telangana budet session
-
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
Telangana Assembly Budget Session.. అప్డేట్స్.. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా కేసీఆర్ తెలంగాణకు తీరని నష్టం చేశారు: ఉత్తమ్ పదేళ్లలో ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేశారు రేపు కాళేశ్వరం సందర్శనకు అందరినీ ఆహ్వానిస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్ చిట్చాట్ ఉత్తమ్ పవర్ ప్రజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది. ఉత్తమ్ తెలుగులో మాట్లాడకుండా.. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు ఉత్తమ్ మాటలు మాకేం అర్థం కావడం లేదు.. ప్రజలకు ఏం అర్థమవుతుంది. ఆనాడు పదవులు కోసం పెదవులు మూసుకుంది: హరీష్రావు ప్రాజెక్టులు అప్పగిస్తామని కేంద్రానికి చెప్పి వచ్చి ఇక్కడ తంటాడు పడుతున్నారు పోతిరెడ్డిపాడుపై పేగులు తెగేదాకి కొట్లాడింది మేం అపోహలు సృష్టించి సభను తప్పుదోవ పట్టించొద్దు రాష్ట్రానికి కృష్ణా జలాల కంటే ఎక్కువ మరేముంది: మల్లు భట్టి విక్రమార్క కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్సర్కార్ అనేక తప్పులు చేసింది గత సర్కారు తప్పులను సరిచేయడానికి ఉత్తమ్ నానా తంటాలు పడుతున్నారు కేసీఆర్పై రేవంత్ సీరియస్ కేసీఆర్ సభకు రావాలి. పదేళ్ల పాలనలో జరిగిన పాపాలకు కేసీఆరే కారణం. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే మాటలకు విలువ లేదు. కేసీఆర్ సభకు వస్తే ఎంతసేపైనా చర్చిస్తాం. కృష్ణా జలాలపై చర్చకు కేసీఆర్ ఎందుకు రాలేదు?. కేసీఆర్ సభ రాకుండా ఫాంహౌస్లో దాక్కున్నారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ అవమానిస్తున్నారు. పద్మారావు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు. పద్మారావును ప్రతిపక్ష నేతను చేయాలి. హరీష్ కామెంట్స్.. కాంగ్రెస్ ప్రాజెక్ట్లను అప్పగించేందుకు ఒప్పుకుంది. సీఎం రేవంత్ తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. రేవంత్ కొడంగల్లో ఓడిపోయి మల్కాజ్గిరికి ఎందుకొచ్చారు?. వాస్తవాలు చెప్తుంటే కాంగ్రెస్కు మింగుడుపడటం లేదు. అధికారులను బద్నాం చేసుకుంటూ ఎన్ని రోజులు తప్పించుకుంటారు. ►తెలంగాణ శాసన మండలి ఈనెల 14కు వాయిదా ఉత్తమ్ కామెంట్స్.. అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ అబద్దాలు చెబుతోంది. ప్రాజెక్ట్లు అప్పజెప్పడంలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. హరీష్రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ హరీష్ రావు కోమటిరెడ్డి కామెంట్స్.. దక్షిణ తెలంగాణను నాశనం చేశారు. నల్లగొండవాసులకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. నల్లగొండ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి కేసీఆర్ నల్లగొండకు రావాలి. హరీష్రావు కామెంట్స్.. నల్లగొండలో సభ పెట్టినందునే ప్రభుత్వం తీర్మానం పెట్టింది. ఇది బీఆర్ఎస్ విజయం మాకు ప్రజెంటేషన్ అవకాశం ఎందుకు ఇవ్వలేదు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు అభ్యంతరం కోమటిరెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్ శాసనసభలో కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు విఫలమైంది. కృష్ణా జలాలు తెలంగాణకు ప్రధాన ఆధారం. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా కృష్ణా జలాలు తరలించే ప్రసక్తే లేదు. కృష్ణా ప్రాజెక్ట్లను కేంద్రానికి అప్పజెప్పే ప్రసక్తే లేదు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కృష్ణా జలాల్లో అన్యాయం జరిగింది. నదీ జలాల పంపకాల్లో అన్యాయం జరిగిందనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాం. తెలంగాణ వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందని అందరూ ఆశించారు. కానీ, బీఆర్ఎస్ వచ్చాన కృష్ణా జలాల్లో మరింత అన్యాయం జరిగింది. ఉమ్మడి రాష్ట్రం కంటే.. ప్రత్యేక రాష్ట్రంలోనే ఎక్కువ అన్యాయం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1200 టీఎంసీలు డైవర్ట్ అయ్యాయి. ఇన్ ఫ్లో తగ్గింది.. డైవర్షన్ పెరిగింది. కృష్ణా జలాలపై గత ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేదు. ఏపీ ప్రభుత్వం అదనపు నీటని తరలిస్తున్నా మౌనంగా ఉన్నారు. పాలమూరు-రంగారెడ్డికి రూ.27500 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదు. 811 టీఎంసీల్లో కేవలం 299 టీంసీలే క్లేయిమ్ చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 50 శాతం కావాలని మాట్లాడుతున్నారు. అంతా చేసి నల్లగొండలో సభ పెడితే ఏం లాభం. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీరియస్ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రధాన చర్చ మిగులు గోదావరి జలాలపై.. కృష్ణా జలాలపై కాదు. ఏపీ సీఎం జగన్ కృష్ణా జలాలపై మాట్లాడలేదు.. గోదావరి జలాలపై మాట్లాడారు. దీన్ని కాంగ్రెస్ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంచేస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ షాకింగ్ కామెంట్స్ కేసీఆర్ సభను పార్టీలకు అతీతంగా బహిష్కరించాలి. కేఆర్ఎంబీపై సంతకం పెట్టి కేంద్రానికి అప్పగించింది కేసీఆరే. రాజకీయాల నుంచి కేసీఆర్ రిటైర్మెంట్ తీసుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగం చేసిన రాష్ట్రాన్ని మేము గాడిలో పెడుతున్నాం. నల్లగొండ జిల్లాకు కేసీఆర్, జగదీష్ రెడ్డి తీరని అన్యాయం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో నేడు వాడీవేడీ చర్చ కృష్ణా జలాలు, కాళేశ్వరంపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. అసెంబ్లీలో రెండు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు. సభలో సభ్యులకు ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్ అయితే, సభలో తమకూ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలన్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ విజ్ఞప్తిని తిరస్కరించిన స్పీకర్ ఇక, ప్రజెంటేషన్ కాపీలను ఎమ్మెల్యేలకు ఇవ్వనున్నారు. ►చివరి రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం ►విద్యుత్, ఫారెస్ట్ కార్పొరేషన్ వార్షిక రిపోర్టును కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. ►అలాగే, దివంగత నేతలు మచిందర్ రావు, నర్సారెడ్డి, రాజమల్లుకు సంతాపం తెలపనుంది. ►బడ్జెట్పైచర్చ-సమాధానం ఇవ్వనున్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ►అలాగే ఇరిగేషన్పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ►మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్టుపై సభలో ప్రకటన చేయనుంది. ►ఇక, టొబాకో అండ్ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ►2023-24 సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్పెండేచర్పై ప్రకటన ►మరోవైపు కృష్ణా జలాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్య మాటల యుద్ధం నడుస్తోంది. ►కృష్ణా జలాలు, కాళేశ్వరంపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. -
