రాష్ట్రస్థాయి చెస్పోటీలలో పెద్దివీడు ఉన్నత పాఠశాల విద్యార్థి
వీరబల్లి: ఈనెల 18, 19వ తేదీలలో విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి చెస్పోటీలలో వీరబల్లి మండలంలోని పెద్దివీడు రెడ్డివారిపల్లెలో గల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఎం.వెంకటేశ్వర్లు ప్రధమస్థానం సంపాదించినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీంద్రబాబు తెలిపారు. ఏపీ చెస్ ఫెడరేషన్ తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో జిల్లానుంచి 7మంది విద్యార్థులు పాల్గొనగా తమ పాఠశాల విద్యార్థి ప్రథమస్థానం సంపాదించారన్నారు. ఈ విద్యార్థికి ఏపీ ఫెడరేషన్ తానా వారు బంగారుపథకంతోపాటు రూ.10వేలు నగదు, జ్ఞాపికను బహుమతిగా అందజేశారు. ఈ విద్యార్థిని పాఠశాలలోని పీఈటీ ఉమాదేవితోపాటు ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.