేశాల్లో వీకే నరేష్కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ సమావేశాలను ‘నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్’ సంస్థతో పాటు ‘ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ (ఐఎస్ సీఏహెచ్ఆర్)’ కలిసి నిర్వహించాయి. ఐఎస్ సీఏహెచ్ఆర్ సంస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది నాటో, యూరోపియన్ యూనియన్, అమెరికా వంటి దేశాల గుర్తింపు ఉన్న సంస్థ కూడా.. అక్కడ నరేష్కు మరో గౌరవం దక్కింది. మిలటరీ ఆర్ట్స్ గుడ్విల్ అంబాసిడర్తో పాటు లెఫ్టినెంట్ కల్నల్గా ఆయన్ను నియమించినట్లు సన్నిహితులు తెలిపారు. ఇకపై నరేష్ పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సార్... అనే హోదా చేరుతుంది. ఉగ్రవాదం, సామాజిక సమస్యలు వంటి అంశాలపై అనేక అంతర్జాతీయ వేదికలపై నరేష్ ప్రసంగించినందుకు గుర్తింపుగా ఈ గౌరవాలు దక్కాయి. -
సింగరేణి మనుగడ కేసీఆర్తోనే..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి సంస్థ మనుగడ సాగించాలంటే సీఎం కేసీఆర్ ఉండాలి..కేసీఆర్ ఉండాలంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, అశ్వారావుపేటలో ఆదివారం ఆయన రోడ్షో, కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...ప్రధాని నరేంద్రమోదీ సింగరేణి ప్రైవేటీకరణకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పంటికి అందకుండా సింగరేణిని మింగేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నాలను బీఆర్ఎస్ ఎంపీలు అడుగడుగునా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఈ విషయంలో ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూడా పార్లమెంట్లో నోరుమెదపలేదని విమర్శించారు. త్వరలోనే ‘సీతారామ’పూర్తి చేస్తాం సీతారామ ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు బీఆర్ఎస్కు సరైన ఆదరణ లేదని, కానీ ఈసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలకం కావాలని పిలుపునిచ్చారు. పార్టీలో నేతల మధ్య చిన్న చిన్న విభేదాలు, అలకలు ఉంటే అన్నీ పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. గిరిజనేతరులకు పోడు పట్టాల పంపిణీ తదితర సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నం చేస్తామన్నారు. దరిద్రానికి నేస్తం ‘హస్తం’ కాంగ్రెస్ వారు ఒక్క అవకాశం ఇవ్వండని అడుగుతున్నారని, ప్రజలు ఇప్పటికే 11 సార్లు అవకాశం ఇచ్చారని, ఇంకెన్నిసార్లు ఇవ్వాలని కేటీఆర్ ఎద్దేశా చేశారు. రేవంత్రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని, రాష్ట్రంలో ఎంత మంది రైతులకు 10 హెచ్పీ మోటార్లు ఉన్నాయని ప్రశ్నించారు. దరిద్రానికి నేస్తంగా హస్తం మారిందని ఆయన ఆరోపించారు. నా పేరే తారక రామారావు: మూడోసారి అధికా రం చేపట్టగానే యాదాద్రి కంటే మిన్నగా భద్రా చలం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తా మని హామీ ఇచ్చారు. కేటీఆర్ మధ్యాహ్నం భద్రా చలం చేరుకునేసరికి అప్పటికే ఆలయం తలుపులు మూసేయగా దర్శనం సాధ్యం కాలేదు. దీనిపై కేటీఆర్ వివరణ ఇస్తూ ‘నా పేరే తారక రామారా వు’నాకు రాముడిపై భక్తి లేకుండా ఎలా ఉంటుంది’అని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాతా మధు, ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట బీఆర్ఎస్ అభ్యర్థులు బానోత్ హరిప్రియ, వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, తెల్లం వెంకట్రావు, మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
పట్టణాలకు పచ్చదనం అందాలు..