తెలంగాణ బడ్జెట్: రైతులకు గుడ్న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
Live Updates.. తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు.. ఉభయ సభలు సోమవారానికి వాయిదా. భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం.. 2024-25 ఆర్థికసంవత్సరానికి ఓట్-ఆన్ అకౌంట్ మొత్తం వ్యయం 2,75,891 కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్ల రూపాయలు. మూలధన వ్యయం 29,669 కోట్లు ద్రవ్యలోటు రూ.32,557 కోట్లు. రెవెన్యూలోటు రూ.5944 కోట్లు. ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తాం తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తెస్తాం ప్రజల సంక్షేమం కోసం ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కొంటాం ప్రజాపాలన మరింత పటిష్టంగా ముందుకు సాగుతుంది నిస్సహాయులకు సాయం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం సమానత్వమే మా ప్రభుత్వ విధానం అందరం కోసం మనందరం అనే స్పూర్తితో ముందుకెళ్తాం ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించడం మా చిత్తశుద్ధికి నిదర్శనం రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత గత ప్రభుత్వం దళిత బంధు పథకానికి రూ.17,700 కోట్లు చూపించారు.. ఒక్క పైసా ఇవ్వలేదు ఐటీ శాఖకు రూ.774 కోట్లు పంచాయతీరాజ్ శాఖకు రూ.40,080 కోట్లు పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు జీఎస్డీపీ 2022-3తో పోలిస్తే 13,02,371 కోట్ల నుంచి 14,49,708 కోట్లకు ఆర్ధిక వృద్ధి 14.7 శాతం నుంచి 11.3 శాతం క్షీణించింది దేశీయ స్థాయిలో వృద్ధి రేటు 16.1 శాతం నుంచి 8.9 శాతానికి పడిపోయింది అధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణది 5వ స్థానం టీఎస్ పీఎస్ సీ నిర్వహణ కోసం 40 కోట్లు కేటాయింపు అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు హామీలు నెరవేర్చాం విద్యుత్ రంగానికి ర.16,825 కోట్లు కేటాయింపు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్ల అదనపు చెల్లింపు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం గృహ జ్యోతి కింద రూ.500లకే వంటగ్యాస్ సంక్షేమ పథకాల అమలుకు రూ.53,196 కోట్లు మా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ను మరింత అభివృద్ధి చేస్తాం రాష్ట్రంలో ప్రభుత్వం తరపున రెండు లెదర్ పార్కులు రాష్ట్రం నలుమూలల అభివృద్ధికి ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు త్వరలో డ్రై పోర్టులను అందుబాటులోకి తెస్తాం పరిశ్రమల శాఖకు రూ.2,543 కోట్లు ప్రతిపాదిస్తున్నాం గ్రామీణ ప్రజల అభివృద్ధికి ఏఐ టెక్నాలజీని వినియోగిస్తాం ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి ఇబ్బంది రానీయం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీని విస్తరిస్తాం అమెరికాలోని ఐటీ సర్వ్ అనే సంస్థతో సంప్రదింపులు చేస్తున్నాం ఐటీ రంగంలో తెలంగాణ తిరుగులేని శక్తిగా నిలబడుతుంది 2 లక్షల రుణమాఫీపై త్వరలోనే విధివిధానాలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.40,080 కోట్లు పాలనకు కాదు రాష్ట్రాభివృద్ధికి హైదరాబాద్ గుండెకాయ హైదరాబాద్ కు ఆర్ధిక శక్తినిచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వమే ఫార్మా, ఐటీ, ఓఆర్ఆర్, 24 గంటల విద్యుత్ ఘనత కాంగ్రెస్దే హైదరాబాద్ అభివృద్ధి నాయకులు, అధికారుల కోసం కాదు మూసీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పనా జోన్ గా మారుస్తాం మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధికి నూతన విధానాలు హైదరాబాద్ అభివృద్ధి నాయకులు, అధికారుల కోసం కాదు థేమ్స్ నది తరహాలో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి సాంస్కృతిక కట్టడాల పరిరక్షణను పకడ్బందీగా అమలు చేస్తాం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కోసం రూ.1,000 కోట్లు తెలంగాణలో అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని 3 జోన్ లుగా విభజిస్తాం ORR, RRR మధ్య ప్రాంతాన్ని పెరి అర్బన్ జోన్ RRR ఆవల ఉన్న భాగాన్ని గ్రామీణ జోన్ గా విభజన సాగుకు పనికి రాని భూములకు సైతం గత సర్కార్ రైతుబంధు ఇచ్చింది పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ భూములకు రైతుబంధు ఇచ్చారు రైతు బంధు కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తాం కౌలు రైతులకు రైతు భరోసా సాయం అందిస్తాం ఆయిల్ పామ్ సాగుకు అదనంగా లక్ష ఎకరాలకు పెంపు కైలు రైతులకు రైతు బీమా పథకం వర్తింపజేస్తాం త్వరలో నూతన విత్తన విధానం అమల్లోకి తెస్తాం ధరణి కొంతమందికి భరణంగా, మరికొంతమందికి ఆభరణంగా మారింది ధరణి పోర్టల్ సమస్యల అధ్యయనంపై ఐదుగురితో కమిటీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలను మరింత అభివృద్ధి చేస్తాం ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.1,000 కోట్లు ఎస్టీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.250కోట్లు గురుకులాల పాఠశాలల సొసైటీ ద్వారా రెండు ఎంబీఏ కాలేజీలు ఎస్టీ సంక్షేమానికి రూ.13,313 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.2,262 కోట్లు బీసీ గురుకుల భవన నిర్మాణాలకు రూ.1,546 కోట్లు సాంప్రదాయ వృత్తుల వారికి శిక్షణతోపాటు