Survey of India
-
మొత్తం చెరువులెన్ని.. ఎన్ని మిగిలాయి?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరం పరిధిలో మొత్తంగా ఎన్ని చెరువులు ఉండేవి? ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? ఎంత మేర ఆక్రమణలకు గురయ్యాయి? అనే లెక్కలను శాస్త్రీయంగా తేల్చాలని ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)’నిర్ణయించింది. దీని కోసం సర్వే ఆఫ్ ఇండియా సహకారం తీసుకోనుంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఇతర అధికారులు మంగళవారం హబ్సిగూడలో ఉన్న సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయానికి వెళ్లారు.సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ బీసీ పరీడా, సూపరింటెండెంట్ ఆఫ్ సర్వే దేబబ్రత పాలిత్తోపాటు ఇతర అధికారులతో సమావేశమై చర్చించారు. సర్వే ఆఫ్ ఇండియా గతంలో రూపొందించిన మ్యాప్లను రంగనాథ్ పరిశీలించారు. 1971–72 నాటి సర్వే ప్రకారం నగరంలో ఎన్ని చెరువులు ఉన్నాయి? అప్పట్లో వాటి విస్తీర్ణం ఎంత? నాలాలు ఎక్కడెక్కడ, ఎంత విస్తీర్ణంలో ఉండేవి? తదితర విషయాలు పరిశీలించారు. తాజా మ్యాప్లతో వాటిని సరిపోల్చి చూశారు. ఈ అంశాలను సర్వే ఆఫ్ ఇండియా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హైడ్రా బృందానికి వివరించారు. పూర్తి వివరాలతో నివేదిక రూపకల్పనపై దృష్టి చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్, మాగ్జిమమ్ వాటర్ స్ప్రెడ్ ఏరియాలను గుర్తించడానికి, తాజాగా నిర్థారించడానికి ఇప్పటికే హెచ్ఎండీఏ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీలతో కలిసి ముందుకు వెళ్తున్న హైడ్రా.. ఇప్పటికే ఆయా విభాగాల నుంచి సమాచారం సేకరించింది. ఆ డేటాను సర్వే ఆఫ్ ఇండియా డేటాతో క్రోడీకరించనుంది. మంగళవారం సర్వే ఆఫ్ ఇండియా అందించిన వివరాలతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని చెరువుల పరిస్థితిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని నిర్ణయించింది. సర్వే ఆఫ్ ఇండియా డేటాను డిజిటలైజ్ చేయడంతోపాటు చెరువుల విస్తీర్ణం, నాలాల పొడవు, వెడల్పులను నిర్ధారించి ఈ నివేదికలో పొందుపర్చనుంది. నివేదికకు తుదిరూపు ఇచ్చాక తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది. ప్రాధాన్యత క్రమంలో చెరువులను గుర్తించి పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు. -
సర్వే ఆఫ్ ఇండియా ఆఫీసుకు హైడ్రా.. 1971 నాటి మ్యాప్ల పరిశీలన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రా అంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు, ఏ చోటకు హైడ్రా అధికారులు వస్తారోనని టెన్షన్ పడుతున్నారు. ఇక, పలుచోట్ల అక్రమ నిర్మాణాలను టార్గెట్ చేస్తూ హైడ్రా ముందుకు సాగుతోంది. మరోవైపు.. కబ్జాలకు గురైన చెరువులను గుర్తించేందుకు హైడ్రా భారీ కసరత్తు చేస్తోంది.గొలుసు కట్టు చెరువులకు ప్రసిద్ధి చెందిన నగరంలో అసలు ఎన్ని చెరువులుండేవి?. ఇప్పుడు ఎన్ని ఉన్నాయనే లెక్కలు తేల్చేందుకు సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి హైడ్రా పని చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో చెరువులను గుర్తించేందుకు మంగళవారం సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో హైడ్రా అధికారులు సమీక్ష చేపట్టారు. హబ్సీగూడలో ఉన్న సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయానికి మంగళవారం హైడ్రా అధికారుల బృందంతో వెళ్లారు కమిషనర్ ఏవీ రంగనాథ్. సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ బీసీ పరీడా, సూపరింటెండెంట్ ఆఫ్ సర్వే డేబబ్రత పాలిట్తో పాటు ఇతర అధికారులతో హైడ్రా ఉన్నతాధికారుల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన పాత మ్యాప్లను కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు.1971-72 సర్వే ప్రకారం నగరంలో ఎన్ని చెరువులు ఉన్నాయి. చెరువులు ఎంత విస్తీర్ణంలో ఉండేవి. ప్రస్తుతం వాటి పరిస్థతి ఏంటి?. నాలాలు ఎలా.. ఎంత విస్తీర్ణంలో ఉండేవి. ఇప్పుడు ఎంత మేర కబ్జా అయ్యాయి అనే అంశాలను మ్యాప్ల ద్వారా పరిశీలించారు. దశాబ్దాల క్రితం నాటి మ్యాప్లతో పాటు.. నేటి పరిస్థితిని సరిపోల్చుతూ చెరువులు, నాలాల వివరాలను పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా కమిషనర్కు వివరించారు సర్వే ఆఫ్ ఇండియా అధికారులు. ఇప్పటికే హెచ్ఎండీఏ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ నుంచి సేకరించిన చెరువుల జాబితాతో.. సర్వే ఆఫ్ ఇండియా వద్ద ఉన్న సమాచారాన్ని క్రోఢీకరించి చెరువులు, నాలాల పరిస్థితి, కనుమరుగైన చెరువులపై అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో చెరువులను ఆక్రమించి కట్టిన మరిన్ని కట్టడాలను హైడ్రా కూల్చివేసే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: పవన్ కల్యాణ్పై కేఏ పాల్ ఫిర్యాదు -
ఏపీలో అరుదైన పగడపు దిబ్బలు.. ఎక్కడ ఉన్నాయంటే?
