saket court
-
ఢిల్లీ కోర్టులో కాల్పుల కలకలం
న్యూఢిల్లీ: కట్టుదిట్టమైన భద్రత ఉండే ఢిల్లీలోని సాకేత్ కోర్టు ఆవరణలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. లాయర్ దుస్తుల్లో వచ్చిన కామేశ్వర్ సింగ్ అనే వ్యక్తి ఓ మహిళపై కాల్పులు జరిపి పరారయ్యాడు. దాంతో అంతా పరుగులు తీశారు. మహిళకు ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. ఆర్థిక విభేదాలే ఘటనకు కారణమని భావిస్తున్నామన్నారు. మాజీ లాయర్ అయిన నిందితుడు హరియాణా పోలీసులకు పట్టుబడ్డాడు. గత ఏడాది అతడిని ఢిల్లీ బార్ అసోసియేషన్ బహిష్కరించింది. ఆయన ఎం.రాధ(సుమారు 40 ఏళ్లు) అనే మహిళకు రూ.25 లక్షలు అప్పుగా ఇచ్చాడు. తిరిగివ్వకపోవడంతో చీటింగ్ కేసు పెట్టాడు. విచారణకు శుక్రవారం ఇద్దరూ కోర్టుకు వచ్చారు. 10.30 సమయంలో తగవుపడ్డారు. కామేశ్వర్ తన వెంట తెచ్చుకున్న తుపాకీతో రాధపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. రాధకు రెండు బుల్లెట్లు, పక్కనే ఉన్న లాయర్కు ఒక బుల్లెట్ తగిలాయి. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. ఢిల్లీలో సామాన్యులకు భద్రతే లేకుండా పోతుంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. -
సాకేత్ కాల్పుల ఘటన.. కేజ్రీవాల్ ఫైర్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఈ ఉదయం కాల్పుల కలకలం రేగింది. సాకేత్ కోర్టు ఆవరణలో ఓ మహిళను లక్ష్యంగా చేసుకుని ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా.. లాయర్ దుస్తుల్లో కాల్పులకు దిగిన వ్యక్తి మాత్రం అక్కడి నుంచి పరారయ్యాడు. సౌత్ ఢిల్లీ సాకేత్ జిల్లా కోర్టు ఆవరణలో శుక్రవారం ఉదయం కాల్పుల ఘటన జరిగింది. కాల్పులకు ముందు.. జనంతో కిక్కిరిసిపోయిన కోర్టు కాంప్లెక్స్ వద్ద బాధితురాలితో సదరు నిందితుడికి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతలో గన్ బయటకు తీసి ఆమెపై కాల్పులకు తెగబడ్డాడు నిందితుడు. దీంతో ఆమె అక్కడి నుంచి పరుగు అందుకుంది.అక్కడే పోలీసులు, కొందరు లాయర్లు ఉన్నప్పటికీ.. ఎవరూ ఆమెను రక్షించేందుకు ముందుకు రాలేదు. మొత్తం నాలుగు రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఘటనలో మహిళ కడుపులోకి బుల్లెట్ దూసుకుపోయింది. ఇక కాల్పుల తర్వాత కోర్టు కాంప్లెక్స్ క్యాంటీన్ నుంచి పారిపోయాడు దుండగుడు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కాల్పులకు తెగబడిన వ్యక్తి ఓ లాయర్. అయితే.. బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ అయ్యాడు. కిందటి ఏడాది జులైలో సదరు మహిళకు, ఓ అడ్వొకేట్కు వ్యతిరేకంగా