unemployment rally
-
గాలికి పోయేవాళ్లం కాదు
ఎన్ని నిర్బంధాలు విధించినా పోరాడుతాం: కోదండరాం ► ర్యాలీ విజయవంతమైంది ► సమస్య తీవ్రత అందరికీ అర్థమైంది ► ముస్లింల సమస్యలపై జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తాం సాక్షి, హైదరాబాద్: ప్రశ్నించేవాళ్లు ఉండకూ డదని ప్రభుత్వంలో ఉన్నవారు కోరుకు న్నా.. తాము గాలికి కొట్టుకు పోయేవాళ్లం కాదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం పేర్కొన్నారు. ఎన్ని నిర్బం ధాలు విధించినా పోరాటాలు ఆగవని స్పష్టం చేశారు. గురువారం కోదండరాం నివాసంలో టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. నిరుద్యోగ నిరసన ర్యాలీపై ప్రభుత్వ నిర్బంధం, అరెస్టులు, అనంతరం పరిణామాలు తదితర అంశాలపై అందులో చర్చించారు. అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని... ఈ తీవ్రతను ప్రపంచానికి చాటి చెప్పాలనే తమ లక్ష్యం సంపూర్ణంగా నెరవేరిందని ఆయన చెప్పారు. ర్యాలీ, సభ విషయంలో సంఘీ భావంగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కుల ప్రకారం నిరసన తెలపడానికి తాము శాంతియుతంగా ర్యాలీ చేస్తామంటే అనుమతి ఇవ్వలేదన్నారు. అర్ధరాత్రి అరెస్టులు చేయడం అత్యంత దారుణమని విమర్శించారు. అర్ధరాత్రి తమ ఇంటిపైకి వచ్చి, తలుపులు విరగ్గొట్టి మరీ అరెస్టు చేయాల్సిన పరిస్థితులు, అవసరం ఎందుకు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. తమను ఏ పోలీస్స్టేషన్లో పెట్టారో కూడా తెలియనివ్వకుండా రహస్యంగా ఉంచా ల్సిన అవసరమేమిటని నిలదీశారు. భూనిర్వాసితుల సమస్యపై రాష్ట్రపతిని కలుస్తాం పోలీస్స్టేషన్లో తమను కలవడానికి వచ్చిన వివిధ పార్టీల నేతలను కూడా పోలీ సులు అరెస్టు చేయడం దుర్మార్గమని కోదండరాం అన్నారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా, పోలీసులతో వేధింపులకు గురిచేసినా పట్టించుకోవాల్సి న అవసరం లేదన్నారు. 5 వేల మందిని అరెస్టు చేయడం, వేలాది మంది పోలీసులను మోహరించడం ఎలాంటి సంకేతమో ప్రజలకు తెలుసునని చెప్పారు. ఉస్మాని యా, కాకతీయ వర్సిటీల్లోని హాస్టళ్ల వద్ద సాయుధ బలగాలను పెట్టారని, నాయకులు, నేతల ఇళ్లపై పడి అరెస్టులు చేశారని... అయినా నిరసన ప్రదర్శన జరిగిందన్నారు. మొత్తంగా జేఏసీ ప్రతిపాదించిన అంశంపై పెద్దఎత్తున చర్చ జరిగిందని, తాము సంపూర్ణ విజయం సాధించామని చెప్పా రు. స్వామి అగ్నివేశ్, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ వంటివారు తమకు ఫోన్లు చేసి, టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఖండించారన్నారు. భూనిర్వాసితుల సమ స్యపై త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు. ముస్లింల సమస్యలపై సుధీర్ కమిటీ సిఫార్సులను అమలుచేయాలని కోరుతూ జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తా మని.. మార్చి 1న మహబూబ్నగర్లో, 4న నిజామాబాద్లో వాటిని ఏర్పాటు చేస్తున్నా మని వెల్లడించారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు కె.రఘు, ప్రహ్లాదరావు, వెంకటరెడ్డి, ఇటిక్యాల పురుషోత్తం, భైరి రమేశ్, గోపాల శర్మ, గురజాల రవీందర్ తదితరులు ఉన్నారు. -
నిరసన గళం.. నిర్బంధపు జులుం!
