Trinamool Congress MP
-
‘మిమిక్రీ’పై ఆగ్రహ జ్వాలలు
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను అనుకరిస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయడాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. ధన్ఖడ్కు మద్దతు ప్రకటిస్తూ ముర్ము బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఎంపీల ప్రవర్తనను చూసి కలత చెందానని పేర్కొన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాలను ఎంపీలంతా కాపాడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. రాష్ట్రపతికి ధన్ఖడ్ కృతజ్ఞతలు తెలిపారు. అవమానాలు, హేళనలు తన మార్గం తనను నుంచి తప్పించలేవన్నారు. ధన్ఖడ్కు మోదీ ఫోన్ ధన్ఖడ్తో మోదీ ఫోన్లో మాట్లాడారు. విపక్ష సభ్యుల ప్రవర్తన చాలా బాధ కలిగించిందన్నారు. విపక్ష సభ్యులు మిమిక్రీ చేయడాన్ని మోదీ ఆక్షేపించారు. ఎవరు ఎన్ని విధాలుగా హేళన చేసినా తన విధులు తాను నిర్వరిస్తూనే ఉంటానని, ఎవరూ తనను అడ్డుకోలేరని మోదీతో ధన్ఖడ్ చెప్పారు. తాను 20 ఏళ్లుగా ఇలాంటి హేళనలు, అవమానాలు ఎదుర్కొంటున్నానని మోదీ చెప్పారంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, ఎన్డీయే ఎంపీలు కూయాయనకు మద్దతు ప్రకటించారు. సంఘీభావంగా బుధవారం లోకసభలో 10 నిమిషాలపాటు లేచి నిల్చున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ధన్ఖఢ్ను కలిసి సంఘీభావం ప్రకటించారు. ధన్ఖడ్ బుధవారం రాజ్యసభలో మాట్లాడారు. పార్లమెంట్ను, ఉప రాష్ట్రపతి పదవిని అవమానిస్తే సహించబోనని హెచ్చరించారు. మిమిక్రీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ ఎవరినీ కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేదని అన్నారు. ఉప రాష్ట్రపతిని అవమానించలేదని చెప్పారు. బీజేపీ ఎంపీపై చర్యలేవి: కాంగ్రెస్ జాట్ కులాన్ని ప్రతిపక్షాలు అవమానించాయన్న ఆరోపణలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. పార్లమెంట్లో తనను ఎన్నోసార్లు మాట్లాడనివ్వలేదని, దళితుడిని కాబట్టే మాట్లాడే అవకాశం ఇవ్వలేదని తాను అనొచ్చా అని ప్రశ్నించారు. మోదీ గతంలో అప్పటి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీని మిమిక్రీ చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ గుర్తు చేశారు. -
మహువాపై వేటు
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యురాలు మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. ఆమె లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం ప్రకటించారు. డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగిన కేసులో ఆమెను దోషిగా తేలుస్తూ లోక్సభ ఎథిక్స్ కమిటీ ఇచి్చన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై విపక్షాలు అభ్యంతరాలు వెలిబుచ్చగా స్పీకర్ నిర్ణయాన్ని తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. తనపై వేటును మొయిత్రా తీవ్రంగా నిరసించారు. స్పీకర్ చర్య అనర్హులైన జడ్జిలతో కూడిన (కంగారూ) కోర్టు ఉరిశిక్ష తీర్పు వెలువరించినట్టుగా ఉందంటూ ఎద్దేవా చేశారు. ఆమె పశి్చమబెంగాల్లోని కృష్ణనగర్ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాట్లాడే చాన్సివ్వని స్పీకర్ మొయిత్రా ఉదంతంపై విచారణ జరిపిన బీజేపీ ఎంపీ వినోద్కుమార్ సోంకర్ సారథ్యంలోని ఎథిక్స్ కమిటీ శుక్రవారం మధ్యాహ్నం లోక్సభకు నివేదిక సమరి్పంచింది. ఆమెను దోషిగా తేలి్చనట్టు పేర్కొంది. ‘‘మొయిత్రా అనైతిక ప్రవర్తనకు పాల్పడ్డారు. తన లోక్సభ పోర్టల్ యూజర్ ఐడీ, పాస్వర్డ్లను అనధికారిక వ్యక్తులకు ఇచ్చారు. తద్వారా దేశ భద్రతకు తీవ్ర విఘాతం కలిగించే పని చేశారు’’ అని తెలిపింది. అనంతరం మొయిత్రాను సభ నుంచి బహిష్కరించాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ తీర్మానం ప్రవేశపెట్టారు. ‘‘మొయిత్రా ప్రవర్తన ఒక ఎంపీ స్థాయికి తగ్గట్టుగా లేదని తేలింది. ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బు, కానుకలు తీసుకుని ప్రతిగా అతని ప్రయోజనాల కోసం ఇలాంటి పనులు చేయడం గర్హనీయం’’ అని అందులో పేర్కొన్నారు. మొయిత్రా సభ్యత్వ రద్దుకు కమిటీ చేసిన సిఫార్సును ఆమోదించాల్సిందిగా సభను మంత్రి కోరారు. తృణమూల్తో పాటు కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఇందుకు తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. మొయిత్రాకు తన వాదన విని్పంచే అవకాశమివ్వాలని డిమాండ్ చేశాయి. గత ఉదంతాలను ఉటంకిస్తూ అందుకు స్పీకర్ నిరాకరించారు. ‘‘2005లో నగదుకు ప్రశ్నల కుంభకోణానికి పాల్పడ్డ 10 మంది లోక్సభ సభ్యులను నాటి స్పీకర్ సోమనాథచటర్జీ సభ నుంచి బహిష్కరించారు. ఆ సందర్భంగా సదరు ఎంపీలకు తమ వాదన చెప్పుకునే అవకాశమివ్వలేదు. అంతేకాదు, ఈ ఉదంతంపై ఎథిక్స్ కమిటీ నివేదిక సభకు అందిన రోజే దాని సిఫార్సు మేరకు వారిపై అనర్హత వేటు వేయాలని సభను కోరుతూ నాటి లోక్సభ నేత ప్రణబ్ ముఖర్జీ తీర్మానం ప్రవేశపెట్టారు’’ అని గుర్తు చేశారు. అనంతరం నివేదిక, తీర్మానంపై కాసేపు వాడివేడి చర్చ జరిగింది. నివేదికను విశ్లేíÙంచేందుకు సభ్యులకు కనీసం మూడు నాలుగు రోజుల సమయమివ్వాలని సభ్యుడు అ«దీర్ రంజన్ చౌదరి (కాంగ్రెస్) కోరగా స్పీకర్ తిరస్కరించారు. ఒక సభ్యున్ని బహిష్కరించాలంటూ సిఫార్సు చేసే అధికారం ఎథిక్స్ కమిటీకి లేదని కాంగ్రెస్ సభ్యుడు మనీశ్ తివారీ వాదించారు. అనంతరం మూజువాణి ఓటుతో తీర్మానాన్ని సభ ఆమోదించింది. దీన్ని నిరసిస్తూ విపక్షాలు వాకౌట్ చేశాయి. అనంతరం మహువాతో కలిసి గాం«దీజీ విగ్రహం వద్ద నేతలు నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యానికి ఉరి: మమత డార్జిలింగ్: మొయిత్రాను బహిష్కరించడం ద్వారా ప్రజాస్వా మ్యాన్ని హత్య చేశారని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశి్చమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈ చర్య పార్లమెంటుకే మచ్చ తెచి్చందన్నారు. ‘‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఇది దుర్దినం. ఎన్నికల్లో తమను ఓడించలేక బీజేపీ ఇలా కక్షసాధింపు రాజకీయాలకు దిగుతోంది’’ అని ఆరోపించారు. మొయిత్రాకు పార్టీ పూర్తిగా మద్దతుగా నిలుస్తుందన్నారు. ‘‘500 పేజీల నివేదిక సభ ముందు పెట్టి, కేవలం 30 నిమిషాల చర్చతో తీర్పు వెలువరించడమా? అంత తక్కువ సమయంలో సభ్యులు నిర్ణయానికి ఎలా రాగలరు?’’ అని మమత ప్రశ్నించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తథ్యమన్నారు. మొయిత్రాకు దన్నుగా నిలిచినందుకు ఇండియా కూటమికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్తో పాటు బీఎస్పీ, ఎస్పీ, సీపీఐ, పీడీపీ తదితర పారీ్టల నేతలు కూడా బహిష్కరణను తప్పుబట్టారు. ఏం జరిగింది? వ్యాపారవేత్త దర్శన్ హీరా నందానీ నుంచి మొయిత్రా భారీగా డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకుని ఆయనకు లబ్ధి చేకూర్చేలా అదానీ సంస్థ తదితరాలపై లోక్సభలో ప్రశ్నలడిగారంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే గత అక్టోబర్లో తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేగాక మొయిత్రా తన లోక్సభ వెబ్సైట్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ను కూడా నందానీకి ఇచ్చారని దూబేతో పాటు ఆమె మాజీ సన్నిహితుడు జై అనంత్ దేహద్రాయ్ కూడా ఆరోపించారు. అది నిజమేనంటూ నందానీ ఎథిక్స్ కమిటీకి అఫిడవిట్ సమరి్పంచారు. దీనిపై మొయిత్రాను ఎథిక్స్ కమిటీ విచారణకు పిలిచింది. అసభ్యకరమైన ప్రశ్నలడిగారంటూ విచారణను ఆమె బాయ్కాట్ చేశారు. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. ప్రశ్నలడిగేది నా పీఏనే! మొయిత్రా ఉదంతంపై చర్చ సందర్భంగా లోక్సభలో జేడీ(యూ) సభ్యుడు గిరిధారీ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ‘‘నాకసలు కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియదు. అందుకే నేను ఒక్క లిఖిత ప్రశ్న కూడా స్వయంగా అడగలేదు. నా లోక్సభ పోర్టల్ లాగిన్ఐడీ, పాస్వర్డ్ నా పీఏ దగ్గరుంటాయి. నా తరఫున నా ప్రశ్నలన్నింటినీ అతనే అందులో అడుగుతాడు’’ అని చెప్పుకొచ్చారు! దాంతో అంతా అవాక్కయ్యారు. అలా ఇతరులతో ప్రశ్నలు తయారు చేయించకూడదంటూ ఎంపీని స్పీకర్ మందలించారు. ఏ ఆధారాలతో వేటు? తనకు వ్యతిరేకంగా ఏ ఆధారాలూ లేకపోయినా ఎథిక్స్ కమిటీ తప్పుడు సిఫార్సు చేసిందని మొయిత్రా ఆరోపించారు. విపక్షాలను లొంగదీసుకునేందుకు మోదీ సర్కారు చేతిలో ఆయుధంగా కమిటీ పని చేస్తోందని దుయ్యబట్టారు. ‘‘నాకు డబ్బు గానీ, కానుకలు గానీ ఇచి్చనట్టు ఒక్క ఆధారమన్నా ఉందా? పైగా, అసలు ఉనికిలోనే లేని నైతిక నియామవళిని ఉల్లంఘించానని తేల్చడం మరీ విడ్డూరం’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘ఎథిక్స్ కమిటీ నివేదిక నియమావళిలోని ప్రతి రూల్నూ ఉల్లంఘించింది. సభ ఆమోదించి ప్రోత్సహించిన రోజువారీ విధానాన్ని పాటించినందుకు నన్ను శిక్షిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించి చరిత్ర సృష్టించిన 17వ లోక్సభే 78 మంది మహిళా ఎంపీల్లో ఒకరినైన నన్ను ఫక్తు కక్షసాధింపు రాజకీయాల్లో భాగంగా వెంటాడి వేధించిన ఉదంతానికి కూడా వేదికైంది. బంగ్లాదేశ్ సరిహద్దులను ఆనుకున్న సుదూర లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ రాజకీయ నేపథ్యమూ లేని నావంటి తొలిసారి ఎంపీని అనుక్షణం వేధించింది’’ అంటూ ధ్వజమెత్తారు. విరుద్ధ వాంగ్మూలాలు ఫిర్యాదుదారుల్లో ఒకరు తన మాజీ సహచరుడని మొయిత్రా గుర్తు చేశారు. ‘‘అతడు తప్పుడు ఉద్దేశంతో నాపై బురదజల్లాడు. కేవలం ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులిచి్చన వాంగ్మూలాల ఆధారంగా నాపై వేటు వేశారు. వారి వాంగ్మూలాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నా పట్టించుకోలేదు. కనీసం వారిని విచారించను కూడా లేదు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ కూడా పిలిచి విచారించలేదు’’ అంటూ ఆక్షేపించారు. ‘‘నందానీ వ్యాపార ప్రయోజనాల కోసం అతని దగ్గర డబ్బులు, కానుకలు తీసుకుని సభలో ప్రశ్నలడిగానని ఎంపీ దూబే తన ఫిర్యాదులో ఆరోపించారు. నందానీ మాత్రం నేనే నా సొంత అజెండాను ముందుకు తీసుకెళ్లడానికి వీలైన ప్రశ్నలు లోక్సభ పోర్టల్లో అప్లోడ్ చేసేలా తనపై ఒత్తిడి తెచ్చానని సుమోటో అఫిడవిట్ దాఖలు చేశారు. వీటిలో ఏది నిజం?’’ అని ప్రశ్నించారు. లాగిన్ రూల్స్ ఉన్నాయా? లోక్సభ పోర్టల్ యూజర్ ఐడీ, పాస్వర్డ్లను ఇతరులకు ఇచ్చానన్న ఏకైక అభియోగంపైనే తనను బహిష్కరించారని మొయిత్రా గుర్తు చేశారు. కానీ ఈ విషయంలో ఎలాంటి నియమ నిబంధనలూ లేవని వాదించారు. 30 ఏళ్లైనా పోరాడతా: మొయిత్రా ఎథిక్స్ కమిటీ నివేదికను మొయిత్రా తూర్పారబట్టారు. నిబంధనలకు పాతరేస్తూ తనపై హడావుడిగా వేటు వేశారని ఆరోపించారు. స్పీకర్ నిర్ణయం అనంతరం విపక్ష ఇండియా కూటమి నేతలు సోనియాగాం«దీ, రాహుల్ గాంధీ తదితరులతో కలిసి పార్లమెంటు ఆవరణలో మొయిత్రా మీడియాతో మాట్లాడారు. ‘‘రేపు కచ్చితంగా సీబీఐని నా ఇంటిపైకి ఉసిగొల్పుతారు. మరో ఆర్నెల్ల పాటు నన్నిలాగే వేధిస్తారు. కానీ పారిశ్రామికవేత్త అదానీ అక్రమాల మాటేమిటి? ఆయన పాల్పడ్డ రూ.13 వేల కోట్ల బొగ్గు కుంభకోణంకేసి సీబీఐ, ఈడీ కన్నెత్తి కూడా చూడవెందుకు?’’ అని ప్రశ్నించారు. మోదీ సర్కారుకు అదానీ ఎంతటి ముఖ్యుడో తనపై వేటుతో మరోసారి నిరూపితమైందన్నారు. ‘‘లోక్సభ నుంచి బహిష్కరించి నా నోరు మూయించవచ్చని, పారిశ్రామికవేత్త అదానీ ఉదంతం నుంచి బయట పడొచ్చని భావిస్తే పొరపాటు. నాకిప్పుడు 49 ఏళ్లు. మరో 30 ఏళ్ల దాకా పార్లమెంటు లోపల, బయట మీపై పోరాడుతూనే ఉంటా’’ అని ప్రకటించారు. -
ఎంపీలకే డిజిటల్ యాక్సెస్
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పారీ్ట(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా వ్యవహారం నేపథ్యంలో లోక్సభ సెక్రెటేరియట్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. పార్లమెంట్ హౌజ్ పోర్టల్ లేదా పార్లమెంట్ యాప్ల పాస్వర్డ్లు, ఓటీపీలను ఎంపీలు ఇతరులతో షేర్ చేసుకోవడాన్ని నిషేధించింది. పార్లమెంట్ సభ్యులు మాత్రమే డిజిటల్ సంసద్ పోర్టల్ లేదా యాప్లను యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ఎంపీలు ఇకపై తమ అధికారిక ఈ–మెయిల్ పాస్వర్డ్ను వ్యక్తిగత సహాయకులు, వ్యక్తిగత కార్యదర్శులకు కూడా షేర్ చేయడం నిషిద్ధమని స్పష్టం చేసింది. సభలో ప్రశ్నలు అడగడం కోసం ముందుగానే నోటీసులు ఇవ్వడానికి, ట్రావెల్ బిల్లులు సమర్పించడానికి పార్లమెంట్ పోర్టల్, యాప్లను ఎంపీలు ఉపయోగిస్తుంటారు. అంతేకాదు ఈ పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించవచ్చు. ఈమెయిల్, ఫోన్ నంబర్తో పోర్టల్లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తన అధికారిక ఈమెయిల్ పాస్వర్డ్ను దుబాయి వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి ఇచి్చనట్లు లోక్సభ ఎథిక్స్ కమిటీ గుర్తించింది. ఆమె నిబంధనలు ఉల్లంఘించారని నిర్ధారించింది. డిజిటల్ సంసద్ పోర్టల్ కొన్ని నెలల క్రితం అందుబాటులోకి వచి్చంది. ఈ పోర్టల్కు ఎలా ఉపయోగించాలో చాలామందిఎంపీలకు తెలియదు. అందుకే వారు తమ వ్యక్తిగత సహాయకులు, కార్యదర్శులపై ఆధారపడుతున్నారు. ఈమెయిల్ వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలు వారికి అందజేస్తున్నారు. దీనివల్ల పోర్టల్ అనధికార వ్యక్తుల చేతుల్లో పడి దురి్వనియోగం అవుతున్నట్లు మహువా మొయిత్రా కేసు నిరూపించింది. ఈ నేపథ్యంలో పోర్టల్ పాస్వర్డ్లు, ఓటీపీలు ఇతరులకు ఇవ్వడాన్ని నిషేధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. -
మొయిత్రా వాకౌట్
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు నగదు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంట్ నైతిక విలువల కమిటీ ముందు హాజరై తర్వాత వాకౌట్ చేశారు. కమిటీ భేటీలో తీవ్ర అభ్యంతర, వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారంటూ ఆమె మధ్యలోనే బయటికొచ్చారు. ఆమెకు మద్దతు పలుకుతూ విపక్ష ఎంపీలు సైతం అర్ధంతరంగా బయటికొచ్చారు. కాగా, ‘ఎథిక్స్ కమిటీని మొయిత్రా తప్పుదోవ పట్టించే ప్రయత్నంచేశారు. కమిటీ తప్పుడు విధానాలను అవలంబిస్తోందంటూ, కమిటీ నిర్వహణ పద్ధతిని మొయిత్రా తప్పుగా చిత్రించే దుస్సాహసం చేశారు’ అని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఆరోపించారు. ‘నగదుకు ప్రశ్నలు’ ఆరోపణలుసహా తన పార్లమెంట్ లాగిన్ వివరాలను పారిశ్రామికవేత్త దర్శన్ హీరానందానీకి మొయిత్రా ఇచ్చారని, దుబాయ్ నుంచి చాలాసార్లు లాగిన్ అయ్యా, విదేశాల్లో లాగిన్ అవడంతో దేశభద్రత ప్రమాదంలో పడిందని దూబే తీవ్ర ఆరోపణలు చేయడం తెల్సిందే. లోక్సభ స్పీకర్ బిర్లాకు దూబే ఫిర్యాదుచేయడంతో వివరణ కోరుతూ పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మొయిత్రాను గురువారం పిలిచింది. ఈ భేటీ దాదాపు నాలుగు గంటలపాటు సాగింది. అసభ్యమైన ప్రశ్నలు వేస్తున్నారు: మొయిత్రా ‘అసలు అవేం ప్రశ్నలు?. తీవ్ర అభ్యంతరకరమైన, అసభ్యమైన ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే బయటికొచ్చేశా’ అని అక్కడ ఉన్న మీడియాతో అన్నారు. ‘మీ కళ్లలో నీళ్లు తిరుగుతున్నట్లు ఉన్నాయిగా’ అని అక్కడున్న ఒక విలేకరి ప్రశ్నించగా.. ‘ఏమిటా చెత్త ప్రశ్న. చూడు నా కళ్లలో నీళ్లు కనిపిస్తున్నాయా?’ అంటూ మొయిత్రా తన రెండు కళ్లను చూపించారు. ‘అసలు ఇది ఎథిక్స్ కమిటీయేనా?. ముందే సిద్దంచేసిన స్క్రిప్ట్ను చదువుతున్నారు’ అంటూ కమిటీపై మొయిత్రా ఆరోపణలు చేశారు. ‘‘కమిటీలో చైర్మన్ నన్ను మాటలతో ‘వ్రస్తాపహరణం’ చేశారు’’ అని ఫిర్యాదుచేస్తూ స్పీకర్ బిర్లాకు మొయిత్రా ఒక లేఖ రాశారు. మొయిత్రా, కమిటీ చైర్మన్, సభ్యులు ఏమన్నారు? మొయిత్రా వాకౌట్ తర్వాత ఎథిక్స్ కమిటీ చైర్మన్, బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకార్ మీడియాతో మాట్లాడారు. ‘ నిజానికి కమిటీ విధివిధానాలు, నిర్వహణ పద్ధతిపై మొయిత్రా తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. తర్వాత ఆమె, విపక్ష సభ్యులు చర్చ జరుగుతుండగానే మధ్యలో బయటికొచ్చేశారు’ అని చెప్పారు. ‘ మొయిత్రాను అడిగిన ప్రశ్నలు అగౌరవనీయం, అనైతికంగా ఉన్నాయి. ఎక్కడెక్కడ తిరిగారు. ఎవరితో మాట్లాడారు. మీ ఫోన్ రికార్డింగ్లు ఇవ్వాలని కమిటీ అడిగింది’ అని కాంగ్రెస్ ఎంపీ, ప్యానెల్ సభ్యుడు అయిన ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి వెల్లడించారు. ‘రాత్రిళ్లు ఎవరితో మాట్లాడతారు? ఎలాంటి విషయాలు మాట్లాడతారు? అని ఆమెను ప్రశ్నించారు. మహిళా ఎంపీని చైర్మన్ ప్రశ్నలు అడిగే పద్దతి ఇదేనా? ద్రౌపది వస్త్రాపహరణం తరహాలో విచారణ కొనసాగింది’ అని కమిటీ సభ్యుడు డ్యానిష్ అలీ ఆరోపించారు. ఆ లాయర్ వల్లే ఇదంతా ! బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేకు బలమైన సాక్ష్యాలు ఇచ్చారంటూ వార్తల్లో నిలిచిన న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ గతంలో మొయిత్రాకు బాగా తెలుసు. వీరిద్దరూ కొన్నాళ్లు సహజీవనం చేసి విడిపోయారు. విడిపోయేటపుడు జరిగిన గొడవకు ప్రతీకారంగానే జై అనంత్ ఇవన్నీ చేస్తున్నారని మీడియాలో వార్తలొచ్చాయి. కమిటీ ముందు ఇవే అంశాలను మొయిత్రా ప్రస్తావించారని తెలుస్తోంది. అయితే, దేహద్రాయ్తో బంధం విడిపోయిన విషయం పక్కనబెట్టి ‘నగదుకు ప్రశ్నలు’ అంశంపై వివరణ ఇవ్వాలని కోరినా ఆమె పట్టించుకోలేదని బీజేపీ ఎంపీ, కమిటీ సభ్యుడు విష్ణుదత్ శర్మ ఆరోపించారు. -
అవతలి పక్షంతో సంప్రదింపులా?
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పరువు నష్టం కేసులో అవతలి పక్షంతో సంప్రదింపులకు దిగినందుకు ఆమె తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర నారాయణన్ను ఢిల్లీ హైకోర్టు మందలించింది. దాంతో ఆయన కేసు నుంచి తప్పుకున్నారు. లోక్సభలో పారిశ్రామికవేత్త అదానీ గ్రూపుపై ప్రశ్నలడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని నుంచి మహువా డబ్బులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే, సుప్రీంకోర్టు లాయర్ జై అనంత్ దేహద్రాయ్ తదితరులు ఆరోపించడం తెలిసిందే. వారిపై ఆమె పరువు నష్టం దావా వేశారు. లాయర్ నారాయణన్ గురువారం తనకు ఫోన్ చేసి, ఆమెపై దాఖలు చేసిన సీబీఐ ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని కోరినట్టు దేహద్రాయ్ హైకోర్టుకు తెలిపారు. దాంతో న్యాయమూర్తి జస్టిస్ సచిన్ దత్తా ఆగ్రహించారు. ‘‘ఇది విని నేను నిజంగా షాక య్యాను. ఇలా మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయ త్నిస్తే ఈ కేసులో వాదించేందుకు మీరెలా అర్హుల వుతారు?’’అని ప్రశ్నించారు. దేహద్రాయ్, మహువా కొంతకాలం పాటు సహజీవనం చేసినట్టు తృణమూల్ వర్గాలు చెబుతుంటాయి. ఆయన తమ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారని, అసభ్యకర మెసేజీలు పంపుతున్నారని, చోరీకి యత్నించారని గత ఆర్నెల్లలో మహువా పలు కేసులు పెట్టారు. -
Sakshi Cartoon: అవసరమైతే ఈ సారి రెండు కాళ్లకు కట్టుకట్టుకోండి మేడం
అవసరమైతే ఈ సారి రెండు కాళ్లకు కట్టుకట్టుకోండి మేడం -
అభిషేక్ బెనర్జీ భార్య, మరదలికి సీబీఐ నోటీసు
న్యూఢిల్లీ/కోల్కతా: త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజీరా బెనర్జీకి, మరదలు మేనకా గంభీర్కు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆదివారం నోటీసు జారీ చేసింది. బొగ్గు అక్రమ తవ్వకం, దొంగతనం కేసులో విచారణకు సహకరించాలని పేర్కొంది. సీబీఐ బృందం కోల్కతాలోని అభిషేక్ బెనర్జీ భార్య, మరదలి నివాసాలకు వెళ్లి, నోటీసు అందజేసింది. పశ్చిమ బెంగాల్లో కునుస్తోరియా, కజోరా ప్రాంతాల్లోని ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్కు(ఈసీఎల్) చెందిన బొగ్గు గనుల్లో బొగ్గును అక్రమంగా తవ్వుకొని, స్వాహా చేశారని ఆరోపిస్తూ సీబీఐ గత ఏడాది నవంబర్లో పలువురిపై కేసు నమోదు చేసింది. నిందితుల్లో ఈసీఎల్ జనరల్ మేనేజర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ ఇన్చార్జి తదితరులు ఉన్నారు. ఈ వ్యవహారంతో రుజీరా బెనర్జీకి, మేనకా గంభీర్కు కూడా సంబంధం ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. విచారణకు సహకరించాలంటూ తాజాగా నోటీసు జారీ చేసింది. సోమవారం విచారించే అవకాశం ఉందని, ఈ కేసుకు సంబంధించి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొంది. అలాగే పశువుల స్మగ్లింగ్ కేసులో అభిషేక్ బెనర్జీకి సన్నిహితుడైన వినయ్ మిశ్రాకు సీబీఐ సమన్లు జారీ చేసింది. బీజేపీకి లొంగే ప్రసక్తే లేదు తన భార్యకు సీబీఐ నోటీసు ఇవ్వడం పట్ల అభిషేక్ బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టంపై తమకు నమ్మకం ఉందని చెప్పారు. కేసులతో తమను బెదిరించలేరని బీజేపీ పెద్దలను హెచ్చరించారు. బీజేపీకి లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. బీజేపీ నుంచి మిత్రపక్షాలన్నీ దూరమయ్యాయని, ఇప్పుడు సీబీఐ, ఈడీ మాత్రమే బీజేపీ కూటమిలో ఉన్నాయని విమర్శించింది. బొగ్గు దొంగతనం కేసులో సీబీఐ విచారణను తృణమూల్ కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్వర్గీయా ఆరోపించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసిన వారు ఎంతటివారైనా శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చిచెప్పారు. -
చంపుతామంటున్నారు..
