time bomb
-
యూపీలో టైం బాంబ్ కలకలం
ఫరూఖాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్లో ఇస్మాయిల్గంజ్లో టైంబాంబ్ కలకలం రేగింది. రెవెన్యూ అధికారి రవీంద్రవర్మ ఇంటి ముందు గురువారం ఉదయం ఓ ప్యాకెట్ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో టైం బాంబు అని తేలడంతో బాంబు స్వ్కాడ్ సాయంతో బాంబును నిర్వీర్యం చేయడంతో అంతా ఊపరి పీల్చుకున్నారు. -
ఎన్నికలకు ముందే చిందిన రక్తం!
బీహార్లో ఎన్నికలంటే ఒకప్పుడు పెద్ద ఎత్తున హింస చోటుచేసుకునేది. ఆటవిక రాజ్యాన్ని తలపించేవిధంగా మాటవినని అభ్యర్థులపై దాడులు, ఓటర్లకు బెదిరింపులు, బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోవడం వంటి అరాచకాలు జరిగేవి. ఇటీవలకాలంలో ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడంతో ఈ హింస కొంత తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా.. తాజాగా ఎన్డీయే, జేడీయూ కూటమి మధ్య హోరాహోరీగా జరుగుతున్న ఎన్నికల్లోనూ హింస చోటుచేసుకుంటున్నది. ఒకప్పటి అరాచకాలను ఇది గుర్తుచేస్తున్నది. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. మధుబని జిల్లాలో జంఝర్పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న సునీల్ ఝాపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో గాయపడిన సునీల్ ఝా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు బీజేపీ రెబెల్ ఎమ్మెల్యే రెష్మీ వర్మ ఇంటివద్ద టైంబాంబ్ దొరకడం కలకలం సృష్టించింది. బీజేపీ నుంచి టికెట్ రాకపోవడంతో రేష్మీ వర్మ స్వతంత్ర అభ్యర్థిగా నర్కటియాగంజ్ నుంచి పోటీకి దిగారు. రెబెల్గా బరిలోకి దిగిన ఆమెకు మొదటినుంచీ బెదిరింపు లేఖలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఇంటివద్ద అమర్చిన టైంబాంబును పోలీసులు శనివారం గుర్తించి నిర్వీర్యం చేశారు. గతంలోనూ రేష్మీ వర్మ ఇంటివద్ద బాంబు దొరకడం గమనార్హం. ఇక మొదటి దఫా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార గడువు నేటితో ముగిసింది. ఈ నెల 12న తొలిదఫా పోలింగ్ జరుగనుంది. -
శివగంగైలో టైమ్బాంబ్
చెన్నై, సాక్షి ప్రతినిధి: శివగంగైలోని ఒక టాస్మాక్ దుకాణంలో టైమ్బాంబ్ బయటపడింది. పైపు రూపంలో ఒక గోనె సంచిలో రహస్యంగా దాచి ఉంచిన ఈ బాంబును నిర్వీర్యం చేశారు. దీంతో పెద్దప్రమాదం తప్పింది. శివంగంగై గాంధీకి వీధి సమీపంలో జిల్లా ఉపాధికల్పనా కార్యాలయ నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు. ఈ నిర్మాణానికి ఎదురుగుండా టాస్మాక్ దుకాణం, దీనికి అనుబంధంగా బార్ ఉంది. కొత్త ఏడాది వేడుకల్లో భాగంగా గురువారం ఉదయం నుంచి రాత్రి 10 గంటలకు టాస్మాక్ మూసివేసే వరకు భారీ సంఖ్యలో మందుబాబులు గుమిగూడారు. టాస్మాక్ మూసివేసిన తరువాత సిబ్బందిని పంపివేసి కొందరు మాత్రం లోపలే నిద్రించారు. అర్ధరాత్రి వేళ వారిలో ఒకడు మూత్ర విసర్జన కోసం లేచివెళుతుండగా ఒక మూల నుంచి టిక్టిక్ అనే శబ్దం వినిపించింది. భయాందోళనకుగురైన ఆ వ్యక్తి ఇతరులను నిద్రలేపాడు. టాస్మాక్ దుకాణం నలుమూలల పరిశీలించగా ఒక గోతం నుంచి ఆశబ్దం వస్తున్నట్లు కనుగొన్నారు. బాంబుగా అనుమానించిన వారు టాస్మాక్ యజమానికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్ నిపుణులు అక్కడికి