'వెట్టి'పై డీజీపీ కార్యాలయంలో విచారణ | Ranga Reddy SP Naveen Kumar Violates Orderly System, home guards attend enquiry | Sakshi
Sakshi News home page

'వెట్టి'పై డీజీపీ కార్యాలయంలో విచారణ

Published Tue, Jul 12 2016 11:58 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

Ranga Reddy SP Naveen Kumar Violates Orderly System, home guards attend enquiry

 హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఎస్పీపై వెట్టిచాకిరి వ్యవహారానికి సంబంధించి డీజీపీ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. డీఐజీ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విచారణకు మంగళవారం  18మంది హోంగార్డులు హాజరయ్యారు. కాగా రంగారెడ్డి జిల్లా  ఎస్పీ నవీన్‌కుమార్ హోంగార్డులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారనే ఆరోపణలపై ఉన్నతస్థాయి కమిటీతో ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

గతంలోనూ పలు ఆరోపణలు ఎదుర్కొన్న జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ తాజాగా ఇంటి పనులకు హోంగార్డులను వినియోగించుకున్నారనే వార్తలు పతాక శీర్షికలకు ఎక్కాయి. ఆర్డర్లీ వ్యవస్థను ఎనిమిదేళ్ల క్రితం రాష్ర్ట ప్రభుత్వం రద్దు చేసినా ఇదేమీ పట్టని పోలీసు బాసు హోంగార్డుల ఇంటి సేవలతో తరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కిందిస్థాయి సిబ్బందిని గౌరవప్రదంగా చూసుకోవాల్సిన ఉన్నతాధికారి.. వారితో గొడ్డుచాకిరీ చేయిస్తున్న ఫొటోలు, వీడియోలు మీడియాలో హల్‌చల్ చేయడంతో పోలీస్‌వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement