result release
-
టీజీసెట్–2024 ఫలితాల విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ: అధ్యాపక ఉద్యోగాల అర్హత పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్–2024 (టీజీసెట్–2024) ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ శనివారం విడుదల చేశారు. ఫలితాలను http://telanganaset.org అనే వెబ్సైట్లో చూడవచ్చు. గత సెప్టెంబర్లో జరిగిన పరీక్షకు 26,294 మంది అభ్యర్థులు హాజరుకాగా 1,884 మంది (7.17 శాతం) అర్హత సాధించారు. అందులో 50.21 శాతం పురుషులు కాగా 49 శాతం మహిళలున్నారు. అర్హులైన అభ్యర్థుల సర్టిఫికెట్లను త్వరలో పరిశీలించనున్నట్టు అధికారులు తెలిపారు. -
పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో 94.57 శాతం పాస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎనిమిది విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలోని పోస్టు–గ్రాడ్యుయేట్ కాలేజీల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగేట్) ఫలితాలను శుక్రవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి విడుదల చేశారు. సెట్లో 94.57 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించినట్టు ఆయన వెల్లడించారు. మొత్తం 45 కోర్సులకు సంబంధించిన ఈ సెట్ను గత నెల 6 నుంచి 16వ తేదీ వరకూ నిర్వహించారు. 73,342 మంది పరీక్షకు దరఖాస్తు చేస్తే, 64,765 మంది పరీక్షకు హాజరయ్యారు.వీరిలో 61,246 మంది (94.57 శాతం) ఉత్తీర్ణులయ్యారు. పీజీ సెట్ పరీక్ష రాసిన వారు, అర్హత సాధించిన వారిలో బాలికలే ఎక్కువగా ఉన్నారు. బాలురు 21,757 మంది పరీక్ష రాస్తే, 20,569 మంది పాసయ్యారు. బాలికలు 43,008 మంది రాస్తే 40,677 మంది పాసయ్యారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రొఫెసర్ మహమూద్, ఉస్మానియా యూనివర్సిటీ రిజి్రస్టార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, సెట్ కనీ్వనర్ పాండు రంగారెడ్డి పాల్గొన్నారు. 12 నుంచి కౌన్సెలింగ్: ఉమ్మడి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఈ నెల 12 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు సెట్ కనీ్వనర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు. విద్యార్థులు సరి్టఫికెట్లను ఆన్లైన్లో వెరిఫికేషన్ కోసం అప్లోడ్ చేయాలని సూచించారు. కాలేజీల్లో చేరేటప్పుడు మాత్రమే ఒరిజినల్ సరి్టఫికెట్లు ఇవ్వాలని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 42,192 పీజీ సీట్లున్నాయని, ఈ సంవత్సరం మరో 2 వేల సీట్లు అదనంగా వచ్చే వీలుందని తెలిపారు. 278 కాలేజీలు కౌన్సెలింగ్ పరిధిలోకి వస్తాయని వెల్లడించారు. -
ఒకే సెంటర్లో 85 శాతం మందికి అర్హత
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నీట్–యూజీ ఫలితాలను పరీక్షా కేంద్రాలు, నగరాల వారీగా శనివారం విడుదల చేసింది. ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో తీసుకొచి్చంది. ఈ ఫలితాలను పరిశీలిస్తే విస్మయకరమైన అంశాలు బయటపడుతున్నాయి. గుజరాత్లోని రాజ్కోట్లో ఒకే పరీక్షా కేంద్రంలో నీట్ రాసిన అభ్యర్థుల్లో ఏకంగా 85 శాతం మంది అర్హత సాధించినట్లు తెలుస్తోంది. రాజ్కోట్లోని యూనిట్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ సెంటర్లో 22,701 మంది నీట్ రాశారు. వీరిలో 85 శాతం అర్హత సాధించారు. ఈ సెంటర్లో 12 మంది 700కు పైగా, 115 మంది 650కిపైగా, 259 మంది 600కు పైగా, 403 మంది 550కిపైగా స్కోర్ సాధించారు. అలాగే రాజస్తాన్లోని విద్యాభారతి శిఖర్ సెంటర్లో పరీక్ష రాసినవారిలో కూడా చాలామందికి మెరుగైన స్కోర్ లభించింది. అక్కడ 8 మంది 700కు పైగా, 69 మంది 650కిపైగా, 155 మంది 600కుపైగా, 241 మంది 500కు పైగా స్కోర్ సాధించారు.