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తీరంలో ఎక్కడా లేని విభిన్న పగడపు దిబ్బలకు చిరునామాగా విశాఖపట్నం జిల్లా పూడిమడక మారింది. కోస్తా తీరంలో పగడపు దిబ్బలు అస్సలుండవు అనే మాట తప్పని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జెడ్ఎస్ఐ) పరిశోధనలు నిరూపించాయి. ఒకే ప్రాంతంలో విభిన్న రకాల కోరల్స్(పగడపు దిబ్బలు) ఉన్నట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు.. వీటిని మరోచోటికి తరలించి అభివృద్ధి చేసేందుకు కూడా అనువుగా ఉన్నాయని స్పష్టం చేశారు. చదవండి: ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి తర్వాత అందంగా లేదని.. దారుణంగా రాష్ట్రంలో జెడ్ఎస్ఐ.. విశాఖ జిల్లా పూడిమడక నుంచి విజయనగరం జిల్లా చింతపల్లి తీరం వరకు సర్వే నిర్వహించగా.. ఈ ప్రాంతమంతా విభిన్న జాతుల వైవిధ్య సముదాయంగా ఉందని స్పష్టమయ్యింది. భారతీయ పగడాల వర్గీకరణపై నిరంతర పరిశోధన చేస్తున్న జెడ్ఎస్ఐ మొట్టమొదటిసారిగా ఆంధ్రా తీరంలో 2020 నుంచి ప్రతి ఏటా జనవరి 17 నుంచి 26వ తేదీ వరకు మూడేళ్ల పాటు సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక అంశాలు వెల్లడయ్యాయి. విభిన్న రకాల పగడపు దిబ్బలు.. పూడిమడక, భీమిలి, రుషికొండ, యారాడ, కైలాసగిరి, సాగర్నగర్, ఆర్కేబీచ్, మంగమూరిపేట, తెన్నేటిపార్కు, చింతపల్లి బీచ్లలో ఒక్కో ప్రాంతంలో నాలుగు భిన్నమైన ప్రదేశాల్ని సర్వే పాయింట్లుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో 30 మీటర్ల లోతులో సాగరగర్భంలో అన్వేషణ సాగించారు. స్థానిక స్కూబాడైవింగ్ సంస్థ లివిన్ అడ్వెంచర్స్ సహకారంతో నలుగురు శాస్త్రవేత్తల బృందం చేపట్టిన సర్వేలో పూడిమడక కేంద్రంగా విభిన్న పగడపు దిబ్బలున్నట్లు గుర్తించారు. స్కెలరాక్టినియా కోరల్స్, పవోనాఎస్పీ, లిథోపిలాన్ ఎస్పీ, మోంటీపోరా ఎస్పీ, పోరిటెస్ ఎస్పీ, హెక్సాకోరిలియా, ఆక్టోకోరలియా, డిస్కోసోమా, లోబాక్టిస్ వంటి అరుదైన పగడపు దిబ్బలున్నట్లు కనుగొన్నారు. సాగర గర్భంలో కనుగొన్న పగడపుదిబ్బలు మరోచోట పెంచుకునేందుకు వీలుగా.. ఒక చోట పెరిగే పగడపు దిబ్బల్ని కొంత భాగం తీసి.. మరోచోట పెంచే రకాలు అరుదుగా ఉంటాయి. ఇలాంటి అరుదైన కోరల్స్ పూడిమడకలో ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా.. ఈ తరహా కోరల్స్.. మేరీటైమ్ మెడిసిన్ తయారీకీ ఉపయోగపడతాయని గుర్తించారు. ప్రతి ఏటా 9 రోజుల పాటు ఆయా బీచ్లలో సబ్–టైడల్, ఇంటర్–టైడల్ ప్రాంతాల్లో సర్వే నిర్వహించి.. విభిన్న జీవరాశులకు సంబంధించిన నమూనాలు సేకరించారు. 1,597 మొలస్కా జాతులు, 182 సినిడారియన్, 161 స్పాంజ్, 133 రకాల చేపలు, 106 క్రస్టేసియన్లు, 12 అసిడియన్లు, 3 ఫ్లాట్ వార్మ్లతో పాటు.. అన్నెలిడ్ జీవజాతుల నమూనాల్ని సేకరించారు. మత్స్యసంపదకు ఉపయుక్తం.. సముద్ర గర్భంలో పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలుగా పగడపు దిబ్బల్ని పిలుస్తారు. పగడాల ద్వారా స్రవించే కాల్షియం కార్బోనేట్ నిర్మాణాల వల్ల ఇవి ఏర్పడతాయి. ఇవి కొన్ని పోషకాలను కలిగి ఉంటాయి. పగడపు దిబ్బలు సముద్రగర్భంలో అత్యంత వైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థలను ఏర్పరుస్తాయి. ఇవి ఉంటే.. సముద్ర జీవరాశులు ఎక్కువగా పెరిగేందుకు ఉపయోగపడతాయి. విభిన్న జీవరాశుల సమాహారం... పూడిమడక తీరం విభిన్న జీవరాశులతో కళకళలాడుతోందని జెడ్ఎస్ఐ సర్వేలో వెల్లడైంది. విదేశీ తీరాల్లో కనిపించే సూక్ష్మ జాతి సముద్ర జీవ రాశులు కూడా పూడిమడకలో ఉన్నట్లుగా గుర్తించారు. పీత జాతికి చెందిన అరుదైన తెనస్, స్పాంజ్, స్టార్ఫిష్, ఇండో పసిఫిక్ సముద్రంలో ఉండే స్టోమోప్నిస్టెస్ సముద్రపు ఆర్చిన్లు, సీ బటర్ఫ్లైస్గా పిలిచే హెనియోకస్ చేపలు, ఒంటెరొయ్యలు.. ఇలా భిన్నమైన జీవజాలంతో పూడిమడక తీరం అద్భుతంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు నివేదికలో పొందుపరిచారు. మరోసారి సర్వే.. పూడిమడక తీరం.. విభిన్న సముద్ర జీవజాతుల సమాహారంగా ఉంది. ఇక్కడ ఉన్న పగడపు దిబ్బలు చాలా అరుదైన రకాలు. ఈ తరహా సముద్ర గర్భ వాతావరణం ఇక్కడ ఉండటం నిజంగా ఆశ్చర్యకరం. మొత్తం డాక్యుమెంటేషన్ నిర్వహించాం. ఇక్కడి కోరల్స్.. సముద్ర పర్యాటకానికి, వైద్యరంగంలో ఔషదాల తయారీకి, మెరైన్ రిలేటెడ్ రీసెర్చ్కు ఎంతగానో ఉపయోగపడతాయి. వచ్చే ఏడాది మరోసారి లోతైన అధ్యయనం చేయాలని భావిస్తున్నాం. – డాక్టర్ జేఎస్ యోగేష్ కుమార్, జెడ్ఎస్ఐ సీనియర్ సైంటిస్ట్ చింతపల్లి వరకు అరుదైన జీవజాలం జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన పరిశోధనలకు రాష్ట్రం తరఫున పూర్తి సహకారం అందించాం. పూడిమడక నుంచి చింతపల్లి వరకు ప్రతి ప్రాంతం విభిన్న రకాల జీవజాతులతో అద్భుతంగా కనిపించాయి. 30 మీటర్ల లోతు వరకు పగడపు దిబ్బల్లో ఉన్న జంతుజాలం ఫొటోల్ని జెడ్ఎస్ఐకి అందించాం. రీఫ్లు, కోరల్స్ ద్వారా.. మత్స్యసంపద చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. అయితే కాలుష్యం బారిన పడకుండా వీటిని సంరక్షించుకోవాలి. – బలరాం, లివిన్ అడ్వెంచర్స్ స్కూబా ఇన్స్ట్రక్టర్ -
రైతు ఆదాయంపై అర్ధసత్యాలు