కోల్కతా: సోషల్ మీడియా ద్వారా తనకు చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని, అందువల్ల రక్షణ కల్పించాలంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, నటి నుస్రాత్ జహాన్ భారత హై కమిషన్ కు లేఖ రాశారు. ప్రస్తుతం ఆమె బెంగాలీ సినిమా షూటింగ్ లో భాగంగా లండన్లో ఉన్నారు. దుర్గా అమ్మవారి రూపంతో మహిషాసురమర్థినిలా త్రిశూలం పట్టుకొని తీసిన ఓ వీడియోను పోస్ట్ చేశాక బెదిరింపులు వస్తున్నట్లు తెలిపారు. ఎంపీగా సాధారణంగానే ఆమెకు భద్రత ఉంటుంది. అయితే బెదిరింపుల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, విదేశాంగ శాఖల ద్వారాఅదనపు భద్రత కూడా ఏర్పాటైనట్లు సమాచారం అందింది. తనకు రక్షణ కావాలంటూ భారత హైకమిషన్ కు రాసిన లేఖలో ఆమెకు వచ్చిన బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా ఉంచినట్లు తెలిపారు. సింధూరం ధరించడం వంటి చర్యల కారణంగా గతంలో ఆమెను కొందరు ముస్లింలు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: యూపీ నిర్భయ పట్ల అమానవీయం) -
నా ఫొటో వాడారు: పోలీసులకు నటి ఫిర్యాదు
కలకత్తా: అనుమతి లేకుండా తన ఫొటో ఉపయోగించిన వీడియో చాట్ యాప్పై నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ మంగళవారం కలకత్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ ప్రమోషన్ కోసం తన ఫొటో వాడటంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు యాప్పై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె పోలీసులను కోరారు. అంతేగాక ప్రకటనకు సంబంధించిన స్క్రీన్ షాట్ను ట్విటర్లో షేర్ చేస్తూ పోలీసు కమిషనర్ అనుప్ శర్మను ట్యాగ్ చేశారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ.. వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం సైబర్ సెల్తో దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. చదవండి: ‘టిక్టాక్ నిషేధం నోట్ల రద్దు వంటిదే’ -
నాకూ వేధింపులు తప్పలేదు!: ఎంపీ
న్యూఢిల్లీ: ‘అప్పుడు నాకు 13 ఏళ్లు. కోల్కతాలో టెన్నిస్ ప్రాక్టీస్కు వెళ్లి తిరిగి వస్తున్నా. నిక్కర్, టీ షర్ట్ వేసుకుని ఉన్నా. ఇంటికి వెళ్లేందుకు చాలా రద్దీగా ఉన్న బస్ ఎక్కాను. ఎవరో తెలీదు. కానీ నన్ను ఆ రద్దీలో నన్ను లైంగికంగా వేధించారు. కొన్నేళ్ల తరువాత ఒక సందర్భంలో మా ఇంట్లో చెప్పాను’.. ఈ వ్యాఖ్యలు చేసింది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ప్రఖ్యాత క్విజ్ మాస్టర్ డెరెక్ ఓ బ్రెయిన్. పోక్సో (లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించే చట్ట సవరణ) బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన రాజ్యసభలో ఈ బాధాకర విషయాన్ని గుర్తు చేసుకున్నారు. పిల్లలపై దారుణంగా లైంగిక నేరానికి పాల్పడినవారికి మరణశిక్ష విధించేలా ప్రతిపాదన ఉన్న ఈ బిల్లుకు డెరెక్ మద్దతు తెలిపారు. మిగతా పార్టీల సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు మద్దతు ప్రకటించారు. బిల్లులోని సవరణలను కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. లోక్సభకు బిల్లు పిల్లలపై తీవ్రమైన లైంగిక నేరాలకు మరణ శిక్ష, మైనర్లపై లైంగిక నేరాలకు ఇతర తీవ్రస్థాయి శిక్షలకు అవకాశం కల్పించేలా ఈ బిల్లులో ప్రతిపాదనలున్నాయి. చర్చకు సమాధానమిస్తూ పోక్సో సంబంధిత 1.66 కోట్ల పెండింగ్ కేసుల విచారణకు 1023 ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. -
బీజేపీలో చేరిన తృణమూల్ ఎంపీ
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌమిత్రా ఖాన్ బుధవారం బీజేపీలో చేరారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమైన తరువాత ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పశ్చిమబెంగాల్లో ప్రజాస్వామ్యం లేదని, పోలీసు రాజ్యం నడుస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ మార్పు తెస్తారని విశ్వసిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం విష్ణుపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సౌమిత్రా ఖాన్ పార్టీని వీడడాన్ని తృణమూల్ తక్కువచేసి చూపే ప్రయత్నం చేసింది. ఆయన్ని ఇది వరకే పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించింది. సౌమిత్రా ఖాన్ చాన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో టికెట్ దక్కదన్న సంగతి ఆయనకు కూడా తెలుసని వెల్లడించింది. తాజా పరిణామంపై బీజేపీ స్పందిస్తూ.. బెంగాల్లో తృణమూల్ పతనం ప్రారంభమైందని పేర్కొంది. -