హరియాణాలోని రోహ్తక్లో మోడల్ స్కూల్ సెంటర్లో పరీక్ష రాసిన వారిలో 45 మంది అభ్యర్థులకు 600కుపైగా స్కోర్ లభించింది. హరియాణాలోని ఝాజ్జర్లో హర్ద యాల్ పబ్లిక్ స్కూల్ సెంటర్లో ఇంతకముందు ఆరుగురు అభ్యర్థులకు 720కి 720 స్కోర్ దక్కింది. గ్రేసు మార్కులను తొలగించి, ఫలితాలను సవరించిన తర్వాత ఈ సెంటర్లో 13 మంది అభ్యర్థులు 600కుపైగా స్కోర్ సాధించారు. 682 స్కోర్ ఎవరికీ దాటలేదు. నీట్ కేసులో మరో ముగ్గురి అరెస్టు నీట్ పేపర్ లీక్ కేసులో సూత్రధారుల్లో ఒకరిగా భావిస్తున్న వ్యక్తిని సీబీఐ అధికారులు శనివారం అరెస్టు చేశారు. అతడిని ఎన్ఐటీ–జంòÙడ్పూర్ బీటెక్ గ్రాడ్యుయేట్ శశికాంత్ పాశ్వాన్ అలియాస్ శశిగా గుర్తించారు. అలాగే ఇదే కేసులో ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటిదాకా అరెస్టయిన వారి సంఖ్య 21కి చేరుకుంది. -
ఎస్ఎస్సీ, ఇంటర్ ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ఫలితాలను సోమవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులకు ఈ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. జూన్ ఒకటో తేదీ నుంచి 8 వరకు ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహించారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 15,058 విద్యార్థులు హాజరు కాగా, 9,531 మంది (63.30 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మిడియట్ పరీక్షలకు 27,279 విద్యార్థులు హాజరు కాగా 18,842 మంది (69.07 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వెబ్సైట్ https://apopenschool.ap.gov.in/ చూడవచ్చని ఓపెన్ స్కూల్ డైరెక్టర్ కె.నాగేశ్వర్రావు తెలిపారు. మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీ కౌంటింగ్ కోసం సబ్జెక్టుకు రూ.200, రీ వెరిఫికేషన్ కోసం సబ్జెక్టుకు రూ.1000 చొప్పున చెల్లించి ఈ నెల 8వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
గ్రూప్–2 ఫలితాల విడుదల
సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్–2 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) బుధవారం విడుదల చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన 45 రోజుల రికార్డు వ్యవధిలోనే ఫలితాలను కూడా వెల్లడించింది. మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. గత ఏడాది డిసెంబర్ 7న ఏపీపీఎస్సీ గ్రూప్–2 నోటిఫికేషన్ జారీ చేయగా.. 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ముందే ప్రకటించిన షెడ్యూల్ మేరకు ఫిబ్రవరి 25న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు 4,04,039 మంది (87.17 శాతం) హాజరయ్యారు. సర్విస్ కమిషన్ గతంలో నిర్వహించిన గ్రూప్–2తో పాటు ఇతర పరీక్షలకు గరిష్టంగా 70 శాతం మాత్రమే హాజరవగా, ఈ ఏడాది ప్రిలిమ్స్కు మాత్రం భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరు కావడం గమనార్హం. తొలుత మెయిన్స్కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని కమిషన్ నిర్ణయించింది. అయితే, నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఏపీపీఎస్సీకి అందిన విజ్ఞప్తుల మేరకు ఎక్కువ మందికి మెయిన్స్ రాసేందుకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఒక పోస్టుకు 100 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేశారు. ఏపీపీఎస్సీ డిసెంబర్ 7వ తేదీన 897 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి 21 నుంచి జనవరి 10వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించింది. అనంతరం మరో 8 పోస్టులు నోటిఫికేషన్కు కలిపారు. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 905కి పెరిగాయి. పెరిగిన పోస్టుల ఆధారంగా మెయిన్స్కు మొత్తం 92,250 మందిని ఎంపిక చేశారు. గ్రూప్–2 మెయిన్స్ పరీక్షను జూలై 28న నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. సర్విస్ కమిషన్ పరీక్షల నిర్వహణలో అనేక సవాళ్లు, ఆటంకాలు ఎదురయ్యాయని, అయినా.. గ్రూప్–2, గ్రూప్–1 ప్రిలిమ్స్ను విజయవంతంగా నిర్వహించామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ప్రభుత్వం అందించిన పూర్తి సహకారంతో తక్కువ సమయంలోనే గ్రూప్–2 ప్రిలిమ్స్ ఫలితాలను సైతం ప్రకటించామని ఆయన తెలిపారు. 92,250 మందికి మెయిన్స్కి చాన్స్ 2018లో నిర్వహించిన గ్రూప్–2 ప్రిలిమ్స్ రాసినవారి నుంచి 1:12 నిష్పత్తిలో మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయగా.. ఈసారి ఎక్కవ సంఖ్యలో 92,250 మంది అభ్యర్థులకు మెయిన్స్ రాసే ఛాన్స్ లభించింది. గ్రూప్ పరీక్షలకు 1:100 విధానంలో ఎంపిక చేయడం సర్విస్ కమిషన్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా, కమిషన్ ప్రకటించిన గ్రూప్–2 నోటిఫికేషన్లో 114 డిప్యూటీ తహసీల్దార్, 150 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, గ్రేడ్–3 మునిసిపల్ కమిషనర్ పోస్టులు 4, గ్రేడ్–2 సబ్ రిజి్రస్టార్ 16, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 28 పోస్టులతో కలిపి 59 శాఖల్లో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఏఓ), సీనియర్ ఆడిటర్, ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్, వివిధ సెక్షన్లలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 566 ఉన్నాయి. కాగా, ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే మెయిన్స్ పరీక్షలో పేపర్–1, పేపర్–2 150 చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. పూర్తి వివరాలకు కమిషన్ వెబ్సైట్ http://www.psc.ap.gov.in లో చూడవచ్చు. నిరుద్యోగులకు ఎంతో మేలు గ్రూప్–2 ప్రిలిమ్స్ పరీక్షను అడ్డుకునేందుకు ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆవేమీ ఫలించలేదు. ఇంత తక్కువ సమయంలో ఫలితాలను ప్రకటించడం చాలా గొప్ప విషయం. నిరుద్యోగుల పట్ల సీఎంకు చిత్తశుద్ధి ఉంది. చెప్పిన సమయానికి ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు 1:100 నిష్పత్తిలో గ్రూప్–2 మెయిన్స్కు ఎంపిక చేయడం అభినందనీయం. చరిత్రలో ఇంతమంది నిరుద్యోగులకు అవకాశం కల్పించడం ఇదే ప్రథమం. ఈ అవకాశం ఇచ్చిన సీఎం జగన్కు కృతజ్ఞతలు. – వై.రామచంద్ర, అధ్యక్షుడు, నిరుద్యోగ ఐక్య సమితి -