సాకేత్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడతను. తన నుంచి పాతిక లక్షల రూపాయలు తీసుకుని.. పెద్ద మొత్తంలో తిరిగి ఇస్తామంటూ ఆశ కల్పించారని, ఆపై మాట తప్పారని వాళ్లపై ఫిర్యాదు చేశాడా సస్పెండెడ్ లాయర్. ఈ క్రమంలో.. ఈ ఉదయం లాయర్ దుస్తుల్లోనే కోర్టులోకి వచ్చి తన లాయర్తో మాట్లాడుతున్న మహిళపై కాల్పులకు తెగబడ్డాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పుల్లో మహిళ సహా ఆమె లాయర్, మరో వ్యక్తికి బుల్లెట్ గాయాలు అయ్యాయని, కడుపులో బుల్లెట్ దూసుకుపోయిన మహిళను ఎయిమ్స్లో చేర్పించామని, ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు వెల్లడించారు.ఎల్జీ సాబ్.. మా ఢిల్లీలో ఏం జరుగుతోందంటూ మరో ట్వీట్ చేశారాయన. ఇక ఈ ఘటనపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. శాంతి భద్రతలను పర్యవేక్షించడం చేత కాకపోతే.. రాజీనామా చేయాలంటూ పరోక్షంగా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు చురకలు అంటించారు. ‘‘ఢిల్లీలో శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇతరుల పనులకు విఘాతం కలిగించే బదులు.. ప్రతీదానికి చెత్త రాజకీయాలు చేసే బదులు.. వాళ్లు వాళ్ల పనిని చూసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఆయన(ఎల్జీని ఉద్దేశిస్తూ..) గనుక ఆ పని చేయకుంటే రాజీనామా చేస్తే వేరేవాళ్లు ఆ పని చూసుకుంటారు. రాముడిపై నమ్మకంతో ప్రజల భద్రతను వదిలిపెట్టలేం’’ అంటూ ట్వీట్ చేశారాయన. LG साहिब, ये हमारी दिल्ली में क्या हो रहा है? pic.twitter.com/lpWy4NlOW7 — Arvind Kejriwal (@ArvindKejriwal) April 21, 2023 👉 ఇదిలా ఉంటే.. దేశ రాజధానిలో కోర్టుల ఆవరణలోనే నేరాలు జరగడం కొత్తేమీ కాదు. కొన్నాళ్ల కిందట సౌత్వెస్ట్ ఢిల్లీ ద్వారక కోర్టులో లాయర్ వేషాల్లో బైక్పై వచ్చిన ఇద్దరు దుండగలు ఓ న్యాయవాదిని కాల్చి చంపి పారిపోయారు. 👉 ఈ క్రమంలో.. తమకు రక్షణ కరువైందని, భద్రత కల్పించే దిశగా ఆదేశాలు జారీ చేయాలని ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు కొందరు న్యాయవాదులు. 👉 కిందటి ఏడాది సెప్టెంబర్లో గ్యాంగ్స్టర్ జితేందర్ మాన్ అలియాస్ గోగిపై రోహిణి కోర్టు ప్రాంగణంలో.. న్యాయవాద దుస్తుల్లో వచ్చిన ఇద్దరు కాల్పులు జరిపారు. ప్రతిగా.. ఆ ఇద్దరినీ పోలీసులు అక్కడికక్కడే కాల్చి చంపారు. 👉 అంతకు ముందు 2022 ఏప్రిల్లోనూ రోహిణి కోర్టు ఆవరణలో క్లయింట్ల విషయంలో ఇద్దరు అడ్వొకేట్ల మధ్య కాల్పులు జరిగాయి. -
కోర్టు ఆవరణలో భార్యపై భర్త కాల్పులు
-
శ్రద్ధా కేసు: అఫ్తాబ్ పూనావాలాపై దాడి.. జైలులో చితకబాదిన తోటి ఖైదీలు!