మమతా బెనర్జీకి కేంద్రం షాక్
కోల్కతా: పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమాల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి షాక్ తగిలింది. రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణం కేసులో టీఎంసీ ఎంపీ తపస్ పాల్ను సీబీఐ అరెస్ట్ చేసింది. శుక్రవారం కోల్కతాలో కొన్ని గంటల పాటు ప్రశ్నించిన అనంతరం సీబీఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. రోజ్ వ్యాలీ కంపెనీలో తపస్ పాల్ డైరెక్టర్గా ఉన్నారు. 17 వేల కోట్ల రూపాయల మేరకు వేలాది మందిని మోసం చేసినట్టు రోజ్ వ్యాలీపై ఆరోపణలు వచ్చాయి. రోజ్ వ్యాలీ నుంచి పాల్ లబ్ధి పొందినట్టు సీబీఐ అధికారులు భావిస్తున్నారు. ఇదే కేసుకు సంబంధించి టీఎంసీకి చెందిన మరో ఎంపీ సుదీప్ బందోపాధ్యాయకు సీబీఐ సమన్లు జారీ చేసింది. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున కేంద్రం సీబీఐని అడ్డుపెట్టుకుని తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. -
'రహదారులకు మహాశ్వేతాదేవి పేరు పెట్టండి'
కోల్కతా: న్యూఢిల్లీ, కోల్కతాల్లోని రహదారులకు ప్రముఖ బెంగాలీ రచయిత్రి మహాశ్వేతాదేవి పేరు పెట్టాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఇడ్రిస్ అలీ కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, బెంగాల్ ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఆలిండియా మైనారిటీ ఫోరం అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్న ఆయన మహాశ్వేతాదేవికి నివాళిగా ఓ లైబ్రరీ ఏర్పాటు చేయాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కోరారు. దేశం మొత్తానికీ ఆమె సుపరిచితురాలు కాబట్టి దేశ రాజధాని నగరంలో ఓ రహదారికి ఆమె పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరారు. ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అయిన మహాశ్వేతాదేవి గత నెలలో మరణించిన విషయం తెలిసిందే. -
'రేపిస్ట్లను కాల్చిచంపేవాడిని'
న్యూఢిల్లీ: 'నిర్భయ స్థానంలో నా కూతురే ఉండి ఉంటే ఆ ఘాతుకానికి పాల్పడినవారిని కాల్చి చంపేవాడిని' అని రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ ఆవేశపడ్డారు. ఆ వాఖ్యను బీజేపీ సభ్యుడు వీపీ సింగ్ బద్నోర్ తప్పుబడ్తూ.. అది సమాజంలోకి తప్పుడు సందేశం పంపిస్తుందన్నారు. నేరాలకు పాల్పడే పిల్లల్లో చాలామంది పేదరికం, అవిద్య నేపథ్యం నుంచి వచ్చినవారేనని కహకషన్ పర్వీన్(జేడీయూ) పేర్కొన్నారు. 'నేరాలకు పాల్పడుతున్న పిల్లల సామాజిక, ఆర్థిక నేపథ్యంపై సమగ్ర అధ్యయనం అవసరం. బాల నేరస్తుల కేంద్రాలు నేరస్తుల తయారీ కేంద్రాలుగా మారాయి' అని కే కేశవరావు(టీఆర్ఎస్) పేర్కొన్నారు. బాల నేరస్తుల సవరణ బిల్లు చట్టంగా మారకముందు జరిగిన నేరాలకు.. ఇందులోని నిబంధనలు వర్తించబోవని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. -
'నా సోదరుడి మృతి వెనక కుట్ర దాగి ఉంది'
కొల్కతా : నా సోదరుడి ఎంపీ కపిల్ కృష్ణ ఠాకూర్ మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని తాజాగా టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మంజుల్ కృష్ణ ఠాకూర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కొల్కతాలో విలేకర్ల సమావేశంలో మంజుల్ మాట్లాడుతూ... కపిల్ది సహజ మరణం కాదని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఆయన మృతి వెనకు కుట్ర దాగి ఉందని ఆరోపించారు. సీబీఐ విచారణతో నిజానిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కపిల్ కృష్ణ ఠాకూర్ 24 ఉత్తర పరిగణల జిల్లాలోని బంగన్ లోక్సభ స్థానం నుంచి టీఎంసీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే గతేడాది అక్టోబర్ స్వల్ప అస్వస్థతతో ఆయన మరణించిన విషయం విదితమే. దాంతో బంగన్ లోక్ సభ స్థానానికి ఫిబ్రవరి 13 ఉప ఎన్నిక జరగనుంది. మమతా బెనర్జీ కేబినెట్లో మంజుల్ కృష్ణ ఠాకూర్ శరణార్థులు, పునరావాస, సహాయ చర్యల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన గురువారం మంత్రి పదవితోపాటు టీఎంసీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం కమలం తీర్థం పుచ్చుకున్నారు. దాంతో మమతా దీదీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీలు శారదా స్కామ్లో చిక్కుకుని పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