సమకాలీనం పోలీసు వ్యవస్థతో ఊడిగం చేయించుకునే ఫ్యూడల్ సంస్కృతిని మన ప్రభుత్వాలు బలోపేతం చేస్తున్నాయి. తాము చెప్పిందే సరైనది, మారుమాటాడకుండా ఒప్పుకోవాలనే పాలకుల ధోరణి ఫలితమే నిరసన గళాలపై ఈ నిర్బంధం. దీన్ని గ్రహించి పౌర సమాజం చైతన్యవంతమైతే తప్ప ‘ప్రజాస్వామ్యమంటే ఏ కొందరికో అధికారం కట్టబెట్టడం కాదు! పాలకులు తప్పు చేస్తున్నప్పుడు, ఏయ్, ఎందుకిలా చేస్తున్నావ్? అని ప్రతి పౌరుడూ అడగ్గలిగే స్థితి ఉంటేనే ప్రజాస్వామ్యం’ అన్న గాంధీజీ మాటలు నిజం కావు. ప్రజాస్వామ్యంలో కీలకమైనదని చెప్పుకునే ప్రజాభిప్రాయం నిరంతర ప్రక్రియనా? లేక ఐదేళ్లకొకసారి వ్యక్తమయ్యేదేనా? ఓట్ల రూపంలో వెల్లడైన ప్రజాభీష్టం మేరకు ఏర్పడ్డ ప్రభుత్వాలు మళ్లీ ఎన్నికల వరకు తామేది తలిస్తే అది చేసుకోవచ్చా? మధ్యలో ప్రజలో ఏ భావమూ వ్యక్తం చేయకూడదా? ప్రజాస్వామ్య పాలనల్లో విధాన నిర్ణయాలకు జనాభిప్రాయమే ఊపిరి. వివిధ రూపాల్లో వ్యక్తమయ్యే జనాభిప్రాయం ఒక నిరంతర ప్రక్రియ. అది తెలిసి మసలుకోవడం ప్రభుత్వాల విధి. మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే కాదు, భాగస్వామ్య ప్రజాస్వామ్యం కూడా. ప్రజల ప్రాతినిధ్యం, భాగస్వామ్యం మరో రూపంలోనూ ఉండొచ్చనడానికి పౌరసమాజమే ప్రతీక! కానీ, ఈ మౌలికాంశంపైనే సందేహం రేకెత్తించేలా ఉన్నాయి మన ప్రభుత్వాల నిర్వా కాలు. కేంద్రంలోనూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు నిరసన గళా లను నొక్కేస్తున్న తీరు ఆందోళనకరం. పొగడ్త కానిది మరేదైనా సహించలేని అసహనం పాలకుల్లో పెరిగిపోతోంది. మున్నెన్నడూ లేనంత నిర్బంధకాండ అమలవుతోంది. పాలకులకువ్యతిరేకంగా ఎవరూ మాట్లాడరాదు! నిరసన తెలుపడానికే వీల్లేదు! నిరసన కార్యకలాపాల సంగతలా ఉంచి, అలాంటి అనుమానమొచ్చినా అరెస్టులు, నిర్బంధాలతో అరాచకం సాగిస్తున్నారు. చట్టాలు, విధివిధానాలు, సంప్రదాయాలు అన్నీ గాలికి పోతున్నాయి. చట్టా నికి లోబడి వ్యవహరించాలని మరచిన పోలీసు వ్యవస్థ గుడ్డిగా పాలకులకు ఊడిగం చేస్తోంది. పటిష్ట మైన రాజ్య వ్యవస్థతో ‘దేన్నయినా నిరాటకంగా అడ్డుకుంటాం. వ్యతిరేక భావనలను మొగ్గలోనే తుంచేస్తాం... ధిక్కారమున్ సైతుమా?’ అన్నట్టుంది సర్కారు పెద్దల ఒంటెద్దు పోకడ. అంతటా అదే ధోరణి ‘దాడి చేయడమే అత్యుత్తమ రక్షణ చర్య’ అనే ఆంగ్ల నానుడిని గుర్తు చేస్తున్న సర్కారు తీరు వారి భయాన్ని చెప్పకనే చెబుతోంది. విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్తెసరు ఆధిక్యతతో ప్రభుత్వాలను ఏర్పాటుచేసిన పాలక పక్షాల్ని మొదట అభద్రత వెంటాడింది. దీంతో ప్రత్యర్థి పార్టీలను చీలుస్తూ రాజకీయ అనైతికతకు పాల్పడ్డాయి. ఎన్నికైన ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల్ని చట్ట వ్యతిరేకంగా పార్టీలో చేర్చుకుంటూ బలపడటానికి ప్రయాసపడ్డాయి. అధి కారం రుచి మరిగి తిరుగులేని ఆధిక్యతను పెంచుకునే క్రమంలోనే.. నిరసన ఏ మూల నుంచి, ఏ రూపంలోనూ రావొద్దన్న పట్టుదలతో అణచివేతకు దిగు తున్నాయి. ప్రజా ఉద్యమాల్ని ఉక్కుపాదంతో తొక్కేస్తున్నాయి. ఇది, ఎన్నికల నాటికి ప్రత్యర్థి రాజకీయ, పౌరసమాజ శక్తులు మనుగడలో లేకుండా చేయా లనే దురాశ! నిన్న హైదరాబాద్లో నిరుద్యోగుల ర్యాలీని చిన్నాభిన్నం చేస్తూ ప్రొఫెసర్ కోదండరామ్పై తెలంగాణ సర్కారు జరిపించిన పోలీసు దాష్టీకం దీన్నే వెల్లడి చేసింది. మొన్న ఏపీ ప్రభుత్వం శాసన సభ్యురాలు రోజాను మహిళా పార్లమెంటరేయన్ల సదస్సుకు వెళ్లనీయకుండా నిర్బంధించి, అక్ర మంగా ఎక్కడెక్కడికో తరలించింది. అంతకు మున్ను ‘ప్రత్యేక హోదా’ కోరుతూ జరిగిన శాంతియుత క్యాండిల్ ర్యాలీలో పాల్గొననీకుండా విపక్షనేత జగన్మోహన్రెడ్డిని విశాఖపట్నం విమానాశ్రయంలో రెండు గంటలు నిర్బం ధించడమే కాక హైదరాబాద్కు తిప్పిపంపింది. ప్రజా ఉద్యమాల పట్ల కేంద్ర ప్రభుత్వ అసహనానికి పలు ఘటనలు అద్దం పడుతున్నాయి. అసహనానికి పట్టం కట్టడం వల్లనే ఢిల్లీ విశ్వవిద్యాలయం ఈరోజు అట్టుడుకుతోంది. ‘నిర సనల సంస్కృతి’ సదస్సు విషయమై జరిగిన విద్యార్థుల ఘర్షణ, ఉమర్ ఖలీద్ను రానీయకుండా అడ్డుకున్న తీరు, అధికార విద్యార్థి సంఘం దాడులు సాగిస్తుండగా పోలీసులు పోషించిన ఉద్దేశపూర్వక ప్రేక్షక పాత్ర ఇదే చెబుతు న్నాయి. ఏ ప్రభుత్వమైనా గిట్టని నిరసన గళాల్ని నియంత్రించడం కాకుండా, తగు వాదనతో ప్రత్యర్థుల్ని ఓడించి విధానాల పరంగా ఆధిపత్యం సాధిం చాలి. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు రావొద్దంటే... హోదా లేకున్నా తామెలా నెట్టుకు రాగలమో వివరించి ప్రజల్ని మెప్పించాలి. నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తున్నామంటే జరిపిన, జరుపనున్న నియామకాలేవో వివ రించాలి. అంతే తప్ప పోలీసు నిర్బంధకాండ అమలుచేయడం సరికాదు. నిరసన ప్రజాస్వామ్య హక్కు ప్రభుత్వాల వైఖరి, విధానాలు, పద్ధతులు, ప్రాథమ్యాలు నచ్చనపుడు నిరసన తెలుపడం పౌరుల ప్రాథమిక హక్కు. నిరసన తెలిపే అవకాశమే లేనప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థమే లేదన్నది న్యాయ నిపుణుల మాట. మార్చ్, ర్యాలీ, ప్రదర్శన, పికెటింగ్, ధర్నా ... ఇలా వివిధ పద్ధతుల్లో ప్రజలు నిరసన తెలు పొచ్చు. ఇది, రాజ్యాంగంలోని 19వ అ«ధికరణం కల్పించిన హక్కు. పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు దీన్ని స్పష్టీకరించింది. అధికరణం 21 జీవించ డానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు భరోసా కల్పించింది. అధికరణం 21 కల్పించిన ‘స్వేచ్ఛతో కూడిన జీవించే హక్కు’ ప్రజాస్వామ్య సమాజ రాజ్యాంగ విలు వలకు గుండెకాయ లాంటిది అని జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ భగవతి వ్యాఖ్యా నించారు. ఓ అంశానికి అనుకూలంగానో, ప్రతికూలంగానో ప్రజాభిప్రా యాన్ని వ్యక్తం చేసే పద్ధతే నిరసన. సహజంగా శాంతియుతంగానే జరిగే ఇటువంటి నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు కొన్ని సందర్భాల్లో హింసాయు తంగా మారొచ్చు. వాటిని పసిగట్టి తగు చర్యల ద్వారా నియంత్రించడం సమర్థ పోలీసింగ్పై ఆధారపడి ఉంటుంది. హింసకు ఆస్కారముందనే సాకును చూపి అసలు ర్యాలీలు, ప్రదర్శనలు జరుపుకోవడానికే అనుమతిం చకపోవడం దారుణం. చట్టం అనుమతిస్తోంది కదా అని, తగు ప్రాతిపదిక లేకుండానే సెక్షన్ 151 (సీఆర్పీసీ)ని రాజకీయంగా వాడుకుంటూ ప్రత్యర్థుల్ని ముందస్తు అరెస్టులు చేసి నిర్బం«ధించడం కచ్చితంగా అణచివేతే! ‘మీరు హింస జరుపుతారని మాకు అనుమానం ఉందం’టూ ఒక నిరాధార మైన,æహేతుబద్ధం కాని కారణంతో నిర్బంధించడం, నిరసనే తెలుపనీయ కుండా అడ్డుకోవడం పౌరుల హక్కును కాలరాయడమే. నిజానికి ఆ సెక్షన్ వాడాలంటే 1) సదరు వ్యక్తి విచారించదగ్గ నేరానికి పాల్పడే వ్యూహంతో ఉన్నట్టు పోలీసులకు నిర్దిష్ట సమాచారం ఉండాలి. 2) అరెస్టు ద్వారా తప్ప మరో విధంగా దాన్ని అడ్డుకోలేని స్థితి ఉండాలి. పైన ప్రస్తావించిన హైద రాబాద్, గన్నవరం, విశాఖ ఘటనలకు సంబంధించి వీటిలో ఏ ఒక్క పరిస్థితీ లేదు. ‘మీ ముందస్తు అరెస్టు నాకు తెలుసు, ఉదయం 6 గంటలకు బయట కొస్తాను కదా! అప్పుడు అరెస్టు చేసుకోండ’ని కోదండరామ్ కిటికీలోంచి చెబుతుంటే, వినకుండా తలుపులు బద్దలు కొట్టి 3 గంటల రాత్రి ఆయన్ని అరెస్టు చేయడాన్ని పోలీసులైనా, ప్రభుత్వమైనా ఎలా సమర్థించుకుంటారు? పెట్టుబడిదారీ దేశాల్లోనూ నిరసన ర్యాలీలు, ప్రదర్శనల్ని అనుమతించే ప్రజా స్వామ్య వాతావరణం ఉంది. ఒక వైపు డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశాధ్య క్షుడిగా ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటిస్తుండగా మొదలైన నిరసన ప్రద ర్శనలు, ఆయన పాలన సాగిస్తున్నా కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన్ని అధ్యక్షుడిగా అంగీకరించని ప్రజల నిరసనలు స్వేచ్ఛగా సాగుతున్నాయి. అభి వృద్ధిచెందిన దేశాల్లో నిరసన వ్యక్తంచేసే పౌరుల స్వేచ్ఛను కాపాడుతూనే, జన సమూహాల్ని పోలీసులు జాగ్రత్తగా నియంత్రిస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజస్వామ్య దేశంలో అది కరవవుతోంది. అసమ్మతికి తావే లేకుండా చేసే కుట్ర భావ ప్రకటన స్వేచ్ఛ, నిరసన తెలిపే హక్కును పౌరులు వాడుకునే ఆస్కా రాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. ఈ క్రమంలో సామాన్య పౌరులు, సామాజిక కార్యకర్తలు నష్టపోవాల్సి వస్తోంది. హైదరా బాద్లో ఒకప్పుడు నిరసనకారులు అసెంబ్లీ వద్దకు, తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు వచ్చేవారు. తర్వాతి కాలంలో బాబూజగ్జీవన్రామ్ (బషీర్ బాగ్), అంబేద్కర్ (ట్యాంక్బండ్ సర్కిల్) విగ్రహాల వరకూ ప్రదర్శనల్ని అనుమతించే వారు. నిరనస ప్రదర్శన చేస్తున్న అంగన్వాడి మహిళల్ని లోగడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుర్రాలతో తొక్కించిన దుర్ఘటన చోటు చేసుకున్నది తెలుగుతల్లి విగ్రహం సమీపంలోనే. నిర్దిష్టంగా స్థలం చూపి, అక్కడే (జలదృశ్యం) టెంట్ వేసి నిరసనలు తెలుపుకోవడాన్ని సర్కారు కొంతకాలం అనుమతించింది. రోజుల తరబడి నిరసనకు కూర్చునే బాధితు లతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రతినిధులు వెళ్లే సంప్రదాయం కూడా కూడా లోగడ ఉండేది. తర్వాత ఆ నిరసనల స్థలాన్ని ఇందిరాపార్క్ ఎదుటికి తరలించారు. అది ఎవరి దృష్టికీ ఆనేదీ కాదు, ప్రభుత్వం తరçఫున ఎవరూ పట్టించుకున్న పాపాన పోయేవారూ కాదు 108 వైద్య సర్వీసు ఉద్యోగులు దాదాపు ఏడాది పాటు ఎండలో, వానలో, చలిలో రిలే నిరాహార దీక్షలు జరి పినా ఎవరి నుంచీ స్పందన లేక సమస్య పరిష్కారం కాకుండానే తమ నిరసనను విరమించాల్సి వచ్చింది. ఇప్పుడు ఎవరరికీ పట్టని అక్కడ్నుంచి కూడా నిరసన స్థలిని నగర శివార్లలోకి తరలించాలని ప్రభుత్వం యోచి స్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో నిరసన స్థలి జంతర్మంతర్ పార్లమెంటుకు సమీపంలో ఉంటుంది. అమెరికాలోనూ ఇలా ‘ఫ్రీ స్పీచ్ జోన్స్’ ఏర్పాటు చేసి నిరసన ప్రదర్శనల్ని అక్కడికి పరిమితం చేసిన ప్పుడు ఇది వారి రాజ్యాంగపు తొలి సవరణ స్ఫూర్తికి విరుద్ధమంటూ తీవ్ర నిరసన వ్యక్తమైంది. నిరసన తెలిపే, ప్రదర్శనలు నిర్వహించుకునే హక్కులకు భంగకరమైన చట్టాలను చేయకుండా నిరోధించడమే అమెరికా రాజ్యాంగ తొలి సవరణ పరమార్థం. పౌరచేతనే పరిష్కారమా? పోలీసు వ్యవస్థతో ఊడిగం చేయించుకునే ఫ్యూడల్ సంస్కృతిని మన ప్రభు త్వాలు బలోపేతం చేస్తున్నాయి. దీన్నిపుడు వ్యవస్థీకృతంగా చేస్తున్నారు. తద్వారా చట్ట నిబంధనలు, కోర్టు తీర్పులు, మానవహక్కుల సంఘ మార్గ దర్శకాలు, ‘అమ్నెస్టీ’ వంటి అంతర్జాతీయ సంస్థల నివేదికలతో నిమిత్తం లేకుండా పోలీసులు సర్కారుకు వీరవిధేయులై వ్యవహరిస్తున్నారు. నియామ కాల నుంచి బదిలీలు, పదోన్నతులు, కీలకబాధ్యతల అప్పగింతవరకు రాజ కీయ ప్రమేయాలు పోలీసు శాఖ పని తీరును ప్రభావితం చేస్తున్నాయి, ప్రజా స్వామ్య విలువల్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. శాఖాపరమైన నిర్ణయాల్లో ‘పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు’ ప్రమేయాన్ని పాలకులు నామమాత్రం చేశారు. పోలీసు విభాగానికి మంచి వాహనాలు, వసతులు, భత్యాలు వంటి మౌలిక సదుపాయాలు పెంచడం వారిని మచ్చిక చేసుకొని నియంత్రణలోకి తెచ్చు కునే ఎత్తుగడేనని పరిశీలకుల వాదన. నరహంతక నేరగాడు నయీమ్తో నెయ్యం నెరపిన బడా పోలీసు బాసుల్ని కూడా ప్రభుత్వం కాపాడుతోంది, పరోక్షంగా వారితో దొడ్డిదారి మేళ్లు పొందుతోందనే విమర్శలున్నాయి. పాల కులకుగాక, రాజ్యాంగానికి, దాని పరిధిలో ఏర్పడ్డ చట్టాలకే విధేయులుగా ఉండాలనే స్ఫూర్తి పోలీసు యంత్రాంగంలో పెరగాలని మేధావి వర్గం చెబు తోంది. ఎదుటివారి వాదన వినకపోవడమేగాక, తాము చెప్పిందే సరైనది, తమ నిర్ణయాన్ని సమీక్షించకుండానే అంతా మారుమాటాడకుండా అంగీకరిం చాలనే ప్రభుత్వాల ధోరణి వల్లే నిరసన గళంపై ఈ నిర్బంధం వచ్చిపడింది. ఈ విషయాలన్నీ గ్రహించి పౌర సమాజం చైతన్యం తెచ్చుకుంటే తప్ప ‘‘ప్రజాస్వామ్యమంటే ఏ కొందరి చేతులకో అధికారం కట్టబెట్టడం కాదు! పాలకులు తప్పు చేస్తున్నప్పుడు, ఏయ్, ఎందుకిలా చేస్తున్నావ్? అని ప్రతి పౌరుడూ అడగ్గలిగే స్థితి ఉన్నదే ప్రజాస్వామ్యం’’ అన్న గాంధీజీ మాటలు నిజం కావు. జాతిపిత కలలు కన్న ప్రజాస్వామ్యం పరిఢవిల్లదు. ( వ్యాసకర్త : దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com) -
‘ర్యాలీ ఫ్లాప్.. కాదు సూపర్ హిట్’
