reverse repo
-
ఆగస్టులో మరోమారు రేట్కట్?!
వచ్చే పరపతి సమీక్షా సమావేశం నాటికి ఆర్బీఐ మరో 35 శాతం మేర వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ ఇండియా అనలిస్టు కౌశిక్దాస్ అంచనా వేశారు. 2008 సంక్షోభానికి పూర్వం రివర్స్ రెపో 3.75 శాతం ఉండేదని, సంక్షోభానంతరం ఈ రేటను 3.25 శాతానికి తగ్గించారని గుర్తు చేశారు. ప్రస్తుత సంక్షోభం ఇంకా పెద్దది కావడం వల్ల రివర్స్ రెపోను మరో 0.35 శాతం తగ్గించి 3 శాతానికి పరిమితం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. తాజాగా ఆర్బీఐ తగ్గించిన రేట్ల ప్రకారం రెపో 4 శాతం, రివర్స్ రెపో 3.35 శాతానికి చేరాయి. ఆగస్టులో జరిగే తదుపరి ద్రవ్యపరపతి సమీక్షా సమావేశంలో కానీ, అంతకుముందే కానీ మరో 35 పాయింట్ల బేసిస్ పాయింట్ల తగ్గింపుంటుందని దాస్ చెప్పారు. బ్యాంకులు మరింత లిక్విడిటీ పెంచేలా ఆర్బీఐ రివర్స్ రెపో మార్గంపై పరిమితులుంచాలన్నారు. దీంతో పాటు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ తీసుకువస్తారన్న అంచనాలున్నాయని చెప్పారు. ఈ రెండు విషయాలను మార్కెట్ ఆశిస్తోందని, దీంతో పాటు త్వరలో విడుల చేసే ప్రభుత్వ బాండ్లను ఎవరు కొంటారన్న అంశమై స్పష్టత రావాలని ఆయన అన్నారు. ఆర్బీఐ నుంచి బాండ్ల కొనుగోలు ప్రకటన, వడ్డీరేట్ల తగ్గింపు ప్రకటన వస్తే మార్కెట్ సానుకూలంగా ఉండొచ్చన్నారు. ఎన్బీఎఫ్సీలకు బ్యాంకులు మరిన్ని రుణాలివ్వాలని ప్రభుత్వం నిధులను కేటాయిస్తున్నా బ్యాంకులు పెద్దగా ముందుకు రావడం లేదని, లిక్విడిటీపై ఇది ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. -
మారని రేట్లు.. వృద్ధికి చర్యలు
ముంబై: వడ్డీరేట్లను ప్రభావితం చేసే కీలకమైన రెపో రేటు, రివర్స్ రెపో రేట్లను ఎలాంటి మార్పులూ చేయకుండా యథాతథంగా ఉంచుతున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. అయితే 11 ఏళ్ల కనిష్టానికి చేరిన ఆర్థిక వృద్ధికి మద్దతుగా బ్యాంకింగ్, రియల్టీ, ఎంఎస్ఎంఈ, ఆటో రంగాలకు ప్రోత్సాహక చర్యలతో ముందుకు వచ్చింది. అయితే, తన సర్దుబాటు విధానాన్ని మార్చుకోకపోవటం ద్వారా అవసరమైతే మున్ముందు రేట్ల కోతకు అవకాశం ఉంటుందని ఆర్బీఐ సంకేతమిచ్చింది. రుణ రేట్లను తగ్గించేందుకు వీలుగా బ్యాంకులకు రూ.లక్ష కోట్లను సమకూర్చనున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. రుణాలకు మంచి రోజులు ► సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ), ఆటోమొబైల్, గృహ రుణ వితరణ పెంపునకు వీలుగా నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) నిబంధనలను ఆర్బీఐ సడలించింది. దీంతో ఈ రంగాలకు అదనంగా ఇచ్చే రుణాల విషయంలో బ్యాంకులు 4 శాతాన్ని సీఆర్ఆర్ రూపంలో పక్కన పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇది ఈ ఏడాది జూలై వరకు అమల్లో ఉంటుంది. ఇది బ్యాంకులకు సానుకూలం. ఎందుకంటే ఇలా మిగిలిన నిధులను రుణాలివ్వటానికి వినియోగించవచ్చు. ► దేశాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఎంఎస్ఎంఈ రంగానికి మద్దతుగా.. డిఫాల్టయిన రుణాలను 2021 మార్చి 31 వరకు పునరుద్ధరిస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది. జీఎస్టీ నమోదిత ఎంఎస్ఎంఈలకే ఇది వర్తిస్తుంది. జీడీపీలో ఎంఎస్ఎంఈ రంగం వాటా 28%. ఎగుమతుల్లో వాటా 40 శాతం. అంతేకాదు 11 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం కూడా. ► వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద ఉపశమనం కల్పించింది. ప్రమోటర్ల చేతుల్లో లేని అంశాలతో వాణిజ్య రియల్టీ ప్రాజెక్టుల కార్యకలాపాల ఆరంభం ఆలస్యమైతే, వాటి రుణ గడువును ఏడాది పాటు పొడిగించేందుకు అనుమతించింది. అంటే ప్రాజెక్టులు ఆలస్యమైనా ఆయా రుణాలను డౌన్గ్రేడ్ చేయరు. ఇన్ఫ్రాయేతర రంగాల రుణాల్లాగే వీటినీ పరిగణిస్తారు. రియల్టీ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఇది అదనపు మద్దతునిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. ద్రవ్యోల్బణం భయాలు రిటైల్ ద్రవ్యోల్బణం జనవరి–మార్చి క్వార్టర్లో 6.5 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ ఎంపీసీ అంచనా వేసింది. జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదేళ్ల గరిష్ట స్థాయిలో 7.35 శాతంగా నమోదు కావటం తెలిసిందే. వచ్చే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్కు ద్రవ్యోల్బణం 3.8–4 శాతం మధ్య ఉంటుందని గతంలో చేసిన అంచనాలను సవరిస్తూ 5–5.4%కి పెంచింది. ప్రధానంగా కూరగాయలు, పప్పుధాన్యాల ధరలు పెరగొచ్చని అభిప్రాయపడింది. వృద్ధి రేటు 5%: 2019–20లో వృద్ధి రేటు 5%గా ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. 2020–21లో 6%గా ఉంటుందని అంచనా వేసింది. 2020–21 తొలి ఆరు నెలల్లో 5.9–6.3% మధ్య ఉంటుందన్న లోగడ అంచనాలను.. 5.5–6%కి తగ్గించింది. ఇతర ముఖ్యాంశాలు ► రేట్ల యథాతథ స్థితికి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలోని ఎంపీసీ కమిటీ ఏకగ్రీవంగా (ఆరుగురు సభ్యులు) ఓటు వేసింది. గత భేటీలోనూ (2019 డిసెంబర్) రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. ► దీంతో ఆర్బీఐ రెపో రేటు 5.15 శాతం, రివర్స్ రెపో రేటు 4.9 శాతంగానే కొనసాగనున్నాయి. ► ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం బడ్జెట్లో 3.8 శాతానికి సవరించగా, దీనివల్ల మార్కెట్ నుంచి ప్రభుత్వ రుణ సమీకరణ పెరగదని ఆర్బీఐ పేర్కొంది. ► చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉందని ఎంపీసీ అభిప్రాయపడింది. దీంతో రానున్న త్రైమాసికంలో (ఏప్రిల్ నుంచి ఆరంభమయ్యే) వడ్డీ రేట్లను కేంద్రం తగ్గించే అవకాశాలున్నాయి. ► హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (హెచ్ఎఫ్సీ) నియంత్రణకు సంబంధించి సవరించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తారు. అప్పటి వరకు నేషనల్ హౌసింగ్ బ్యాంకు ఆదేశాలు, మార్గదర్శకాలే కొనసాగుతాయి. హెచ్ఎఫ్సీల నియంత్రణ గతేడాది ఆగస్ట్ 9 నుంచి ఆర్బీఐకి బదిలీ కావటం తెలిసిందే. ► బ్యాంకుల్లో డిపాజిట్ బీమాను ఒక డిపాజిట్దారునికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడం బ్యాంకు బ్యాలన్స్ షీట్లపై పెద్దగా ప్రభావం చూపదని పేర్కొంది. ► బడ్జెట్లో ప్రభుత్వం వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లలో చేసిన మార్పులు డిమాండ్కు మద్దతునిస్తాయని అంచనా వేసింది. ► తదుపరి ఆర్బీఐ విధాన ప్రకటన ఏప్రిల్ 3న ఉంటుంది. మా వద్ద ఎన్నో అస్త్రాలు ‘‘సెంట్రల్ బ్యాంకు వద్ద ఎన్నో సాధనాలున్నాయని గుర్తుంచుకోవాలి. వృద్ధి మందగమనం రూపంలో భారత ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైతే వాటిని సంధిస్తాం’’ అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. తద్వారా 2008 ఆర్థిక మాంద్యం తర్వాత అమెరికాలో మాదిరే అసాధారణ అస్త్రాలను వినియోగించేందుకు ఆర్బీఐ వెనుకాడదన్న సంకేతం ఇచ్చారు. రేట్లలో మార్పులు చేయకపోవడం అంచనాలకు అనుగుణంగానే ఉందన్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వృద్ధి తగ్గే రిస్క్ పెరిగిందని... అయితే, పూర్తి ప్రభావంపై అనిశ్చితి ఉందని చెప్పారు. బ్యాంకుల్లోకి రూ.లక్ష కోట్లు లాంగ్టర్న్ రీపర్చేజ్ అగ్రిమెంట్స్ (రెపోస్/రుణాలు) ఏడాది, మూడేళ్ల కాల వ్యవధిపై రూ.