చేరుకున్నారు. అది బాంబుగా నిర్ధారించారు. జాగ్రత్తగా గోతాంను తెరచిచూడగా అర అడుగున్న పైపు రూపంలో బాంబు, రెండు సిలిండర్లు, బ్యాటరీలు, ఒక డయలు కలిగి ఉన్న టైమ్బాంబు కనిపించింది. వాటి అనుసంధానాన్ని జాగ్రత్తగా కట్చేసి బాంబును నిర్వీర్యం చేశారు. దీనిపై ఓ అధికారి మాట్లాడారు. ఇది చాలా శక్తివంతమైనదని, సుమారు 300 అడుగుల పరిధిలో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించగలదని చెప్పారు. భవనాలను కూల్చివేయడంతోపాటు ప్రాణ నష్టం కూడా తీవ్రంగా ఉండేదని చెప్పారు. టైమ్బాంబుగానేగాక రిమోట్ సహాయంతో పేల్చేసే వసతి ఉందన్నారు. -
టైం బాంబు కలకలం
చిలమత్తూరు, న్యూస్లైన్ : చిలమత్తూరు మండలం పలగలపల్లి పంచాయతీ పరిధిలోని బండ్లపల్లి గ్రామంలో టైం బాంబు కలకలం రేపింది. ఆరుబయట భార్యతో కలిసి నిద్రిస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్త వెంకటశివప్పను హతమార్చేందుకు అతని ఇంటి ముందు ప్రత్యర్థులు మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు బాంబు పేలేలా టైం సెట్ చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కరెంటు రావడంతో వ్యవసాయబోరు మోటరును ఆన్ చేసేందుకు భార్య,భర్తలు లేవడంతో పాలిథిన్ కవర్లో ఉంచిన బాంబును గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఐదు నిమిషాలు ముందుగానే అంటే 2:55 గంటలకు బాంబును నిర్వీర్యం చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ .. వైఎస్సార్సీపీ కార్యకర్త వెంకటశివప్ప ఇంటి వద్ద టైం బాంబు అమర్చిన స్థలాన్ని హిందూపురం రూరల్ సీఐ శివనారాయణస్వామి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఊర్లో ఎవరైనా శత్రువులు ఉన్నారా అని ఆరా తీయగా.. తనకెవరూ వ్యక్తిగతంగా శత్రువులు లేరని బాధితుడు తెలిపారు. తాను వైఎస్సార్సీపీలో చురుగ్గా పాల్గొంటున్నానన్న కారణంగానే ప్రత్యర్థులు ఈ పనికి ఒడిగట్టి ఉంటారని చెప్పారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం సంఘటన స్థలాన్ని డాగ్స్క్వాడ్తో తనిఖీ చేయించారు. త్వరలోనే నిందితులను గుర్తిస్తామని సీఐ చెప్పారు. -
వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇంట్లో టైంబాంబు
-
వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇంట్లో టైంబాంబు
అనంతపురం జిల్లాలో టైంబాంబు కలకలం సృష్టించింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంకటశివప్ప ఇంట్లో ఈ టైంబాంబు మంగళవారం తెల్లవారుజామున బయటపడింది. ఈ ప్రాంతంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వెంకట శివప్పను హతమార్చేందుకు ఆయన రాజకీయ ప్రత్యర్థులే ఇలా చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. తన స్వగ్రామమైన బండ్లపల్లిలోని ఇంట్లో ఉన్న శివప్ప, మంగళవారం తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో మోటార్ ఆన్ చేసేందుకు బయటకు వచ్చారు. ఆ సమయంలోనే ఇంట్లో టైం బాంబు ఉన్న విషయాన్ని ఆయన గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చిలమత్తూరు నుంచి పోలీసులు వచ్చారు. వెంటనే బాంబు నిర్వీర్యదళాన్ని పిలిపించి, ఆ టైంబాంబును నిర్వీర్యం చేయించారు. శివప్ప ప్రత్యర్థులే ఇలాంటి ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.