హైదరాబాద్: నిరుద్యోగ ర్యాలీ విజయవంతం అయిందని తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ అన్నారు. ర్యాలీ నేపథ్యంలో జరిగిన పరిణామాలు, అరెస్టుల పర్వం తదితర అంశాలపై గురువారం ఉదయం ఆయన నివాసంలో జేఏసీ నేతలు, నిరుద్యోగ జేఏసీ, విద్యార్థి నాయకుల మధ్య చర్చల అనంతరం కోదండరామ్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగులు స్వచ్ఛందంగా ర్యాలీకి వచ్చారని చెప్పారు. దాదాపు 5వేలమందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరికీ తెలుసని, దీన్ని బట్టే ర్యాలీ విజయవంతం అయిందని చెప్పవచ్చని అభిప్రాయపడ్డారు. ర్యాలీ కార్యక్రమం అత్యద్భుతంగా జరిగిందని, తాము ఏం చెప్పాలనుకున్నామో అది చాలా విస్తృతంగా చెప్పగలిగామని, ర్యాలీ విజయవంతమైందని చెప్పడానికి ఇదే గీటురాయని అన్నారు. ఆయా విశ్వవిద్యాలయాల్లో నిరుద్యోగులు, యువత నిరసనలు తెలిపేందుకు తరలిన విధానం ప్రతి మీడియా గమనించిందని గుర్తు చేశారు. మరోపక్క అంతకుముందు బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ ర్యాలీ అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కోదండరామ్ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కోదండరామ్ కుట్రలు చూస్తున్నారని, నిరుద్యోగులు, యువత ర్యాలీలో పాల్గొనకుండా కేసీఆర్పై విశ్వాసం చూపించారని అన్నారు. -
‘ర్యాలీ ప్లాఫ్.. కాదు సూపర్ హిట్’
-
ప్రభుత్వానిది దౌర్జన్యం
నిరుద్యోగ ర్యాలీని అడ్డుకోవడంపై పలు పార్టీలు, ప్రజా సంఘాల మండిపాటు సాక్షి, హైదరాబాద్: టీజేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీపై పోలీసు నిర్భంధాన్ని ప్రయోగించడం దారుణమని వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. జేఏసీ నాయకులు, వివిధ పార్టీల నేతలు, యువజన, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని తప్పుబట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన మేరకు ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశాయి. ‘‘ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగుల్లో అసంతృప్తి పెరిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల ప్రవర్తన చూస్తుంటే తెలంగాణ ఉద్యమం నాటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వ తీరు గుర్తుకొస్తోంది. పోలీసుల దౌర్జన్యం, అణచివేత సరికాదు..’’ – డా.కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ‘‘టీజేఏసీ ర్యాలీ పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉంటుంది. జేఏసీ నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం సరికాదు..’’ – వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ‘‘ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి యువతను భయభ్రాంతులకు గురిచేసింది. కోదండరాం ఇంటి తలుపులు బద్దలుకొట్టి మరీ అరెస్టు చేయడం ప్రభుత్వ కక్షపూరిత వైఖరికి నిదర్శనం. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తికే స్వరాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి రావడం దారుణం. కేసీఆర్ అప్రజాస్వామిక పోకడలకు ఇది పరాకాష్ట..’’ – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కచ్చితంగా ఇది ప్రభుత్వ కుట్రే... అక్రమ అరెస్టులు, నిర్భందాలతో ఉద్యమాలను ఆపలేరని, జేఏసీ ర్యాలీలో విధ్వంసం జరుగుతుందంటూ హైకోర్టులో అఫిడవిట్ వేయటం వెనుక అంతర్యం ఏమిటని బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు. శాంతియుతంగా తలపెట్టిన ర్యాలీపై అసత్యాలను ప్రచారం చేస్తూ, చివరి నిమిషంలో అనుమతి నిరాకరణ కచ్చితంగా ప్రభుత్వ కుట్రేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.నాగయ్య విమర్శించారు. నిరుద్యోగ ర్యాలీని అడ్డుకునే పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం హింసాకాండకు, నిరంకుశత్వానికి పాల్పడిందని, పార్టీ, ప్రజాసంఘాల కార్యాలయాలను పోలీసులతో దిగ్భంధించడం దారుణమని సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ (చంద్రన్న) నేతలు సాదినేని వెంకటేశ్వరరావు, కె.గోవర్ధన్లు ఆరోపించారు. ఉద్యోగాల కోసం ఆందోళన చేసిన వారిని అరెస్టు చేయడం కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనంటూ ఎంసీపీఐ (యూ) రాష్ట్ర కార్యదర్శి తాండ్రకుమార్ దుయ్యబట్టారు. యువజనులు, విద్యార్థుల భుజాలపై స్వారీ చేసి.. ఉద్యమాల ద్వారా గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల కోసం చేపట్టిన పోరాటాన్ని పోలీసు నిర్భందం ద్వారా అణచేసే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని లోక్సత్తా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డా.పాండురంగారావు తెలిపారు. -