లక్ష కోట్ల మేర రెపో రేటుకు జారీ చేయనున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. రెపోస్ అంటే.. బ్యాంకులు ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్బీఐకి విక్రయించి నిధులు పొందడం. గడువు తీరిన తర్వాత తిరిగి అవి మళ్లీ కొనుగోలు చేస్తాయి. ఇప్పటి వరకు ఆర్బీఐ గరిష్టంగా 56 రోజులకే రెపోస్ను ఇష్యూ చేసింది. అందులోనూఒక రోజు నుంచి 15 రోజుల కాలానికే ఎక్కువగా ఉండేవి. మొదటిసారి ఏడాది, మూడేళ్ల రెపోస్ను ఆర్బీఐ ప్రకటించింది. బ్యాంకుల నిధుల వ్యయాలను తగ్గించడమే ఇందులోని ఉద్దేశం. ‘‘మానిటరీ పాలసీ బదిలీ మరింత మెరుగ్గా ఉండేందుకు తీసుకున్న చర్య ఇది. ఎందుకంటే రెపో రేటుకు నిధులను ఇస్తున్నాం. బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.లక్ష కోట్లను విడుదల చేయాలనుకుంటున్నాం. దాంతో బ్యాంకులు రుణ రేట్లను తగ్గించేందుకు వీలు పడుతుంది’’ అని ఆర్బీఐ గరవ్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. ఎవరేమన్నారంటే... ఏడాది, మూడేళ్ల లాంగ్టర్మ్ రెపోస్ బ్యాంకుల నిధుల వ్యయాలను తగ్గిస్తాయి. దీంతో ఈ ప్రభావాన్ని మరింత మెరుగ్గా రుణగ్రహీతలకు బదిలీ చేయడం వీలు పడుతుంది. రెపో రేట్లను మార్పు చేయకపోవడం ఊహించినదే. అయితే, అభివృద్ధి, నియంత్రణపరమైన చర్యలు ఆర్థిక రంగానికి సానుకూలం. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ ప్రాజెక్టు రుణాలకు అదనంగా ఏడాది గడువు ఇవ్వడం రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ఉపశమనం. – అనుజ్పురి, అన్రాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ ఆటో, హౌసింగ్, ఎంఎస్ఎంఈ రంగాలకు ఇచ్చే ఇంక్రిమెంటల్ రుణాలకు సీఆర్ఆర్ నుంచి బ్యాంకులకు మినహాయింపునివ్వడం.. ఈ రంగాలకు రుణ వితరణను పెంచి, మందగమనానికి మందులా పనిచేస్తుంది. – కృష్ణన్ సీతారామన్, క్రిసిల్ -
రేట్ల కోతకు ‘సానుకూల’ అంకెలు
♦ పారిశ్రామిక ఉత్పత్తి మందగమనం.. ♦ మేలో కేవలం 1.7 శాతం వృద్ధి ♦ చరిత్రాత్మక కనిష్టంలో రిటైల్ ధరల స్పీడ్ ♦ జూన్లో 1.54 శాతం ♦ ఆగస్టు ఆర్బీఐ పాలసీపై దృష్టి ముంబై: రెపో, రివర్స్ రెపో వంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రేట్లను మరింత తగ్గించాలన్న డిమాండ్కు బలం చేకూరే స్థూల ఆర్థిక గణాంకాలు బుధవారం వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) సూచీ మే నెలలో కేవలం 1.7 శాతం (2016 ఇదే నెలతో ఉత్పత్తితో పోల్చితే) నమోదయ్యింది. ఇక జూన్లో వినియోగ ధరల (సీపీఐ) సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం చరిత్రాత్మక కనిష్ట స్థాయి 1.54 శాతంగా నమోదయ్యింది. ద్రవ్యోల్బణం కట్టడిలో ఉన్న నేపథ్యంలో అటు ప్రభుత్వం నుంచీ ఇటు పారిశ్రామిక వర్గాల నుంచీ రేటు తగ్గింపునకు ఆర్బీఐకి విజ్ఞప్తులు అందుతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల ఒకటి, రెండు తేదీల్లో ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానం నేపథ్యంలో బుధవారం ఆయా శాఖలు విడుదల చేసిన గణాంకాల వివరాల్లో ముఖ్యాంశాలు చూస్తే... ఐఐపీ... 8 నుంచి 1.7 శాతానికి డౌన్ ⇔ 2016 మే నెలలో (2015 మే నెలతో పోల్చితే) పారిశ్రామిక ఉత్పత్తి 8%గా నమోదయ్యింది. అయితే తాజా దిగువ ధోరణికి కారణం– కీలకమైన తయారీ, మైనింగ్ వంటి విభాగాల పేలవ పనితీరే. ⇔ మొత్తం సూచీలో దాదాపు 70% వాటా కలిగిన తయారీ రంగంలో వృద్ధి రేటు 8.6 శాతం నుంచి 1.2 శాతానికి పడిపోయింది. ⇔ భారీ వస్తు ఉత్పత్తికి, డిమాండ్, పెట్టుబడులకు సూచిక అయిన క్యాపిటల్ గూడ్స్లో అసలు వృద్ధిలేకపోగా – 3.9% క్షీణత నమోదయ్యింది. 2016 మే నెలలో ఈ విభాగంలో వృద్ధి భారీగా 13.9%. ⇔ కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలోనూ క్షీణత నమోదయ్యింది. ⇔ మైనింగ్ రంగం 5.7% క్షీణత నుంచి 0.9% క్షీణతకు జారింది. ⇔ విద్యుత్ రంగంలో ఉత్పాదకత వృద్ధి మాత్రం 6.1 శాతం నుంచి 8.7 శాతానికి ఎగసింది. ఏప్రిల్–మే నెలల్లోనూ దిగువకే... 