దేశంలోని రైతు కుటుంబాల పరిస్థితిపై ఇటీవలే వెలుగులోకి వచ్చిన జాతీయ గణాంకాల సర్వే సంస్థ (ఎన్ఎస్ఎస్) సర్వే వెల్లడించిన వాస్తవాలకంటే అది దాచిపెట్టిన నిజాలే ఎక్కువగా ఉంటున్నాయి. సగటు రైతు కుటుంబం నెలకు రూ. 10 వేల వరకు సంపాదిస్తోందని ఈ సర్వే చెబుతోంది కానీ, అది అర్ధసత్యం మాత్రమే. రైతు సంపాదిస్తున్న ప్రతి రూపాయి, సాగు ద్వారా మాత్రమే రావడం లేదు. ఇతర శ్రమలు, ద్రవ్యోల్బణం వంటివి తీసివేస్తే, పంట సాగు ద్వారా రైతుకు వచ్చే నెలవారీ ఆదాయం రూ. 3,798 మాత్రమే. మొత్తం రైతు కుటుంబ ఆదాయంలో ఇది చాలా చిన్న భాగమనే వాస్తవాన్ని ఈ సర్వే దాచిపెట్టింది. ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకోని ఈ సగటు గణాంకాలు అటు రైతులకూ, ఇటు దేశానికీ మేలుకొలుపు కావాలి. దేశంలో గత కొద్ది నెలలుగా సాగుతున్న రైతుల ఉద్యమంలో బాగా ప్రాచుర్యం పొందిన నినాదాల్లో ‘మా తిండికోసం, మా పంటకోసం’ మేం పోరాడుతున్నాం అనేది ఒకటి. దేశంలోని రైతుల పరిస్థితులపై తాజాగా వెలువడిన ఒక అధికారిక సర్వే, ఈ నినాదం సంపూర్ణ సత్యమని చూపిస్తోంది. 2021 సెప్టెంబర్ 10న ప్రకటించిన కేంద్రప్రభుత్వ కీలక నివేదిక వెల్లడిస్తున్న అంశాలు... మన విధాన నిర్ణేతలు, రాజకీయ నేతలకు మాత్రమే కాకుండా రైతులు, రైతుల ఉద్యమాలకు కూడా మేలుకొలుపు కలిగిస్తున్నాయి. గ్రామీణ భారతంలో 2019లో వ్యవసాయ కుటుంబాలు, వారి స్వాధీనంలో ఉన్న భూమి, పశుగణం తదితరాల పరిస్థితి అంచనాపై ఎన్ఎస్ఎస్ 77వ నివేదిక పట్ల దేశం ఎంతో ఆసక్తితో వేచి చూసింది. ఎట్టకేలకు విడుదలైన ఆ సర్వే నివేదిక ప్రధానంగా ఒక అంశంపై దృష్టి పెట్టింది. సగటు వ్యవసాయ కుటుంబంపై ఉన్న రుణభారం రూ. 47 వేలనుంచి రూ. 74 వేలకు అమాంతంగా పెరిగిపోయిందని ఈ సర్వే తెలిపింది. ఇది కలవరపెట్టే అంశం. రైతుల పరిస్థితి మెరుగవుతోంది అని చెబుతున్న తరుణంలోనే వారు చెల్లించాల్సిన బకాయిలు అధికంగా పేరుకుపోతున్నాయి. కాని ఇది వ్యాధికాదు, వ్యాధి లక్షణం మాత్రమే. అసలైన సమస్య ఏదంటే రైతు ఆదాయమే. లేదా ఆదాయం లేకపోవడమేనని చెప్పాలి. రైతుల ఆదాయం గురించి ఈ సర్వే ఏం చెబుతోందంటే... దేశంలో సగటు రైతు కుటుంబం నెలకు రూ. 10 వేల దాకా ఆదాయం సంపాదిస్తోంది. నిజానికి పట్టణాల్లోని ఇళ్లలో పనిచేస్తున్న వారు సంపాదించే ఆదాయం కంటే ఇది తక్కువ. 2013లో నిర్వహించిన ఇదే సర్వేలో రైతు కుటుంబం నెలవారీ ఆదాయం రూ. 6,442లు ఉండగా, ఆరేళ్ల తర్వాత అంటే 2019లో సగటు రైతు కుటుంబం ఆదాయం రూ. 10,218లకు పెరిగింది. ఈ లెక్కలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. పైగా, ఇవి వెల్లడించిన అంశాల కంటే దాచి ఉంచినవే ఎక్కువ. ఈ లెక్కలు సగటు రైతు కుటుంబం నెలకు రూ. 10 వేల కంటే ఎక్కువ సంపాదిస్తోందన్న అభిప్రాయం కలిగిస్తున్నాయి. రైతు కుటుంబం మూల ఆదాయం తక్కువగానే ఉంటున్నప్పటికీ, అది హేతుపూర్వక రీతిలో పెరుగుతోందని ఈ లెక్కలు చెబుతున్నాయి. దీనికంటే వాస్తవాన్ని కప్పిపుచ్చే అంశం మరొకటి ఉండదు. ఇదెలాగో చూద్దాం మరి. ఎన్ఎస్ఎస్ సర్వే గణాంకాలతో సమస్య మొదటగా, రైతుల ఆదాయం అని చెబుతున్నది సగటు కుటుంబ ఆదాయమే కాబట్టి ఇది వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తోంది. పదెకరాల కంటే ఎక్కువ భూమి కలిగి నెలకు దాదాపుగా రూ. 30 వేల వరకు సంపాదిస్తున్న బడా రైతులను కూడా సగటు కుటుంబాలలో కలిపేశారు. బడా రైతు కుటుంబాలు సంపాదిస్తున్న ఈ మొత్తం కంటే ప్రభుత్వంలోని నాలుగో గ్రేడ్ ఉద్యోగి సంపాదించేదే ఎక్కువగా ఉంటుందని గమనించాలి. ఒకటి నుంచి 2.5 హెక్టార్ల వరకు భూమిని సాగు చేస్తున్న మధ్యతరగతి రైతు కుటుంబ ఆదాయం నెలకు రూ. 8,571ల కంటే తక్కువగానే ఉంటుంది. రెండోది, ఇది వ్యవసాయం ద్వారా వస్తున్న ఆదాయం కాదు. వ్యవసాయ కుటుంబం సంపాదిస్తున్న ఆదాయం. ఈ రెండింటికి తేడాను అర్థం చేసుకోవడమే చాలా కీలకమైంది. రైతు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ రైతు కాదు. రైతు సంపాదిస్తున్న ప్రతి రూపాయి వ్యవసాయం ద్వారా మాత్రమే రావడం లేదు. వ్యవసాయ కుటుంబం అనే భావనను ఈ సర్వే విస్తృత ప్రాతిపదికన నిర్వచిస్తోంది. గ్రామీణ వ్యవసాయ కుటుంబం పంటల ద్వారా, లేక పశుపెంపకం ద్వారా అతి తక్కువ ఆదాయం మాత్రమే సంపాదిస్తున్నాయి. రైతు కుటుంబంలో తండ్రి పొలం పని చేస్తే, తల్లి పశువులను మేపుతుంది. కుమార్తె స్థానిక పాఠశాలలో బోధిస్తుంటే, రైతు కుమారుడు షాపు నడుపుతుంటాడు. వ్యవసాయ కుటుంబం ఇలాగే ఉంటుంది. ఒక రైతు కుటుంబం సంపాదిస్తున్న ఈ నాలుగు రకాల ఆదాయాన్ని కలిపేసి ఈ మొత్తాన్ని వ్యవసాయ కుటుంబ ఆదాయంగా లెక్కిస్తున్నారు. మొత్తంమీద చూస్తే పంట సాగు ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రైతు ఆదాయంలో చాలా చిన్న భాగం. ఇది ఊహాజనితమైన ఉదాహరణ కాదు. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం రైతు కుటుంబం సంపాదించే ఆదాయంలో మూడోవంతు మాత్రమేనని తాజా సర్వే చెబుతోంది. ఒక నెలలో సగటు రైతు కుటుంబం రకరకాల పంటల సాగు ద్వారా రూ. 3,798లు సంపాదిస్తోంది. ఇక పశువుల పెంపకం ద్వారా రూ. 1,582లను, వ్యాపారం నుంచి రూ. 641లను, కూలీలు, వేతనాల ద్వారా రూ. 4,063లను ఆర్జిస్తోంది. మరో మాటలో చెప్పాలంటే, రైతు కుటుంబం తన సొంత భూముల్లో పనిచేయడం కంటే తన శ్రమను ఇతరత్రా వెచ్చించడం ద్వారానే ఎక్కువగా సంపాదిస్తోంది. కాబట్టి పైన చెప్పినట్లుగా రైతు వ్యవసాయం ద్వారా వస్తున్న ఆదాయం రూ. 3,798లు మాత్రమే. మన రైతులు ఎందుకు పట్టణాలు, నగరాలకు పరుగెడుతున్నారో, ప్రభుత్వోద్యోగాలకు ప్రతి ఒక్కరూ ఎందుకింతగా వెంపర్లాడుతున్నారో దీన్ని బట్టే అర్థమవుతుంది. మూడు, ఈ కనీస మొత్తాన్ని కూడా అతిశయించి చెబుతున్నారు. రైతు ఆదాయాన్ని అధికం చేసి చూపడంలో సర్వే పరిమితి దాటినట్లుంది. రైతుచేతికి వస్తున్న డబ్బు మొత్తంగా వ్యవసాయ ఉత్పత్తులను అమ్మగా వస్తున్నదేనని ఈ లెక్కలు చెబుతున్నాయి. పంటల సాగుకు అయ్యే ఖర్చులన్నీంటినీ రైతు నేరుగా చెల్లించిన తర్వాత రైతుకు మిగులుతున్న ఆదాయంగా ఇవి సూచిస్తున్నాయి. ఈ వ్యత్యాసమే రైతుకు లాభం అని అంచనా వేశారు. రైతు కుటుంబం సొంత శ్రమ, ఇతర పెట్టుబడులను సాగు ఖర్చులో కలపడం లేదు. నగదు రూపంలో చెల్లించని ఈ మొత్తాల విలువను కూడా లెక్కించినట్లయితే, మొత్తం పంట సాగు ఖర్చు, వశుపెంపకం ఖర్చులు ఎక్కువై రైతు లాభం అంటున్నది తగ్గిపోతుంది. ఈ సరైన పద్ధతిని మీరు అనుసరిస్తే, పంట సాగు ద్వారా రైతుకుటుంబానికి వచ్చే నెలవారీ ఆదాయం కేవలం రూ. 3,058లకు, పశుపెంపకం ద్వారా వచ్చే ఆదాయం రూ. 441లకు పడిపోతుంది. ఈ లెక్కన రైతు కుటుంబం మొత్తం ఆదాయం నెలకు రూ. 