పనిముట్లు బీసీ సంక్షేమానికి రూ.8,000 కోట్లు కేటాయింపు కాంగ్రెస్ మేనిఫెస్టో సింహభాగం మహిళల సంక్షేమానికే మహిళలకు గత డిసెంబర్ 9 నుంచి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం 35,781 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు పోషకాహారం తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తాం త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కేటాయింపులు ఇలా.. ఆరు గ్యారెంటీల అమలు కోసం రూ.53,196 కోట్లు. ఐటీ శాఖకు రూ.774 కోట్లు. పంచాయతీరాజ్ శాఖకు రూ.40080 కోట్లు. పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు. వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు. ఎస్సీ, ఎస్టీ గురుకుల భవనాల కోసం రూ.1250 కోట్లు. గృహ నిర్మాణానికి రూ.7740 కోట్లు. నీటి పారుదల శాఖకు రూ.28024 కోట్లు. బీసీ సంక్షేమానికి ఎనిమిది వేల కోట్లు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో సింహభాగం మహిళల సంక్షేమానికే. బీసీ గురుకుల భవన నిర్మాణాలకు రూ.1546 కోట్లు. సాంప్రదాయ వృత్తుల శిక్షణతో పాటు పనిముట్లు. విద్యుత్-గృహజ్యోతి పథకానికి రూ.2418 కోట్లు. విద్యుత్ సంస్థలకు రూ.16825 కోట్లు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. విద్యుత్ రంగానికి 16825 కోట్లు కేటాయింపు మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్లు అదనపు కేటాయింపు. గృహజ్యోతి కింద రూ.500లకే వంటగ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ విద్యారంగానికి రూ.21,389 కోట్లు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు రూ.500 కోట్లు. యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు. ఎస్సీ సంక్షేమం రూ.21874కోట్లు. ఎస్టీ సంక్షేమం రూ.13013 కోట్లు. పరిశ్రమల శాఖకు రూ.2543 కోట్లు ప్రతిపాదిస్తాం. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తాం. విద్యారంగానికి రూ.21389 కోట్లు. త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్కు రూ.500 కోట్లు కేటాయింపు. 65 ఐటీఐలను ప్రైవేటు సంస్థలతో భాగస్వామ్యం. గుజరాత్, ఢిల్లీ, ఒడిశా తరహాలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు. రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లు. మా ప్రభుత్వంలో 6956 నర్సింగ్ ఆఫీసర్లను నియమించాం. వైద్య రంగానికి రూ.11,500 కేటాయింపు. యువజన సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం. యువకులను రెచ్చగొట్టం కాదు.. ఆత్మగౌరవంతో బతికేలా చేస్తాం. జాబ్ క్యాలెండర్ తయారు ప్రక్రియను ప్రారంభించాం. త్వరలో మెగా డీఎస్సీ నిర్వహించబోతున్నాం. త్వరలో 15వేల కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఒక్క గ్రూప్-1 ఉద్యోగం కూడా ఇవ్వలేదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేశాం. టీఎస్పీఎస్సీకి రూ.40కోట్ల ఆర్థిక వనరులు. తాత్కాలిక ఉద్యోగులకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. తాత్కాలిక ఉద్యోగి మరణిస్తే రూ.5లక్షల ఎక్స్గ్రేషియా. చేనేత కార్మికుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. రాష్ట్రం నలుమూలల నుంచి స్కూల్ యూనిఫామ్స్ కొనుగోలు చేస్తాం. అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన ఘనత తెలంగాణది. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ది. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్కు కట్టుబడి ఉన్నాం. గృహజ్యోతి పథకం కింద రూ.200 యూనిట్ల ఫ్రీ కరెంట్. గృహజ్యోతి పథకానికి రూ.2418 కోట్లు కేటాయింపు. ట్రాన్స్కో, డిస్కమ్లకు రూ.16,825 కోట్లు. స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షల సాయం. ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున మంజూరు. గృహ నిర్మాణానికి రూ.7740 కోట్లు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతాం. రాష్ట్రంలో హుక్కా బార్లను నిషేధించాం. నూతన హైకోర్టు భవనానికి వంద ఎకరాల స్థలం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం అయిష్టంగా ఉంది. ప్రణాళిక, హేతుబద్దత లేకుండా గత ప్రభుత్వం అప్పులు చేసింది. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇప్పుడు సవాళ్లుగా మారాయి. నీళ్లు, నిధులు, నియామకాలను దృష్టిలో పెట్టుకుని పాలన సాగుతుంది. ►తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. ►బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రి భట్టి విక్రమార్క. ►మండలిలో బడ్జెట్ను ప్రవేశపెడుతున్న మంత్రి శ్రీధర్ బాబు. ►తెలంగాణ బడ్జెట్ 2.75 లక్షల కోట్లు. నేటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశానికి కేటీఆర్ దూరం ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ బీఆర్ఎస్ సభకు హాజరుకానున్న కేటీఆర్, ఎమ్మెల్యే తలసాని. అనంతరం తెలంగాణ భవన్కు కేటీఆర్ ఈ క్రమంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ ప్రత్యేక భేటీ రేపు సాయంత్రం సీఎల్పీ సమావేశం. సీఎల్పీలో కాళేశ్వరం టూర్, పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్న నేతలు సీఎల్పీ భేటీకి హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రులు ►బడ్జెట్ ప్రతులను సీఎం రేవంత్కు అందించిన ఆర్థిక మంత్రి భట్టి, శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు. ►శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బడ్జెట్ పత్రాలు అందజేసిన భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ►ఈనెల 12వ తేదీన బడ్జెట్ సమావేశాలను ముగించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్. ►మరోవైపు.. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఇరిగేషన్ శ్వేత పత్రం విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ►విజిలెన్స్ ఇరిగేషన్ అంశాలను సభలో మాట్లాడనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ►ఈనెల 13న మేడిగడ్డ పర్యటనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ సర్కార్. ►సీఎం రేవంత్ ఆధ్వర్యంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఆహ్వానించిన ప్రభుత్వం. ►కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు మాజీ సీఎం కేసీఆర్ను కూడా ఆహ్వానించాలని నిర్ణయం. ►కేసీఆర్ను ఆహ్వానించే బాధ్యతను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్కు అప్పగించిన సీఎం రేవంత్ ►కాసేపట్లో అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్. ఇప్పటికే అసెంబ్లీ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ►బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కామెంట్స్ స్పీకర్ పదవి ఆఫర్ ఇచ్చారు. నేనే వద్దన్నాను. రెండో విడతలో మంత్రి పదవి వస్తుంది అని ఆశిస్తున్నాను. కేసీఆర్ ముర్కుడు.. రేషన్ బియ్యం సరఫరాలో, ధాన్యం సేకరణలో అవినీతికి పాల్పడ్డారు ప్రాణహిత చేవెళ్ల కోసం రెండువేల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేస్తే పైపులకే కేసీఆర్ మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో SLBCకి కొంత నిధులు ఇస్తే ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యేది. దానికి కూడా నిధులు ఇవ్వలేదు 9:50AM, Feb 10, 2024 బడ్జెట్లో అన్ని అంశాలు ఉంటాయి: భట్టి విక్రమార్క ఇచ్చిన హామీలను అమలు చేస్తాం 9:47AM, Feb 10, 2024 ముగిసిన తెలంగాణ కేబినెట్సమావేశం ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం మధ్యాహ్నం గం. 12.లకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ అంచనా రూ. 3లక్షల కోట్లు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి మండలిలో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్బాబు ►తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం ►బడ్జెట్లో అన్ని అంశాలు ఉంటాయి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తాం: భట్టి విక్రమార్క ►బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రారంభమైన రాష్ట్ర కేబినెట్ సమావేశం. ►తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ►కాసేపట్లో బడ్జెట్కు ఆమోదం తెలుపునున్న రాష్ట్ర కేబినెట్ ►తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నాం 12 గంటలకు ఓటాన్ అకౌంట్ (ఓట్ ఆన్ అకౌంట్) బడ్జెట్ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క.. మరోవైపు శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. ►మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో శనివారం తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారు. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు కేసీఆర్ రెండ్రోజులుగా దూరంగా ఉన్నారు. ఇక ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో తొలిసారిగా సమావేశాలకు హాజరవుతుండటంపై ఆసక్తి నెలకొంది. -
అసెంబ్లీలో కేటీఆర్, ఈటల మధ్య ఆసక్తికర సన్నివేశం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం సమక్షంలో జనగణమన ఆలాపనతో సమావేశాలు లాంఛనంగా మొదలయ్యాయి. ఈ క్రమంలో గవర్నర్ ప్రసంగానికి ముందు శాసనసభలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లిన మంత్రి కెటిఆర్ అందరినీ పలకరించారు . బిజెపి ఎమ్మెల్యేల వద్ద దాదాపు 10 నిమిషాలు ఉన్నారు కెటిఆర్. ఎక్కువ సేపు ఈటెల రాజేందర్ దగ్గరే కనిపించారు కెటిఆర్. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్తో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. హుజురాబాద్లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని ఈటలను కేటీఆర్ అడగ్గా, పిలిస్తే కదా హాజరైయ్యేదంటూ ఈటల సమాధానం ఇచారు. ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి వెళ్లే ప్రాక్టీస్ సరిగాలేదంటూ కేటీఆర్కు ఈటల హితవు పలికారు. ఈటల, కేటీఆర్ సంభాషణ మధ్యలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎంట్రీ ఇచ్చారు. తనను సైతం అధికారిక కార్యక్రమాలకు పిలువటంలేదంటూ భట్టి ప్రస్తావించారు. కనీసం కలెక్టరేట్ అయినా ఆహ్వానించాలన్న ఈటల వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ నవ్వి ఊరుకున్నారు. దీంతో గవర్నర్ సభలోకి వస్తున్నారంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.. కేటీఆర్ను అలెర్ట్ చేశారు. దీంతో తన ట్రెజరీ బెంచీల వైపు కేటీఆర్ వెళ్ళిపోయారు. కేటీఆర్ కంటే ముందు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈటల వద్ద కొచ్చి ప్రత్యేకంగా మాట్లాడారు. చదవండి: మా ప్రభుత్వం ఎన్నో సవాళ్లను అధిగమించింది: గవర్నర్ తమిళిసై -
మా ప్రభుత్వం ఎన్నో సవాళ్లను అధిగమించింది: గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయని, తద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ బడ్జెట్-2023 సమావేశాల ప్రారంభం సందర్భంగా.. పబ్లిక్ గార్డెన్స్లోని అసెంబ్లీ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ఆమె తన ప్రసంగం చదివి వినిపించారు. ‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది..’ అంటూ కాళోజీ కవితతో ఆమె తన ప్రసంగం ప్రారంభించిన గవర్నర్ తమిళిసై, తెలంగాణ సర్కార్ను మా ప్రభుత్వంగా ఆమె సంబోధించడం ఆకట్టుకుంది. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతర కృషి చేస్తోంది. మా ప్రభుత్వం ఎన్నో సవాళ్లను అధిగమించింది. ఆ కృషి వల్లే 24 గంటలు కరెంట్ ఉంటోంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తలసరి విద్యుత్వినియోగం రికార్డు స్థాయిలో పెరిగింది. గతంలో నీటి కోసం కొట్లాటలు జరిగాయి. ఇప్పుడు 24 గంటలపాటు నీటిని అందిస్తున్నాం. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించాం. మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి మంచి నీరు అందిస్తున్నాం. రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశాం. దళితుల అభివృద్ధి కోసమే దళిత బంధు. రాష్ట్రం ఏర్పడగానే ఎస్టీ రిజర్వేషన్ 10 శాతానికి పెంచాం తండాలను పంచాయితీలుగా మార్చాం. పేదల కోసం ఆసరా పెన్షన్లతో ఆదుకుంటున్నాం. నేతన్న బీమా పథకం ద్వారా జీవిత బీమా అందిస్తున్నాం. గీత కార్మికుల సంక్షేమం కోసం వైన్షాపుల్లో 15 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నాం. తాటి, ఈత చెట్లపై పన్ను రద్దు చేశాం. లాండ్రీ, సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తున్నాం. సివిల్ పోలీస్ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నాం. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం రూ. 1,00,116లు ఆర్థిక సాయం అందిస్తున్నాం. 12.46 లక్షల ఆడపిల్లల కుటుంబాలకు షాదీ ముబారక్తో లబ్ధి చేకూరింది. వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించాం. రైతు సంక్షేమానికి మా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. రైతు బీమా అందిస్తున్నాం. రైతు పండించే ప్రతీ బియ్యపు గింజను కొంటున్నాం. దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ మారుతోంది. ఫ్లోరైడ్ సమస్య లేకుండా చేశాం. వివిధ శాఖల్లో ఏకకాలంలో 80వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం. 2014 నుంచి కిందటి ఏడాది వరకు 1,41,735 ఉద్యోగాలను భర్తీ చేశాం. నాణ్యమైన విద్యను పిల్లలకు అందించేందుకే మన ఊరు మన బడి. మూడు దశల్లో ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో.. 28వేల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన. హైదరాబాద్ నలువైపులా మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు. నిమ్స్లో అదనంగా మరో 2 వేల పడకలు. సంక్షేమ అభివృద్ధిలో దేశంలోనే ముందుంది. పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆకర్షిస్తోంది.తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం మూడింతలు అయ్యింది అని ఆమె ప్రసంగించారు. -
Telangana Budget: తెలంగాణ బడ్జెట్కు డేట్ ఫిక్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ 2023-24 బడ్జెట్కు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 6వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 3వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఉభయ సభలకు ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. ఆ మరుసటి రోజున గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. ఇదిలా ఉండగా.. తెలంగాణ బడ్జెట్కు ఎట్టకేలకు గవర్నర్ ఆమోద ముద్ర లభించింది. బడ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగం ఉంటుందా? అనే అభ్యంతరం లేవనెత్తిన గవర్నర్.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశారు. దీంతో సర్కార్ హైకోర్టును ఆశ్రయించగా.. ఇరు పక్షాలను చర్చించుకుని ఓ కొలిక్కి తీసుకురావాలని బెంచ్ సూచించింది. దీంతో బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించేందుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి గవర్నర్కు ప్రత్యేక ఆహ్వానం అందడంతో ఈ వివాదం ముగిసినట్లయ్యింది. ఇదీ చదవండి: ‘కోర్టు మొట్టే వరకు కేసీఆర్ బుర్ర పనిచేయలేదు’ -
ప్రధాని పేరైనా మార్చుకోవాలి.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజ్భవన్ను రాజకీయాలకు అడ్డాగా మార్చడం మనుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. రాజ్భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో పెట్టుకున్నారని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థను బ్రిటిష్ వారు ప్రవేశ పెట్టారని.. దానిని ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ను ఎవరు ఎన్నుకున్నారని రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి రాజకీయాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారు కూడా పార్టీలకు అనుకూలంగా, పార్టీల ప్రతినిధులుగా పార్టీల చర్చల్లో పాల్గొనడం, రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయడం మానుకుంటే మంచిది. ఇంత అన్యాయంగా ఒక పార్టీ గురించే మాట్లాడుతూ, ఒక పార్టీ నాయకుల ఫోటోలనే రాజ్భవన్లో పెట్టుకుంటూ రాజ్భవన్ను రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చడం దేశానికి మంచిది కాదు. వ్యవస్థకు మంచిది కాదు. బ్రిటీష్ కాలం నాటి బానిస చిహ్నాలు పోవాలని మొన్న మోదీ గొప్ప స్పీచ్ ఇచ్చారు. అందుకే రాజ్పథ్ను కర్తవ్య పథ్ అని మార్చామని ప్రధాని అన్నారు. మరి గవర్నర్ వ్యవస్థ కూడా బ్రిటీషోళ్లు పెట్టిందే. అవి ఎందుకు ఉండాలి.. దాని వల్ల దేశానికి ఏం ఉపయోగమో చెప్పాలి. రాజకీయాల్లో ఉన్నవారికి గవర్నర్ పదవి ఇవ్వొద్దని మోదీనే చెప్పారు. రెండేండ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటేనే ఇవ్వాలన్నారు. మరి ఇవాళ మోదీ అది పాటిస్తున్నాడా..? ముఖ్యమంత్రి మోదీనేమో నీతులు చెబుతాడు. ప్రధానమంత్రి మోదీనేమో అదే నీతులను తుంగలో తొక్కుతాడు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉంటాయి. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి ఉంటారు. గవర్నర్ పదవికి బ్రిటీష్ కాలంలో అర్థం ఉండే. ఎందుకంటే పైనా వైశ్రాయ్ ఉండే.. కింద గవర్నర్ ఉండే.. వారు సంభాషించుకునేవారు. ఇక ప్రధానమంత్రైనా ఆయన పేరును వైశ్రాయ్ అని మార్చుకోవాలి. లేదంటే ఇక్కడ గవర్నర్లను అయినా ఎత్తేయాలి. ఇతరులకు చెప్పేముందు ఆయన ఆలోచించుకుంటే మంచిది’ అని కేటీఆర్ సూచించారు. చదవండి: అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగానికి గవర్నర్ తమిళిసైకి ఆహ్వానం -
అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగానికి గవర్నర్ తమిళిసైకి ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణ రావు. అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు సోమవారం రాజ్ భవన్కు చేరుకొని గవర్నర్ను కలిసి ఆహ్వానించారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసైతో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీష్రావు భేటీ అయ్యారు. కాగా గవర్నర్ తమిళిసై విషయంలో తెలంగాణ సర్కార్ వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. గవర్నర్పై దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వ తరఫు లాయర్ దుశ్యంత్ దవే హైకోర్టుకు తెలిపారు. గవర్నర్ను విమర్శించొద్దన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు మొదలవుతాయని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా రాష్ట్ర గవర్నర్ ప్రసంగంతో శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందుకు విరుద్ధంగా గతేడాది బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ ఏడాది కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడానికి సిద్ధమైంది. అయితే ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విబేధాలు మరింత తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో బడ్జెట్ ప్రతిపాదనలను తక్షణమే సిఫారసు చేయకుండా గవర్నర్ పెండింగ్లో ఉంచినట్టు తెలుస్తోంది. -