సాక్షి, అమరావతి: రాష్ట్ర పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఆహ్లాదం, వినోదం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న నగర వనాలు త్వరలో మరో 100 అందుబాటులోకి రానున్నాయి. భూమి లభ్యతను బట్టి ప్రతి జిల్లాలో కనీసం 2 నుంచి 4 నగర వనాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదించేందుకు, ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతుండటంతో వీటి ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజల అభిరుచులకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో నగర వనాలను తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మంగళగిరి, పేరేచర్ల, దివాన్చెరువు (రాజమహేంద్రవరం),కడప, అనంతపురం, నెల్లూరు, తిరుపతిలో ఒక్కోటి చొప్పున, కర్నూలు, చిత్తూరులో 2 చొప్పున నగర వనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో 30కి పైగా నగర వనాలను డిసెంబర్లోపు, మిగిలిన వాటిని మార్చి నెలాఖరులోపు సిద్ధం చేయడానికి అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి జిల్లాలో 2, 3 ఏర్పాటుకు సన్నాహాలు కొన్ని పట్టణాల్లో భూమి దొరక్కపోవడంతో నగర వనాల ప్రణాళిక ఆలస్యమైంది. భూమి అందుబాటులో ఉన్న చోట 2, 3 నగర వనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు వద్ద అటవీ ప్రాంతం ఎక్కువ ఉండటంతో అక్కడ 2 నగర వనాలను తీర్చిదిద్దారు. అనంతపురం టౌన్ దగ్గర్లో ఎక్కడా అటవీ భూమి లేదు. దీంతో అక్కడ రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో భూమి కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. అలాంటి చోట్ల కొద్దిగా ఆలస్యమైనా మిగిలిన ప్రాంతాల్లో త్వరితగతిన నగర వనాలు సిద్ధమవుతున్నాయి. కొన్నిచోట్ల భూమి లేకపోయినప్పుడు అక్కడ అందుబాటులో ఉండే పెద్ద సంస్థలు, పెద్ద కాలేజీలు, క్యాంపస్లలో ఎక్కువ భూమి ఉంటే అలాంటిచోట్ల నగర వనాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వ నిధులతోపాటు కార్పొరేషన్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఆయా ప్రాంతాల్లోని కార్పొరేట్ సంస్థలు, కంపెనీలను సంప్రదిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఆయా ప్రాంతాల ప్రజలను వీటి ఏర్పాటులో భాగస్వాముల్ని చేస్తున్నారు. వాకర్స్ క్లబ్లు, స్థానిక ప్రముఖులను కూడా కలిసి వీటి గురించి వివరించి నిధులు సమకూర్చి, వారి ద్వారానే వాటిని నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎకో టూరిజం నిబంధనలకు అనుగుణంగా.. పచ్చదనంతో కూడిన స్వచ్చమైన పరిసరాలు నగర వనాల్లో ఉండేలా చూస్తున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు అక్కడకు వచ్చి ఆహ్లాదంగా గడిపేందుకు నగర వనాలను తీర్చిదిద్దుతున్నారు. పిల్లలు ఆడుకునేందుకు పలు రకాల క్రీడా సౌకర్యాలు, వాకింగ్ ట్రాక్, యోగా, వెల్నెస్ సెంటర్, అరుదైన చెట్ల పెంపకం వంటివన్నీ అక్కడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఎకో టూరిజం నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతి అందాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లనక్కర్లేదు ప్రకృతి అందాలను వీక్షించేందుకు ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళుతున్నారు. వారి నివాసాలకు సమీపంలోనే ప్రకృతి సహజసిద్ధ ప్రాంతాలున్నాయి. వాటిని నగర వనాలుగా తీర్చిదిద్దుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 30 నగర వనాలున్నాయి. మరో 100 వనాలను ఏర్పాటు చేస్తున్నాం. – ఎన్ మధుసూదన్రెడ్డి, రాష్ట్ర అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ -
‘మామిడి’లో మనమే ఘనం