నా భర్త ఎక్కడున్నారో చెప్పండి:సుశీల
-
నా భర్త ఎక్కడున్నారో చెప్పండి: కోదండరామ్ భార్య
హైదరాబాద్: తన భర్త, జేఏసీ కన్వీనర్, ప్రొఫెసర్ కోదండరామ్ను తెల్లవారు జామున అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన భార్య సుశీల ప్రశ్నించారు. తన భర్త ఆచూకీ తెలపాలని, ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ‘నిరుద్యోగ ర్యాలీలో సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయంటున్నారు.. అలాంటప్పుడు తెలంగాణ ఉద్యమానికి మద్దతిచ్చింది కూడా సంఘ విద్రోహ శక్తులేనా’ అని ఆమె నిలదీశారు. నిరుద్యోగ ర్యాలీ నేపథ్యంలో కోదండరామ్ను ముందస్తు అరెస్టు చేసిన సందర్భంగా సుశీల మంగళవారం పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డిని కలిసి వివరాలు అడిగారు. ఉదయం 6గంటలకు బయటకు వస్తానని చెప్పినా తెల్లవారు జామున 3.30గంటల ప్రాంతంలో తలుపులు బద్ధలు కొట్టి అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగలు, దోపిడీ దారులు తమ వద్ద ఉన్నట్లు పోలీసులు ప్రవర్తించారని దిగులుచెందారు. తన భర్తను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగ ఖాళీలపై నోటిఫికేషన్ ఇచ్చి తీరాల్సిందేనని కోదండరామ్ భార్య సుశీల డిమాండ్ చేశారు. జేఏసీ తరుపున కోర్టులో వాదనలు చేసిన అడ్వకేట్ రచనా రెడ్డి మాట్లాడుతూ ‘ఉదయం ఆరుగంటలకు బయటకు వస్తానని, కావాలంటే అప్పుడు అరెస్టు చేసుకోండని కోదండరామ్ చెప్పారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. తెల్లవారు జామున తలుపులు పగులగొట్టి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది? మూడుగంటల నుంచి ఇప్పటి వరకు ఆయనను ఎక్కడ ఉంచారో ఎవరికీ తెలియదు. ఆయనను వెంటనే విడుదల చేయాలి. దుర్మార్గంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి’ అని ఆమె డిమాండ్ చేశారు. మరోపక్క, సీపీ మహేందర్రెడ్డిని కలిసిన అనంతరం సుశీల గవర్నర్ నరసింహన్ను కలిసేందుకు వెళ్లారు. అయితే, ఆయన లేకపోవడంతో వెనుదిరిగారు. సంబంధిత వార్తలకై చదవండి.. సీపీని కలిసిన కోదండరామ్ సతీమణి కోదండరాం అరెస్ట్ అప్రజాస్వామికం : ఉత్తమ్ కోదండరాం అరెస్ట్పై జేఏసీ నేతల ఆగ్రహం (రాజధాని దిగ్బంధం: కోదండరాం అరెస్ట్ ) -
సీపీని కలిసిన కోదండరామ్ సతీమణి
హైదరాబాద్ : తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టీ-జేఏసీ) చైర్మన్ ప్రొ.కోదండరాం సతీమణి సుశీల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డిని బుధవారం కలిశారు. కోదండరాం ఆచూకీ తెలపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆయన్ను అరెస్ట్ చేసిన తీరుపై సీపీకి ఫిర్యాదు చేశారు. మహేందర్ రెడ్డిని కలిసిన వారిలో న్యాయవాది రచనారెడ్డి, జేఏసీ నాయకులు ఉన్నారు. (రాజధాని దిగ్బంధం: కోదండరాం అరెస్ట్ ) తార్నాకలోని కోదండరాం నివాసంలో బుధవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఇంటి తలుపులను బద్దలుకొట్టి మరీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిరుద్యోగ ర్యాలీ, సభ నిర్వహించి తీరుతామని టీజేఏసీ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోదండరాం అరెస్ట్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపట్ల పలు రాజకీయ పార్టీల నేతలు, జేఏసీ నాయకులు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత వార్తలు కోదండరాం అరెస్ట్ అప్రజాస్వామికం : ఉత్తమ్ కోదండరాం అరెస్ట్పై జేఏసీ నేతల ఆగ్రహం -
నిరుద్యోగుల ర్యాలీకి అనుమతిపై నేడు తీర్పు
-
పోలీసులు అరెస్టులు మానుకోవాలి
-
జల్లికట్టు తరహాలో నిరుద్యోగ ర్యాలీకి ప్లాన్!