‘కానిస్టేబుల్’ తుది ఫలితాల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపికకు సంబంధించిన తుది ఫలితాలు వెలువడ్డాయి. అన్ని పరీక్షల అనంతరం పోలీస్కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారి వివరాలు గురువారం ఉదయం టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్లో ఉంచుతామని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామకబోర్డు (టీఎస్ఎలీ్పఆర్బీ) వెల్లడించింది. మొత్తం 13 కేటగిరీల్లో 16,604 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా, దరఖాస్తు చేసుకున్న వారిలో 15,750 మందిని ఎంపిక చేసినట్టు టీఎస్ఎలీ్పఆర్బీ చైర్మన్ వీవీ.శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైనవారిలో 12,866 మంది పురుషులుకాగా, 2,884 మంది మహిళలు ఉన్నారు. ఈ ఏడాది జూన్ 3, 4 వారాల్లో రాష్ట్రంలోని 18 కేంద్రాల్లో నిర్వహించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్లో భాగంగా అభ్యర్థుల విద్యార్హతలు, రిజర్వేషన్లు, స్థానికత, వయసు మినహాయింపు, ఇతర అంశాలు పరిశీలించామని, దీంతోపాటు శారీరక సామర్థ్య పరీక్ష, ట్రేడ్ టెస్టు, తుది రాత పరీక్ష అనంతరం అన్నింటిని పరిగణనలోకి తీసుకొని వీరిని ఎంపిక చేసినట్టు ఆ ప్రకటనలో శ్రీనివాసరావు తెలిపారు. కోర్టు కేసులు, ఇతర సాంకేతిక కారణాలతో 854 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయలేదు. అటెస్టేషన్ ఎలా చేయాలంటే...! బోర్డు వెల్లడించిన ప్రకారం తుది ఫలితాల్లో ఎంపికైన అభ్యర్థులు ఆన్లైన్లో అటెస్టేషన్ ఫారం తీసుకోవాలి. టీఎస్ఎలీ్పఆర్బీ వెబ్సైట్లో అభ్యర్థుల లాగిన్లో ఈనెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వెబ్ టెంప్లేట్ రూపంలో ఈ ఫారంలు అందుబాటులో ఉంటాయి. వీటిని డిజిటల్గా పూర్తిచేసిన తర్వాత పీడీఎఫ్ రూపంలో మూడు సెట్లు ప్రింట్లు ఏ4 సైజు పేపర్పై ఒకవైపు మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకున్న మూడు సెట్లపై అభ్యర్థులు సంతకాలు చేసి, రెండు పాస్పోర్టు ఫొటోలు అతికించి, గెజిటెడ్ ఆఫీసర్తో ధ్రువీకరణ సంతకం తీసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం సంబంధిత డాక్యుమెంట్లను పొందుపరిచి ఈనెల 12,13 తేదీల్లో నిర్దేశిత కేంద్రాల్లో సమర్పించాలి. సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లు ఈనెల 12న ఎస్పీ/ కమిషనర్ కార్యాలయాల్లో, ఎస్పీఎఫ్, ఎస్ఏఆర్, మెకానిక్, ట్రాన్స్పోర్టు (హెచ్ఓ) కానిస్టేబుళ్లు ఈనెల 13న హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయంలో, మిగిలిన అభ్యర్థులు 13న ఆయా జిల్లాల ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయాల్లో అటెస్టేషన్ ఫారంలు సమర్పించాలి. సందేహాల నివృత్తికి అవకాశం తుది రాత పరీక్షలు క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియలో సందేహాలు, వాటిని నివృత్తికి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు అవకాశం కల్పించింది. ఈనెల 5వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో అభ్యర్థుల లాగిన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ స్థానికులైన ఎస్సీ, ఎస్టీలు రూ.1000, ఇతరులు రూ.2000 ఫీజు చెల్లించాలి. కేవలం ఆన్లైన్ ద్వారానే ఎంపిక ప్రక్రియకు సంబంధించిన సందేహాలు నివృత్తి చేసుకోవాల్సి ఉంటుందని, ఎలాంటి వ్యక్తిగత వినతులకు అవకాశం లేదని బోర్డు స్పష్టం చేసింది. -
ఈసెట్లో 93 శాతం ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: పలు డిప్లొమా కోర్సులు పూర్తిచేసి, ఇంజనీరింగ్ ద్వితీ య సంవత్సరంలో ప్రవేశానికి గత నెలలో నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ ఈసెట్–2003) ఫలితాల ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫె సర్ ఆర్.