Panakam
-
రామయ్యకు నైవేద్యంగా వడపప్పు, పానకమే ఎందుకు?
శ్రీరామ నవమి అనంగానే తాటాకు పందిళ్లు రాములోరి కళ్యాణ ఘట్టం. కొన్ని గ్రామాల్లో అయితే తిరునాళ్లు కూడా చేసుకుంటారు. ఈ రోజు కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం జరిగిన వెంటనే పానకం, వడపప్పు పంచి పెడతారు. ఈ ప్రసాదాన్ని ఎవ్వరు మిస్ చేసుకోరు. ఆ టైం కల్లా వచ్చి ప్రసాదం అందుకుంటారు. వీధివీధుల్లో ఈ తంతు, కోలాహాలం కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రీరామునికి నైవేద్యంగా పెట్టే వాటిలో పానకం, వడపప్పు ప్రత్యేకమైనవి. ఎందుకు శ్రీరామనవమి రోజు పానకం ఇస్తారు? వడపప్పును నైవేద్యంగా నివేదిస్తారు? అంటే.. అందుకు ఆధ్యాత్మిక, శాస్త్రీయ దృక్కోణాలు రెండూ ఉన్నాయని పలువురు పండితులు చెబుతున్నారు. శ్రీరామచంద్రమూర్తికి బెల్లమన్నా, పానకం అన్నా ఇష్టమని, శ్రీరామచంద్రుడు స్వయంవరానికి వచ్చిన సమయంలో ఆయనకు బెల్లం పానకం ఇచ్చారని చెబుతారు . అప్పట్లో వేసవిలో బాటసారులకు వడదెబ్బ తగలకుండా బెల్లం పానకాన్ని ఇచ్చేవారట. ఇక ఈ క్రమంలోనే స్వయంవరానికి వెళ్లిన శ్రీరామచంద్రుడికి కూడా బెల్లం పానకాన్ని ఇచ్చినట్లు చెబుతారు. ఈ క్రమంలోనే పానకాన్ని శ్రీరాముడి వారసత్వంగా స్వీకరించి ఆయనకు పానకంతో నివేదన చేస్తారు. ఆపై ప్రసాదంగా అందరికీ పంచుతారు. ఆరోగ్య ప్రయోజనాలు.. ఇక శాస్త్రీయ కోణంలో చూసినట్లయితే ఎండలు ముదిరే సమయంలో శ్రీరామనవమి వస్తుంది. కాబట్టి ఉష్ణోగ్రతను తగ్గించడానికి బెల్లం పానకం మంచి ఔషధంగా పనికి వస్తుంది. కాబట్టి బెల్లం పానకాన్ని స్వామి కళ్యాణానికి వచ్చిన వారందరికీ ప్రసాదంగా పంచి పెడతారు. అందులో మిరియాలు కలపడం వల్ల కఫాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. బెల్లం మనలో ఐరన్ లోపాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది. ఇక వడపప్పు మలబద్ధకాన్ని తొలగించి, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంతేగాదు రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు జీర్ణక్రియనూ వృద్ధి చేస్తుంది. ఏడాదికి ఒక్కసారైనా ఇటువంటి ఔషధయుక్తమైన ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. పిబరే రామరసం! రామనామం పాలుమీగడలు, పంచదారతేనెల కంటే కూడా కడు తీయని రసం! నవమి వేడుకల నైవేద్యమైన పానకం కూడా రామనామమంత మధురంగా ఉంటుంది. ఇక వడపప్పు రుచి మనకు తెలిసిందే! ఈ రెండు నైవేద్యాలకూ అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. (చదవండి: నవమి రోజే సీతారాముల కళ్యాణం చేస్తారు ఎందుకు..?) -
నైవేద్యంగా పానకం... వడపప్పు ఎందుకు?