2016 ఏప్రిల్–మే నెలల్లో ఐఐపీ 7.3 శాతం నుంచి 2.3 శాతానికి పడిపోయింది. ఈ కాలంలో తయారీ రంగం వృద్ధి రేటు 7.1 శాతం నుంచి 1.8 శాతానికి, మైనింగ్ రంగానికి సంబంధించి ఈ శాతం 6.2 శాతం నుంచి 1.1 శాతానికి, విద్యుత్ రంగంలో ఉత్పత్తి వృద్ధి రేటు 10.1 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గింది. తగ్గిన రిటైల్ ‘ధర’ వేగం ⇔ 2016 జూన్ నెలతో పోల్చితే 2017 జూన్లో రిటైల్ ధరల పెరుగుదల వేగం గణనీయంగా తగ్గిపోయింది. చరిత్రాత్మక కనిష్ట స్థాయిలో 1.54 శాతంగా నమోదయ్యింది. ⇔ ఆహార ఉత్పత్తులు: కూరగాయల ధరల్లో అసలు పెరుగుదల లేకపోగా ధరలు 17% తగ్గాయి. పప్పులు, సంబంధిత ప్రొడక్టుల ధరలు కూడా 22% తగ్గాయి. గుడ్లు (–0.08%), సుగంధ ద్రవ్యాలది(–0.73%) కూడా ఇదే పరిస్థితి. తృణధాన్యాలు (4.39%), మాంసం, చేపలు (3.49%), పాలు, పాలపదార్థాలు (4.15%), చమురు, వెన్న (2.34 శాతం), పండ్లు (1.98%) ధరలు స్వల్పంగా పెరగ్గా, చక్కెర సంబంధిత ఉత్పత్తుల ధర 8.74% ఎగశాయి. ⇔ పాన్, పొగాకు: ఈ విభాగంలో ధరలు 5.62 శాతం పెరిగింది. ⇔ దుస్తులు, పాదరక్షలు: ధరల పెరుగుదల 4.17 శాతం. ⇔ హౌసింగ్: ధరల పెరుగుదల రేటు 4.7 శాతం. ⇔ ఫ్యూయెల్, లైట్: 4.54 శాతం ఎగసింది. స్థిరత్వానికి సంకేతం రిటైల్ ద్రవ్యోల్బణం స్థూల ఆర్థిక అంశాల స్థిరత్వానికి సంకేతం. ఈ తరహా గణాంకాలు మనం 1999లో అంతకుముందు 1978 ఆగస్టుల్లోనే చూశాం. – అరవింద్ సుబ్రమణ్యం, ప్రధాన ఆర్థిక సలహాదారు -
ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు యథాతధం
ముంబై: భారతీయ కేంద్ర బ్యాంకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ద్రవ్యపాలసీని ప్రకటించింది. రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో రెండు రోజుల భేటీ అనంతరం ద్రవ్యవిధాన కమిటీ వడ్డీరేట్లపై తమ నిర్ణయాన్ని వెల్లడించింది. అంచనాలకు కనుగుణంగానే ఆర్బీఐ స్టేటస్ కో వ్యూహాన్నే అనుసరించింది. మానిటరీ పాలసీ కమిటిలో అయిదుగురు సభ్యులు యథాతధ పాలసీకే ఓటు వేసారు. బుధవారం ప్రకటించిన రివ్యూ పాలసీలో రెపో రేటు, రివర్స్ రెపో రేటును యథాతధంగానే ఉంచింది. రెపో రేటును 6.25 శాతం వద్ద, రివర్స్ రెపో రేటును వద్ద ఎలాంటి మార్పులేకుండా ఉంచింది. రెపో రేటు లేదా కీలక రుణాలపై 6.25 శాతం వడ్డీ రేటును కొనసాగించింది. రివర్స్ రెపో 6 శాతం వద్దే కొనసాగనుంది. దీంతో కీలక వడ్డీరేటు 6 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరింది. అయితే ఎస్ఎల్ఆర్ 50 బీపీఎస్ పాయింట్లను కట్ చేసింది. -
యథాతథంగా ఆర్బీఐ కీలక వడ్డీరేటు
-
యథాతథంగా ఆర్బీఐ కీలక వడ్డీరేటు
ముంబై: అంచనాలకు తగ్గట్టుకుగానే రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. గురువారం నిర్వహించిన పాలసీ రివ్యూలో యథాతథ పాలసీ అమలుకే మొగ్గుచూపింది. రెపో రేటు 6.25 శాతం, రివర్స్ రెపో రేటు 6 శాతంగా మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించినట్టు ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ ప్రకటించారు. వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.25 వద్దే కొనసాగనుంది. అయితే రివర్స్ రెపోను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీకి చెక్ పెట్టాలని ఆర్బీఐ భావిస్తోంది. బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ వద్ద డిపాజిట్ చేసే నిధులకు లభించే వడ్డీ రేటు రివర్స్ రెపో 0.25 శాతం పెంపుతో ఇది 6 శాతంగా ఉండనుంది. ఊర్జిత్ పటేల్ అధ్యక్షతన రెండు రోజులపాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) పరపతి నిర్ణయాలను ప్రకటించింది. దీంతో ద్వైమాసిక పాలసీ సమీక్షలో భాగంగా ఎంఎస్ఎఫ్ రేటును 6.25 శాతానికి తగ్గించింది. -
ఉర్జిత్ ‘రేటు’ షాక్!