చిన్నపాటి జ్ఞాపకం గుర్తు చేసుకున్న కేసీఆర్
-
CM KCR: తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీ: సీఎం కేసీఆర్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ 2022 సమావేశాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కీలక ప్రకటన చేశారు. ఊహించినట్లుగానే భారీగా కొలువుల భర్తీ ప్రకటనను స్వయంగా వెల్లడించారు. మొత్తం 91, 142 ఉద్యోగాలకు నేటి నుంచే భర్తీ ప్రక్రియ ప్రారంభం అని ప్రకటించారు. తమది ఎంప్లాయింట్మెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని, హయ్యెస్ట్ పెయిడ్ ఎంప్లాయిస్ తెలంగాణలో ఉన్నారని ప్రకటించుకున్న తెలంగాణ సీఎం.. కేంద్రం వైఖరి వల్లే భర్తీ ప్రక్రియ ఆలస్యమైందని ఆరోపించారు. ‘‘తెలంగాణ ఏర్పాటు దేశ చరిత్రలో ప్రత్యేక ఘట్టం. నేనూ పోలీసు లాఠీ దెబ్బలు తిన్నా. అంతులేని వివక్ష, అన్యాయం ఎదుర్కొంది తెలంగాణ. వేరే పార్టీలకు రాజకీయాలంటే గేమ్.. టీఆర్ఎస్కు మాత్రం ఒక టాస్క్. ఈ రాష్ట్రం తెచ్చిన వాళ్లం మేం. మేం ఏం చేశామో ప్రజలకూ తెలుసు. పోరాటాలు చేశాం. జైలుకు వెళ్లాం. వ్యక్తిగత నిందలు ఎదుర్కొన్నా. ఏకాగ్రత, లక్ష్యం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఊరుకున్నాం. తెలంగాణ కోసం క్షోభ, బాధ అనుభవించాం. తెలంగాణ భాష అంటే ఒకప్పుడు హాస్యాస్పదంగా ఉండేది. ఒకప్పుడు జోకర్లకు ఉండే తెలంగాణ యాస.. ఇప్పుడు హీరోలకు వచ్చేసింది. అధికారికంగా పండుగలు జరుపుకుని.. సంస్కృతిని కాపాడుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు.. ఉద్దేశంతో పోరాడాం. గోదావరి జలాలు సాధించుకున్నాం. తెలంగాణ కోసం విద్యార్థులు పోరాటాలు చేశారు. రెండు రోజులు ఆలస్యమైనా పని మంచిగా జరగాలనే కోణంలో పని చేసింది మా ప్రభుత్వం. ఇప్పటివరకు లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. మరో లక్షా 56 వేల ఉద్యోగాలకు నోటిఫై చేశాం. రాష్ట్రపతి, ప్రధానులకు స్వయంగా నేనే చర్చించా. దేశంలో ఎక్కడా లేని విధంగా.. శాశ్వతంగా 95 శాతం స్థానికులకే వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఇకపై అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే. టీచర్ల ప్రమోషన్లు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చాం. 9, 10 షెడ్యూల్ పంచాయితీ ఇంకా తెగని కారణంగా.. మరికొన్ని పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణలో గుర్తించిన ఖాళీలు 91, 142 11, 103 కాంట్రాక్ట్ ఉద్యోగుల రైగ్యులరైజేషన్ గ్రూప్-1 పోస్టులు 503, గ్రూప్-2 పోస్టులు 582 గ్రూప్-3 పోస్టులు 1,373 గ్రూప్-4 పోస్టులు 9,168 జిల్లా స్థాయిలో 39, 829 పోస్టులు. హైదారాబాద్- 5,268 నిజామాబాద్- 1,976 మేడ్చల్ మల్కజ్గిరి - 1,769 రంగారెడ్డి- 1,561 కరీంనగర్-1,465 నల్లగొండ-1,398 కామారెడ్డి- 1,340 ఖమ్మం- 1,340 భద్రాద్రి కొత్తగూడెం- 1,316 నాగర్ కర్నూలు-1,257 సంగారెడ్డి-1,243 మహబూబ్నగర్- 1,213 ఆదిలాబాద్-1,193 సిద్దిపేట- 1,178 మహబూబాబాద్: 1, 172 హన్మకొండ- 1,157 మెదక్- 1,149 జగిత్యాల- 1, 063 మంచిర్యాల-1, 025 యాదాద్రి-భువనగిరి- 1,010 జయశంకర్ భూపాలపల్లి- 918 నిర్మల్-876 వరంగల్-842 కొమురంభీం ఆసీఫాబాద్- 825 పెద్దపల్లి-800 జనగాం-760 నారాయణ్పేట- 741 వికారాబాద్-738 సూర్యాపేట-719 ములుగు- 696 జోగులాంబ గద్వాల-662 రాజన్న సిరిసిల్ల- 601 వనపర్తి-556 జోనల్ లెవల్లో 18, 866 పోస్టులు మల్టీజోనల్లో 13, 170 ఉద్యోగాల ఖాళీ ఇతర కేటగిరీ, వర్సిటీల్లో 8, 174 పోస్టులు నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతో పాటు మొత్తం ఖాళీలలో.. 11, 103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు సీఎం కేసీఆర్. అలాగే మిగిలిన వాటిల్లో 80, 039 పోస్టులకు ఇవాళ్టి(మార్చి 9, 2022) నుంచే నోటిఫికేషన్లు జారీ అవుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అంతేకాదు ఉద్యోగ గరిష్ట వయోపరిమితిని పదేళ్లకు పెంచుతున్నట్లు తెలిపారు. ఓసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల వయోపరిమితి 49 ఏళ్లు దివ్యాంగ అభ్యర్థుల వయోపరిమితి 54 ఏళ్లు ఎక్స్ సర్వీస్మెన్లకు వయోపరిమితి 47 ఏళ్లు హోంశాఖలో వయోపరిమితి మినహాయింపు లేదు ► మొత్తం 80, 039 ఖాళీల్లో.. అత్యధికంగా హోం శాఖలో 18, 334 ఖాళీలు ఉన్నాయి. తర్వాతి సెకండరీ ఎడ్యుకేషన్లో 13, 086 ఖాళీలు, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖలో 12, 775 ఖాళీలు ఉన్నాయి. ► ఉన్నత విద్యలో 7, 878, బీసీల సంక్షేమం 4, 311, రెవెన్యూలో 3, 560, షెడ్యూల్ కాస్ట్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 2, 879, ఇరిగేషన్లో 2, 692, ఫైనాన్స్లో 1, 146, అత్యల్పంగా లెజిస్లేచర్లో 25, విద్యుత్ శాఖలో 16 ఖాళీలు ఉన్నాయి. ► కాంట్రాక్ట్ ఉద్యోగాలు వద్దన్నందుకు రాష్ట్రంలోని పలు పార్టీలు కోర్టుకు వెళ్లాయని చెప్పారు సీఎం కేసీఆర్. ఉద్యోగి కన్నా కాంట్రాక్ట్ ఉద్యోగులే ఎక్కువ పనిచేస్తుంటారని, అయినప్పటికీ వారి జీతాలు మాత్రం తక్కువగా ఉంటున్నాయని చెప్పారు. ► కాంట్రాక్ట్ పేరుతో శ్రమదోపిడి ఉండకూడదనేది తమ అభిలాష అని ఆయన అన్నారు. అందుకే 11, 103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. క్రమంగా ఉద్యోగాల భర్తీ ఉంటుందని చెప్పారు. ► రాష్ట్రంలో ఇప్పటికే తాము 1.56 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని, 1.12 లక్షల కొత్త పోస్టులు మంజూరు చేశామని చెప్పుకొచ్చారు. తెలంగాణలో 1,33,940 ఉద్యోగాలు భర్తీ అయ్యాయని చెప్పారు. ► 95 శాతం లోకల్ కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామని అన్నారు. కేంద్ర సర్కారు సమస్యలను పరిష్కరించడం లేదని అన్నారు. దేశంలోనే అతి తక్కువ అప్పులు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన చెప్పుకొచ్చారు. తాము క్రమశిక్షణతో పరిపాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. కొందరు ఉద్యోగ నియామకాలపై అర్ధరహిత వివాదాలు సృష్టించారని ఆయన అన్నారు. -
తెలంగాణ బడ్జెట్ 2021: ‘సీఎం దళిత్ ఎంపవర్మెంట్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021-22 ఏడాదికి గాను 2,30,825.96 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశ పెట్టింది. షెడ్యూల్ కులాల ప్రజల అభివృద్ధికి బడ్జెట్లో పెద్ద పీట వేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో 2021-22 బడ్జెట్లో ఎస్టీల కోసం ప్రత్యేకంగా ‘సీఎం దళిత్ ఎంపవర్మెంట్’ పథకాన్ని రూపొందించినట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రాష్ట్రంలోని షెడ్యూల్ కులాల ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనాలు కల్పించబోతుందన్నారు.షెడ్యూల్ కులాల ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం ఉద్దేశించిన ఈ పథకం కోసం ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు. దాంతో పాటు ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం 21,306.85 కోట్ల రూపాయలను హరీశ్ రావు బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా విదేశాలలో విద్యను అభ్యసిస్తున్న షెడ్యూల్ కులాల విద్యార్థులకు 20 లక్షల రూపాయల చొప్పున డా. బీ.ఆర. అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్పులను ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటి వరకు 623 మంది విద్యార్థులు ఈ స్కాలర్షిప్ అందుకున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు 107.8 కోట్ల రూపాయల మొత్తాన్ని వెచ్చించింది. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యా వికాసం కోసం చేస్తోన్న కృషిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా లా కాలేజీల మంజూరీపై ఉన్న మారటోరియాన్ని సడలించి మన రాష్ట్రంలో రెండు గురుకుల ఇంటిగ్రేటెడ్ లా కాలేజీల ఏర్పాటు చేయడానికి ప్రత్యేక అనుమతి జారీ చేసింది. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా ఎస్టీ బాలుర కోసం న్యాయవిద్యా గురుకుల కళాశాలను సంగారెడ్డిలో ఏర్పాటు చేయగా.. దళిత బాలికల కోసం ఎల్బీ నగర్లో మరో న్యాయవిద్య గురుకులాన్ని ప్రారంభించింది. -
ఉచిత విద్యుత్ ఘనత వైఎస్సార్దే: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్ అమలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరోసారి పునరుద్ఘాటించారు. ఉచిత విద్యుత్ తాము అమలు చేశామని డబ్బాలు కొట్టుకునే అలవాటు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం నాణ్యమైన ఉచిత విద్యుత్ను ఇస్తున్నట్లు వివరించారు. కరోనా వైరస్పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సూచనలను పాటిస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో అన్ని వసతులు కల్పించామని చెప్పారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. పాత సచివాలయం స్థానంలో ప్రార్థనా మందిరాలు పునర్నిర్మిస్తామని స్పష్టం చేశారు. 39.36 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. భూసేకరణ ధరలు అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదని గుర్తుచేశారు. సంక్షేమానికి ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఇంకా రాష్ట్ర గీతం నిర్ణయించలేదని తెలిపారు. గందిమళ్ల నిర్వాసితులకు గజ్వేల్ పక్కన ఏడున్నరవేల ఇళ్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. న్యాయవాదుల హత్య కేసులో ఇప్పటికే చాలామంది అరెస్టయ్యారని గుర్తుచేశారు. ఆ హత్య కేసులో తమ పార్టీ మండల అధ్యక్షుడు హస్తం ఉందని వార్తలు రావడంతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని వివరించారు. పెట్రోల్ ధరలను అదుపు చేయడం తమ చేతుల్లో లేదని అన్నారు. -
హామీల అమలు దిశగా..
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల అమలుదిశగా సీఎం కేసీఆర్ బడ్జెట్ను రూపొందించారు. అభివృద్ధి, సంక్షేమం ప్రధాన లక్ష్యాలుగా బడ్జెట్ రూపకల్పన పూర్తయింది. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు కేసీఆర్ అసెంబ్లీలో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ అయినా కేంద్ర ప్రభుత్వం తరహాలోనే పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిపే అవకాశం ఉందని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఆర్థికశాఖ తన వద్దే ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. గత నాలుగేళ్లలాగే ఈసారీ భారీ బడ్జెట్కు రూపకల్పన జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రగతిభవన్లో సమావేశం కానున్న కేబినెట్ తాత్కాలిక బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. తాత్కాలిక బడ్జెట్ అయినా 12 నెలలకు అవసరమైన అంచనాలను బడ్జెట్లో పొందుపరిచినట్లు తెలిసింది. సంక్షేమానికి భారీగా... ‘ఆదాయం పెంచాలి. సంక్షేమం పంచాలి’నినాదంతో సంక్షేమ రంగానికి ఈసారీ భారీగా కేటాయింపులు జరపనుంది. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు గతంలో కంటే ఈసారి కేటాయింపులు పెంచనుంది. ఆసరా పింఛన్లలో కొత్త విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి పెరిగిన పింఛన్ను చెల్లించనుంది. ఈ నేపథ్యంలో ఆసరా పథకానికి కేటాయింపులు భారీగా పెరగనున్నాయి. రాష్ట్రంలో ఆసరా పింఛన్ లబ్ధిదారులు 40లక్షల మంది ఉన్నారు. వయస్సు పరిమితి తగ్గించడం, పెన్షన్ మొత్తాన్ని రెట్టింపు చేస్తుండడంతో కేటాయింపులు సైతం రెట్టింపు కానున్నాయి. కొత్తగా 7లక్షల మందికి పింఛను చెల్లించాలని అధికారుల నివేదికలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఆసరా పథకానికి అత్యధిక మొత్తంలో నిధుల కేటాయింపులు ఉండనున్నాయి. నిరుద్యోగభృతి, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పథకంలో మార్పులు, ఎస్సీ–ఎస్టీ వర్గాల అభివృద్ధికి ప్రత్యేక పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్లో వీటిని ప్రస్తావించడంతోపాటు అవసరమైన నిధుల కేటాయింపులు ఉండనున్నాయి. -
ఈ చిలిపి చేష్టలు, గిల్లికజ్జాలేమిటి?