సాక్షి, అమరావతి : దేశంలో అత్యధికంగా మామిడి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. అలాగే జాతీయ స్థాయి సగటు హెక్టార్కు మామిడి ఉత్పాదకతను మించి రాష్ట్రంలో సగటు హెక్టార్కు మామిడి ఉత్పాదకత అత్యధికంగా ఉంది. దేశంలో ఏపీ తర్వాత మామిడి ఉత్పత్తిలో ఒడిశా రాష్ట్రం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశాలో మామిడి తదితర పండ్ల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా రైతులకు మేలుతో పాటు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ అధ్యయన నివేదిక వెల్లడించింది. కొరియా ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ సహకారంతో ఈ అధ్యయనం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఆహార ప్రాసెసింగ్ రంగంలో సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక రూపంలో విడుదల చేశారు. నివేదికలో ఉన్న ముఖ్యాంశాలు జాతీయ స్థాయిలో హెక్టార్కు సగటున 9.6 టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుండగా, ఏపీలో హెక్టార్కు సగటున 12 టన్నులు ఉత్పత్తి అవుతోంది. ఒడిశాలో హెక్టార్కు సగటున 4 నుంచి 6.3 టన్నుల మామిడి ఉత్పత్తి అవుతోంది. ఏపీలో ఉత్పత్తయ్యే మామిడి పండ్లలో 16% ఫ్రూట్ ప్రాసెస్ చేపడుతున్నారు. ఇలా ప్రాసెస్ చేసిన ఉత్పత్తుల డిమాండ్ను పెంచాల్సి ఉంది. ఏపీలో బంగినపల్లి, సువర్ణ రేఖ, నీలం, తోతాపురి రకాలు ఎక్కువగా పండుతుండగా, ఎగుమతికి అనువైన ఇమామ్ పసంద్, బంగినపల్లి, సువర్ణరేఖ వంటి గుజ్జు రకాలూ ఎక్కువగానే పండుతున్నాయి. ఏపీలో ఉత్పత్తి అయ్యే గుజ్జు రకాల పండ్లలో దాదాపు 54 శాతం ఎగుమతి అవుతున్నాయి. ప్రాసెస్ చేసిన పండ్ల ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. గుజ్జు రకాల మామిడి పండ్ల ఉత్పత్తి ఏపీ, ఒడిశాలో అత్యధికంగా ఉంది. పండ్ల ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించడం ద్వారా అధిక ఉద్యోగాలు కల్పించవచ్చు. పండ్ల ప్రాసెసింగ్ పరిశ్రమలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్లో కీలకమైన పరిమితులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు నాణ్యమైన ముడి పదార్థాలను అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ పథకాలను అందుబాటులో ఉంచడంతో పాటు త్వరగా అనుమతులివ్వాలి. పండ్ల ప్రాసెసింగ్లో 75 శాతం మహిళలకు, 25 శాతం పురుషులకు ఉపాధి లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 3.39 మిలియన్ ఎంఎస్ఎంఈలను ఉండగా, ఒడిశాలో 1.98 మిలియన్ ఎంఎస్ఎంఈలున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఎంఎస్ఎంఈల్లోనే 111 మిలియన్ల మంది ఉపాధి పొందుతున్నారు. నమోదైన ప్రాసెసింగ్ యూనిట్ల కన్నా ఏపీ, ఒడిశాల్లో నమోదుకాని యూనిట్లు 26 నుంచి 80 రెట్లు ఉంటాయి. ఏపీ ప్రభుత్వం 2020–25 లక్ష్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ విధానాన్ని తెచ్చింది.. కొత్త సాంకేతిక బదిలీలను ప్రోత్సహించడం, సాంకేతికతను అప్గ్రేడేషన్ చేయడం, ముడి సరుకు సక్రమంగా సరఫరా అయ్యేలా సరైన పంటల ప్రణాళికలకు మద్దతు ఇవ్వడం, వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేయడం.యువతకు వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇంక్యుబేషన్ కేంద్రాల ఏర్పాటు, రైతు భరోసా కేంద్రాలు తదితరాలతో బ్యాక్వర్డ్ లింక్లను ఏర్పరచుకోవడం వంటివి లక్ష్యంగా విధానాన్ని రూపొందించుకుంది. -
ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మొద్దు: రఘుమారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభాలకు గురిచేసి డబ్బులు వసూలు చేసే దళారులు, సంస్థ సిబ్బంది మాటలు నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు సంస్థ సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) నియామకంలో నిర్ణిత అర్హతలు ఉండి, స్తంభాలు ఎక్కే (పోల్ క్లైంబింగ్) పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అనుసరించి అత్యంత పారదర్శకంగా ఎంపిక జరుగుతుందని శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మెరిట్, రూల్ మాఫ్ రిజర్వేషన్స్ను ప్రామాణికంగా తీసుకుని అర్హులైన అభ్యర్థులకు ఈనెల 28 నుంచి వివిధ జిల్లా/సర్కిల్ కేంద్రాల్లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, పోల్ క్లైంబింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సంస్థ వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో 1,553 జూనియర్ లైన్మెన్ పోస్టులకు ఈ ఏడాది నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. -
సర్వేలపై ఎల్లో మీడియా సొంత కథనాలు