-
ఉర్జిత్ ‘రేటు’ షాక్!
►ఎక్కడి వడ్డీరేట్లు అక్కడే... ► రెపో 6.25%, రివర్స్ రెపో 5.75%, సీఆర్ఆర్ 4 శాతంగా కొనసాగింపు... ► నోట్ల రద్దుతో ఈ ఏడాది వృద్ధి అంచనా 7.1 శాతానికి కోత మార్చినాటికి ద్రవ్యోల్బణం లక్ష్యం 5 శాతం ► తదుపరి పాలసీ సమీక్ష ఫిబ్రవరి 8న అంచనాలన్నీ తప్పాయి. పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్)తో అష్టకష్టాలు పడుతున్న సామాన్యుడికి వడ్డీరేట్ల తగ్గింపు ఆశలు కూడా ఆవిరయ్యాయి. కనీసం పావు శాతం వడ్డీ రేట్ల తగ్గింపు ఖాయమంటూ లెక్కలేసిన విశ్లేషకులు, స్టాక్ మార్కెట్లు, పారిశ్రామిక వర్గాలకు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ షాక్ ఇచ్చారు. కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు డీమోనిటైజేషన్ కారణంగా ఆర్థిక వ్యవస్థపై స్వల్పకాలానికి తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండొచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. వృద్ధి అంచనాల్లో భారీగా కోత విధించింది. మొత్తంమీద రుణాలపై వడ్డీరేట్లు దిగొస్తాయని వేచిచూస్తున్నవారందరినీ ఆర్బీఐ తీవ్ర నిరాశకు గురిచేసింది. అరుుతే, తాత్కాలిక 100% సీఆర్ఆర్ పరిమితిని తొలగించడంతో రుణ రేట్లు రానున్న కాలంలో తగ్గుముఖం పట్టొచ్చని బ్యాంకర్లు పేర్కొనడం కాస్త ఊరటనిచ్చే అంశం. ముంబై: ఆర్బీఐ గవర్నర్గా రెండో పాలసీ సమీక్షను నిర్వహించిన ఉర్జిత్ పటేల్పై అందరి అంచనాలు తప్పాయి. ఆరుగురు సభ్యుల ఆర్బీఐ పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) ఏకాభిప్రాయంతో పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో రెపో రేటు ఇప్పుడున్న 6.25 శాతం, రివర్స్ రెపో 5.75 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4 శాతంగా కొనసాగనున్నాయి. గత సమీక్షలో ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ముడిచమురు ధరల పెరుగుదల అంచనాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచుతున్నదన్న భయాల నేపథ్యంలో ఆర్బీఐ పాలసీ రేట్ల తగ్గింపునకు బ్రేక్ పడింది. వాస్తవానికి డీమోనిటైజేషన్ కారణంగా వ్యవస్థలోకి ద్రవ్య సరఫరా పోటెత్తడంతో ఆర్బీఐ కచ్చితంగా ఈ సమీక్షలో పావు శాతమైనా రెపో రేటును తగ్గిస్తుందని మెజారిటీ బ్యాంకర్లు, ఆర్థిక విశ్లేషకులు అంచనా వేశారు. ‘అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ఖాయమన్న అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి, ఒడిదుడుకులు చోటుచేసుకుంటున్నాయి. వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థలపై దీని ప్రభావం ఉంటుంది. మరోపక్క, డీమోనిటైజేషన్ కారణంగా ఈ ఏడాది మన జీడీపీ వృద్ధి రేటు తగ్గే అవకాశం ఉంది. ఈ స్వల్పకాలిక ప్రతికూలతల వల్లే ప్రస్తుత సమీక్షలో కాస్త ఆచితూచి రేట్లను యథాతథంగా ఉంచాలన్న నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత సరళ పాలసీ విధానం కొనసాగుతుంది. రానున్న కాలంలో వెలువడే ప్రధాన ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా తదుపరి పాలసీ చర్యలు ఉంటారుు’ అని ఆర్బీఐ పేర్కొంది. కాగా, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలవల్లే పాలసీ రేట్లను తగ్గించలేదా అన్న ప్రశ్నకు దాంతో సంబంధం లేదని ఉర్జిత్ పటేల్ పేర్కొనడం గమనార్హం. ద్రవ్యోల్బణం పెరుగుదల రిస్కు... రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యానికి అనుగుణంగానే ఈ ఆర్థిక సంవత్సరం చివరికి(మార్చి) 5 శాతంగానే ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. అరుుతే, ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలు, ఫైనాన్షియల్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకుల కారణంగా ద్రవ్యోల్బణం పెరిగే రిస్కు ఉందని అభిప్రాయపడింది. 