శ్రీరామనవమి రోజు దేవుడికి పానకం, వడపప్పు నైవేద్యంగా పెడతారు. ఈ ప్రసాదాల వెనుక ఆయుర్వేదిక పరమార్థం కూడా ఉంది. శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది కాబట్టి శ్రీరాముడిని పూజించిన తరువాత కొత్తకుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి పంచి పెడతారు. భగవంతుడికి నివేదించే ప్రసాదాలు అన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ, ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అదే కాకుండా పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. అలాగే పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి పరుస్తుంది. అంతేకాదు... ఇది దేహకాంతి, జ్ఞానానికి ప్రతీక కూడా. పెసరపప్పునే వడపప్పు అంటారు ఇది మండుతున్న ఎండలలో ‘వడదెబ్బ’ కొట్టకుండా కాపాడుతుంది. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది కాబట్టి వడపప్పు తినడం వల్ల బుధుడి అనుగ్రహం లభిస్తుంది. పానకం కావలసినవి: నీళ్లు – ఆరు కప్పులు, బెల్లం తరుగు – ఒకటిన్నర కప్పు, మిరియాలు – ముప్పై, యాలకులు – ఆరు, శొంఠి – ముప్పావు టీస్పూను, నిమ్మకాయ – మూడు చెక్కలు, తులసి ఆకులు – గుప్పెడు, ఉప్పు – చిటికెడు, పచ్చకర్పూరం – చిటికెడు. తయారీ... ► ముందుగా మిరియాలు, యాలకులను విడివిడిగా దంచి పొడిచేసుకుని జల్లెడ పట్టి పక్కన పెట్టుకోవాలి. ► పానకం తయారీ గిన్నెలో నీళ్లు పోసి అందులో ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లం వేయాలి. బెల్లం నీటిలో కరిగేంత వరకు చక్కగా కలుపుకోవాలి ► ఇప్పుడు మిరియాలపొడి, ఉప్పు, పచ్చకర్పూరం వేయాలి. తులసి ఆకులను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి వేయాలి. ► నిమ్మరసం, శొంఠి పొడి వేసి బాగా కలిపితే పానకం రెడీ. వడపప్పు కావలసినవి: పొట్టుతీసిన పెసర పప్పు – ఒకటిన్నర కప్పులు, పచ్చిమిర్చి – ఒకటి(సన్నగా తరగాలి), పచ్చికొబ్బరి తురుము – మూడు టేబుల్ స్పూన్లు, మామిడికాయ ముక్కలు – పావు కప్పు, కీరా తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – టీస్పూను, నిమ్మరసం – టీస్పూను. తయారీ... ► ముందుగా పెసరపప్పుని శుభ్రంగా కడిగి గంటపాటు నానబెట్టుకోవాలి. ► నానబెట్టిన పప్పులో నీళ్లు వంపేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. దీనిలో పచ్చిమిర్చి, పచ్చికొబ్బరి తురుము, మామిడికాయ ముక్కలు, కీరా తరుగు, కొత్తిమీర తరుగు వేసి కలపాలి ► చివరిగా ఉప్పు, నిమ్మరసం వేసి కలిపితే వడపప్పు రెడీ. చలిమిడి కావలసినవి: రాత్రంతా నానబెట్టిన బియ్యం – కప్పు, పంచదార పొడి – ముప్పావు కప్పు, పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – అరటీస్పూను, పాలు – మూడు టేబుల్ స్పూన్లు, నెయ్యి – టేబుల్ స్పూను. తయారీ.. ► తడిబియ్యాన్ని వడగట్టుకుని..మిక్సీజార్లో వేసి పొడిచేసుకోవాలి. ఈ పిండిని మెత్తగా జల్లెడ పట్టుకోవాలి. ► జల్లెడ పట్టి తీసిన మెత్తటి బియ్యప్పిండిని ఒక గిన్నెలో తీసుకుని పచ్చికొబ్బరి తురుము, పంచదార పొడి, యాలకుల పొడి వేసి కలపాలి. ► ఈ మిశ్రమంలో నెయ్యి, పాలు పోసి ముద్దలా కలుపుకోవాలి. ► ఈ ముద్దను పానకం, వడపప్పుతో దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. – డి.వి.ఆర్. భాస్కర్ -
Summer Tips: పానకంలో ఏలకులు, మిరియాలు, అల్లం వంటివి చేర్చితే!