సాక్షి, అమరావతి: ఏ జాతీయ సంస్థ సర్వే వచ్చినా అది ఫేక్, పెయిడ్ అంటూ ఎల్లో మీడియా సొంత కథనాలు వండి వారుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఇండియా టుడే ఇంగ్లిష్ న్యూస్ చానల్... సీ ఓటర్తో కలిసి చేసిన సర్వే మాత్రమే అసలు సిసలు అంటూ ఎల్లో మీడియా ఊదరగొడుతోందన్నారు. పచ్చ పార్టీ గెలుస్తుందని చెబితే ఒరిజినల్, లేకపోతే ఆ సర్వే ఫేకా అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో గ్యారెంటీగా గెలుస్తామనే ధీమా టీడీపీలో ఏ ఒక్కరికీ లేదన్నారు. రాజకీయాల్లో విజేతలు, హుందాగా ఉండే వారి మాటలకే సమాజంలో గౌరవం ఉంటుందని తెలిపారు. పరాజితులు, ఒకప్పటి రౌడీషీటర్లు, చిల్లర నేరగాళ్లు హెచ్చరికలు జారీ చేస్తే వీధి కుక్కలు కూడా భయపడవని చెప్పారు. నలుగురి దృష్టిని ఆకర్షించే ఘటన ఎక్కడ జరిగినా దాన్ని చంద్రబాబు తనకు ఆపాదించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అల్లు అర్జున్కు జాతీయ అవార్డు రావడానికి కూడా తానే స్ఫూర్తి అని అన్నా అంటారన్నారు. ‘‘నా హయాంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ కొత్త పుంతలు తొక్కింది.. ఎందరో పుష్పరాజ్లను నేను తయారు చేశా.. పుష్ప పార్ట్ 2 కూడా వస్తోంది తమ్ముళ్లూ’’ అని బాబు అంటారేమో అని ఎద్దేవా చేశారు. పల్నాడు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు తాము సమీక్ష నిర్వహిస్తే ‘ఈనాడు’లో తప్పుడు కథనాలు రాశారని మండిపడ్డారు. జర్నలిజం విలువలను పూర్తిగా వదిలేసిన ఈనాడు అభూత కల్పనలు రాస్తూ నానాటికీ దిగజారుతోందన్నారు. కాగా ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రకటించిన జైవిక్ ఇండియా అవార్డుకు ఎంపికైన గనిమిశెట్టి పద్మజకు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. మన రాష్ట్రానికి మూడు అవార్డులు దక్కడం ప్రశంసనీయమన్నారు. -
ఎవరు పొట్టి..పొడుగు
ఇంట్లో, బయటా, ఆఫీసులో, మరో చోట.. ఎక్కడైనా ఎవరో ఒకరిని కలుస్తూ ఉంటాం. కొందరు మనకన్నా పొడుగ్గా ఉంటే.. మరికొందరు పొట్టిగా ఉంటుంటారు. ఇది సాధారణమే. కానీ కొన్ని ప్రాంతాల్లో వారు బాగా పొట్టిగా, మరికొన్ని ప్రాంతాల్లో వారు బాగా పొడుగ్గా ఉంటుంటారు. వారిలో తరాలుగా వస్తున్న జన్యువులకుతోడు స్థానిక వాతావరణం, ఉష్ణోగ్రతలు, జీవన విధానం, పని పరిస్థితులు, వైద్యారోగ్య సౌకర్యాలు, పోషకాహారం వంటివి మనుషుల ఎత్తులో తేడాలకు కారణమవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఇన్సైడర్ సంస్థ ప్రపంచంలో ఎత్తు తక్కువ జనాభా ఉన్న 25 దేశాలతో నివేదికను రూపొందించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆయా దేశాల ఆరోగ్యశాఖలు, వివిధ సర్వేలు, అధ్యయనాలను పరిశీలించి.. దీనిని సిద్ధం చేసింది. ఆయా దేశాల్లో బాగా పొడవుగా ఉన్నవారు కూడా ఉండొచ్చని, తాము సగటు ఎత్తును ప్రామాణికంగా తీసుకున్నామని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను పరిశీలిస్తే.. దక్షిణాసియా, మధ్య ఆఫ్రికా దేశాల్లో జనంఎత్తు తక్కువగా ఉన్నారని నివేదిక పేర్కొంది. దాదాపు అన్ని దేశాల్లో కూడా మహిళల కంటే పురుషుల ఎత్తు ఎక్కువని తెలిపింది. ప్రపంచంలో అత్యధికంగా నెదర్లాండ్స్ దేశస్తుల సగటు ఎత్తు 175.62 సెంటీమీటర్లుకాగా.. అమెరికాలో 172.21, చైనాలో 161.45 సెంటీమీటర్లుగా ఉంది. -
Health tip : కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయొద్దు
తినే సమయంలో ఆహారంపై మనసు కేంద్రీకరించడం వల్ల అది మన మనస్తత్వ శాస్త్రాన్ని ప్రభావితం చేస్తుందని, జీర్ణక్రియను కూడా ప్రభావితం చేస్తుందని వెల్నెస్ కోచ్, ఆయుర్వేద ఔత్సాహికురాలు అమృత కౌర్ రాణా తెలిపారు. FICCI లేడీస్ ఆర్గనైజేషన్ (FLO) హైదరాబాద్ చాప్టర్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు అమృత. ఆమె చెప్పిన హెల్త్ టిప్స్ ఇవి. కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయకండి (షవర్ తీసుకోకండి), ఇది రక్తపోటు క్రమరాహిత్యానికి కారణమవుతుంది ఆయుర్వేదం 'జీవిత శాస్త్రం'. ఇది ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడంలో సహాయపడుతోంది శరీరాన్ని మంచి ఆరోగ్యంతో ఉంచుకోవడం మన కర్తవ్యం, లేకుంటే మన మనస్సును బలంగా మరియు స్పష్టంగా ఉంచుకోలేము ప్రతిరోజూ, మన ఆరోగ్యాన్ని నిర్దేశించే ఎంపికలను చాలా తరచుగా, మనకు తెలియకుండానే మార్చుకుంటాం. వేగవంతమైన జీవితాలు మరియు అనేక బాహ్య కారకాలచే ప్రభావితమవుతున్నాయి. వేదాలు