లింబాద్రి మంగళవారం విడుదల చేశారు. ఈ పరీక్షలో 20,988 మంది (93.07 శాతం) అర్హత సాధించారని వెల్లడించారు. ఉత్తీర్ణత సాధించినవారి లో 14,415 మంది పురుషులు, 6,484 మంది మహిళలు ఉన్నారు. బీఎస్సీ (మ్యాథ్స్), కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రాని క్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికే షన్ ఇంజనీరింగ్, ఇనుస్ట్రు మెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్, మెటలర్జికల్, మైనింగ్, ఫార్మసీ బ్రాంచీల్లో 9 వేల సీట్లు ఉన్నా యని, వీటికి త్వరలో కౌన్సెలింగ్ చేపడతామని లింబాద్రి తెలిపారు. విలే కరుల సమావేశంలో ఈసెట్ కన్వీనర్ శ్రీరాం వెంకటేష్, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్, ఓయూ వీసీ డి.రవీందర్ పాల్గొన్నారు. -
ఏపీ ‘గురుకుల’ ఫలితాల వెల్లడి
సాక్షి,అమరావతి/గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలోని 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను గురువారం అధికారులు విడుదల చేశారు. ఈ సంస్థ పరిధిలో 38 పాఠశాలలు, 7 జూనియర్ కాలేజీలు, ఒక డిగ్రీ కళాశాల ఉన్నాయి. 2023–24 విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో ఉన్న 3,195 సీట్లకు, 6, 7, 8 తరగతుల్లో మిగిలి ఉన్న 356 ఖాళీల భర్తీకి, ఇంటర్లోని ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ/సీఈసీ విభాగాల్లో ఉన్న 1,149 సీట్లకు, డిగ్రీలోని బీఏ, బీకాం, బీఎస్సీలోని 4,852 సీట్లకు గత నెల 20న ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి ఆర్.నరసింహారావు తెలిపారు. విద్యార్థుల ర్యాంకులను వారి మొబైల్ నంబర్లతో పాటు వారి పాఠశాలలకు కూడా పంపించామని, https://aprs.apcfss.in వెబ్సైట్లో కూడా ఉంచామన్నారు. మొత్తం అన్ని విభాగాల్లోను 87,252 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు వివరించారు. వీరికి ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించి అర్హులైనవారికి ప్రవేశాలు కల్పిస్తామన్నారు. కాగా, 12 మైనార్టీ పాఠశాలలు, 3 జూనియర్ కాలేజీల్లో మైనార్టీ విద్యార్థులకు ప్రవేశ పరీక్షతో సంబంధం లేకుండా నేరుగా అడ్మిషన్లు చేపడతామని చెప్పారు. తొలి స్థానంలో నిలిచింది వీరే.. గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలకు 100 మార్కులకు, ఇంటర్, డిగ్రీ కాలేజీ ఎంట్రన్స్ టెస్ట్ 150 మార్కులకు నిర్వహించారు. వీరిలో అత్యధిక మార్కులు సాధించి తొలి స్థానంలో నిలిచిన అభ్యర్థుల పేర్లను గురుకుల విద్యాలయ సంస్థ వెల్లడించింది. ♦ ఐదో తరగతి ప్రవేశ పరీక్షలో విజయనగరం జిల్లాకు చెందిన బి.దిలీప్ కృష్ణ 99 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆరో తరగతిలో పి.జితేంద్రకుమార్ (శ్రీకాకుళం జిల్లా), ఏడో తరగతిలో జీకే సాయిపవన్ (పశ్చిమ గోదావరి), ఎనిమిదో తరగతిలో కె.నవీన్ కుమార్ (కృష్ణా జిల్లా) మొదటి స్థానం సాధించారు. ♦ ఇంటర్ కేటగిరీలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కె.సాయి సృజన (ఎంపీసీ) 146 మార్కులు, టీ సాహితి (బైపీసీ) 140 మార్కులు, విజయనగరం జిల్లాకు చెందిన కేవీ.వంశీకృష్ణ నాయుడు (ఎంఈసీ/సీఈసీ) 133 మార్కులతో ప్రథమ స్థానం సాధించారు. ♦ డిగ్రీ విభాగంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె.అచ్యుతరావు (బీఏ), విజయనగరం జిల్లాకు చెందిన ఎం.జ్ఞానతేజ (బీకాం), టి.పునీత్ కుమార్ (బీఎస్సీ–ఎంఎస్సీఎస్), పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఎస్.తేజ (బీఎస్సీ–ఎంపీసీ) విభాగాల్లో మొదటి ర్యాంకులు సాధించారు. -