Bellam Panakam: సంప్రదాయ వేసవి పానీయాల్లో పానకానిది ప్రత్యేక స్థానం. ఇది అచ్చమైన తెలుగు పానీయం. బెల్లంతో తయారు చేసే పానకాన్ని పూజల్లో నైవేద్యంగా కూడా పెడతారు. ముఖ్యంగా వేసవి ప్రారంభంలో వచ్చే శ్రీరామనవమి రోజున రాములవారికి వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. ఇక బెల్లం పానకంలో ఏలకులు, మిరియాలు, అల్లం వంటివి చేర్చడం వల్ల పానకానికి అదనపు రుచి వస్తుంది. వేసవితాపం నుంచి ఉపశమనం కలిగించే పానకం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. తెలుగువారి పానకం మాదిరిగానే ఒడియా ప్రజలు ‘పొణా’ అనే పానీయాన్ని తయారు చేస్తారు. ఒడియా ప్రజల నూతన సంవత్సరం మేష సంక్రాంతి రోజున వస్తుంది. ఆ రోజున వీధి వీధినా చలివేంద్రాలను ఏర్పాటు చేసి, జనాలకు ఉచితంగా ‘పొణా’ను పంచిపెడతారు. అందువల్ల ఈ పండుగను ‘పొణా సంక్రాంతి’ అని కూడా అంటారు. ‘పొణా’ తయారీలో ప్రధానంగా నవాతుబెల్లాన్ని ఉపయోగిస్తారు.‘పొణా’లో పచ్చిమామిడి ముక్కలు, కొబ్బరికోరు, అరటిపండు ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వంటివి కూడా చేరుస్తారు. ‘పొణా’ సేవనంతోనే ఒడియా ప్రజలు వేసవికి స్వాగతం పలుకుతారు. చదవండి: Bad Habits: వాష్రూమ్ వాడి సరిగ్గా నీళ్లు కొట్టరు.. ఎలా చెప్తే మారతారు మగాళ్లు? -
పానకం, వడపప్పే ఎందుకు?
శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది కాబట్టి శ్రీరాముడిని పూజించిన తరువాత కొత్తకుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి పంచి పెడతారు. ఈ ప్రసాదాల వెనుక ఆయుర్వేదిక పరమార్థం కూడా ఉంది. భగవంతుడికి నివేదించే ప్రసాదాలు అన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ, ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అదే కాకుండా పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది.అలాగే పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి పరుస్తుంది, దేహకాంతినిస్తుంది. పెసరపప్పునే వడపప్పు అంటారు ఇది మండుతున్న ఎండలలో ‘వడదెబ్బ’ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుంది. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది కాబట్టి, దీనిని తీసుకోవడం వల్ల బుద్ధి వికసిస్తుందని పండితుల మాట. వడపప్పు తయారీ కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు; క్యారట్ తురుము – ఒక టేబుల్ స్పూను; పచ్చి మిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; నిమ్మరసం – 2 టీ స్పూన్లు; ఉప్పు – కొద్దిగా తయారీ: ∙ముందుగా పెసరపప్పును సుమారు మూడు గంటల సేపు నానబెట్టి, నీళ్లు ఒంపేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు, క్యారట్ తురుము, పచ్చి మిర్చి తరరగు, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి, సుమారు అర గంట తరవాత తింటే రుచిగా ఉంటుంది. పానకం తయారీ కావలసినవి: నీళ్లు – 4 కప్పులు; బెల్లం పొడి – రెండు కప్పులు; ఏలకుల పొడి – టీ స్పూను; మిరాయల పొడి – రెండు టీ స్పూన్లు. తయారీ: ∙ముందుగా ఒక పెద్ద పాత్రలో నీళ్లు, బెల్లం పొడి వేసి బెల్లం కరిగేవరకు బాగా కలపాలి ∙ఏలకుల పొడి, మిరియాల పొడి జత చేసి మరోమారు కలపాలి ∙ గ్లాసులోకి తీసుకుని తాగాలి. -
రామ నైవేద్యం
పానకం కావల్సినవి: బెల్లం తరుగు – 4 టేబుల్ స్పూన్లు నీళ్లు – 2 కప్పులు యాలకుల పొడి – చిటికెడు శొంఠి పొడి – చిటికెడు మిరియాల పొడి – చిటికెడు తయారీ: గిన్నెలో నీళ్లు పోసి, బెల్లం తరుగు వేసి కరిగించాలి. ఈ మిశ్రమాన్ని జల్లితో వడకట్టాలి. దీంట్లో యాలకుల పొడి, శొంఠి, మిరియాల పొడి కలపాలి. గ్లాసులో పోసి నివేదించాలి. వడపప్పు కావల్సినవి:పెసరపప్పు – పావు కప్పు; నీళ్లు – 2 కప్పులుమామిడికాయ ముక్కలు (సన్నగా తరగాలి) – టేబుల్స్పూన్; పచ్చిమిర్చి – 1 (బాగా సన్నగా తరగాలి); పచ్చికొబ్బరి ముక్కలు (సన్నగా తరగాలి) – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – చిటికెడు కొత్తిమీర తరుగు – అర టీ స్పూన్ తయారీ: పెసరపప్పును 2 గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి. తర్వాత నీళ్లను వడకట్టాలి. ఈ పప్పులో సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, పచ్చికొబ్బరి ముక్కలు, ఉప్పు, కొత్తిమీర తరుగు కలపాలి. నోట్: ఏవీ కలపకుండా నానబెట్టిన పెసరపప్పును కూడా నివేదించవచ్చు. -
ఎంతో రుచిరా..!