ప్రకృతిలోని ఐదు అంశాలను - గాలి, నీరు, అంతరిక్షం, అగ్ని మరియు భూమి - పంచమహాభూతంగా సూచిస్తాయి. మానవ శరీరంలో ఈ మూలకాల ఉనికి లేదా లేకపోవడం దాని జీవ స్వభావం లేదా దోషాన్ని నిర్ణయిస్తుంది. ఆధునిక జీవనం కోసం ఆరోగ్యకరమైన శరీరం & మనస్సు కోసం ఆయుర్వేద సూత్రాల ఆధారంగా రోజువారీ అభ్యాసాలు చాలా ముఖ్యమైనవి శక్తితో కూడిన శరీరం కోసం మనస్సు తేలికగా ఉండాలి ఎప్పుడు మానసిక ఒత్తిడితో జీవితం గడిపితే అది కచ్చితంగా శరీరంపై, తద్వారా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ఆయుర్వేద పోషకాహారం ప్రకారం రోజువారీ మంచి ఆహారపు అలవాట్లు పెంచుకోవాలి మంచి జీర్ణ శక్తి, సరైన రుతుస్రావం మెరుగైన హార్మోన్లకు దోహదపడతాయి ఒత్తిడి లేని జీవితం గడిపేలా స్వీయ-సంరక్షణ పద్ధతులను పాటించాలి కంటి నిండా నిద్ర, మానసిక ఆరోగ్యం వల్ల చర్మం, జుట్టు సంరక్షింపబడతాయి మైండ్ఫుల్గా తినడం అంటే ఎక్కువ తినమని కాదు అర్థం. దీనికి కేలరీలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు లేదా ప్రోటీన్తో సంబంధం లేదు. కానీ ఏం తింటున్నామో.. మనసుకు తెలియజేయాలి. మనం నోట్లో పెట్టుకున్నప్పుడు మనసు దాన్ని జీర్ణింపజేయడానికి కొన్ని రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది. ఇంద్రియ జ్ఞానం వల్ల తినే తిండి సత్పలితాలను ఇస్తుంది. తినే సమయంలో ఆహారంపై మనసు కేంద్రీకరించడం మన శరీరధర్మాన్ని ప్రభావితం చేస్తుంది. ఆహారం తిన్న కొద్దిసేపటి వరకు నీళ్లు తాగకుండా చూసుకోండి. భోజనం చేసిన వెంటనే కనీసం 100 అడుగులు నడవడం మంచిది. ఇలా చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. మీరు అతిగా తింటే, మీ తదుపరి భోజనాన్ని తగ్గించండి లేదా దానిని దాటవేయండి. సూర్యాస్తమయం తర్వాత పెరుగు తినకూడదు. కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయకండి. ఇది రక్తపోటు క్రమరాహిత్యానికి కారణమవుతుంది. స్నానం మీ హృదయ స్పందన రేటును కూడా పెంచుతుంది ఇది కడుపు నిండినప్పుడు అసౌకర్యంగా అనిపిస్తుంది అని ఆమె తెలిపారు (అమృత ఫుడ్ బ్లాగర్ మరియు సర్టిఫైడ్ ఆయుర్వేద పోషకాహార సలహాదారు, జర్నలిస్ట్, రేడియో జాకీ, కంటెంట్ సృష్టికర్త మరియు ఉపాధ్యాయురాలు) -
భారత్కు ట్రంప్ జూనియర్..రియల్ ఎస్టేట్ రంగంపై కన్ను, వేలకోట్ల పెట్టుబడులు?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ రియల్ ఎస్టేట్ రంగంలో తన వ్యాపార కార్యాలపాల్ని విస్తరించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈ డిసెంబర్ నెలలో భారత్లో పర్యటించనున్నారు. ట్రంప్ జూనియర్కు చెందిన ది ట్రంప్ ఆర్గనైజేషన్ ముంబై ట్రిబెకా డెవలపర్స్ భాగస్వామ్యంతో భారత్లో పలు నిర్మాణాలు చేపట్టనుంది. ఇప్పటికే ‘ట్రంప్’ బ్రాండ్ పేరుతో దేశీయంగా లగ్జరీ ప్రాజెక్ట్లను నిర్మిస్తుంది. ఇందుకోసం ట్రిబెకా డెవలపర్స్, లోధా గ్రూప్తో జతకట్టింది. ఇక, ట్రంప్ ఆర్గనైజేషన్ భారత్లో ఇప్పటివరకు ట్రంప్ టవర్ ఢిల్లీ - ఎన్సీఆర్, ట్రంప్ టవర్స్ కోల్కతా, ట్రంప్ టవర్ పూణే, ట్రంప్ టవర్ ముంబై నాలుగు లగ్జరీ ప్రాజెక్ట్ల నిర్మాణాలను చేపట్టింది. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ రాకపై ట్రిబెకా డెవలపర్స్ ప్రతినిధులు స్పందించారు. తమ సంస్థ 10వ వార్షికోత్సవం సందర్భంగా జూనియర్ భారత్కు వస్తున్నట్లు తెలిపారు. భారత పర్యటన నేపథ్యంలో ట్రిబెకా డెవలపర్స్ అధినేత కల్పేష్ మెహత, ట్రంప్ జూనియర్లు వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. భారత్లో ట్రంప్ లగ్జరీ ప్రాజెక్ట్లు 2014లో ది ట్రంప్ ఆర్గనైజేషన్ భారత్లో తన వ్యాపార కార్యకలాపాల్ని ప్రారంభించింది. తొలిసారిగా ముంబైలో లోథా గ్రూప్తో ఇంటి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. పూణేలో పంచశీల్ రియాల్టీ సంస్థ భాగస్వామ్యంలో లగ్జరీ ప్రాజెక్ట్ను పూర్తి చేసింది. కోల్ కతాలో ట్రంప్ టవర్స్ 140 అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్ను ప్రారంభించింది. 2018లో గురుగ్రామ్, హర్యానాలలో మరో లగ్జరీ ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. -
కేంద్ర గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం
చిక్కడపల్లి: నగరంలో శిథిలస్థితికి చేరిన గ్రంథాలయాలకు నూతన భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు నగర కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ కె.ప్రసన్నరామ్మూర్తి, కార్యదర్శి పి.పద్మజ పేర్కొన్నారు. ఆరు నెలలకు ఓ సారి నిర్వహించే కేంద్ర గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం బుధవారం చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో జరిగింది. ఈ సందర్భంగా ప్రసన్న, పద్మజ మాట్లాడుతూ.. నగరంలో గ్రంథాలయాలను పాఠకుల అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దడంతో పాటు పాఠకుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నూతన పుస్తకాల కొనుగోలు, సిబ్బంది జీత భత్యాలు, పెన్షన్తో పాటు నగరంలోని 82 గ్రంథాలయాలను ఆధునీకరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారు చర్చించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెండు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్నారని, ఇకపై ప్రతి నెలా ఇచ్చే అంశంపై చర్చించినట్లు తెలిసింది. వచ్చే ఏడాది గ్రంథాలయాల అభివృద్ధి, జీత భత్యాలు తదితర వాటికి దాదాపు రూ.2కోట్ల పైచిలుకు నిధులకు ప్రతిపాదన చేసినట్లు సమాచారం. సమావేశంలో సభ్యులు వాసుదేవ్రావు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
వీఐలో వాటా అప్పగించేందుకు రెడీ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా(వీఐ) లిమిటెడ్లో తమకున్న వాటాను ప్రభుత్వం లేదా ఏ ఇతర సంస్థకైనా అప్పగించేందుకు సంసిద్ధమంటూ కేఎం బిర్లా తాజాగా స్పష్టం చేశారు. కంపెనీ కొనసాగింపునకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మేలు చేయగలదని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ జూన్ 7న కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గాబాకు బిర్లా లేఖ రాశారు. వీఐఎల్లో బిర్లాకు 27 శాతం వాటా ఉంది. అధికారిక సమాచారం ప్రకారం వీఐఎల్కున్న సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్) బకాయిలు(లయబిలిటీ) రూ. 58,254 కోట్లుకాగా.. వీటిలో రూ. 7,854 కోట్లకుపైగా చెల్లించింది. సుప్రీం నో: ఏజీఆర్ మదింపులో దిద్దుబాట్లకోసం భారతీ ఎయిర్టెల్సహా వీఐఎల్ సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ చుక్కెదురైంది. కాగా.. ఏజీఆర్ బకాయిలపై స్పష్టత లోపించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు కంపెనీలో పెట్టుబడులకు ముందుకురావడంలేదని లేఖలో బిర్లా పేర్కొన్నారు. స్పెక్ట్రమ్ చెల్లింపులపై అవసరమైనంత మారటోరియం విధింపు, ప్రధానంగా సర్వీసు వ్యయాలకు మించిన ఫ్లోర్ ధరల విధానాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. భారీ రుణ భారం: రూ. 25,000 కోట్లు సమీకరించేందుకు 2020 సెప్టెంబర్లో బోర్డు వీఐఎల్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అయితే కంపెనీ నిధుల సమీకరణ చేపట్టలేకపోవడం గమనార్హం! లీజ్ లయబిలిటీలను మినహాయిస్తే కంపెనీకి స్థూలంగా రూ. 1,80,310 కోట్ల మేర రుణభారముంది. వీటిలో వాయిదాపడిన స్పెక్ట్రమ్ చెల్లింపులు రూ. 96,270 కోట్లుకాగా.. బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాలు రూ. 23,080 కోట్లుగా నమోదయ్యాయి. -
బైజూస్ చేతికి సింగపూర్ సంస్థ
న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్ టెక్నాలజీ దిగ్గజం బైజూస్ శరవేగంగా అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు విస్తరిస్తోంది. కొత్తగా మరో సంస్థను కొనుగోలు చేసింది. సింగపూర్ కేంద్రంగా పనిచేసే గ్రేట్ లెర్నింగ్ను 600 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 4,466 కోట్లు) దక్కించుకుంది. ప్రొఫెషనల్, ఉన్నత విద్య సెగ్మెంట్లో తన స్థానాన్ని పటిష్టం చేసుకునే దిశగా గ్రేట్ లెర్నింగ్లో 400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,977 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. బైజూస్ ఇటీవలే అమెరికాకు చెందిన డిజిటల్ రీడింగ్ ప్లాట్ఫాం ఎపిక్ను 500 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 3,730 కోట్లు) కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఉత్తర అమెరికా మార్కెట్లో 