100 శాతం తాత్కాలిక సీఆర్ఆర్ రద్దు... తాత్కాలికంగా కొత్త డిపాజిట్లపై 100 శాతం నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్-బ్యాంకులు తమ డిపాజిట్లలో ఆర్బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన పరిమాణం)ను ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ నెల 10 నుంచి దీన్ని తొలగించనున్నామని పాలసీ సమీక్ష సందర్భంగా వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లోకి డిపాజిట్లు వెల్లువెత్తడంతో వాటిపై తాత్కాలికంగా సీఆర్ఆర్ను 100 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. అయితే, మార్కెట్ స్థిరీకరణ పథకం(ఎంఎస్ఎస్) కింద ప్రభుత్వ బాండ్ల జారీ పరిమితిని ఇటీవలే రూ.30 వేల కోట్ల నుంచి రూ. 6 లక్షల కోట్లకు పెంచిన నేపథ్యంలో ఈ 100 శాతం తాత్కాలిక సీఆర్ఆర్ను తొలగించేందుకు ఆర్బీఐకి మార్గం సుగమం అరుుంది. దీంతో ఇకపై డీమోనిటైజేషన్లో భాగంగా బ్యాంకుల్లోకి వచ్చే డిపాజిట్లను(ఈ నెలాఖరు వరకూ గడువు ఉంది) బ్యాంకులు తమ వద్దే అట్టిపెట్టుకోవడానికి దోహదం చేస్తుంది. వృద్ధికి డీమోనిటైజేషన్ దెబ్బ... డీమోనిటైజేషన్ కారణంగా డిమాండ్ మందగించడంతో స్వల్పకాలానికి ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభవం ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2016-17) జీడీపీ వృద్ధి అంచనాలను 7.1 శాతానికి తగ్గించింది. గతంలో ఆర్బీఐ వృద్ధి రేటు అంచనా 7.6 శాతంగా ఉంది. ‘ప్రధానంగా నగదు లావాదేవీలపై అధికంగా ఆధారపడి ఉండే రిటైల్ వర్తకం, హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణాతో పాటు అసంఘటిత రంగంలో కూడా ఆర్థిక కార్యకలాపాలు కొంతకాలం తీవ్రంగా దెబ్బతినొచ్చు. ఈ రంగాల్లో డిమాండ్ దిగజారనుంది. దీంతో మూడు, నాలుగు త్రైమాసికాల్లో జీడీపీ వృద్దిని దిగజార్చవచ్చు. ఈ నేపథ్యంలో వృద్ధి అంచనాలను తగ్గించాల్సి వచ్చింది’ అని ఆర్బీఐ పేర్కొంది. పరిశ్రమవర్గాల నిరాశ... న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచడంపై పరిశ్రమవర్గాలు నిరాశ వ్యక్తం చేశాయి. వడ్డీ రేట్లు తగ్గించి ఉంటే.. కుదేలవుతున్న పరిశ్రమకు ఊతమిచ్చేందుకు, పెద్ద నోట్ల రద్దుతో తగ్గిన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తోడ్పడి ఉండేదని పేర్కొన్నాయి. ’ప్రస్తుత పరిస్థితుల్లో రెపో రేట్ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించి ఉండి ఉంటే పారిశ్రామిక ఎకానమీకి ఊతమిచ్చినట్లయ్యేది. డీమోనిటైజేషన్ కారణంగా వినియోగ డిమాండ్పై ప్రతికూల ప్రభావం పడింది. వడ్డీ రేట్లు తగ్గించి ఉంటే ఇటు వినియోగదారులకు, అటు పరిశ్రమకు తోడ్పాటు అందించినట్లయ్యేది’ అని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ న్యోతియా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో దేశీ ఆర్థిక వ్యవస్థ నుంచే వృద్ధికి తోడ్పాటు లభించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు, వృద్ధి, రుణాలపై వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం పైనా డీమోనిటైజేషన్ ప్రభావాలు ఎలా ఉంటాయో ఇంకా తెలియాల్సి ఉందని అసోచాం ప్రెసిడెంట్ సునీల్ కనోరియా చెప్పారు. కోతతో సెంటిమెంట్ మెరుగుపడేది.. వడ్డీ రేట్లు తగ్గించి ఉంటే మార్కెట్ సెంటిమెంటుపై సానుకూల ప్రభావం ఉండేది. తగ్గించకపోవడం వల్ల మార్కె ట్ కాస్త నిరాశపడి ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో డిమాండ్ గణనీయంగా పతనమైంది. డిమాండ్ పెరగాలంటే.. ఎకానమీ మెరుగుపడాల్సిన అవసరం ఉంది. అదనపు సీఆర్ఆర్ పెంపు తొలగింపు, మార్కెట్ స్థిరీకరణ పథకం కింద బాండ్ల జారీ పరిమితిని రూ. 