న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలాపై దాడి జరిగింది. శుక్రవారం సాకెత్ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా జైలులోని ఇతర ఖైదీలు అతడ్ని చితకబాదారు. ఈ ఘటనలో అతను స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. అఫ్తాబ్పై దాడి జరిగిన విషయాన్ని అతని తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో నిందితుడ్ని కోర్టుకు తీసుకొచ్చే సమయంలో మరోసారి ఇలా దాడులు జరగకుండా పటిష్ఠ భద్రత కల్పించాలని సాకెత్ కోర్టు జైలు అధికారులను ఆదేశించింది. కాగా.. శ్రద్ధా హత్య కేసు వాదనలు పూర్తయ్యాయి. అయితే విశ్వసనీయమైన, క్లిష్ట సాక్ష్యాధారాల ద్వారా నేరారోపణ పరిస్థితులు వెల్లడయ్యాయని, కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని మార్చి 20నే ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇందుకు కౌంటర్గా అఫ్తాబ్ తరఫు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే శుక్రవారం అఫ్తాబ్ను కోర్టుకు తీసుకువచ్చారు. వాదనల అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది న్యాయస్థానం. తన ప్రేయసి శ్రద్ధవాకర్తో చాలాకాలంగా సహజీవనం చేసిన అఫ్తాబ్.. గతేడాది మేలో ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి అడవిలో పడేశాడు. కొన్ని నెలల తర్వాత వెలుగుచూసిన ఈ హత్యోదంతం దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చదవండి: మరో యువతితో ప్రేమాయణం.. ఇది తెలియడంతో హైదరాబాద్ వెళ్లి -
ఆప్ ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ఆప్ ఎమ్మెల్యే దినేశ్ మోహానియాకు బెయిల్ లభించింది. ఆయనకు సాకేత్ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. కాగా గతంలో దినేశ్ మోహానియాకు న్యాయస్థానం బెయిల్ తిరస్కరించిన విషయం తెలిసిందే. నీటి సరఫరా సక్రమంగా చేయాలని కోరుతూ తన దగ్గరకు వచ్చిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెను హింసించిన ఘటనలో దినేష్ మోహనియాపై ఐపీసీ 306, 506, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గతవారం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న దినేశ్ మోహానియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టు 14 రోజులపాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఎమ్మెల్యే ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. కాగా ఆప్ నేతలు ఇలా కేసుల్లో ఇరుక్కోవడం ఇదే తొలిసారి కాదు. ఎమ్మెల్యేలు ధర్మేంద్ర సింగ్, సోమ్నాథ్ భారతి, మరో నేతపై కూడా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులు ఉన్నాయి. వివిధ కేసుల్లో ఇప్పటివరకూ ఢిల్లీ పోలీసులు ఎనిమిది మంది ఆప్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. -
ఆప్ ఎమ్మెల్యేకు బెయిల్ తిరస్కరణ
న్యూఢిల్లీ : ఆప్ ఎమ్మెల్యే దినేశ్ మోహనియాకు సాకేత్ కోర్టు సోమవారం బెయిల్ తిరస్కరించింది. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఆయనని పోలీసులు శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో దినేశ్ మోహనియా ఇవాళ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు బెయిల్ తోసిపుచ్చింది. మరోవైపు దినేశ్ మోహనియా జ్యుడిషియల్ కస్టడీని జూలై 11 వరకూ న్యాయస్థానం పొడిగించింది. కాగా నీళ్ల కోసం వెళ్తే తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఎమ్మెల్యే దినేశ్పై ఓ మహిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నీళ్ల గురించి మరోసారి అడగగానే తనతో పాటు ఇతర మహిళలను నోటికొచ్చినట్లు తిట్టి, తోసేశారంటూ దినేష్ మోహనియాపై ఫిర్యాదు చేశారు. -
నిర్భయ తీర్పును స్వాగతించిన వైఎస్ఆర్సిపి
-
ఉరిశిక్ష అమలుపై చర్చ Part 3
-
సాకేత్ కోర్టు వెలుపల వెల్లువెత్తిన నిరసన
-
ఉరిశిక్ష అమలుపై చర్చ Part 2
-
'విద్రోహులకు నిర్భయ తీర్పు ఓ మరణశాసనం'