1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 7,460 కోట్లు) ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉంది. బైజూస్ గ్రూప్లో భాగంగా మారినప్పటికీ వ్యవస్థాపక సీఈవో మోహన్ లక్కంరాజు, సహ వ్యవస్థాపకులు హరి నాయర్, అర్జున్ నాయర్ల సారథ్యంలో గ్రేట్ లెర్నింగ్ ఇకపైనా స్వతంత్రంగానే కార్యకలాపాలు కొనసాగించనుంది. బైజూస్ టెక్నాలజీ, గ్రేట్ లెర్నింగ్ ప్రొఫెషనల్ కోర్సుల కంటెంట్ ఒక దగ్గరకు చేరేందుకు ఈ డీల్ ఉపయోగపడనుంది. అంతర్జాతీయంగా పేరొందిన ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కంపెనీతో జట్టు కట్టడం ద్వారా కొత్త సెగ్మెంట్లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించుకోగలమని బైజూస్ వ్యవస్థాపక, సీఈవో బైజూ రవీంద్రన్ తెలిపారు. ఆన్లైన్లో ఉన్నత విద్యాభ్యాసం పెరిగే కొద్దీ అందుబాటు ధరల్లో అందరికీ విద్యను అందించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడగలదని మోహన్ పేర్కొన్నారు. బైజూస్.. గ్రేట్ లెర్నింగ్ ఇలా.. గ్రేట్ లెర్నింగ్ 2013లో ప్రారంభమైంది. ఇప్పటిదాకా 170 పైచిలుకు దేశాల్లో 15 లక్షల మంది పైగా విద్యార్థులకు కోర్సులు అందించింది. ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) వంటి దిగ్గజ విద్యా సంస్థలకు చెందిన 2,800 పైగా పరిశ్రమ నిపుణులు ఇందులో మెంటార్లుగా ఉన్నారు. ప్రధానంగా సింగపూర్, అమెరికా, భారత్లో గ్రేట్ లెర్నింగ్ కార్యకలాపాలు ఉన్నాయి. -
అప్పుడు నేను మాత్రమే ముస్లిం అమ్మాయిని
‘లెడ్ బై’ భారతీయ ఇస్లాం మహిళల సాధికారత కోసం ఏర్పాటైన వేదిక. సంప్రదాయాల ముసుగు మాటున అణగారిపోతున్న మహిళల మేధకు పదును పెట్టి సాధికారత దిశగా అడుగులు వేయిస్తోంది డాక్టర్ రుహా షాబాద్. ముప్పై ఏళ్ల రుహా షాబాద్ పుట్టింది మనదేశంలోనే. పెరిగింది మాత్రం సౌదీ అరేబియాలో. మహిళలకు శిక్షణనివ్వడానికి, అభివృద్ధి వైపు నడిపించడానికి గత ఏడాది ‘లెడ్ బై’ సంస్థను స్థాపించిందామె. ఆలోచించాల్సిన విషయం జీవితంలో తాను అనుకున్నది సాధించిన మహిళ డాక్టర్ రుహ. కొన్నేళ్లపాటు డాక్టర్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రజావైద్య విభాగంలో పని చేయాలనే ఉద్దేశంతో క్లింటన్ హెల్త్ యాక్సెస్ ఇనిషియేటివ్, నీతి ఆయోగ్లో పని చేసింది. ఆ తర్వాత పబ్లిక్ హెల్త్లో మాస్టర్స్ డిగ్రీ కోసం హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లింది. ఆమెలో రేకెత్తిన ఆలోచనలకు కార్యరూపమే లెడ్బై సంస్థ. తనలో ఈ ఆలోచనలు రూపుదిద్దుకోవడానికి దారి తీసిన అనేక సంఘటనలను గుర్తు చేసుకున్నారామె. ‘‘చదువుకునేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు నేను మాత్రమే ముస్లిం అమ్మాయిని. కోట్లాది ముస్లిం కుటుంబాలు ఉండగా, ఒక్క ముస్లిం మహిళ కూడా నాకు చదువులో, ఉద్యోగంలో తారసపడలేదెందుకని, వారంతా ఏం చేస్తున్నారు... అని కూడా అనిపించేది. అలాగే డాక్టర్గా ప్రాక్టీస్ చేసిన రోజుల్లో నేను గమనించిన విషయం ఒకటుంది. నా దగ్గరకు వైద్యం కోసం వచ్చిన ముస్లిం యువతుల్లో చాలా మందికి చిన్న వయసులోనే ఎంతోమంది పిల్లలుండేవాళ్లు. ఇది తప్పని కానీ, ఒప్పని కానీ చెప్పలేను. ఇది ఆలోచించాల్సిన విషయం అని మాత్రం అనిపించింది. మహిళలకు ఆలోచించే అవకాశం కల్పించాలి. వారి ఆలోచనలను ఆచరణలో పెట్టగలిగిన వేదిక కల్పించాలని నిర్ణయించుకున్నాను. నా ఆలోచనలకు హార్వర్డ్లో ఉన్నప్పుడు ఒక రూపు వచ్చింది. లెడ్బై సంస్థను స్థాపించాను. మహిళలను ఉన్నత విద్యవైపు ప్రోత్సహించడంతోపాటు వారిలో నాయకత్వ లక్షణాలను ప్రోదిగొల్పడానికి వర్క్ షాపులు నిర్వహిస్తున్నాను. అడ్వైజరీ ఫ్రేమ్వర్క్తోపాటు పూర్తి స్థాయిలో శిక్షణ కూడా ఇప్పిస్తున్నాను. ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసిన 24 మందితో నాలుగు నెలల తొలి విడత కోర్సు పూర్తయింది. కోవిడ్ కారణంగా సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలన్నీ ఆన్లైన్లోనే పూర్తి చేయాల్సి వచ్చింది. భారతీయ మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ లెడ్బై సంస్థను ఆన్లైన్లో సంప్రదించవచ్చు. ఇండియాలో ఇలాంటి ప్రయత్నం ఇంతకు మునుపు జరగలేదు, ఇదే తొలి ప్రయత్నం’’ అని చెప్పింది డాక్టర్ రుహా షాదాబ్. -
ట్రిమ్మర్కు బదులు కండోమ్స్ ప్యాకెట్లు!