8,337లు మాత్రమే అని స్పష్టమవుతుంది. నాలుగు, రైతుల ఆదాయంలో ఆరోగ్యకరమైన పెరుగుదల కనిపిస్తోందంటూ సర్వే చెబుతున్నది అసత్యం. ఎందుకంటే ఇది ద్రవ్యోల్బ ణాన్ని లెక్కలోకి తీసుకోని సాధారణ లెక్కలు. 2013, 2019 మధ్యకాలంలో అంటే అప్పటి, ప్రస్తుత సర్వే నిర్వహించిన మధ్య కాలంలో రైతుల నామమాత్రపు ఆదాయం 59 శాతం పెరిగింది. కానీ ఈ లెక్కలను మీరు ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసినట్లయితే, (2019 కోసం గ్రామీణ భారత్కి వినియోగదారీ ధరల సూచి, బేస్ ఇయర్ 2012), రైతు ఆదాయం పెరుగుదల 22 శాతం మాత్రమే. అంటే ముందే చెప్పినట్లుగా ఇది రైతు కుటుంబం మొత్తానికి అన్ని రకాల ఆదాయాలు కలిసి వచ్చిన ఆదాయ పెరుగుదల అన్నమాట. పంట సాగు ద్వారా వచ్చిన ఆదాయాన్ని మాత్రమే మనం చూసినట్లయితే, ఈ ఆరు సంవత్సరాల్లో రైతు కుటుంబం ఆదాయం వాస్తవానికి క్షీణించిపోయింది. 2013లో రైతు పంట సాగు ద్వారా రూ. 3,081లు సంపాదించేవాడు. 2012 బేస్ ఇయర్లో ధర ప్రకారం ఇది రూ. 2,770లకు సమానం. ఈ బేస్ ఇయర్ని మనం నిలుపుకున్నట్లయితే, రైతుల తాజా నెలవారీ ఆదాయం (రూ. 3,798) కేవలం రూ. 2,645లకు సమానం. అంటే గత ఆరేళ్లలో రైతుల ఆదాయం 5 శాతం తగ్గిపోయిందన్నమాట. కాబట్టి ఈ సర్వేకి వాస్తవమైన శీర్షిక ఇలా ఉంటే యుక్తంగా ఉంటుంది. ‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే చారిత్రాత్మక మిషన్ నిజానికి చారిత్రాత్మక తిరోగమనానికి దారితీస్తోంది’. యోగేంద్రయాదవ్ వ్యాసకర్త జై కిసాన్ ఆందోళన్ సహ సంస్థాపకుడు, స్వరాజ్ ఇండియా సభ్యుడు -
ఆంధ్రప్రదేశ్: గ్రామ కంఠాల్లోని ఆస్తులకు సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా గ్రామ కంఠాల్లో ఇల్లు లేదా ఖాళీ స్థలమున్న వారికి ఆస్తి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష పథకంలో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్టు 15న వీటిని పంపిణీ చేయనుందని సమాచారం. దాదాపు 100 గ్రామ కంఠాల్లో 20 వేల నుంచి 25 వేల వరకు ఆస్తులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో ధ్రువీకరణ పత్రాలు అందజేయించాలని పంచాయతీరాజ్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. 241 గ్రామాల్లోని ఆస్తులకు మ్యాప్లలో మార్కింగ్.. గ్రామ కంఠాల్లో ప్రజలకు సంబంధించిన ఇళ్లు, ఖాళీ స్థలాలకు ఇప్పటిదాకా అధికారిక ధ్రువీకరణ పత్రాల్లేవు. దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆయా ఇళ్లు, ఖాళీ స్థలాలను గుర్తించే ప్రక్రియ చేపట్టింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష పథకంలో భాగంగా ఇప్పటిదాకా 753 గ్రామాల్లో సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా సర్వే పూర్తయ్యిందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే 241 గ్రామాల్లోని ఇళ్లు, ఖాళీ స్థలాలకు మ్యాప్లలో మార్కింగ్ చేశారు. వీటిని పంచాయతీరాజ్ శాఖకు సర్వే ఆఫ్ ఇండియా అధికారులు అందజేశారు. పంచాయతీరాజ్ శాఖ సంబంధిత గ్రామాలకు వీటిని పంపిస్తోంది. గ్రామ పంచాయతీ సిబ్బంది క్షేత్ర స్థాయిలో వ్యక్తిగతంగా ఒక్కొక్క ఆస్తిని ధ్రువీకరించుకుంటారు. ఇవి కాకుండా క్షేత్ర స్థాయిలోని అధికారులు ఏవైనా ఆస్తులను గుర్తిస్తే.. వాటి వివరాలను మ్యాప్కు జత చేసి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపిస్తారు. ఈ వివరాలను పరిశీలించి మళ్లీ కొత్త మ్యాప్లను తయారు చేస్తారు. తుది మ్యాప్లో గ్రామ పరిధిలోని ఒక్కొక్క ఆస్తికి ప్రత్యేక నంబర్ కేటాయిస్తారు. పంచాయతీరాజ్ శాఖ ఒక్కొక్క ఆస్తికి.. దాని యజమాని వివరాలతో ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తుంది. ఈ పత్రాల్లో ఆ ఆస్తికి సంబంధించిన మ్యాప్ కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. 16 గ్రామాల్లో 3,170 ఆస్తుల వివరాలు సిద్ధం ఇప్పటివరకు 16 గ్రామాల పరిధిలో ఆస్తి ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఈ 16 గ్రామాల పరిధిలో ఉన్న 3,170 ఆస్తులకు సంబంధిత యజమాని వివరాలతో పాటు మ్యాప్లు సిద్ధమయ్యాయని వెల్లడించారు. ఇతర గ్రామాల్లోనూ ఈ ప్రక్రియ వేగంగా జరుగుతోందని చెప్పారు. కృష్ణా జిల్లా బూతుమిల్లిపాడు పరిధిలోని గ్రామ కంఠంలో ఉన్న ఆస్తుల గుర్తింపు ప్రక్రియను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ పరిశీలించారు. -
విజయవాడ: ఈ నెల 21 నుంచి రీసర్వే ప్రారంభం
-
ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు: గిరీష్ కుమార్
సాక్షి, విజయవాడ: భూముల రీసర్వే కచ్చితత్వంతో పూర్తి చేస్తామని సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్ అన్నారు. మొదటి దశలో భాగంగా ఈ నెల 21న రీసర్వే ప్రారంభవుతుందని తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో రాష్ట్రవ్యాప్తంగా భూములను సమగ్రంగా రీసర్వే చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం సర్వే ఆఫ్ ఇండియాతో బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో గిరీష్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలోనే మొదటిసారిగా ఏపీలో మాత్రమే రీసర్వే జరగనుందని పేర్కొన్నారు. తమతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ‘‘ పూర్తి ఆధునిక సాంకేతికత ద్వారా రీసర్వే చేపడతాం. ఒప్పందంలో భాగంగా ఏపీ ప్రభుత్వానికి సాంకేతిక సహకారం అందిస్తాం. అత్యాధునిక కెమెరాలు, డ్రోన్లు వినియోగిస్తున్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానంపై 14 వేల మంది సర్వేయర్లకి శిక్షణ ఇవ్వనున్నాం. రీసర్వే చేసి మేం ఇచ్చే మ్యాపులు అన్ని ప్రభుత్వ శాఖలకి ఉపయోగకరంగా ఉంటాయి. సర్వే ఆఫ్ ఇండియాకి ప్రామాణికత అధికం. మూడు దశల్లో కచ్చితత్వంతో రీసర్వే పూర్తిచేస్తాం. జాతీయ మ్యాపులు తయారు చేసే ఏజెన్సీగా సర్వేయర్ ఆఫ్ ఇండియా ఉంది. రీసర్వేకి జీపీఎస్ అనుసంధానం చేసిన డ్రోన్తో కొనసాగుతుంది. అయిదు సెంటీమీటర్ల మార్పుతో కచ్చితమైన సర్వే జరుగుతుంది. తిరుపతిలో ఒక ట్రైనింగ్ అకాడమి ఏర్పాటు చేస్తాం. ఛార్టర్డ్ సర్వేయర్లను రాబోయే కాలంలో అందించేందుకు ఈ ట్రైనింగ్ అకాడమీ ఉంటుంది’’ అని గిరీష్ కుమార్ తెలిపారు.