6 లక్షల కోట్లకు పెంచడం పరిణామాలతో బ్యాంకులకు ద్రవ్య లభ్యత మెరుగుపడుతుంది. వ్యవస్థలో ఆర్థిక స్థిరీకరణకు దోహదం చేస్తుంది. - అరుంధతి భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్ ఉదార విధానం.. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ ఉదార విధానం కొనసాగించింది. ఒకవైపు వృద్ధికి తోడ్పాటునిస్తూ.. మరోవైపు మధ్యకాలికంగా ద్రవ్యోల్బణ లక్ష్యాలను సాధించడంపై దృష్టితో ద్రవ్యపరపతి విధానాన్ని స్థిరంగా ఉంచింది. అదనపు సీఆర్ఆర్ నిబంధన ఉపసంహరణ, లిక్విడిటీ నిర్వహణకు ఎంఎస్ఎస్ తదితర సాధనాలను ఉపయోగించడం మొదలైనవి స్వాగతించతగ్గ అంశాలు. రాబోయే రోజుల్లో డిపాజిట్లు, రుణాలపై వడ్డీ రేట్ల తగ్గుదల కొనసాగే అవకాశాలు ఉన్నాయి. - చందా కొచర్, సీఈవో, ఐసీఐసీఐ బ్యాంక్ డీమోనిటైజేషన్ ప్రభావాలపై ధీమా.. వృద్ధిపై డీమోనిటైజేషన్ ప్రభావాలు తాత్కాలికమైనవేనని, మధ్య-దీర్ఘకాలికంగా ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయని ఆర్బీఐకి ఉన్న ధీమాను పాలసీ రేట్లు యథాతథంగా కొనసాగించడం ప్రతిబింబిస్తోంది. - రాణా కపూర్, సీఈవో, యస్ బ్యాంక్ వేచి చూసే ధోరణి.. ఆర్బీఐ పావు శాతం పాలసీ రేట్లు తగ్గించవచ్చని చాలా మంది భావించారు. కానీ రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం తీరుతెన్నులు ఎలా ఉంటాయో పరిశీలించే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ వేచి చూసే ధోరణిని అవలంబించింది. - చంద్రశేఖర్ ఘోష్, చైర్మన్, బంధన్ బ్యాంక్ సాహసోపేత నిర్ణయం: ఆర్థిక శాఖ పాలసీ రేట్లను యథాతథంగా ఉంచాలన్న ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయాన్ని ఆర్థిక శాఖ స్వాగతించింది. ‘అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై అనిశ్చితి నెలకొంది. దీంతో ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లు కుదుపులకు గురవుతున్నాయి. మరోపక్క, ద్రవ్యోల్బణం తగ్గుదలకు కొన్ని అటంకాలు నెలకొన్నాయి. ఇవన్నీ పరిశీలించే ఆర్బీఐ వేచిచూసే ధోరణితో పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణరుుంచింది’ అని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. కాగా, ప్రజల అంచనాలకు భిన్నంగా ఉంది కాబట్టి.. ఇది సాహసోపేతమైన చర్యేనని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రణియన్ వ్యాఖ్యానించారు. అందుకే తగ్గించకపోరుు ఉండొచ్చు.. డీమోనిటైజేషన్ ప్రభావంతో వ్యవస్థలోకి గణనీయంగా నగదు వచ్చి చేరింది. ద్రవ్యోల్బణం కూడా నిర్దేశిత స్థారుులోనే తిరుగాడుతోంది. ఈ సానుకూలాంశాల నేపథ్యంలో బలహీనంగా ఉన్న వ్యాపారాల వృద్ధికి తోడ్పడేలా రేట్లను తగ్గించి ఉంటే బోలెడంత ఊతంగా ఉండేది. అయితే, గత పాలసీ రేట్ల కోతల ప్రయోజనాల పూర్తి బదలారుుంపు కోసం ఆర్బీఐ బహుశా ఎదురుచూస్తుండవచ్చు. అందుకే రేట్ల కోత నిర్ణయం వాయిదా వేసి ఉండొచ్చు. ప్రస్తుతం నగదు లభ్యత బాగానే ఉంది.. అలాగే బ్యాంకుల నిధుల సమీకరణ వ్యయం కూడా తగ్గనుంది కాబట్టి అవి ఇప్పుడిక వడ్డీ రేట్లు తగ్గించవచ్చు. - వీఎస్ పార్థసారథి, గ్రూప్ సీఎఫ్వో, ఎంఅండ్ఎం గ్రూప్ -
ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు యధాతథం
-
రాజన్.. మూడో‘సారీ’!
