sp Naveen Kumarm
-
'వెట్టి'పై డీజీపీ కార్యాలయంలో విచారణ
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఎస్పీపై వెట్టిచాకిరి వ్యవహారానికి సంబంధించి డీజీపీ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. డీఐజీ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విచారణకు మంగళవారం 18మంది హోంగార్డులు హాజరయ్యారు. కాగా రంగారెడ్డి జిల్లా ఎస్పీ నవీన్కుమార్ హోంగార్డులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారనే ఆరోపణలపై ఉన్నతస్థాయి కమిటీతో ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. గతంలోనూ పలు ఆరోపణలు ఎదుర్కొన్న జిల్లా ఎస్పీ నవీన్కుమార్ తాజాగా ఇంటి పనులకు హోంగార్డులను వినియోగించుకున్నారనే వార్తలు పతాక శీర్షికలకు ఎక్కాయి. ఆర్డర్లీ వ్యవస్థను ఎనిమిదేళ్ల క్రితం రాష్ర్ట ప్రభుత్వం రద్దు చేసినా ఇదేమీ పట్టని పోలీసు బాసు హోంగార్డుల ఇంటి సేవలతో తరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కిందిస్థాయి సిబ్బందిని గౌరవప్రదంగా చూసుకోవాల్సిన ఉన్నతాధికారి.. వారితో గొడ్డుచాకిరీ చేయిస్తున్న ఫొటోలు, వీడియోలు మీడియాలో హల్చల్ చేయడంతో పోలీస్వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. -
ఖాకీల్లో కలవరం
-
ఖాకీల్లో కలవరం
* ఎస్పీ ఇంట్లో ఆర్డర్లీ విధానంపై కదలిక * పోలీస్ బాస్ అరాచకాలను ఎండగట్టిన హోంగార్డులు * హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్తో పోలీసుల్లో అలజడి సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా పోలీస్ విభాగంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఎస్పీ నవీన్కుమార్ హోంగార్డులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారనే ఆరోపణలపై ఉన్నతస్థాయి కమిటీతో ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అనూహ్యంగా కొందరు హోంగార్డులు మీడియా ముందుకు వచ్చి ఎస్పీ అరాచకాలను ఎండగట్టారు. క్యాంపు కార్యాలయంలో, వ్యక్తిగత వ్యవహారాల్లోనూ హోంగార్డులతో చాకిరీ చేయించుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తంతు జిల్లా పోలీస్వర్గాలను ఒక్కసారిగా కలవరానికి గురిచేసింది. పోలీస్ బాస్పై హోంగార్డుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో ఆ శాఖలో గందరగోళం నెలకొంది. హెడ్కానిస్టేబుల్పై వేటు.. ఇదిలా ఉండగా బంట్వారం పోలీస్ స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న మహేష్ను ఎస్పీ నవీన్కుమార్ ఆదివారం సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే హోంగార్డుల మీడియా సమావేశం జరిగిన కొద్ది సమయంలోనే ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు రావడం గమనార్హం. మహేష్ గతంలో ఎస్పీ కార్యాలయంలో సీసీగా పనిచేశారు. అప్పట్లో పెట్రోల్, డీజిల్ వినియోగంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అయితే అకస్మాత్తుగా మహేష్పై సస్సెన్షన్ వేటు వేయడం పోలీస్ అధికారుల్లో చర్చనీయాంశమైంది. హోంగార్డులను వ్యక్తిగత పనులకు వాడుకుంటున్న ఫొటోలను సోషల్ మీడియాలో మహేష్ పోస్టు చేశాడనే ప్రచారం సాగుతోంది. ఈ చర్యలపై ఎస్పీ నవీన్ ఆగ్రహించి సస్పెండ్ చేసినట్లు సర్వత్రా గుసగుసలు వినిపిస్తుండడం గమనార్హం. -
వెట్టిచాకిరి కేసులో కొత్త ట్విస్ట్
రంగారెడ్డి: రంగారెడ్డి ఎస్పీ నవీన్కుమార్ ఇంట్లో 'హోమ్గార్డుల వెట్టిచాకిరి' కేసు కొత్త మలుపు తిరిగింది. హోమ్గార్డులతో వెట్టిచాకిరీ చేయిస్తున్న రంగారెడ్డి జిల్లా ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్లు వస్తుంటే...కానిస్టేబుల్ మహేశ్నే ఎస్పీ సస్పెండ్ చేశారు. అధికారిక సమాచారాన్ని లీక్ చేశారని సస్పెన్షన్ వేటు వేసినట్టు వెల్లడించారు. గతంలోనూ పలు ఆరోపణలు ఎదుర్కొన్న జిల్లా ఎస్పీ నవీన్కుమార్ తాజాగా ఇంటి పనులకు హోంగార్డులను వినియోగించుకున్నారనే వార్తలు పతాక శీర్షికలకు ఎక్కాయి. ఆర్డర్లీ వ్యవస్థను ఎనిమిదేళ్ల క్రితం రాష్ర్ట ప్రభుత్వం రద్దు చేసినా ఇదేమీ పట్టని పోలీసు బాసు హోంగార్డుల ఇంటి సేవలతో తరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కిందిస్థాయి సిబ్బందిని గౌరవప్రదంగా చూసుకోవాల్సిన ఉన్నతాధికారి.. వారితో గొడ్డుచాకిరీ చేయిస్తున్న ఫొటోలు, వీడియోలు మీడియాలో హల్చల్ చేయడంతో పోలీస్వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే హోంగార్డులు తన ఇంట్లో పని చేసిన వ్యవహారంలో కుట్రజరిగిందని మహేశ్ అనే కానిస్టేబుల్ పథకం ప్రకారం ఈ పని చేశాడని ఎస్పీ నవీన్ కుమార్ తెలిపారు. దీని పై విచారణ కూడా చేయిస్తామన్నారు. ఇంతలోనే మహేశ్ పై వేటు పడటం గమనార్హం. -
వెట్టిచాకిరి కేసులో కొత్త ట్విస్ట్