జైల్లో బహిష్కృత ఎంపీ ఆత్మహత్యాయత్నం
-
జైల్లో బహిష్కృత ఎంపీ ఆత్మహత్యాయత్నం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన శారదా గ్రూపు చిట్ఫండ్ కుంభకోణంలో నిందితుడుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కునాల్ ఘోష్ శుక్రవారం జైల్లో ఆత్మహత్యాయత్నం చేశారు. కోల్కతా ప్రెసిడెన్సీ జైల్లో ఉన్న ఆయన 58 నిద్రమాత్రలు మింగి ఈ ఘటనకు పాల్పడ్డారు. కునాల్ ఆత్మహత్యాయత్నాన్ని గమనించిన జైలు అధికారులు హుటాహుటీన ఎన్ఎన్కెఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా కునాల్ ఘోష్పై ఆరోపణలు రావటంతో తృణమూల్ కాంగ్రెస్ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. కునాల్ గత నవంబర్ లో అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. శారదా గ్రూపు మీడియా విభాగం సీఈవోగా వ్యవహరించిన ఆయనపై చీటింగ్ సహా పలు అభియోగాలు ఉన్నాయి. మరోవైపు కునాల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించటంతో జైల్లోనే ఉన్నారు. శారద స్కాంలో ప్రమేయం ఉన్న చాలామంది స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని, మూడు రోజుల క్రితం కునాల్ కోర్టుకు వెల్లడించారు. వారిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన కోరారు. -
ప్రపంచం ఉన్నంతకాలం రేప్లు జరుగుతాయి
టీఎంసీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు కోల్కతా: పశ్చిమ బెంగాల్లో తృణవుూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్పాల్ మహిళల విషయుంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రగడ ఇంకా సద్దుమణగకముదే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే దీపక్ హల్దార్ నోరుజారారు. ప్రపంచం ఉన్నంతవరకు అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయని ఆయున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో తీవ్ర దుమారం సృష్టించాయి. మహిళా హక్కుల సంఘాలు, విపక్షాలు ఆయునపై తీవ్రస్థారుులో విరుచుకుపడ్డాయి. బుధవారం ఆయున డైవుండ్ హార్బర్ వద్ద జరిగిన ఓ సమవేశంలో మాట్లాడుతూ, ‘గతంలో అత్యాచారాలు జరిగాయి. ఇప్పుడూ జరుగుతున్నాయి. ప్రపంచం ఉన్నంతవరకు అవి జరుగుతూనే ఉంటారు’ అని అన్నారు. అత్యాచారాలు సావూజిక రుగ్మత వంటివని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కరే ఈ సవుస్యను పరిష్కరించలేరని ఆయున పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై వివిధ వర్గాలు భగ్గుమనడంతో ఆయున క్షవూపణలు చెప్పాల్సి వచ్చింది. హల్దార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయుడం దురదృష్టకరమని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అన్నారు. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నాయుకత్వంలోని టీఎంసీ నేతలు పదేపదే ఇటువంటి వ్యాఖ్యలు చేయుడం దురదృష్టకరమని మహిళా హక్కుల నేత మమతా శర్మ అన్నారు. వుుఖ్యవుంత్రి ఇటువంటి విషయూలను పట్టించుకోవడం లేదని, ఇలాంటి ప్రజాప్రతినిధులను పార్టీనుంచి సస్పెండ్ చేయూలని డివూండ్ చేశారు. టీఎంసీ లో కూడా ఇదే తరహా పరిస్థితులు ఉన్నాయుని సీపీఎం నేత రీతుబ్రాతా బెనర్జీ వివుర్శించారు. -
తపస్ పాల్ ను బహిష్కరించండి
న్యూఢిల్లీ: సీపీఎం కార్యకర్తలను బెదిరించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్ పాల్ ను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని జాతీయ మహిళా సంఘం డిమాండ్ చేసింది. మీడియాలో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించిన మహిళా సంఘం పాల్ ను నోటీసు జారీ చేసింది. తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆయనను ఆదేశించింది. పాల్ పై మమతా బెనర్జీ చర్య తీసుకోవాలని జాతీయ మహిళా సంఘం అధ్యక్షురాలు మమత శర్మ డిమాండ్ చేశారు. తమ పార్టీకి చెందిన ఒక్క కార్యకర్తపై దాడి జరిగినా.. ప్రతిపక్ష సీపీఎం కార్యకర్తలను హతమారుస్తామని, వారి మహిళలపై అత్యాచారాలు చేయాలని తమ కార్యకర్తలకు పురికొల్పుతానని సీపీఎం నేతలను హెచ్చరిస్తూ తపస్ పాల్ చేసిన ప్రసంగం తాలూకూ వీడియోను ఓ స్థానిక టీవీ చానల్ ప్రసారం చేయడంతో ఆయనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి.