throws
-
రిజర్వేషన్లపై ఆందోళనలు.. మంత్రికి చేదు అనుభవం..
ముంబయి: రిజర్వేషన్ల అంశంలో మహారాష్ట్ర మంత్రి రాధాకృష్ణం విఖే పాటిల్కి చేదు అనుభవం ఎదురైంది. రిజర్వేషన్ కోసం డిమాండ్ చేస్తున్న అభ్యర్థులు మంత్రి రాధాకృష్ణం విఖే పాటిల్పై దురుసుగా ప్రవర్తించారు. మాట్లాడుతున్న క్రమంలో ఆయనపై పసుపు పోశారు. పక్కనే ఉన్న మంత్రి అనుయాయులు ఆ అభ్యర్థిపై విరుచుకుపడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమ రిజర్వేషన్ల పెంపు డిమాండ్పై మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్కు వినతిపత్రం ఇవ్వడానికి కొంత మంది అభ్యర్థులు వచ్చారు. వినతిపత్రం మంత్రికి అందించారు. ఆ లేఖను చదివే క్రమంలో మంత్రి తలపై పసుపును ఒక్కసారిగా పోశారు. ఈ అనుకోని సంఘటనతో ఆయన దూరంగా జరిగారు. Video: Man Throws Haldi At Maharashtra Minister, Warns Chief Minister https://t.co/zQTGSfboXq pic.twitter.com/zrvqRWvQC7 — NDTV (@ndtv) September 8, 2023 పక్కనే ఉన్న మంత్రి అనుయాయులు ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పక్కకు తోశారు. అనంతరం అతనిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై స్పందించిన మంత్రి.. తనపై పసుపు పోయడం శుభమేనని అన్నారు. ఇది తప్పుడు చర్య ఏం కాదని అన్నారు. దీనిని తాను సానుకూలంగా తీసుకున్నట్లు చెప్పారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఏకంగా రాష్ట్ర సీఎం మీద కూడా ఇంక్ పోస్తామని అభ్యర్థులు హెచ్చరించారు. తమ ధంగర్ కమ్యునిటీని షెడ్యూల్డ్ ట్రైబ్స్ కింద పరిగణించాలని డిమాండ్ చేశారు. అయితే.. మహారాష్ట్రలో కొన్ని రోజులుగా రిజర్వేషన్ల గొడవ కొనసాగుతోంది. ఇదీ చదవండి: ఢిల్లీకి చేరిన ఐఎంఎఫ్ చీఫ్.. ఫోక్ సాంగ్కు డ్యాన్సులు.. -
ఓరి.. దుర్మార్గుడా..! చలానాకు భయపడి..
Viral Video: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు ఎంత హితభోద చేసినా.. వాహనదారులు పెడచెవిన పెడుతుంటారు. తమ జీవితాలతో పాటు తోటి ప్రయాణీకులను ఇబ్బంది పెడుతుంటారు. ప్రయాణించే ముందే హెల్మెట్, సరైన ద్రువపత్రాలు వెంట తెచ్చుకుంటే ఏ సమస్య ఉండదు. కానీ అవేవీ లేకుండా రోడ్లపై వాహనాలను నడుపుతూ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నానాపాట్లు పడుతుంటారు. ఇలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. చలానా తప్పించుకోవడానికి ఓ యువకుడు చేసిన పని తన లవర్ కిందపడిపోయేలా చేసింది. ఓ యువకుడు తన ప్రేమికురాలితో బండిపై ప్రయాణిస్తున్నాడు. ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ వచ్చింది. యువకుడు బండిని నెమ్మదిగా స్లో చేశాడు. అంతలోనే అక్కడికి ఓ కానిస్టేబుల్ వచ్చాడు. అతన్ని చూడగానే యువకుడు చాలానా వేస్తాడేమోననే భయంతో తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా బండి స్పీడ్ పెంచేసి సిగ్నల్ను దాటేయబోయాడు. అంతే వెనక ఉన్న యువతి అమాంతం కిందపడిపోయింది. ఆమెను పట్టించుకోకుండానే ఆ యువకుడు తప్పించుకున్నాడు. लड़की को breakup में देर नहीं करनी चाहिए ऐसे बहुत आयेंगे जाएँगे यह लड़का गर्लफ़्रेंड के लिये एक चालान नहीं भर सका बीच सड़क बाइक से उतार दिया pic.twitter.com/BkUdzNq4Ls — Abhishek Anand Journalist 🇮🇳 (@TweetAbhishekA) August 14, 2023 అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఆ అమ్మాయిని పైకి లేపి ఆస్పత్రికి తరలించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను ప్రముఖ జర్నలిస్టు అభిషేక్ ఆనంద్ షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ట్రాఫిక్లో ఇలాంటి పిచ్చి చేష్టలు చేయకూడదని సూచనలు చేశారు. ఓరి దుర్మార్గుడా..! లవర్ కంటే చలానానే ఎక్కువై పోయిందా అంటూ ఫన్నీగా మరికొందరు కామెంట్ పెట్టారు. ఇదీ చదవండి: Indian Laws: ఆ వెసలుబాటు పురుషులకు లేదు.. అమ్మాయిల్ని దత్తత తీసుకోలేరు -
అభిమానిపై ప్రముఖ ర్యాపర్ ఫైర్.. మైక్ విసిరి.. బూతులు తిడుతూ..
ప్రముఖ ర్యాపర్ కార్జీ బీకి చేదు అనుభవం ఎదురైంది. ఓ మ్యూజిక్ షోలో పాట పాడుతుండగా.. ఓ వ్యక్తి ఆమెపై డ్రింక్ బాటిల్ను విసిరాడు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనిపై బూతులు తిడుతూ మైక్ను విసిరింది. 'ఐ లైక్ ఇట్' పాటకు మూమెంట్స్ ఇస్తూ వేదికపై కార్డీ బీ ఉత్సాహంగా పాట పాడుతున్నారు. ఈ క్రమంలో స్టేజ్ కింద నుంచి ఓ వ్యక్తి డ్రింక్ బాటిల్ను ఆమెపై విసిరాడు. కోపంతో ఊగిపోయిన కార్డీ బీ.. అతనిపై మైక్ విసిరింది. ఈ వీడియోను ర్యాపర్ సోషల్ మీడియాలో పంచుకుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. Jealous Ass Bitch! https://t.co/bPikhCYBYx pic.twitter.com/AUoG7pvtCv — Cardi B | Updates (@updatesofcardi) July 30, 2023 కార్జీ బీ చేసిన పనికి ఆమెను మెచ్చుకున్నారు కొంతమంది నెటిజన్లు. ఫ్యాన్సు అతి చేయకూడదని సూచనలు చేశారు. పర్ఫార్మర్లపై అలా చేస్తే ప్రోగ్రామ్ దెబ్బతింటుందని కామెంట్లు పెట్టారు. ఇందులో కార్జీ బీ చేసిన పనిని నిందించకూడదని అన్నారు. మ్యూజిక్ ప్రోగ్రామ్లలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. డ్రేక్, బెబే రెక్ష, కెల్సియా బాలేరిని, అవా మాక్స్లకు కూడా ఫ్యాన్స్ నుంచి ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయి. ఇదీ చదవండి: కోతి పిల్లను అక్కున చేర్చుకున్న పిల్లి.. ఏదేమైనా మథర్ ఈజ్ గ్రేట్..! వీడియో వైరల్.. -
మహిళను రోడ్డుపై పడేసి.. పెప్పర్ స్ప్రే చల్లి..
అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ నల్లజాతీయురాలిని పోలీసు నడిరోడ్డుపై పడేశాడు. అనంతరం ఆమెను కాలితో అదుముతూ పెప్పర్ స్ప్రే చల్లాడు. ఊపిరాడటం లేదని మహిళ చెబుతున్నా.. వినకుండా దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ పోలీసుపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. లాంకాస్టర్లోని వింకో కిరాణా దుకాణంలో దొంగతనానికి సంబంధించిన కేసులో ఓ వ్యక్తి, మహిళ నిందితులుగా ఉన్నారు. వీరివురు రోడ్డుపై కనిపించగా.. పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. మొదట ఆ వ్యక్తిని పట్టుకుని సంకేళ్లు వేశారు. ఆ దృశ్యాలను మహిళ వీడియో తీస్తుంది. దీనిని గమనించిన పోలీసు కోపంతో ఆమె వైపు దూసుకొచ్చాడు. అనంతరం మహిళను పట్టుకుని రోడ్డుపైనే లాగి పడేశాడు. ఆ తర్వాత ఆమెను కాలుతో అదుముతూ పెప్పర్ స్ప్రే చల్లాడు. బాధిత మహిళ ఇప్పటికే క్యాన్సర్తో పోరాడుతోంది. This is Lancaster, California. A Los Angeles county sheriffs deputy throws a Black woman to the ground and brutalized her for filming them arresting her husband. Filming the police is not illegal. This is brutality. Arrest this pig. pic.twitter.com/BKg9dnZX7M — Bishop Talbert Swan (@TalbertSwan) July 4, 2023 ఈ మొత్తం సన్నివేశాన్ని పక్కనే కారులో ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇది కాస్త నెట్టింట తెగ వైరల్ అయింది. పోలీసుల దురుసు ప్రవర్తనపై నెటిజన్లు ఫైరయ్యారు. ప్రతి వ్యక్తికి గౌరవం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై స్బందించిన పోలీసు విభాగం.. సదరు పోలీసులను విధుల నుంచి తప్పించినట్లు చెప్పారు. దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇదీ చదవండి: ఆకాశంలో తలకిందులుగా ఆగిపోయిన రోలర్ కోస్టర్.. -
టీచర్ క్రూరత్వం.. విద్యార్థిని స్కూల్ బాల్కనీలోంచి తోసేసి హత్య!
బెంగళూరు: కర్ణాటకలోని గడక్ జిల్లాలో దారుణ సంఘటన వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు క్రూరంగా ప్రవర్తించాడు. నాలుగో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని చితకబాది.. పాఠశాల భవనం మొదటి అంతస్తులోని బాల్కనీలోంచి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలైన ఆ బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన హగ్లీ గ్రామంలోని ఆదర్శ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం జరిగింది. కుటుంబ గొడవలే కారణం.. ఆదర్శ్ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు భరత్ అనే విద్యార్థి. అదే పాఠశాలలో పని చేస్తున్న ముత్తప్ప అనే ఉపాధ్యాయుడు.. భరత్ను చితకబాది బాల్కనీలోంచి బయటకు తోసేశాడని గడక్ జిల్లా సీనియర్ పోలీసు అధికారి శివప్రకాశ్ దేవరాజ్ తెలిపారు. ఈ దారుణం వెనుక కుటుంబ కలహాలు ఉన్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. బాధితుడు భరత్ తల్లి, అదే పాఠశాలలో టీచర్గా పని చేస్తున్న గీతా బార్కర్ను సైతం ముత్తప్ప తీవ్రంగా కొట్టినట్లు చెప్పారు. ఆమె స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోందన్నారు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిగా చేస్తున్న నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఇదీ చదవండి: పాతబస్తీలో దారుణం.. లలిత్ బాగ్ కార్పొరేటర్ అల్లుడి హత్య -
5 నెలల పసికందును బావిలో పడేసిన తల్లి
-
కన్నబిడ్డ హత్యకు వరుస ప్లాన్లు.. కసాయి తల్లిపై విచారణ
సాక్షి, బెంగళూరు: నగరంలో సంపంగిరామనగర సీకేసీ గార్డెన్ అద్విత్ అపార్టుమెంటులో నాలుగో అంతస్తు నుంచి ఐదేళ్ల బిడ్డను కిందకు విసిరేసి హత్య చేసిన తల్లి, దంత వైద్యురాలు సుష్మాపై విచారణ సాగుతోంది. బిడ్డకు మానసిక వైకల్యం అనే కారణంతోనే తల్లి నాలుగో అంతస్తు నుంచి పడేసిందని, హత్య కేసు నమోదు చేసి తల్లి సుష్మాను అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ డీసీపీ శ్రీనివాసగౌడ శనివారం తెలిపారు. బిడ్డను విసిరేస్తున్న దృశ్యం, నిందితురాలు సుష్మా భార్య చేసిన హత్యను సీసీ కెమెరాల్లో చూసిన భర్త కిరణ్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఆమెకు బిడ్డ భారమనిపించి ఉంటే నేనే పోషించేవాడనని చెప్పాడు. కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్య సుష్మాపై ఎస్ఆర్ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా బిడ్డను వదిలించుకోవాలని రైల్లో వదిలేసి వచ్చింది. అయితే ఒక ఎన్జిఒ సభ్యులు గాలించి కుటుంబానికి అప్పగించారు. చిన్నారిని అంతమొందించాలని అనేకసార్లు ప్రయత్నాలు చేసిందని విచారణలో తేలింది. చదవండి: మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్యకు వేధింపులు 2017లోనూ ఇదే మాదిరి ఘటన కాగా, 2017లో బెంగళూరు జేపీ నగరలో సరిగ్గా ఇటువంటి సంఘటనే జరిగింది. స్వాతి సర్కార్ అనే ప్రైవేటు స్కూల్ టీచర్.. తన కూతురు శ్రేయ సర్కార్ మానసిక వైకల్యంతో బాధపడుతోందని విరక్తి చెంది పాపను నాలుగో అంతస్తు నుంచి రెండుసార్లు కిందకు పడవేయడంతో పాప చనిపోయింది. తరువాత స్థానికులు ఆ తల్లిని పట్టుకుని కరెంటు స్తంభానికి కట్టేసి చావబాదారు. ఆ తల్లికి మతిస్థిమితం లేదని తేలింది. -
పెళ్లి కాకుండానే గర్భం.. బిడ్డను కిటికీలోంచి విసిరేసి..
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): అక్రమ సంబంధంతో గర్భం దాల్చిన అవివాహిత ప్రైవేట్ క్లినిక్లో బిడ్డకు జన్మనిచ్చి పురిటిబిడ్డను శౌచాలయం కిటికీలోంచి విసిరేసిన సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా హెసరఘట్టలో చోటుచేసుకుంది. హెసరఘట్టకు చెందిన మహిళ (22) అక్రమ సంబంధం కారణంగా గర్భం దాల్చింది. నెలలు నిండడంతో ప్రైవేటు ఆస్పత్రికి వచ్చి దాఖలయింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె పురిటిబిడ్డను శౌచాలయంలోని కిటికీలోంచి విసిరేసి పరారైంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన హాస్పిటల్ సిబ్బంది మాదనాయకనహళ్లి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఆమెను గుర్తించి అరెస్టు చేసి అనంతరం చికిత్స కోసం లక్ష్మివిలాస్ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన నవజాత శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఆమె గర్భం దాల్చడానికి కారణమైన గుడేమారనహళ్లికి చెందిన శశాంక్ (25) అనే వ్యక్తిని అరెస్టు చేసారు. ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. -
హెచ్1బీ వీసా : ఐటీ నిపుణులకు భారీ ఊరట
వాషింగ్టన్: హెచ్1బీ నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన హెచ్1బీ వీసాల ఆంక్షలపై అమెరికా ఫెడరల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలను కాలిఫోర్నియాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి జెఫ్రీ వైట్ తోసిపుచ్చారు. ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వం పారదర్శక విధానాలను పాటించలేదని ఈ మార్పులు కరోనా మహమ్మారి ఉద్యోగ నష్టాలను పూడ్చడంకోసం అని వాదించడం సరికాదని తెలిపింది. ఎందుకంటే ట్రంప్ సర్కార్కు అందకుముందే ఈ ఆంక్షల ఆలోచన ఉందనీ, కానీ అక్టోబరులో ఆదేశాలు జారీ చేసిందని జెఫ్రీ వ్యాఖ్యానించారు. ఈ తీర్పుతో బే ఏరియా కౌన్సిల్, స్టాన్ఫర్డ్ శ్వవిద్యాలయం, ఇతర విద్యా వ్యాపార వర్గం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపై చట్టపరమైన విజయం సాధించారు. ఇది మన ఆర్థిక వ్యవస్థకు, చెత్త ఆదేశాలపై సాధించిన పెద్ద విజయం" అని బే ఏరియా కౌన్సిల్ సీఈవో జిమ్ వుండెర్మాన్ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ట్రంప్ ఓటమి, జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవిని స్వీకరించనున్న నేపథ్యంలో తాజా ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమెరికాలోకి విదేశీ నిపుణుల రాకను అడ్డుకోవడం ద్వారా స్ధానికులకు ఉపాధి పెంచేందుకు ట్రంప్ సర్కార్ వీసాలపై ఆంక్షలు విధిస్తూ అక్టోబర్ లో ఆదేశాలు జారీ చేసింది. హెచ్ 1బీ వీసాలపై మూడవ పార్టీ సంస్థలలో హెచ్ 1బీ ఉద్యోగాల నియామకాలపై ఏడాది పాటునిషేధం విధించింది. దీనిపై బే ఏరియా కౌన్సిల్, స్టాన్ఫర్డ్, యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మానుఫ్యాక్చరర్స్ , ఇతర గ్రూపులు సవాల్చేసిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రతీ ఏడాదీ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి రంగాల్లో కలిపి దాదాపు 85 వేల వీసాలను ఇస్తుంది. ఇవి మూడేళ్ల పాటు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత వీటిని రెన్యువల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలా అమెరికాలో హెచ్1బీ వీసాలు పొందిన వారిలో 6 లక్షల మంది భారత్, చైనాకు చెందిన వారే ఉన్నారు. కాగా అమెరికా నూతన అధ్యక్షునిగా పదవిని చేపట్టనున్న జో బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్రంప్ ఆంక్షలను రద్దు చేయవచ్చునని భావిస్తున్నారు. తద్వారా లక్షలాది భారతీయుల వీసా ఇబ్బందులు చెక్పడనుందనే అంచనాలకు మరింత బలం చేకూరింది. బైడెన్ వాగ్దానం ప్రకారం హెచ్1బీ వీసాలతో బాటు హై స్కిల్డ్ వీసాల సంఖ్యను ఆయన పెంచవచ్చునని, అలాగే ఇమ్మిగ్రేషన్ పాలసీని సైతం సవరించే అవకాశం ఉందని అంచనా. -
ఫోన్ విసిరేసిన బాలకృష్ణ : వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్ : చిత్ర విచిత్ర వ్యాఖ్యలు, వింత ప్రవర్తనతో వార్తల్లో నిలిచే టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ట మరోసారి తన ప్రకోపాన్ని ప్రదర్శించారు. సందర్బం ఏదైనా, సమయం ఏదైనా తనకు కోపం వస్తే నేనింతే అంటూ బాలయ్య బాబు రియాక్ట్ అయిన తీరు ట్రెండింగ్లో నిలిచింది. ఒక సినిమా పోస్టర్ రిలీజ్ ఫంక్షన్లో బాలకృష్ణ కోపంతో సెల్ ఫోన్ విసిరేశారు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర్ష కనుమల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న “'సెహరి” సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచింగ్కు నందమూరి బాలకృష్ణ ప్రముఖ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మూవీ పోస్టర్ రిలీజ్కు బాలకృష్ణ సన్నద్దమవుతున్నారు. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. అంతే.. జేబులో నుంచి ఫోన్ తీసి పరిశీలించిన బాలయ్య, నెంబర్ చూసి మరీ ఫోన్ను అలా గాల్లోకి క్యాచ్ విసిరారు. అలా ఆయన స్టేజిపై నుంచే ఫోన్ విసిరేయటంతో సినిమా యూనిట్ సభ్యులు అంతా ఒక్క క్షణం బిక్క చచ్చిపోయారు. దీంతో నెటిజన్లు వ్యంగ్య కామెంట్లు, మీమ్స్తో సందడి చేస్తున్నారు. కోపదారి మనిషికి ఆ సమయంలో ఎవరబ్బా ఫోన్ చేసింది.. ఖచ్చితంగా ఎవరో బాలయ్య బాబుకు కోపం తెప్పించే వ్యక్తి ఫోన్ చేసి ఉంటారంటూ సోషల్ మీడియాలోకామెంట్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సందర్భంగా సినిమాని ప్రేమించండి.. సినిమా అనేది ఒక ప్యాషన్.. సినిమా అంటే పిచ్చి ఉండకూడదు.. అంటూ చిత్రయూనిట్కు బాలయ్య ఇచ్చిన సలహాపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనాకి వ్యాక్సిన్ ఇంకా రాలేదు.. ఇకముందు రాదు కూడా.. దాని సంగతి నాకు తెలుసు అంటూ వ్యాఖ్యానించి సంచలనం రేపారు. (గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కమెడియన్) View this post on Instagram A post shared by Punch Siksha (@punchsiksha) View this post on Instagram A post shared by hakunamatata3 (@hakunamatataaa_3) -
ఆటగాళ్లపై కిట్లను విసిరిన కర్ణాటక మంత్రి
న్యూఢిల్లీ: కర్ణాటక రెవిన్యూ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత ఆర్వీ దేశ్పాండే(71) వివాదంలో చిక్కుకున్నారు. ఆటగాళ్ల చేతికి స్పోర్ట్స్ కిట్లను అందించకుండా గాల్లోకి విసిరేసి పట్టుకోవాల్సిందిగా ఆయన సూచించారు. కర్ణాటకలో తన నియోజకవర్గం హలియాల్లో ఇండోర్ స్టేడియంను మంత్రి దేశ్పాండే బుధవారం ప్రారంభించారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి అథ్లెట్లకు క్రీడా కిట్లను అందించాల్సిందిగా నిర్వాహకులు దేశ్పాండేను వేదికపైకి ఆహ్వానించారు. ఆటగాళ్లందరినీ ముందుకు రావాల్సిందిగా కోరిన మంత్రి.. మహారాజు తరహాలో వేదిక నుంచి ఆటగాళ్లపైకి కిట్లను విసిరేశారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
కసాయి తండ్రి పైశాచికం
-
మతం మార్చుకోనన్నాడని ప్రియుడిపై యాసిడ్ దాడి..
బెంగళూరు: బెంగళూరులో ఓ యువతి ప్రేమికుడిపై యాసిడ్ చేసిన ఘటన కలకలం రేపింది. గత ఐదు సంవత్సరాలుగా ప్రేమిస్తున్న ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఈ దాడికి దిగింది. పథకం ప్రకారం అతణ్ని వెంబడించి మరీ ముఖంపై యాసిడ్ పోసి బ్లేడ తో దాడిచేసి పరారయ్యింది. వివరాల్లోకి వెళితే శ్రీరాంపురా లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న లిడియా (26) జయకుమార్ (32)గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వివాహంచేసుకోవాలని అడుగుతూ వచ్చింది లిడియా. అలాగే క్రైస్తవంలోకి మతం మార్చుకోవాలని కూడా డిమాండ్ చేసింది. అయితే ఎట్టకేలకు పెళ్లి చేసుకునేందుకు అంగీకరించినా మతం మార్చుకునేందుకు మత్రం నిరాకరించాడు కుమార్. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో గత నవంబర్ నుంచి జయకుమార్ ఆమె ఫోన్ కాల్స్ కు స్పందించడం మానేసాడు. దీంతో లిడియా ప్రియుడిపై పగ పెంచుకుంది. ఎలాగైనా దెబ్బకొట్టాలనుకుంది. దీనికి కజిన్ సునీల్ సాయం తీసుకుని జయ కుమార్ కదలికలపై కన్నేసింది. జయకుమార్, స్నేహితుడుతో పద్మనాభ రాజరాజేశ్వరి ఆలయానికి వెళుతున్న సమాచారాన్ని తెలసుకుంది. లిడియా, సునీల్ ఇద్దరూ స్కూటర్ మీద మార్గమధ్యలో అతని కోసం కాపు కాచారు. దర్శనం అనంతరం తిరిగి కారులో వస్తున్న జమకుమార్ పై దాడిచేసింది. అట్టిగుప్పబస్సు స్టాప్ దగ్గర వారికిని అటకాయించి..జయకుమార్ ముఖంపై యాసిడ్ పోసింది. బాధతో విలవిల్లాడుతూ కారునుంచి బయటికి వచ్చిన అతనిపై బ్లేడుతో ఎదురుచూస్తున్న లిడియా దాడిచేసి ఉడాయించింది. తీవ్రంగా గాయపడిని కుమార్ ను అతని స్నేహితుడు ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదుచేసిన పోలీసులు ఐపీసీ 326ఎ, 307 ఇతర సెక్షన్ల కింద లిడియాను అరెస్టు చేశారు. ఆమెకు సహకరించిన సునీల్ మాత్రం పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
ఆ శాడిస్ట్ ఓ మెడికో!
తన ఇంటి టెర్రస్ పై నిలబడి, కుక్కను పిట్టగోడపై నిలబెట్టి, నవ్వుతూ వీడియోకి పోజివ్వడమే కాదు.. దాన్ని మేడపైనుంచి విసిరేసి దారుణంగా ప్రవర్తించిన సదరువ్యక్తి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలోని కుక్కను టెర్రస్ పై నుంచి దూరంగా విసిరేసిన వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుణ్ని ఎట్టకేలకు పట్టుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే సదరు శాడిస్ట్ ఓ వైద్యవిద్యార్థి! కుక్కను కిందపడేసిన శాడిస్టును చెన్నైకి చెందిన మెడికో గౌతమ్ గా చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇతను చెన్నై శివారు తండాలంలోని మధా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోన్నట్లు పోలీసులు తెలిపారు. వీడియో ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన తమకు గౌతమ్ స్నేహితుడొకరు ఇచ్చిన సమాచారం కీలకంగా మారిందని పేర్కొన్నారు. బిల్డింగ్ పై నుంచి కుక్కను కిందికి తోసేసిన వీడియో వైరల్ కావడంతో అందులో ఉన్న గౌతమ్ ను అతని క్లాస్ మేట్ గుర్తుపట్టి పోలీసులకు ఉప్పందించడంతో శాడిస్ట్ జాడ తెలిసినట్లయింది. గౌతమ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీడియో చిత్రీకరించిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. చేస్తున్నది రాక్షస క్రీడ అయినా ఎంతో ఆనందంగా నవ్వుతూ గౌతమ్ కెమెరాకు పోజిచ్చిన తీరు అందర్నీ విస్మయపరుస్తోంది. ఆ మూగ జంతువు ప్రాణ భయంతో అరుస్తూ నేలపై పడటాన్ని సైతం స్టో మోషన్ లో వీడియో తీసి ప్రకృతికి విరుద్ధంగా అతడు ప్రవర్తించిన తీరు... చూపరులను అందోళన పరుస్తోంది. ఓ మూగ ప్రాణం పట్ల అతడు చూపించిన కర్కశత్వానికి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోలోని శాడిస్టు ఎవరో తెలుసుకొని, తగిన శిక్ష విధించాలని ఫేస్ బుక్ వినియోగదారులతోపాటు జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. మనుషుల మనోభావాలు, ప్రవర్తన.. ఒక్కోరివీ ఒక్కోలా ఉంటాయి. అయితే అవి ఇతరులకు ఎలాంటి హాని తలపించనివైతే నష్టంలేదు. వారి ప్రవర్తన తేడాగా ఉన్నపుడు మాత్రం సమాజానికి, ఇతరులకు ఎంతో నష్టాన్ని చేస్తుంది. అటువంటి వారిపట్ల మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే. మెడికో గౌతమ్ అదే కోవకు చెందిన వ్యక్తి అని కాదనగలమా! -
నాన్న తోసేశాడు.. చెట్లు రక్షించాయ్!
థానేః ఆరేళ్ళ ఆ చిన్నారి పట్ల తండ్రే కాసాయి వాడిలా ప్రవర్తించాడు. పసిప్రాణం అని చూడకండా నిర్దాక్షిణ్యంగా నదిలో విసిరేశాడు. అయితే తండ్రి రాక్షసుడిలా ప్రవర్తించినా... నదీమతల్లి మాత్రం ఆమె గర్భంలో అల్లారుముద్దుగా పెరుగుతున్న పచ్చని చెట్లను ఆమె ప్రాణాలకు అడ్డువేసింది. దాంతో పదకొండు గంటలపాటు చెట్లను పట్టుకొని ప్రాణాలు కాపాడుకొన్న ఆమెను... అదృష్టవశాత్తూ అటుగా వచ్చిన ఓ సెక్యూరిటీ గార్డు రక్షించాడు. థానే, బద్లాపూర్ లోని వాలివ్లీ బ్రిడ్జి ప్రాంతంలో జరిగిన ఘటన కన్నతండ్రి కర్కశత్వానికి నిదర్శనంగా నిలిచింది. బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు గుప్పెట్టో పెట్టుకొని చెట్లను పట్టుకొని ఏడుస్తున్నఆరేళ్ళ చిన్నారిని అక్కడి కనస్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు చూసి రక్షించడంతో ఆమె ప్రాణాలతో బయట పడింది. కొత్త బూట్లు కొనిస్తానని నమ్మించి, ఉత్సాహంగా తనతో వచ్చిన ఆరేళ్ళ కూతుర్ని ఆమె తండ్రితోపాటు, అతడి స్నేహితుడు బలవంతంగా అల్హాస్ నదిలోకి తోసేసిన ఘటన స్థానికులను విస్మయ పరచింది. స్థానిక మోహన్ గ్రూప్ కనస్ట్రక్షన్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 35 ఏళ్ళ రమేష్ భైర్ సదరు చిన్నారి నదిలో ప్రాణాలతో ఉన్నట్లుగా గమనించాడు. తాను నదివైపునుంచీ వెడుతుండగా ఎక్కడో పాప అరుపులు, ఏడుపు వినిపించాయని, కానీ నదిలోకి చూస్తే ఎవ్వరూ కనిపించలేదని చెప్పాడు. తర్వాత కాసేపు నిశితంగా బ్రిడ్జిమీద నిలబడి చూస్తే బ్రిడ్జి కందిభాగంలోని చెట్లను పట్టుకొని ఓ పాప కనిపించడంతో నిర్ఘాంతపోయిన తాను వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించినట్లు తెలిపాడు. 15 నిమిషాల్లో అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది పాపను రక్షించినట్లు రమేష్ వెల్లడించాడు. పాపను నదినుంచీ బయటకు తీసిన అనంతరం ఆమె చెప్పిన వివరాలను బట్టి వర్తక్ నగర్ కు చెందిన ఏక్తా తులసిరామ్ సియానిగా పాపను గుర్తించామని రమేష్ భైర్ తెలిపాడు. నదిలో ఎలా పడిపోయావ్ అని అడిగితే.. తన తండ్రి, అతడి స్నేహితుడు కలసి తనను నదిలోకి విసిరేసినట్లు తెలిపిందని చెప్పాడు. తనకు షూ కొనిస్తానని చెప్పి... బయటకు తీసుకెళ్ళి నిదిలో విసిరేశారని పాప చెప్పిన వివరాలను బట్టి కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు తమకు ఫోన్ కాల్ రాగానే ఘటనా ప్రాంతానికి చేరుకొని, ఓ తాడుకు ఎయిర్ ట్యూబ్ ను కట్టి నదిలోకి దిగి, పాపను ట్యూబ్ పై కూర్చోపెట్టుకొని 20 నిమిషాల్లోపలే ప్రాణాలతో రక్షించినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. ఇదిలా ఉంటే పాప తల్లి వర్తక్ నగర్ పోలీస్ స్టేషన్ లో అంతకు ముందురోజే మిస్సింగ్ కేసు నమోదు చేసిందని, మైనర్ బాలిక కావడంతో కడ్నాప్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు సీనియర్ పోలీస్ ఇనస్పెక్టర్ కెజి గవిట్ తెలిపారు. అనంతరం బద్లాపూర్ నది ప్రాంతంలో పాప దొరికి నట్లుగా సమాచారం అందడంతో ఆమెను వైద్య పరీక్షలకు పంపించామని, తమ సిబ్బంది తండ్రి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. -
కోరిక కాదన్నాడని.. డాక్టర్పై యాసిడ్ దాడి!
లక్నో: ఉత్తరప్రదేశ్లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. తన కోరికను కాదన్నాడనే కారణంతో ఓ మధ్య వయసు మహిళ స్థానిక ఓ యువ డాక్టర్ పై యాసిడ్ దాడి చేయడం కలకలం రేపింది. ఘజియాబాద్ జిల్లాలో వైశాలిలో సోమవారం ఈ దారుణం జరిగింది. బాధితుడు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే వైశాలికి చెందిన ఓ మహిళ (45).. పశువుల డాక్టర్ అయిన అమిత్ వర్మ (28)పై యాసిడ్ కుమ్మరించింది. జాతీయ మీడియా కథనం ప్రకారం.. అమిత్ వర్మతో సంబంధాన్ని కోరుకున్న మహిళ గత కొన్నిరోజులుగా అతణ్ని వేధిస్తోంది. ఆమె ప్రతిపాదనను డాక్టర్ గట్టిగా తిరస్కరించడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వెటర్నరీ డాక్టర్ అమిత్ .. కుక్కల కోసం స్థానికంగా ఒక క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం నాలుగు లీటర్ల యాసిడ్తో క్లినిక్కు వచ్చిన ఆమె.. అమిత్ పై దాడి చేసి ఉడాయించింది. తీవ్ర గాయాలపాలైన అమిత్ను అతని స్నేహితుడు దీపక్ ఆసుపత్రికి తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితునికి నలభై శాతం గాయాలయ్యాయని పొట్టమీద, ఛాతీపైన తీవ్ర గాయాలైనట్టువైద్యులు ప్రకటించారు. పోలీసులు కేసు నమోదుచేసి, బంధువులకు సమాచారం అందించారు. అయితే అమిత్ వర్మ తీవ్ర గాయాల పాలై బ్యాండేజీలతో ఉండటంతో ఆయన నుంచి ప్రస్తుతానికి వాంగ్మూలం ఏదీ నమోదు చేయలేదు. కాగా, ఘటనా స్థలంలో మరో మహిళ పర్సు, ఐడీ కార్డు దొరికాయని పోలీసు అధికారి దీపక్ ఉపాధ్యాయ తెలిపారు. -
యువకుడిని బయటకు తోసేసిన ప్రీతీ జింటా
బాలీవుడ్ నటి ప్రీతీ జింటాకు కోపం వచ్చింది. అది ఏ రేంజ్లో అంటే.....ఓ యువకుడిని సినియా థియేటర్ నుంచి బలవంతంగా బయటకు తోసేటంత. జాతీయ గీతం వస్తున్నప్పుడు ఓ యువకుడు లేచి నిలబడేందుకు నిరాకరించటం ప్రీతి జింతాకు ఆగ్రహం తెప్పించింది. దాంతో ఆమె ఈ చర్యకు పాల్పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే హృతిక్ రోషన్ తాజా చిత్రం 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమా చూసేందుకు ప్రీతి మంగళవారం ఓ థియేటర్కు వెళ్లింది. ఈ సందర్భంగా సినిమా మొదలయ్యే ముందు జనగణమణ గీతం వస్తుండగా సినిమాకు వచ్చిన ఓ యువకుడు లేచి నిలబడలేదు. దాంతో చిర్రెత్తుకొచ్చిన ప్రీతికి అతడిని బలవంతంగా థియేటర్ నుంచి తోసేసింది. ఈ సంఘటనను ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేసింది.మరోవైపు ప్రీతి చర్యపై సోషల్ మీడియాలో ఓ వర్గం నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఆమెకు దేశభక్తి ఉండచ్చు కాని మరీ ఇంత తలబిరుసు తనం పనికిరాదని బాధితుడి తరపున వ్యాఖ్యలు చేశారు. -
బిడ్డ పుట్టగానే బాత్రూమ్ నుంచి విసిరేసిన మహిళ
-
మెదక్ జిల్లా సిద్ధి పేటలో కసాయి తల్లి