కదళీఫలం (అరటిపండు) మధురం. ఖర్జూరం మృదు మధురం. నవరస పరమాన్న నవనీతాలు మధురాతి మధురం. కానీ భక్తరామదాసు ఒప్పుకోడు! రామనామాన్ని మించిన మధురం లేదంటాడు. ఎందుకు లేదూ... ఉంది! శ్రీరాముడిపై రామదాసు భక్తి!! ఇవాళ శ్రీరామనవమి. భక్తితో పానకం చేసినా, అరటి పూరీ చేసినా అది మధురమే. పానకం కావలసినవి: బెల్లం తురుము - 3 కప్పులు; నీళ్లు - 5 కప్పులు; శొంఠి పొడి - అర టీ స్పూను; మిరియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - టీ స్పూను; ఉప్పు - పావు టీ స్పూను; నిమ్మరసం - టేబుల్ స్పూను; తయారీ: ఒక పెద్ద పాత్రలో నీళ్లు, బెల్లం తురుము వేసి బాగా కరిగే వరకు కలపాలి ఉప్పు, నిమ్మరసం వేసి మరో మారు కలపాలి శొంఠి పొడి, మిరియాల పొడి, ఏలకుల పొడి వేసి బాగా కలిపి గ్లాసులలో అందించాలి. దోసకాయ కోసుమల్లి కావలసినవి: పెసర పప్పు - అరకప్పు; దోసకాయ లేదా కీర దోస కాయ - 1 (తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి); నిమ్మరసం - 3 టీ స్పూన్లు; ఉప్పు - అర టీ స్పూను; కొత్తిమీర - చిన్న కట్ట (శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి); నెయ్యి - టీ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; ఇంగువ - చిటికెడు; తాజా కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు. తయారీ పెసర పప్పును శుభ్రంగా కడిగి సుమారు రెండు గంటల సేపు నానబెట్టి, జల్లెడ వంటి దానిలో వడకట్టి సుమారు పది నిమిషాలు అలాగే ఉంచేయాలి. (పూర్తిగా నీళ్లు పోవాలి) ఒక పాత్రలో తరిగిన దోసకాయ ముక్కలు, నిమ్మరసం, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలపాలి చిన్న గుంట గరిటెలో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ఇంగువ జత చేసి బాగా కలిపి దోసకాయ ముక్కలు ఉన్న గిన్నెలో వేయాలి తాజాకొబ్బరి తురుముతో అలంకరించి అందించాలి. అరటిపండు పూరీ కావలసినవి: అరటిపండ్ల గుజ్జు - అర కప్పు; పంచదార - అర కప్పు; నెయ్యి - టేబుల్ స్పూను (కరిగించినది); ఏలకుల పొడి - పావు టీ స్పూను; ఉప్పు - చిటికెడు; బాదం పప్పుల తురుము - 3 టేబుల్ స్పూన్లు; గోధుమపిండి - ముప్పావు కప్పు; మైదా పిండి - ముప్పావు కప్పు; నూనె - వేయించడానికి తగినంత. తయారీ ఒక పాత్రలో అరటిపండ్ల గుజ్జు, పంచదార, బాదం పప్పుల తురుము, కరిగించిన నెయ్యి, ఉప్పు, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి గోధుమపిండి, మైదా పిండి జత చేసి బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని చపాతీ పిండిలా తయారుచేసి సుమారు రెండు గంటల సేపు పక్కన ఉంచాలి చేతికి నూనె కాని నెయ్యి కాని రాసుకుని పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, చిన్న చిన్న పూరీల మాదిరిగా అప్పడాల పీట మీద ఒత్తాలి బాణలిలో నూనె కాగాక ఒక్కో పూరీ వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి. (ఇవి ఒక్కొక్కటీ వేగడానికి సుమారు రెండు నిమిషాలు పడుతుంది) వీటిని వేడివేడిగా అందించాలి.