(చదవండి: ఆ రాతలపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్ ) మూడేళ్లపాటు ఒప్పందం రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి రీసర్వే ప్రారంభం కాబోతోందని సీసీఎల్ఎ ఛీఫ్ కమీషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. ఇందుకు సంబంధించి సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. రీసర్వే పూర్తయ్యే వరకు రాబోయే మూడేళ్ల పాటు ఈ ఒప్పందం ఉంటుందని పేర్కొన్నారు. ‘‘ రీసర్వే ద్వారా ఒక యూనిక్ నంబర్ కేటాయిస్తాం. లాంగిట్యూడ్, ల్యాటిట్యూడ్ ఆధారంగా మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. ప్రతీ గ్రామంలో డ్రోన్ సర్వే ద్వారా మ్యాపింగ్ చేయడం జరుగుతుంది’’ అని తెలిపారు. 17340 గ్రామాల్లో.. మూడు దశల్లో: ఉషారాణి ‘‘మన రాష్ట్రంలో బ్రిటిష్ కాలంలో వంద సంవత్సరాల క్రితం సర్వే జరిగింది. మళ్లీ ఇప్పుడు జరుగుతోంది. భూమి విలువ పెరగడంతో భూసమస్యలు పెరిగాయి. రీసర్వే ద్వారా భూవివాదాలకి పరిష్కారం లభిస్తుంది. ప్రజలు రీసర్వేకి సహకరించాలి. కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పధకం ఈ నెల 21 న ప్రారంభిస్తాం. 2023 నాటికి మూడు దశల్లో ముగుస్తుంది. 14 వేల మంది సర్వేయర్లకి ప్రత్యేక శిక్షణనిస్తున్నాం. రీ సర్వే కోసం 956 కోట్లను కేటాయించాం. భూ యాజమానికి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ ప్రక్రియ ఉంటుంది. ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తాం. డ్రోన్లు వినియోగిస్తాం. ప్రభుత్వ ఖర్చుతోనే భూములకి రీసర్వే చేసి రాళ్లు కూడా వేయడం జరుగుతుంది. రీసర్వే ద్వారా అసలైన యాజమానికి పూర్తి హక్కులు లభిస్తాయి. అదే విధంగా రీసర్వే తర్వాత సంబంధిత భూములపై అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తాం. అటవీ భూములు మినహాయించి వ్యవసాయ భూములు, గ్రామనకంఠాలు, పట్టణాలలోని భూములన్నింటికీ రీసర్వే జరుగుతుంది. 17340 గ్రామాలలో మూడు ఫేజులలో రీసర్వే పూర్తి చేస్తాం. మండలానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మొబైల్ కోర్టులు కూడా ఏర్పాటు చేస్తున్నాం’’ అని రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి తెలిపారు. -
ఏపీ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రపదేశ్ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. బుధవారం సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ‘వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష’లో భాగంగా సర్వే ఆఫ్ ఇండియాతో ఎంవోయూ కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో సర్వే ఆఫ్ ఇండియాతో ఈ ఒప్పందం జరిగింది. అనంతరం ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం’ పై కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. సర్వే ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం చేసుకోవటం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే కార్యక్రమం అన్నారు. ఏపీ ప్రభుత్వం, సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి సమగ్ర సర్వే చేస్తుందని, దేశంలో తొలిసారిగా ఇంత పెద్దస్థాయిలో సర్వే చేస్తున్నామని తెలిపారు. ఇంటి స్థలం, పొలం, స్థిరాస్తులపై ఒక టైటిల్ ఇచ్చిన తర్వాత రెండేళ్ల పాటు అబ్జర్వేషన్లో అదే గ్రామ సచివాలయంలో పెడతామని వెల్లడించారు. ఆ టైటిల్ మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని చెబుతున్నామని తెలిపారు. రెండేళ్ల తర్వాత టైటిల్కు శాశ్వత భూహక్కు లభించండతోపాటు టైటిల్ ఖరారు చేస్తుందన్నారు. ఆ తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వమే బాధ్యత తీసుకుని పరిహారం చెల్లిస్తుందని పేర్కొన్నారు. చదవండి: మూడు రిజర్వాయర్లకు సీఎం జగన్ శంకుస్థాపన వందేళ్ల తర్వాత ఈ సర్వే వందేళ్ల తర్వాత జరుగుతోందని, ఈ వందేళ్లలో సబ్డివిజన్లు, పంపకాలు క్షేత్రస్థాయిలో నమోదుకాని పరిస్థితి ఉందన్నారు. వాటన్నింటినీ రికార్డుల్లోకి ఎక్కించి, రాళ్లు కూడా వేస్తామని చెప్పారు. తర్వాత యూనిక్ ఐడెంటింటీ నంబర్తో కార్డు కూడా ఇస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే కార్డులో క్యూర్ఆర్ కోడ్ ఉంటుందని, హార్డ్కాపీ కూడా ఇస్తారని సీఎం జగన్ తెలిపారు. ల్యాండ్ పార్సిళ్లు, మ్యాపులు కూడా గ్రామంలో అందుబాటులో ఉంచుతామని, రికార్డులన్నింటినీ కూడా డిజిటలైజేషన్ చేస్తామని పేర్కొన్నారు. విలేజ్ హాబిటేషన్స్, టైన్స్కు సంబంధించిన మ్యాపులు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సర్వే రికార్డులు ఉంటాయని తెలిపారు. చదవండి: ఏలూరు బాధితులకు సీఎం జగన్ బాసట అన్ని సేవలు ఒకచోటే రిజిస్ట్రేషన్, రెవిన్యూ సేవలు అందుబాటులోకి వస్తాయని, ఇంటిగ్రేటెడ్ రెవిన్యూ సర్వీసులు, రిజిస్ట్రేషన్తో పాటు అందుబాటలోకి గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఎక్కడా కూడా ఇంత పెద్ద స్థాయిలో సర్వే ఎప్పుడూ జరగలేదని సీఎం వైఎస్ జగన్ అన్నారు. గ్రామాల్లో తరతరాలుగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు తీరిపోతాయని తెలిపారు. భూ వివాదాలు సమసిపోయి గ్రామాల్లో మంచి వాతావరణం ఏర్పడుతుందని, న్యాయమైన చట్టబద్ధమైన హక్కలు లభిస్తాయని సీఎం జగన్ తెలిపారు. కుటుంబాలు, వారి వారసులకు మంచి వ్యవస్థ అందుబాటులోకి వస్తుందన్నారు. బృహత్తర కార్యక్రమం ఇలా మంచి కార్యక్రమానికి మనం శ్రీకారం చుడుతున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం, సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి 70 బేస్ స్టేషన్లు పెడుతున్నామని, సర్వే ఆఫ్ ఇండియా నెట్వర్క్లో ఇవి భాగం అవుతాయని వెల్లడించారు. కచ్చితమైన కొలతలు ఉంటాయని, ఎర్రర్ అత్యంత సూక్ష్మ స్థాయిలో రెండు సెంటీ మీటర్లకు అటు ఇటుగా ఉంటుందని అన్నారు. అత్యాధునిక సదుపాయాలు, కార్స్ టెక్నాలజీ, డ్రోన్లు, రోవర్లు వాడుతుమని చెప్పారు. 