కోల్సిటీ(రామగుండం): ఆన్లైన్ సంస్థల మోసం మరోసారి వెలుగు చూసింది. గడ్డం గీసుకోవడానికి ఉపయోగించే ఎలక్ట్రిక్ షేవర్ (ట్రిమ్మర్) మిషన్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే... కస్టమర్కు కండోమ్ ప్యాకెట్లు పంపించిన విడ్డూరమైన సంఘటన గోదావరిఖనిలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... గోదావరిఖని లక్ష్మీనగర్లో ఎనగందుల శ్రీనివాస్ సెలూన్నిర్వహిస్తున్నాడు. కస్టమర్లకు మెరుగైన సేవలందించడం కోసం ఇటీవల ఎలక్ట్రిక్షేవర్ మిషన్ కొనుగోలు చేయాలని స్మార్ట్ఫోన్ ద్వారా ఓ ప్రముఖ ఆన్లైన్ కంపెనీలో ఆర్డర్ చేయడంతో పంపించారు. షేవర్ను వాడకముందే అది పని చేయలేదు. దీంతో ఆన్లైన్ సంస్థకు ఫిర్యాదు చేయడంతో, షేవర్ను స్వాధీనం చేసుకొని డబ్బులు తిరిగి పంపించారు. సదరు కంపెనీపై నమ్మకం ఏర్పడడంతో ఈనెల 11న మరో షేవర్ మిషన్ కొనుగోలుకు అదే సంస్థకు ఆర్డర్ ఇచ్చారు. ఆదివారం కొరియర్ బాయ్ ఇంటికి వచ్చి పార్సిల్ ఇచ్చాడు. తీరా దాన్ని తెరిచి చూడగా దాంట్లో కండోమ్ ప్యాకెట్లు కనిపించాయి. విస్తూపోయిన బాధితుడు హుటాహుటిన సదరు కొరియర్ కార్యాలయానికి వెళ్లి నిలదీశాడు. తమకు సంబంధం లేదని, ఆర్డర్ ఇచ్చిన ఆన్లైన్ సంస్థకే ఫిర్యాదు చేయాలని చెప్పి తప్పించుకున్నారు. దీంతో సదరు సంస్థకు ఆన్లైన్లో ఫిర్యాదు చేయడంతో, ఆర్డర్ చేసిన వస్తువుకు మరోసారి పరిశీలించి పంపిస్తామని అప్పటి వరకు డబ్బులు తిరిగి ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. కస్టమర్ చేతికి రిటన్ ఆర్డర్గా బుక్ చేసిన షేవింగ్ మిషన్ పార్సిల్ వచ్చాక, కండోమ్ ప్యాకెట్లను తిరిగి పంపించాలని సంస్థ ప్రతినిధులు సూచించారని బాధితుడు తెలిపాడు. తక్కవ ధరలో లభిస్తున్నాయనే ఆశతో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇలాంటి మోసాలే జరుగుతాయని పలువురు వెల్లడిస్తున్నారు. అయితే ఇలాంటి మోసాలపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. -
పని చేస్తున్న సంస్థకే కన్నం
బంజారాహిల్స్ : పని చేస్తున్న సంస్థకు కన్నం వేసి పోలీసులకు చిక్కాడు ఓ ప్రబుద్ధుడు. జూబ్లీహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ముత్తు తెలిపిన వివరాల ప్రకారం.. బాలానగర్ నేతాజినగర్ కాలనీలో ఉన్న ఫతేనగర్ చర్చి స్ట్రీట్లో నివసించే వాయిల వెంకటేశ్వర్లు అలియాస్ విక్కి(23) సేల్స్ ఎగ్జిక్యూటీవ్గా పని చేస్తున్నాడు. ఆయన పని చేస్తున్న కంపెనీలో ప్రతిరోజూ డబ్బు లావాదేవీలు జరుగుతుంటాయి. గత నెల 18వ తేదీన ఎవరూ లేని సమయంలో క్యాష్ కౌంటర్లో నుంచి రూ. 2.50 లక్షలు దొంగిలించి పరారయ్యాడు. సంస్థ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా సీసీ ఫుటేజీ ఆధారంగా ఈ డబ్బు దొంగిలించినట్లు తేలింది. ఆయన్ను అరెస్టు చేసి రూ. 1.91 లక్షల నగదుతో పాటు ఒక ట్యాబ్ను పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వరంగల్లో వందేమాతరం