హైదరాబాద్ : తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టీ-జేఏసీ) ఈ నెల 22న చేపట్టిన నిరుద్యోగ ర్యాలీని తమిళనాడు జల్లికట్టు తరహాలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు నిర్ణయించిందని పోలీస్ శాఖ హైకోర్టుకు తెలిపింది. హైకోర్టులో సోమవారం ఉదయం నిరుద్యోగ ర్యాలీ పిటిషన్పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ర్యాలీకి అనుమతి నిరాకరించడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు పోలీస్ శాఖను ఆదేశించింది. ర్యాలీ నిరాకరణకు గల కారణాలను హైదరాబాద్ పోలీస్ శాఖ హైకోర్టుకు సమర్పించింది. ఆ నివేదకలో ఏం పేర్కొందంటే 'ఇప్పటికే జేఏసీపై 31 కేసులు ఉన్నాయి. ర్యాలీలో సంఘ విద్రోహ శక్తులు చొరబడే అవకాశముందని ఇంటలిజెన్స్ రిపోర్ట్లో తేలింది. ఈ ర్యాలీ కోసం జేఏసీ చైర్మన్ కోదండరామ్ 31 జిల్లాల్లో 131 ప్రాంతాల్లో పర్యటించారు. ఒక్కో ప్రాంతం నుంచి వెయ్యి మందిని తరలించేందుకు ప్లాన్ చేశారు. జల్లికట్టు తరహాలో ఉద్యమం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనివల్ల గ్రేటర్ పరిధిలో అనుమతి ఇవ్వలేం. మరో చోట ర్యాలీ నిర్వహిస్తే అభ్యంతరం లేదు' అని తేల్చి చెప్పింది. హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
కోదండరామ్ పిటిషన్ రేపటికి వాయిదా
హైదరాబాద్ : తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజాక్) చైర్మన్ కోదండరామ్ పిటిషన్పై విచారణను హైకోర్టు రేపటికి(మంగళవారం) వాయిదా వేసింది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ఈ నెల 22న తలపెట్టిన చలో హైదరాబాద్కు పోలీసులు అనుమతినివ్వకపోవడంతో టీజాక్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. శాంతియుతంగా, ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ చేపడతామని హామీ ఇచ్చినా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని టీజాక్ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, అధికార ప్రతినిధి జి.వెంకటరెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్లో ర్యాలీకి అనుమతి కుదరదని, మరో చోట ర్యాలీ నిర్వహిస్తే అభ్యంతరం లేదని పోలీసులు చెప్పారు. -
1.70 లక్షల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి
సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశంలో తీర్మానాలు ఖమ్మం రూరల్: రాష్ట్రంలోని 1.70 ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఖమ్మం రూరల్ మండలంలోని తెల్దారుపల్లి లో ఆదివారం రాష్ట్ర కమిటీ సమావే శం జరిగింది. దీంతో సీపీఎం మహా జనపాదయాత్రను ఒకరోజు నిలిపి వేశారు. ఈ సమావేశం పలు తీర్మా నాలను ఆమోదించింది. ఖాళీ పోస్టు లను భర్తీచేయాలని, రాజకీయ జేఏసీ ఫిబ్రవరి 27న నిర్వహించే నిరుద్యోగ ర్యాలీకి మద్దతు ప్రకటించాలని తీర్మా నించింది. ఉద్యోగాల భర్తీ కోసం ఉద్యమం చేస్తున్న కోదండరాంపై ప్రభుత్వం, నాయకులు అక్కసు వెళ్లగ క్కడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండిం చింది. ప్రభుత్వ పాఠశాలలను కుదిం చాలనే ఆలోచనను ప్రభుత్వం విర మించుకోవాలని, ఖాళీ పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరింది. అంబేడ్కర్ భావాలను ఎలు గెత్తిచాటి, కులోన్మాదాన్ని, పరువు హత్యలపై కుటిలనీతిని విమర్శించే లా నిర్మించిన శరణం గచ్ఛామి సిని మాకు సెన్సార్బోర్డు అనుమతి ఇవ్వక పోవడాన్ని ఖండిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. రాష్ట్ర నాయకులు బి.వెంకట్ తదితరులు పాల్గొన్నారు -
నిరుద్యోగ ర్యాలీకి లెఫ్ట్ మద్దతు
సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామ్య శక్తుల పునరేకీకరణకు యత్నం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను సీపీఐ, సీపీఎం లోతుగా పరిశీలిస్తున్నాయి. ఈ నెల 22న టీజేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరుద్యోగ ర్యాలీకి ఈ రెండు పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ పార్టీల అనుబంధ విద్యార్థి, యువజన సంఘాలు సంఘీభావం ప్రకటించడమే కాకుండా ర్యాలీని విజయవంతం చేసేందుకు కార్యాచరణను ప్రారంభించాయి. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజకీయశక్తుల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని వామపక్షాలు గట్టిగా భావిస్తున్నాయి. భావసారూప్య వామపక్ష, లౌకిక, ప్రజాస్వామ్య, సామాజిక శక్తులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఫ్రంట్ ఏర్పాటు దిశలో ఈ పార్టీలు ముందుకు సాగుతున్నాయి. కలిసొచ్చే శక్తులను కలుపుకొని పోయేందుకు ఆయా సంఘాలు, వ్యక్తులు, సంస్థలు, మేధావులతో ప్రాథమిక చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రంలో 93 శాతంమేర ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అభివృద్ధి ఫలాలు అందే విధంగా, సామాజిక న్యాయం అమలయ్యేలా అన్ని శక్తులను ఒకటి చేయాలనే ఆలోచనతో ఈ పార్టీలున్నాయి. మరో పక్క సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర వచ్చేనెల 19న హైదరాబాద్లో బహిరంగసభ ద్వారా ముగియనుంది. సీపీఐ ఆధ్వర్యంలో ఏప్రిల్, మేనెలలో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్రను చేపట్టి మే చివర్లో హైదరాబాద్లో బహిరంగసభను నిర్వహించనున్నారు. సమస్యలపై పోరాటం.. కాంగ్రెస్, టీడీపీ, తదితర పార్టీల ముద్ర లేకుండా ఒక ఉమ్మడి శక్తిగా ఎదిగేందుకు దోహదపడే రాజకీయ, సామాజిక శక్తులపై వామపక్షాలు దృష్టిని కేంద్రీకరించాయి. ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల అమలు విషయంలో అధికార టీఆర్ఎస్ తీరును ఎండగట్టేందుకు ఇప్పటికే ఈ పార్టీలు కార్యాచరణను రూపొందించుకున్నాయి. ›ప్రధానంగా డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, తదితర సమస్యలపై ఆందోళనలను మరింత తీవ్రతరం చేయడం ద్వారా ఈ ప్రయోజనాలను ఆశిస్తున్న వర్గాలను కలుపుకుని పోవాలనే ఆలోచనతో ఉన్నాయి. -
ర్యాలీకి అనుమతి కోరుతూ హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ఈ నెల 22న తలపెట్టిన చలో హైదరాబాద్కు పోలీసులు అనుమతినివ్వడం లేదంటూ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజాక్) శనివారం హైకోర్టును ఆశ్రయించింది. శాంతియుతంగా, ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ చేపడతామని హామీ ఇచ్చినా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని టీజాక్ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, అధికార ప్రతినిధి జి.వెంకటరెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ర్యాలీకి అనుమతినిచ్చేలా పోలీసులను ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇందులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, చిక్కడపల్లి ఏసీపీ, చిక్కడపల్లి పీఎస్ ఎస్హెచ్ఓలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు విచారణ జరపనున్నారు. -
అవసరమైతే పార్టీ పెడతాం: కోదండరాం
హైదరాబాద్: రాజకీయ పార్టీ పెట్టే సందర్భం, అవసరం వస్తే తప్పకుండా పెడతామని జేఏసీ చైర్మెన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సమాజంలో విలువలతో కూడిన రాజకీయ పార్టీల అవసరం ఉందని.. ప్రత్యామ్నాయ రాజకీయ విలువల కోసం జేఏసీ పోరాడుతోందన్నారు. ఒక వేళ పార్టీ పెట్టాల్సిన అవసరం, సందర్భం వస్తే తప్పకుండా పెడతామన్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినా.. జేఏసీ మాత్రం కొనసాగుతుందన్నారు. జోనల్ వ్యవస్థను రద్దు చేస్తే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, అనేక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని అందుకే జోనల్ సిస్టమ్ను రద్దు చేయకుండా దాన్ని సవరించాల్సిన అవసరముందున్నారు. ఈ నెల 22న తెలంగాణ జేఏసీ అధ్వర్యంలో నిర్వహించనున్న నిరుద్యోగుల ర్యాలీ శాంతియుతంగా జరుగుతుందన్నారు. అనవసరంగా ఎవరు ఆవేశపడొద్దని.. జేఏసీని బద్నామ్ చేయడానికి కొందరు కాచుకొని కూర్చున్నారని.. గొడవలు, కాల్పులు జరిపేందుకు సిద్ధమైనట్లు తెలిసిందన్నారు. ఏది ఏమైనా ర్యాలీ శాంతియుతంగా జరిగేలా సహకరించాలని కోరారు. -
అవసరమైతే పార్టీ పెడతాం
-
లక్ష మందితో చలో అసెంబ్లీ
హైదరాబాద్: నిరుద్యోగులు శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి అసెంబ్లీ వరకు భారీ ర్యాలీ తీయనున్నారు. గ్రూప్-2 పోస్టులను పెంచాలని, లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, గ్రూప్-2 ఎక్జామ్ని 3 నెలలు పోస్టుపోన్ చేయాలని, గ్రూప్-2లో ఇంటర్వూ విధానం ద్వారా ఎంపిక విధానాన్ని తొలగించాలని, త్వరిత గతిన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను వెంటనే నియమించాలనే డిమాండ్లతో తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ, ఓయూ జేయూసీలు ‘ఛలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చాయి. నిరుద్యోగ యువకులను అసెంబ్లీ వైపు రాకుండా నిలువరించేందుకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.