1.26 లక్షల చదరపు కిలోమీటర్లు సర్వే చేస్తున్నారని తెలిపారు. 5వేల రెవిన్యూ గ్రామాల్లో ఈ సర్వే మొదటి విడత డిసెంబర్ 21న ప్రారంభమై.. జులై 2021 వరకూ కొనసాగుతుందన్నారు. ఆగస్టు 2021 నుంచి 6500 రెవిన్యూ గ్రామాల్లో రెండో విడత ప్రారంభమై.. 2022 ఏప్రిల్ వరకూ కొనసాగుతుందని చెప్పారు. మిగిలిన గ్రామాల్లో జులై 2022 నుంచి జనవరి 2023 వరకూ కొనసాగి అప్పటితో సర్వే పూర్తవుతుందన్నారు. మొదటి విడత పూర్తైన తర్వాత రెండో విడత ప్రారంభం అయ్యేలోపే సంబంధిత గ్రామ సచివాలయాలను సబ్రిజిస్ట్రార్ ఆఫీసులుగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. వివాదాలు పరిష్కరించడానికి అదే సమయంలో మొబైల్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 660 మొబైల్ మెజిస్ట్రేట్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిబ్బంది నియామకం అక్కడికక్కడే సమస్యలను పరిష్కరిస్తామని, అందుకోసం 14వేల సర్వేయర్లును ప్రభుత్వం నియమించిందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో వీళ్లు ఉంటారని, వీరందరికీ కూడా శిక్షణ జరుగుతోందన్నారు. 9400 మంది ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు. జనవరి 26 వరకు మిగిలిన వారికి ట్రైనింగ్ పూర్తవుతుందని తెలిపారు. కలెక్టర్లు-బాధ్యత వీటన్నింటినీ కలెక్టర్లు దగ్గరుండి చూసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ట్యాండ్ టైటిలింగ్ అథారిటీని రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేస్తున్నామని, సర్వే సన్నద్దతపై కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. జిల్లా స్థాయిలో ట్రైబ్యునల్స్ ఏర్పాటు సాగాలన్నారు. అప్పిలేట్ ట్రైబ్యునల్స్ను కూడా రిటైర్డ్ న్యాయమూర్తులతో ఏర్పాటు చేయాలని సూచించారు. వీటిని వెంటనే ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులను ఆదేశించారు. డ్రోన్స్ ద్వారా సర్వే మొదలుపెట్టే సమయానికి గ్రామాల సరిహద్దులు, వాటి మార్కింగ్స్ను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ప్రతి మండలంలో ఒక డ్రోన్ టీం, డాటా ప్రాససింగ్, రీ సర్వే టీంల ఏర్పాటుపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారు. ప్రజల్లో అవగాహన కలిగించాలి సర్వే వల్ల జరిగే మంచి ఏంటి ఏమిటి? లాభాలు ఏంటన్న దానిపై ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిన అవసరం ఉందని, ప్రజలకు ఎంతో మంచి జరుగుతుందన్నారు. పూర్తిగా ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. గ్రామ, వార్డు వాలంటీర్ల సహాయంతో ప్రతి ఒక్కరికీ తెలిసేలా చేయండని సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటికే ప్రారంభం అయ్యిందని, దాన్ని సమర్థవంతంగా చేసేలా చూడాలని, డిసెంబర్ 14 నుంచి 19 వరకూ గ్రామ సభలు కూడా నిర్వహించాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. వారికి కావాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రి కాలేదన్న బాధతో ఎల్లోమీడియా సమగ్ర సర్వేపై తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. ఈ పథకం ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసి, సమర్థవంతంగా ముందుకు సాగేలా చూడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరిష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సర్వే కార్యక్రమంలో తమను భాగస్వాములను చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. దేశంలోనే ఇలాంటి సర్వే చేపట్టడం తొలిసారని చెప్పారు. ఏపీ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఐదు నిమిషాల్లోనే కొలిచి ల్యాండు రికార్డులు వస్తాయని తెలిపారు. 2–3 సెంటీమీటర్ల అటు ఇటుగా కచ్చితత్వం ఉంటుందని పేర్కొన్నారు. సమగ్ర సర్వే అన్నది దార్శనికతతో కూడిన కార్యక్రమం అని తెలిపారు. ప్రపంచంలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడుతున్నామని, వందేళ్ల తర్వాత మళ్లీ ప్రస్తుతం సమగ్ర సర్వే జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సీఎస్ నీలం సాహ్ని, సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ నీరబ్కుమార్ ప్రసాద్తో పాటు, సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా, లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్, వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలు వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరయ్యారు. -
ఇండియా కొత్త మ్యాప్ల వినియోగంపై ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన ఇండియా కొత్త మ్యాప్ను వినియోగించాలని ఆర్జేడీలు, డీఈవోలను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆదేశించింది. ఈ మేరకు సర్వే ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుంచి మ్యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంది. విద్యాశాఖ కార్యాలయాలతోపాటు అన్ని పాఠశాలల్లోనూ నూతన మ్యాప్ను ఉపయోగించాలని స్పష్టం చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠ్య పుస్తకాల్లోనూ ఇదే మ్యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. -
స్వదేశీ డిజిటల్ మ్యాప్