విద్యుత్ ఏఈ రాత పరీక్ష ఫలితాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో 70 అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి జూలై 17న నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను గురువారం సంస్థ యాజమాన్యం ప్రకటించింది. వివరాల కోసం సంస్థ వెబ్సైట్ (https:// www.tssouthernpower.com)ను చూడాలని అభ్యర్థులకు సూచించింది. -
ఐసెట్లో 90.09% ఉత్తీర్ణత
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఐసెట్–21 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, కేయూ వీసీ ఆచార్య తాటికొండ రమేష్, టీఎస్ఐసెట్ చైర్మన్ ఆచార్య కె.రాజిరెడ్డితో కలిసి విడుదల చేశారు. మొత్తం 66,034మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 56,962 మంది పరీక్ష రాశారు. వారిలో 51,316 మంది (90.09) ఉత్తీర్ణత సాధించారని లింబాద్రి తెలిపారు. పురుషుల విభాగంలో 28,848 మందికిగాను 26,057 మంది ఉత్తీర్ణత (90.33శాతం) సాధించారు. మహిళా విభాగంలో 28,111 మందికిగాను 25,256 మంది (89.84 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్జెండర్లు ముగ్గురు రాయగా, ముగ్గురూ ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ, ఏపీ కలిపి నిర్వహించిన ఈ పరీక్షలో హైదరాబాద్కు చెందిన ఆర్.లోకేష్ 155.36716 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ టి.పాపిరెడ్డి, కేయూ రిజిస్ట్రార్ బి.వెంకట్రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఐఏఎస్ కావాలనేది లక్ష్యం.. నేను ఐఏఎస్ కావాలనే లక్ష్యంగా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా. టీఎస్ఐసెట్ను సివిల్స్ ప్రిపరేషన్లో భాగంగా రాశాను. 155 మార్కులతో మొదటిర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నేను ఇప్పటికే బీటెక్ ఈసీఈ పూర్తిచేశాను. – ఆర్.లోకేష్, మొదటి ర్యాంకర్. బ్యాంకు మేనేజర్ కావాలనేది లక్ష్యం.. నేను బీటెక్ ఈఈఈ 2020లోనే పూర్తి చేశా. అప్పటినుంచి బ్యాంకు మేనే జర్ కావాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా. ఎంబీఏ కూడా చదువుకోవాలనే టీఎస్ఐసెట్ రాశాను. రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు వస్తుందని ఊహించలేదు. రెండో ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నేను ఓయూలో ఎంబీఏలో చేరుతా. – పామడి సాయి తనూజా, రెండో ర్యాంకర్. ఫైనాన్స్ మేనేజ్మెంట్లో చేరుతా.. నేను గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నా. ఐసెట్లో మూడవ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. సీబీఐటీలో ఫైనాన్స్ మేనేజ్మెంట్ కోర్సులో చేరతాను. – నవీనాక్షంత, మూడో ర్యాంకర్. -
బీటెక్, బీఫార్మసీ సప్లిమెంటరీ ఫలితాల విడుదల
జేఎన్టీయూ : జేఎన్టీయూ అనంతపురం పరిధిలో డిసెంబర్–2016లో జరిగిన బీటెక్, బీఫార్మసీ (ఆర్–15) మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు గురువారం విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సి.శశిధర్ తెలిపారు. మార్కుల వివరాల కోసం వర్సిటీ వెబ్పోర్టల్ను సంప్రదించాలని సూచించారు. -
ఛాలెంజింగ్ వాల్యుయేషన్ ఫలితాలు విడుదల
జేఎన్టీయూ : ఎంటెక్ రెండో సెమిస్టర్కు సంబంధించి ఛాలెంజింగ్ వాల్యుయేషన్ ఫలితాలు విడుదల చేశారు. వీటి ఫలితాలు 2016 ఆగస్టులో విడుదలయ్యాయి. ఏదైనా సబ్జెక్టు మార్కులు పెరుగుతాయనే భావించే విద్యార్థులు ఛాలెంజింగ్ వాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోనే అవకాశం ఉంది. దీంతో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.