-
ఈ చిలిపి చేష్టలు, గిల్లికజ్జాలేమిటి?: హరీశ్ రావు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సభలో ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకునేది లేదని టీఆర్ఎస్ పార్టీ నేత, మంత్రి హరీశ్ రావు అన్నారు. శాసన సభ గౌరవాన్ని కాంగ్రెస్ మంటగలిపిందని మండిపడుతూ వారి చర్యను ఖండించారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగలొద్దని, హుందాగా వ్యవహరించాలని గత బీఏసీ సమావేశాల్లోనే అందరి సమక్షంలో నిర్ణయించామని, అయినా ఎందుకు ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో స్పష్టత లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. స్లోగన్లతో సభలో గందరగోళానికి యత్నించారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే చూస్తే.. ‘మేం ఎన్ని రోజులైనా చర్చకు రెడీ. ప్రతి అంశంపై చర్చ పెడతామని ఇప్పటికీ చెబుతున్నాం. గతంలో అది చేశాం.. ఇప్పుడు కూడా చేస్తాం. స్పీకర్ కూడా అన్ని పక్షాలకు ఈ విషయాన్ని చెప్పారు. గతంలో బీఏసీలో గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులొద్దని నిర్ణయం తీసుకున్నప్పటికీ కాంగ్రెస్, టీడీపీ ఎందుకు స్లోగన్స్ ఇచ్చింది? ఎందుకు ఆ తొందరపాటు? చిలిపిచేష్టలు ఏ ఉద్దేశంతో చేశారు? గిల్లికజ్జాలతో సభను ఎందుకు డిస్ట్రబ్ చేయాలని అనుకున్నారు? ఏదైనా చెప్పాలనుకుంటే రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చెప్పేటప్పుడు చెప్పవచ్చు కదా. అప్పుడు మీకు చాలా సమయం ఉంటుందిగా. మీకు భయం.. ఎందుకంటే పోయిన శాసనసభ సమావేశాల్లోనే ప్రతిపక్షాలు క్లీన్ బోల్డ్ అయ్యాయి. ఇప్పుడు కూడా అవుతాయని భయపడ్డాయి. కుల వృత్తుల కోసం బడుగుల కోసం త్వరలో మరిన్ని సంక్షేమ పథకాలు తెస్తుంటే వణికిపోతున్నారు. తమను మెచ్చుకోవాల్సి వస్తుందని బాధపడుతున్నారు. ప్రతిపక్షాల చర్యను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘కేసీఆర్ తుగ్లక్లా చేసి గొప్పలు చెప్పుకుంటున్నారు’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ తుగ్లక్ పనులు చేసి చాలా గొప్పగా చేశానంటూ చెప్పుకుంటున్నారని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. గవర్నర్తో రాజకీయ ప్రసంగం చదివించారని ఆయన మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో స్పష్టత లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా మీడియా వద్ద టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి, జానారెడ్డి తదితరులు మాట్లాడారు. ఉత్తమ్కుమార్ రెడ్డి ఏం మాట్లాడారంటే.. ..‘తెలంగాణ ఏర్పడిన తర్వాత గవర్నర్ది నాలుగో ప్రసంగం. సాధారణంగా గవర్నర్ ప్రభుత్వ కేబినెట్ ఏది రాసిస్తే అదే చదువుతారు. నేటి ప్రసంగంలో ప్రధాన అంశాలు మాత్రం ఇందులో లేవు. గతంలో ప్రకటించిన పథకాలపై నిర్ధిష్టమైన ప్రణాళిక లేదు. గవర్నర్ చేత పలు చోట్ల అబద్ధాలు చెప్పించారు. పవర్ సప్లయ్ విషయంలో కాంగ్రెస్ హయాంలో పూర్తయినవి తప్ప వీళ్లు మొదలుపెట్టిన ప్రాజెక్టులతో ఒక్క యూనిట్ కూడా విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. అందించలేదు. వేరే రాష్ట్రాల నుంచి విద్యుత్ తీసుకొచ్చే పనులు కూడా గత ప్రభుత్వమే మొదలుపెట్టింది. ఏదో అద్భుతం చేస్తున్నట్లుగా చూపిస్తున్నారు. పరిశ్రమలు వచ్చినట్లుగా అబద్ధాలు చెప్పించారు. తెలంగాణ రాష్ట్రంలోకి పెట్టుబడులు తక్కువగా వస్తున్నాయని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వెబ్ సైట్ ఇచ్చిన నివేదిక 2017 తెలిపింది. 31 జిల్లాల గురించి గొప్ప చేసినట్లు చెబుతున్నారు. అన్ని తుగ్లక్ పనులు చేసి గొప్ప పనులని కేసీఆర్ అంటున్నారు. జిల్లాల విభజనలో ప్రజల మనోభవాలు పట్టించుకోలేదు. జీడీపీ గ్రోత్ రేట్ పెరిగిందని చెప్పారు.. దానిపై అనుమానం ఉంది. రబీలో తెలంగాణ రైతు బ్రహ్మాండంగా చేశారని కేసీఆర్ అంటున్నారు. కానీ, ఏది నిజమో రైతులకు తెలుసు. పంటపండింది తక్కువ చెప్పుకుంటుంది ఎక్కువ. వాస్తవానికి తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలో ఉంది. ముస్లింలు, గిరిజనులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న 12శాతం రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వలేదు’ . జానారెడ్డి ఏం మాట్లాడారంటే.. ‘ప్రభుత్వ విధివిధానాలను వివరించే విషయంలో ముఖ్యంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు.. మూడెకరాల భూమి, 12శాతం మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు, సబ్ ప్లాన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ స్పీచ్ చాలా బాధా కలిగించింది. డబుల్ బెడ్రూం, మూడు ఎకరాల భూమిపై ప్రజలు ఎదురు చూస్తున్నారు. మేం కూడా కొత్త ప్రభుత్వం అని సహకరించాం. వారు చేసిన తప్పిదాన్ని వారికి తెలియజేసేందుకే మేం వాకౌట్ చేశాం’ అని అన్నారు.