బెంగళూరు: మీరు గూగుల్ మ్యాప్ వాడుతున్నారా ? గమ్యస్థానం చేరినప్పటికీ మ్యాప్లో కొద్ది మీటర్ల దూరం తేడా వచ్చిందా ! గూగుల్ మ్యాప్స్లో కచ్చితత్వం, కొన్ని మీటర్ల తేడాతో ఉండటం వల్ల ఈ సమస్యలు తలెత్తున్నాయి. దీన్ని అధిగమించేందుకు భారత్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలోని సర్వే ఆఫ్ ఇండియా నడుం కట్టింది. డిజిటల్ మ్యాప్గా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్టులో భాగంగా కచ్చితత్వాన్ని 10 సెంటీమీటర్ల తేడాతో గుర్తించేలా డిజిటల్ మ్యాప్ను తయారుచేయబోతోంది. దీనికోసం డ్రోన్లను, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బిగ్డేటాను ఉపయోగించుకుంటోందని ప్రభుత్వ సీనియర్ అధికారి వెల్లడించారు. కచ్చితమైన కొలతలతో... ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక మ్యాపును ప్రజలకు, గ్రామ పంచాయతీలకు, ప్రభుత్వ అధికారులకు అందివ్వనున్నారు. దీనివల్ల పరిపాలనా పరమైన ప్రయోజనాలు కూడా ఉండేలా రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక, హరియాణా, మహారాష్ట్ర, గంగా బేసిన్లో మ్యాప్ కోసం సర్వే ప్రారంభించారు. గంగా బేసిన్కు ఇరువైపులా 25 కిలోమీటర్ల దూరంపాటు 10 సెంటీమీటర్ల కచ్చితత్వంతో మ్యాపింగ్ చేస్తున్నట్లు సర్వే అధికారి ప్రొఫెసర్ శర్మ వెల్లడించారు. డిజిటల్ రిఫరెన్స్ పాయింట్లు... భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)తో కలసి ఈ ప్రాజెక్టు చేపట్టామన్న వార్తలు అవాస్తవమని ప్రొఫెసర్ శర్మ తెలిపారు. సాధారణంగా శాటిలైట్లు ఫొటోలు తీస్తాయని, ఇది అలాంటి సాంకేతిక కాదన్నారు. డ్రోన్లను ఉపయోగించి, మలుపులను పరిగణలోకి తీసుకొని తయారుచేసే హైరిజల్యూషన్ మ్యాప్ అన్నారు. ప్రతి 20 కిలోమీటర్లకు ఒక డిజిటల్ రిఫరెన్స్ పాయింట్ను ఏర్పాటు చేస్తామన్నారు. వీటి ద్వారా అక్షాంశాలు, రేఖాంశాలను కచ్చితత్వంతో విభజించడంతోపాటు 10 సెంటీమీటర్ల కచ్చితత్వంతో మ్యాప్ ఉంటుందన్నారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) కొద్ది మీటర్ల తేడాతో ప్రదేశాలను గుర్తిస్తే ఇందులో ఆ తేడా స్వల్పమన్నారు. -
‘ఎవరెస్టు ఎత్తు తగ్గిందట.. మళ్లీ కొలుస్తాం’
హైదరాబాద్: ఎవరెస్టు ఎత్తు మళ్లీ కొలవబోతున్నారా? ఇటీవల కాలంలో ఏర్పడిన భూకంపాలు, అగ్ని పర్వతాల బద్ధలు కారణంగా ఎవరెస్టు ఎత్తు తగ్గి ఉంటుందనే అనుమానాలను నివృత్తి చేయనున్నారా? అంటే అవునని స్పష్టమైంది. త్వరలోనే సర్వే ఆఫ్ ఇండియా ఓ ప్రత్యేక టీంను మౌంట్ ఎవరెస్టు ఎత్తు కొలిచేందుకు పంపిస్తోంది. రెండేళ్ల కిందట నేపాల్లో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ఈ సమయంలో పెద్ద మొత్తంలో మంచుపర్వాతాలు కదిలిపోయాయి. ఈ నేపథ్యంలో ఎవరెస్టు ఎత్తు తగ్గి ఉంటుందని పలువురు శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సర్వే ఆఫ్ ఇండియా మరోసారి ఎవరెస్టు ఎత్తు కొలిచే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించి అందుకు కావాల్సిన అనుమతులు కూడా పొందినట్లు సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా స్వర్ణ సుబ్బారావు చెప్పారు. ఇది పూర్తయితే భవిష్యత్తులో సైంటిఫిక్ స్టడీస్ ఉపయోగపడుతుందని అన్నారు. ‘మౌంట్ ఎవరెస్టు వద్దకు మేం ఓ అన్వేషణ బృందాన్ని పంపిస్తున్నాము. ఎవరెస్టు ఎత్తును 1855లో ప్రకటించారు. ఎంతోమంది దాన్ని కొలిచారు కూడా. ఇప్పటి వరకు భారత సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించిన ప్రకారం ఎవరెస్టు సరైన ఎత్తు 29,028 అడుగులు’ అని ఆయన తెలిపారు. భూమిలోపలి భాగంలో పలకల కదలిక, భూకంపాలకారణంగా ఎత్తుతగ్గిందని వచ్చిన అనుమానం, సైంటిఫిక్ స్టడీస్కు ఉపయోగపడుతుందనే మూడు కారణాల వల్ల తాము మరోసారి ఎవరెస్టును కొలవబోతున్నామని స్పష్టం చేశారు. -
‘పశ్చిమ’లో నల్ల బంగారం నిక్షేపాలు
చింతలపూడి ప్రాంతంలో అపారంగా ఉన్నట్లు గుర్తింపు భూగర్భంలో తక్కువ లోతులోనే కనుగొన్న వైనం చింతలపూడి: పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి దేశవ్యాప్త ఖ్యాతి గడించబోతోంది. ఈ ప్రాంతంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు వెల్లడి కావడం తో ఆంధ్రా సింగరేణిగా వార్తల్లోకి ఎక్కుతోంది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బొగ్గు నిక్షేపాల అన్వేషణ కోసం జియా లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఆధ్వర్యంలో సౌత్ వెస్ట్ పినాకిల్, మహేశ్వరి సంస్థలు పెద్దఎత్తున డ్రిల్లింగ్ పనులు చేపట్టాయి. చింతలపూడి, శెట్టివారిగూడెం ప్రాంతాల్లో 50–70 మీటర్ల లోతులోనే అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. మహేశ్వరి కంపెనీ నిర్వహించిన సర్వే(డ్రిల్లింగ్)లో నామవరం ప్రాంతంలోని రిగ్గు నంబర్–1 వద్ద 70 మీటర్ల దిగువన, రెండో రిగ్గు వద్ద 67 మీటర్ల దిగువన, 3వ రిగ్గు వద్ద 51 మీటర్ల దిగువన బొగ్గు నిల్వలు ఉన్నట్టు తేలింది. మిగిలిన ప్రాంతాల్లో 115 మీటర్ల లోతునుంచి 280 మీటర్ల లోతున నాణ్యమైన బొగ్గు నిల్వలున్నట్టు కనుగొన్నారు. 6 నెలల్లో సర్వే పూర్తి సర్వే పూర్తి కావడానికి ఆర్నెల్లు పడుతుం దని జియాలజిస్ట్ ఎ.సతీష్ తెలిపారు. ప్రస్తుతం చింతలపూడి ప్రాంతంలో 120 పాయింట్లను గుర్తించి డ్రిల్లింగ్ చేస్తున్నా మన్నారు. ఈ ప్రాంతంలో సింగరేణి కన్నా నాణ్యమైన బొగ్గు ఉందన్నారు. సర్వే పూర్తయ్యాక కేంద్రానికి నివేదిక పంపాలని, నిక్షేపాల వెలికితీతకు అనుమతులు రావడానికి మాత్రం సమయం పడుతుందని చెప్పారు. 2 వేల మిలియన్ టన్నుల నిల్వలు కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సోమవరం నుంచి మొదలుకొని పశ్చిమ గోదా వరి జిల్లా చింతలపూడి వరకు సుమారు 2 వేల మిలియన్ టన్నుల నల్ల బంగారం ఉన్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. భూమి ఉపరితలానికి 500 మీటర్ల లోపు చింతలపూడి ప్రధాన కేంద్రంగా 30 కిలోమీటర్ల పరిధిలో ఈ నిల్వలున్నట్లు సర్వే నివేదికలు వివరిస్తున్నాయి. మరిన్ని యంత్రాలు రప్పిస్తాం బొగ్గు అన్వేషణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరిన్ని అధునాతన యంత్రాలను రప్పించే పనిలో ఉన్నాం. – వీపీ యాదవ్, డీలర్, (జీఎస్ఐ) -
లైడార్ సర్వే వివరాలు సెన్సార్!
ప్రాణహితపై సర్వే అంశాలు యథాతథంగా ఇవ్వలేమంటున్న సర్వే ఆఫ్ ఇండియా సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పులో భాగంగా కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద నిర్మించదలిచిన బ్యారేజీ పరివాహక ప్రాంతంలో అత్యాధునిక పద్ధతిలో నిర్వహించిన లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ (లైడార్) సర్వే వివరాలను యథాతథంగా ఇచ్చేందుకు సర్వే ఆఫ్ ఇండియా కొర్రీలు పెడుతోంది. సర్వే ద్వారా తీసిన త్రీడీ, టోఫోగ్రఫిక్ చిత్రాలను అన్నింటినీ ఇవ్వడం కుదరదని, ఏ వివరాలు, ఎందుకు కావాలో కోరితే ఆ వివరాలే సమర్పిస్తామని ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా ప్రభుత్వం చెక్లిస్ట్ని సర్వే ఆఫ్ ఇండియాకు పంపినట్లుగా తెలిసింది. గోదావరి నీటిని తీసుకునేందుకు ప్రతిపాదించిన కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లి, మిడ్మానేరు, ఇచ్ఛంపల్లి మార్గాల వద్ద గత నెలలో మొదటి విడత లైడార్ సర్వే జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మిడ్మానేరు నుంచి తడ్కపల్లి, పాములపర్తి, నిజాంసాగర్ల మధ్య రెండో విడత సర్వే కొనసాగుతోంది. సర్వేలో భాగంగా హెలికాప్టర్ ద్వారా లేజర్ కిరాణాలు పంపి దూరాలు, లోతును కొలిచే పనిని పూర్తిచేశారు. దీనిద్వారా సర్వే చేసిన ప్రాంతంలో రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంతో త్రీడీ చిత్రాలను తీయవచ్చు. తొలి విడత సర్వేలో ఈ ప్రక్రియంతా పూర్తయింది. అయితే ఈ వివరాలను పూర్తిగా ఇవ్వడానికి సర్వే ఆఫ్ ఇండియా ఒప్పుకోవడం లేదు. దీంతో అధికారులు తమ అవసరాలను పేర్కొంటూ సర్వే ఆఫ్ ఇండియాకు జాబితా పంపారు. వీటిని పరిశీలించాక సర్వే ఆఫ్ ఇండియా ఒక బ్యాచ్ నంబర్ను రాష్ట్రానికి ఇస్తుంది. నంబర్ను తీసుకొని కేంద్ర రక్షణ శాఖ వద్దకు వెళితే ఏయే వివరాలు కావాలో వాటిని మాత్రమే రాష్ట్రానికి ఇస్తారని తెలుస్తోంది. -
తెలంగాణ మ్యాప్ వచ్చేసింది
రాష్ట్ర విశిష్టతలతో రూపొందించిన సర్వే ఆఫ్ ఇండియా సాక్షి, న్యూఢిల్లీ: సర్వే ఆఫ్ ఇండియా సంస్థ తెలంగాణ రాష్ట్ర పటాన్ని అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రానికి సంబంధించిన పలు విశేషాలు గల ఈ మ్యాప్ను ఆ సంస్థ తన వెబ్సైట్లో పొందుపరచింది. తెలంగాణ రాష్ట్రం దేశంలోని 29 రాష్ట్రాల్లో 12వ అతి పెద్ద రాష్ట్రంగా సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ మ్యాప్లో తెలంగాణలోని ముఖ్య ప్రాంతాలను, పర్యాటక ప్రాంతాలను, జిల్లాల వారీగా జనాభా వివరాలను... రాష్ట్ర సంస్కృతి, భాషలు, రోడ్డు, రైలు, రవాణా మార్గాలను, వివిధ ప్రాంతాల మధ్య దూరాన్ని పొందుపరిచింది. హైదరాబాద్ మెట్రో మార్గాలను, సరిహద్దు రాష్ట్రాలను ఈ మ్యాప్లో సూచించారు. రాష్ట్రంలోని నదులు, పండే పంటలు, ముఖ్యమైన ఆలయాలు, తదితర వివరాలున్నాయి. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పటాన్ని కూడా అందుబాటులోకి తేనున్నట్టు సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది. -
గూగుల్పై సీబీఐ విచారణ
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్పై సీబీఐ ప్రాథమిక విచారణ నమోదు చేసింది. 2013లో గూగుల్ పొందుపరిచిన మ్యాప్లను సీబీఐ నిశితంగా పరిశీలించనుంది. చట్టాలను అతిక్రమించి నిషేధిత ప్రాంతాలను మ్యాపింగ్ చేసినట్టు అభియోగాలు నమోదు చేసింది. భారత రక్షణ స్థావరాలు, ఇతర సున్నితమైన ప్రదేశాలను చిత్రీకరించినట్టు ఆరోపణలు వచ్చాయి. భారత సర్వేయర్ జనరల్ కార్యాలయం ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించింది. గతేడాది మార్చిలో మ్యాపింగ్ పోటీలు నిర్వహించే ముందు భారత సర్వే కార్యాలయం అనుమతి తీసుకోలేదని తెలియజేసింది. పరిసర ప్రాంతాలు, ఆస్పత్రులు, రెస్టారెంట్ల వివరాలను మ్యాపింగ్ చేయాల్సిందిగా ప్రజలను కోరుతూ గూగుల్ పోటీలను నిర్వహించింది. అయితే ప్రజలకు సంబంధంలేని సున్నితమైన రక్షణ స్థావరాలను ఎలా మ్యాపింగ్ చేశారో తెలియజేయాల్సిందిగా సర్వే ఆఫ్ ఇండియా గూగుల్కు సూచించింది. గూగుల్ నిబంధనలను ఉల్లంఘించడాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లింది. హోం శాఖ ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేయనుంది. -
మెట్రో కారిడార్లలో జర భద్రం
ఉప్పల్: నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న మెట్రోరైలు పనుల్లో తరచూ అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. ఓవైపు ట్రాఫిక్ రాకపోకలు సాగుతుండగానే మరోవైపు మూడు కారిడార్లలో మెట్రో పిల్లర్ల నిర్మాణం, సెగ్మెంట్ల బిగింపు, స్టేషన్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ తదితర పనులు కొనసాగుతున్నాయి. ఫలితంగా నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవడమే గాక అక్కడక్కడా ప్రమాదాలూ సంభవిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మెట్రో రూట్లలో రాకపోకలు సాగించడానికి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. శనివారం ఉదయం ఉప్పల్, నారాయణగూడలో ప్రమాదాలు జరిగాయి. ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదం ఓ వ్యక్తి ప్రాణాల మీదకొచ్చింది. పిల్లర్ పైభాగం నుంచి పొడవాటి ఇనుప పైపు పడడంతో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. నారాయణగూడలో బస్షెల్టర్ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద... వనస్థలిపురం వైదేహినగర్కు చెందిన ఈశ్వర్ప్రసాద్ (48) చర్లపల్లిలోని ఎంజీఆర్ఎం కంపెనీలో మేనేజర్ (అకౌంట్స్). శనివారం ఉదయం 9.30 ప్రాంతంలో ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై ఉప్పల్ మీదుగా చర్లపల్లికి బయలు దేరారు. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా మెట్రో స్టేషన్ పిల్లర్ కె.గ్రేడ్ వద్దకు చేరుకోగానే అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఐరన్ పైపును అకస్మాత్తుగా రోడ్డుపైకి తీసుకు రావడంతో ఆ పైపు ఈశ్వర్ ప్రసాద్ తలకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఈశ్వర్ ప్రసాద్ను ఉప్పల్ ఆది త్య ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఉప్పల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా ప్రత్యక్ష సాక్షుల కథనం మరోలా ఉంది. ఈశ్వర్ప్రసాద్ ద్విచక్రవాహనంపై సర్వే ఆఫ్ ఇండి యా మెట్రోస్టేషన్ వద్దకు రాగానే పిల్లర్ పైనుంచి సుమారు ఆరు మీటర్ల పొడవాటి ఇనుప పైపు తలపై పడగా అక్కడికక్కడే కుప్పకూలి పోయారని అంటున్నారు. పైభాగంలో భారీ ఎత్తున పనులు చేపడుతున్న సమయంలో కింద రోడ్డుపై ట్రాఫిక్ను నియంత్రించక పోవడంపై విమర్శలు వస్తున్నాయి. నిర్మాణ సంస్థ, మెట్రో అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పటికీ ఎల్ అండ్ టీ అధికారులు, సిబ్బంది స్పందించలేదని, క్షతగాత్రుడిని ఆసుపత్రిలో చేర్పించేందుకు కూడా చొరవ చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భద్రత చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. -
సిద్దం కాని తెలంగాణ రాష్ట్ర చిత్రపటం