ముంబై: వర్షాలు ముఖం చాటేయడం... వడ్డీరేట్ల తగ్గింపు ఆశలను గల్లంతుచేసింది. ఆహారోత్పత్తుల ధరలకు రెక్కలొస్తాయనే భయాలు వెంటాడుతుండటంతో కీలక పాలసీ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నిర్ణయించారు. మంగళవారం జరిగిన పరపతి విధాన సమీక్షలో రెపో, రివర్స్ రెపో, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్)లో మార్పులేవీ చేయలేదు. అయితే, చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్)ని అర శాతం తగ్గించడం ద్వారా వ్యవస్థలోకి రూ.40 వే ల కోట్ల నిధులు విడుదలయ్యేలా చేశారు. మరోపక్క, రుణాలపై వడ్డీరేట్లను తగ్గించే అవకాశాల్లేవని బ్యాంకర్లు తేల్చిచెప్పారు. దీంతో గృహ, వాహన రుణాలపై నెలవారీ వాయిదా(ఈఎంఐ)లు ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగనున్నాయి. ఆర్బీఐ నిర్ణయం అటు రిటైల్ రుణ గ్రహీతలతో పాటు కార్పొరేట్ వర్గాలను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. పాలసీ రేట్లలో మార్పులు చేయకపోవడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. పాలసీ సమీక్షలో ఆర్బీఐ మరోసారి ద్రవ్యోల్బణం కట్టడికే ప్రాధాన్యమివ్వడంతో కీలక పాలసీ వడ్డీరేట్లయిన రెపో(8%), రివర్స్ రెపో(7%), సీఆర్ఆర్(4%)లు ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగనున్నాయి. అయితే, ఎస్ఎల్ఆర్ను అర శాతం తగ్గించడం ద్వారా ప్రస్తుతం ఉన్న 22.5% నుంచి 22 శాతానికి చేర్చింది. ఈ నెల 9 నుంచి ఈ తగ్గింపు అమల్లోకి రానుందని ఆర్బీఐ వెల్లడించింది. ఎస్ఎల్ఆర్ తగ్గింపుతో బ్యాంకులు మరిన్ని రుణాలను ఇచ్చేందుకు వీలవుతుంది. గత పాలసీ(జూన్)లో కూడా ఎస్ఎల్ఆర్ను అర శాతం తగ్గించడం తెలిసిందే. మరోపక్క, బ్యాంక్ రేటును కూడా ఇప్పుడున్న 9 శాతం వద్దే ఉంచుతున్నట్లు తెలిపింది. గతేడాది సెప్టెంబర్లో ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన రాజన్.. మూడుసార్లు పావు శాతం చొప్పున రెపో రేటును పెంచిన విషయం విదితమే. ద్రవ్యోల్బణం తగ్గింపే తన లక్ష్యమని కూడా ఆయన పదేపదే స్పష్టం చేస్తూవస్తున్నారు. 5.5 శాతం వృద్ధికి అవకాశం... ప్రభుత్వం ఈ ఏడాదికి(2014-15) అంచనా వేస్తున్నట్లుగా 5.5 శాతం స్ధూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటును సాధించడానికి పరిస్థితులు కొద్దిగా మెరుగుపడుతున్నాయని రాజన్ పేర్కొన్నారు. సెంటిమెంట్, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం ఇందుకు దోహ దం చేయనుందని పేర్కొన్నారు. గత రెండేళ్లలో వృద్ధి రేటు 5 శాతం దిగువనే నమోదైన సంగతి తెలిసిందే. ‘రిటైల్ ద్రవ్యోల్బణం జూన్లో 43 నెలల కనిష్టమైన 7.31 శాతానికి దిగొచ్చింది. ఇక మే నెలలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 4.7%కి పుంజుకుంది. ఇది 9 నెలల గరిష్టస్థాయి. ఈ అంశాల నేపథ్యంలోనే మరోసారి వడ్డీరేట్లు యథాతథంగా ఉంటాయని అందరూ అంచనా వేశారు’ అని రాజన్ చెప్పారు. కాగా, తదుపరి పాలసీ సమీక్ష సెప్టెంబర్ 30న ఉంటుందని వెల్లడించారు. రేట్ల తగ్గింపు అనివార్యం: కార్పొరేట్లు వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించడంపై పారిశ్రామిక వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అధిక వడ్డీరేట్లు పరిశ్రమల విస్తరణలపై నీళ్లుజల్లుతున్నాయని పేర్కొన్నాయి. ‘పారిశ్రామికోత్పత్తి ఇంకా మందకొడిగానే ఉంది. మరోపక్క, రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. రుతుపవనాల్లో కాస్త పురోగతి నేపథ్యంలో ద్రవ్యోల్బణం రిస్కులు కూడా క్రమంగా తగ్గనున్నాయి. వీటిని ఆర్బీఐ వడ్డీరేట్ల కోతకు అనువుగా మలుచుకోవాల్సింది’ అని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. అయితే, ఎస్ఎల్ఆర్ను మరో అర శాతం తగ్గించడాన్ని సీఐఐతో పాటు ఫిక్కీ, పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ స్వాగతించాయి. ఆర్బీఐ అస్త్రాలు... నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్): బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో కచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉంచాల్సిన మొత్తమే సీఆర్ఆర్. రెపో రేటు: బ్యాంకులు తన వద్దనుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీనే రెపో రేటుగా వ్యవహరిస్తారు. రివర్స్ రెపో: బ్యాంకులు తన వద్ద ఉంచే నిధులపై ఆర్బీఐ చెల్లించే వడ్డీయే రివర్స్ రెపో రేటు. ఎస్ఎల్ఆర్: బ్యాంకులు తమ వద్దనున్న మొత్తం డిపాజిట్లలో కొంత మొత్తాన్ని తప్పనిసరిగా ప్రభుత్వ సెక్యూరిటీ(బాండ్లు)ల్లో పెట్టుబడిగా పెట్టాల్సి ఉం టుంది. ఇదే చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్).