విద్రోహులకు నిర్భయ కేసు తీర్పు ఓ మరణశాసనమని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు. నిర్భయ సామూహిక అత్యాచార కేసులో నిందితులకు శుక్రవారం న్యూఢిల్లీలోని సాకేత్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ సందర్భంగా హోం మంత్రి షిండేపై నిర్భయ కేసులో న్యాయస్థానం విధించిన తీర్పు పైవిధంగా స్పందించారు. క్రూరమైన నేరాలకు పాల్పడేవారికి ఆ శిక్ష ఓ హెచ్చరికా లాంటిందని ఆయన తెలిపారు. నిర్భయ కేసులో న్యాయం జరిగిందన్నారు. అత్యంత అరుదైన కేసుల్లో ఉరిశిక్ష తప్పని సరి అని ఆయన పేర్కొన్నారు. నిర్భయ కేసులో నిందితులు అమానవీయమైన చర్యలకు పాల్పడ్డారన్నారు. ఇకపై ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళ అధికారి ఉండేలా చర్యలు చేపట్టనున్నట్లు షిండే వివరించారు. మహిళలపై అత్యాచార కేసులు తమ శాఖ వద్ద ఏవి పెండింగ్లో లేవని హోం శాఖ మంత్రి షిండే తెలిపారు. -
నిర్భయ తల్లిదండ్రులకు న్యాయం జరిగింది : షిండే
-
నిర్భయ కేసులో మధ్యాహ్నం కోర్టు తీర్పు
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిన ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో దోషుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. ఢిల్లీలోని సాకేత్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు మధ్యాహ్నం 2.30 గంటలకు వారికి శిక్షలు ఖరారు చేయనుంది. శిక్షలు ఏవిధంగా ఉంటాయనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దోషులకు మరణశిక్ష విధించాలని నిర్భయ తల్లిదండ్రులతో పాటు దేశవ్యాప్తంగా పలు విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దోషులకు మరణశిక్ష పడే అవకాశాలే అధికంగా ఉన్నప్పటికీ యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలు కూడా లేకపోలేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా సాకేత్ కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కోర్టు మార్గంలో రోడ్లపై పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఉద్దేశపూర్వకంగానే 23ఏళ్ల నిస్సహాయ మెడికోపై ఈ నలుగురు అత్యాచారానికి పాల్పడి ఆమెను హతమార్చారని అదనపు సెషన్స్ న్యాయమూర్తి యోగేష్ ఖన్నా తన తీర్పులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వీరిని హత్యానేరం కింద కూడా దోషులుగా నిర్థారించడం వల్ల కనిష్ఠ స్థాయిలో యావజ్జీవ కారాగార శిక్ష, గరిష్ఠ స్థాయిలో మరణ శిక్ష విధించే అవకాశం ఉంది. తమకు క్షమాభిక్ష పెట్టాలని దోషులు వేడుకుంటున్నప్పటికీ వారి పట్ల ఎలాంటి సానుభూతి కనబరచాల్సిన అవసరం లేదని, వారికి ఉరిశిక్ష వేయాల్సిందేనని ఢిల్లీ పోలీసులు కూడా డిమాండ్ చేశారు. -
నిర్భయ కేసులో ఢిల్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు
-
జడ్జిమెంట్ డే
-
నిర్బయ కేసులో నేటి మధ్యాహ్నం తుది తీర్పు
న్యూఢిల్లీ : గత ఏడాది ఢిల్లీలో జరిగిన పారా మెడికల్ విద్యార్థిని నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో నేటి మధ్యాహ్నం 12.30 గంటలకు తుది తీర్పు వెలువడనుంది. ఈ కేసులో నలుగురు నిందితులను మంగళవారం ఉదయం పోలీసులు తీహార్ జైలు నుంచి సాకేత్ కోర్టుకు తరలించారు. ఈ కేసులో నలుగురు నిందితులు ఏపీ సింగ్, వివేక్ శర్మ, సదాశివగుప్తా, ముఖేశ్ అత్యాచారం, హత్య అభియోగాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నిందితులపై నేరాన్ని నిరూపించేందుకు ప్రాసిక్యూషన్ 85 మంది సాక్షులను విచారించింది. నిందితుల తరపున 17 మంది సాక్ష్యమిచ్చారు. డిసెంబరు 16, 2012న దక్షిణ ఢిల్లీలో ఓ కదులుతున్న బస్సులో 23 ఏళ్ల యువతిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. చివరకు బాధిత యువతి సింగపూర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాంసింగ్ మార్చి 11న ఢిల్లీలోని తీహార్ జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతనిపై విచారణ నిలిచిపోయింది. మరో నిందితుడైన కౌమార వ్యక్తికి శనివారం బాలల న్యాయస్థానం (జువైనల్ జస్టిస్ బోర్డు) మూడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ కేసులో న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.