USAID
-
యూఎస్ ఎయిడ్ కాంట్రాక్టుల్లో 90 శాతం రద్దు!
వాషింగ్టన్: అమెరికా అంతర్జాతీయ విదేశీ సహాయ నిధి (యూఎస్ ఎయిడ్)కు ఇప్పటికే మంగళం పాడిన డొనాల్డ్ ట్రంప్ సర్కారు, దానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 90 శాతానికి పైగా కాంట్రాక్టులను రద్దు చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ దెబ్బతో 6,200 కాంట్రాక్టుల్లో 54 బిలియన్ డాలర్ల విలువైన 5,800 పై చిలుకు ఒక్కసారిగా బుట్టదాఖలయ్యాయి. యూఎస్ ఎయిడ్ కాంట్రాక్టుల మొత్తం విలువ 60 బిలియన్ డాలర్లని సర్కారు వెల్లడించింది. యూఎస్ ఎయిడ్ రద్దును సవాలు చేస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే కోర్టుల తలుపులు తట్టాయి. సదరు కాంట్రాక్టులకు సంబంధించి నిలిపేసిన బిలియన్ల కొద్దీ డాలర్లను తక్షణం విడుదల చేయాల్సిందిగా డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి ఒకరు మంగళవారం తీర్పు ఇచ్చారు. కానీ దానిపై ట్రంప్ యంత్రాంగం బుధవారం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దిగువ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు దన్నుగా నిలిచే యూఎస్ ఎయిడ్ కార్యక్రమాన్ని అమెరికా 60 ఏళ్లకు పైగా కొనసాగిçస్తున్న సంగతి తెలిసిందే.ఖాళీకి పావుగంటఉద్వాసన పలికిన, దీర్ఘకాలిక సెలవులపై పంపిన యూఎస్ ఎయిడ్ సిబ్బందికి తమ డెస్కులను ఖాళీ చేసేందుకు గురు, శుక్రవారాల్లో ప్రభుత్వం కేవలం 15 నిమిషాల గడువిచ్చింది. దాంతో సిబ్బంది ఒక్కొక్కరుగా సంస్థ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. తమ కార్యాలయాన్ని, డెస్కును చివరిసారిగా చూసుకుంటూ భారమైన మనసుతో నిట్టూర్చారు. ఇది తమను మరింతగా అవమానించడమేనని వాపోయారు. -
అవమానిస్తున్నా నోరు మెదపరా?
న్యూఢిల్లీ: భారత్లో ఓటర్ల సంఖ్య పెంచేందుకు అమెరికా కోట్ల రూపాయల నగదు విరాళాలు ఇచ్చిందని డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్లు పదేపదే చెబుతుంటే మోదీ సర్కార్ ఎందుకు మౌనం వహిస్తోందని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నించింది. ఈ విషయమై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(ఇన్చార్జ్) జైరాం రమేశ్ ఆదివారం ‘ఎక్స్’లో పలు పోస్ట్లుచేశారు. ‘‘అబద్దాలకోరులు, నిరక్షరాస్యుల ఊరేగింపు మందగా బీజేపీ తయారైంది. 2.1 కోట్ల డాలర్లు ఇచ్చామని అమెరికా ప్రకటించినప్పటి నుంచీ బీజేపీ వాళ్లు ఎగిరెగిరి పడుతున్నారు. 2022లో భారత్కు అన్ని కోట్ల డాలర్లు వచ్చాయనేది అబద్ధం. ఆ డబ్బు బంగ్లాదేశ్కు వెళ్లింది. ఎలాన్ మస్క్ తప్పు చెప్పారు. ఢాకా అనిబోయి ట్రంప్ ఢిల్లీ అన్నారు. బీజేపీ నేత అమిత్ మాలవీయ అబద్ధాలు ప్రచారంచేస్తున్నారు. దీనికి బీజేపీ వాళ్లు వంతపాడుతున్నారు’’అని జైరాంరమేశ్ అన్నారు. సీఈపీపీఎస్కు 48 కోట్ల డాలర్లు ‘‘డోజ్ జాబితా ప్రకారం అమెరికా నుంచి రెండు యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూఎస్ఎయిడ్) గ్రాంట్లు రావాల్సి ఉంది. ఆ 48.6 కోట్ల డాలర్లు కన్షార్సియం ఫర్ ఎలక్షన్స్ అండ్ పొలిటికల్ ప్రాసెస్ స్ట్రెంథనింగ్(సీఈపీపీఎస్)కు రావాల్సిఉంది. ఇందులో 2.2 కోట్లు మాల్దోవా కోసం, మరో 2.1 కోట్లు భారత్లో ఓటర్ల సంఖ్య పెంచేందుకు ఉద్దేశించినవి. ఇందులో తొలిగ్రాంట్ ఏఐడీ117ఎల్ఏ1600001 ఐడీతో మాల్దోవాకు ఇచ్చారు. 2.1 కోట్ల గ్రాంట్కు భారత్కు వెళ్లాల్సి ఉందని మస్క్ చెప్పింది అబద్ధం. ఈ గ్రాంట్ వాస్తవానికి బంగ్లాదేశ్కు వెళ్లాల్సింది. నా ఓటు నాదే అనే కార్యక్రమం కోసం ఈ గ్రాంట్ను వినియోగించాలని బంగ్లాదేశ్లో నిర్ణయించారు. కానీ తర్వాత ఈ నిధులను నాగరిక్ కార్యక్రమం కోసం వినియోగించాలని నిర్ణయం మార్చుకున్నారు. ఈ విషయాన్ని యూఎస్ఎయిడ్ అధికారి స్పష్టం చేశారు’’అని జైరాం వెల్లడించారు. -
కొత్త మలుపు తీసుకున్న యూఎస్ఎయిడ్ వివాదం
న్యూఢిల్లీ: భారత్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా నుంచి యూఎస్ఎయిడ్ తరఫున 2.1 కోట్ల డాలర్ల నిధులు వచ్చాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ మోదీ ప్రభుత్వం కొత్త విషయాన్ని బయటపెట్టింది. 2023–24 ఆర్థికసంవత్సరంలో భారత్లో ఏడు ప్రాజెక్టుల కోసం యూఎస్ఎయిడ్ 75 కోట్ల డాలర్ల నిధులను సమకూర్చిందని భారత ఆర్థికశాఖ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ‘‘ మొత్తంగా 75 కోట్ల డాలర్ల విలువైన ప్రాజెక్టులను భారత ప్రభుత్వ భాగస్వామ్యంలో యూఎస్ఎయిడ్ చేపట్టింది. అందులో 2023–24 కాలంలో 9.7 కోట్ల డాలర్లను ఖర్చుచేశారు. ఇందులో ఓటర్ల సంఖ్య పెంచేందుకు ఉద్దేశించిన ప్రాజెక్ట్ లేదు. వ్యవసాయం, ఆహార భద్రత, నీరు, శుభ్రత(వాష్ ప్రోగ్రామ్), పునరుత్పాదక ఇంధనం, విపత్తు నిర్వహణ, ఆరోగ్యం, సుస్థిర అడవులు, పర్యావరణ అనుకూల కార్యక్రమాలు, ఇంధన సమర్థ వినియోగ సాంకేతికలను అందుబాటులోకి తేవడం, ఇన్నోవేషన్ ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి’’ అని వార్షిక నివేదిక పేర్కొంది. 1951 ఏడాదిలో మొదలైన ద్వైపాక్షిక అభివృద్ధి సాయంలో భాగంగా భారత్కు అమెరికా ఇప్పటిదాకా 555కుపైగా ప్రాజెక్టుల్లో ఏకంగా 17 బిలియన్ డాలర్ల సాయం అందించిందని వార్షిక నివేదిక పేర్కొంది. ద్వైపాక్షిక నిధుల వ్యవహారాలను చూసే కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థికవ్యవహారాల విభాగం సైతం ఈ వివరాలను వెల్లడించింది. -
భారత్కు అమెరికా సాయం.. బంగ్లాకు మళ్లిందా?
న్యూఢిల్లీ: అమెరికా 21 మిలియన్ డాలర్ల సాయం వ్యవహారం.. కొత్త మలుపు తిరిగింది. ఆ సాయం భారత సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసేందుకేనన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ-కాంగ్రెస్లు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ లోపు ఆ సాయాన్ని బంగ్లాదేశ్కు మళ్లించారంటూ ఓ జాతీయ మీడియా సంస్థ నుంచి కథనం వెలువడంది. దాని ఆధారంగా బీజేపీ-కాంగ్రెస్లు పరస్పర ఆరోపణలతో మండిపడుతున్నాయి.భారత్లో ఓటింగ్ శాతం పెంపు కోసం ఇచ్చిన ఆ నిధులను బంగ్లాదేశ్లో ఓ ప్రాజెక్టు వినియోగించారన్నది ఆ కథనం సారాంశం. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్(Jairam Ramesh) దీనిని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి.. బీజేపీ, ఆ పార్టీ అనుకూల మీడియాపై విరుచుకుపడ్డారు. దానిని షేర్ చేస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీపై నిప్పులు చెరుగుతోంది. అయితే.. ఆ కథనాన్ని ఫేక్ అంటూ బీజేపీ ఖండించింది. Lies first mouthed in Washington. Lies then amplified by BJP's Jhoot Sena.Lies made to be debated on Godi media.Lies now thoroughly exposed. Will the Liars apologise? pic.twitter.com/nY7iP4jmnN— Jairam Ramesh (@Jairam_Ramesh) February 21, 2025 FAKE NEWS ALERT 🚨‼️The Indian Express story discusses $21 million in funding to Bangladesh in 2022. However, the article misrepresents the reference to a $21 million funding tranche intended to ‘promote’ voter turnout in India.What Indian Express conveniently sidesteps is… pic.twitter.com/niOaWXivm5— Amit Malviya (@amitmalviya) February 21, 2025భారత్లో ఎవరినో గెలిపించడానికి గత అధ్యక్షుడు జో బైడెన్ 21 మిలియన్ డాలర్ల(రూ.182 కోట్ల నిధులు) కేటాయించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆరోపించిన సంగతి తెలిసిందే. ఓటింగ్ను పెంచడంద్వారా భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు బైడెన్ ప్రయత్నించారని ట్రంప్ విమర్శించారు. అందుకే డోజ్ దానిని రద్దు చేసిందని సమర్థించుకున్నారు. ఈ ట్రంప్ వ్యాఖ్యలపై భారత్లో దుమారం రేగింది.విదేశీ సంస్థల చేతుల్లో రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలుబొమ్మలా మారారని బీజేపీ ధ్వజమెత్తగా.. ట్రంప్వి అర్థం లేని ఆరోపణలని కాంగ్రెస్ తిప్పికొట్టింది. ట్రంప్ వ్యాఖ్యలతో 2024 ఎన్నికల్లో విదేశీ శక్తులు పని చేస్తున్నాయని అప్పట్లో ప్రధాని మోదీ చేసిన ఆరోపణలు నిజమని తేలిందని బీజేపీ పేర్కొంది. విదేశీ శక్తులతో కలిసి రాహుల్ గాంధీ.. భారత్ వ్యూహాత్మక, భౌగోళిక ప్రయోజనాలను దెబ్బతీయాలని చూశారని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ విమర్శించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు అర్థం లేని ఆరోపణలేనని కాంగ్రెస్ కొట్టిపారేసింది. యూఎస్ ఎయిడ్ ద్వారా దశాబ్దాలుగా భారత్లోని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు అందిన సాయంపై శ్వేత పత్రాన్ని కేంద్రం విడుదల చేయాలని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ డిమాండు చేశారు.ఇతర దేశాలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ఫిబ్రవరి 16న జాబితా ప్రకటించింది. అందులో భారత్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన నిధులను రద్దు చేసినట్లు ప్రకటించింది. డోజ్ నిర్ణయం.. భారత్లో రాజకీయ వివాదానికి దారి తీసింది. -
అమెరికా సాయం వివాదం..ఎవరీ వీణారెడ్డి..?
న్యూఢిల్లీ:భారత్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా చేసిన సాయం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. బీజేపీ,కాంగ్రెస్ పార్టీల మధ్య ఈ వివాదంపై విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. భారత్కు రూ. 186 కోట్ల ఓటర్ టర్నవుట్ సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.భారత్లో ఏదో ఒక పార్టీకి ఎన్నికల్లో సాయం చేయడానికే బైడెన్ ఈ సాయం చేసి ఉంటారని ట్రంప్ వ్యాఖ్యానించడం కూడా సంచలనమైంది.అయితే ఈ వ్యవహారంలో తాజాగా వీణారెడ్డి తెరపైకి వచ్చింది. వీణారెడ్డి యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూఎస్ఎయిడ్)ఇండియాకు 2021-24 మధ్య డైరెక్టర్గా వ్యవహరించారు.భారత్కు ఓటర్ టర్నవుట్ విషయంలో సాయం చేయడంలో వీణారెడ్డి కీలకంగా వ్యవహరించారన్న ప్రచారం జరుగుతోంది. ఈమె 2021లో భారత్కు వచ్చి 2024 లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత తిరిగి అమెరికా వెళ్లారు. వీణారెడ్డి పాత్రపై విచారణ జరపాలని బీజేపీ ఎంపీ మహేష్ జెఠ్మలానీ తాజాగా ట్వీట్ చేయడంతో ఆమె పేరు వెలుగులోకి వచ్చింది.So #DOGE has discovered that #USAID allocated $21million for “voter turnout” in India ,a euphemism for paying voters to cast their votes to effect regime change. #VeenaReddy was sent to India in 2021 ( ominous?) as head of USAIDs Indian mission . Post #loksabha elections 2024 (…— Mahesh Jethmalani (@JethmalaniM) February 16, 2025వీణారెడ్డి యూఎస్ఎయిడ్ డైరెక్టర్గా ఉన్నపుడు అమెరికా నుంచి భారత్కు అందే సాయం గణనీయంగా పెరిగినట్లు సమాచారం.అమెరికా సాయంతో భారత్లో ఓటర్ టర్నవుట్ పెరిగితే అది కచ్చితంగా అధికార పార్టీకి అయితే మేలు చేయదని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్య ఇప్పటికే ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టడం గమనార్హం. -
మరో ట్రంప్ ఉత్తర్వుకు చుక్కెదురు
వాషింగ్టన్: అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ డజన్లకొద్దీ కార్యనిర్వాహక ఉత్తర్వులిస్తూ అన్ని దేశాలను కలవరపరుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో న్యాయస్థానం మొట్టికాయ వేసింది. వలస వచ్చిన వాళ్లకు పిల్లలు పుడితే వారికి దక్కే జన్మతః పౌరసత్వ హోదాను రద్దుచేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులు ఇచ్చిన ట్రంప్ను ఇప్పుడు అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ(యూఎస్ఎయిడ్) ఉద్యోగుల విషయంలోనూ మరో కోర్టు కట్టడిచేసింది. వేలాది మంది యూఎస్ఎయిడ్ ఉద్యోగులను ఉద్యోగాలు మానేసి 30 రోజుల్లోపు స్వదేశానికి తిరిగొచ్చేయాలని ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను వారం రోజులపాటు నిలుపుదల చేస్తున్నట్లు యూఎస్ డిస్ట్రిక్ కోర్ట్ జడ్జి కార్ల్ నిఖోల్స్ శుక్రవారం రాత్రి మధ్యంతర తీర్పు వెలువరిచారు. యూఎస్ఎయిడ్ను శాశ్వతంగా మూసేస్తానంటూ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ పెట్టిన కొన్ని గంటలకే ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా తాత్కాలిక తీర్పు వెలువడటం విశేషం. విదేశాల్లో యూఎస్ఎయిడ్ ఉద్యోగులు, వారి జీవితభాగస్వాములు, చదువుకుంటున్న వారి పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైన వేళ కోర్టు ఉత్తర్వులతో తాజాగా వారికి భారీ ఊరట లభించింది. అయితే ఈ విభాగానికి నిధులు ఆపేయాలంటూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేయాలంటూ ది అమెరికన్ ఫారెన్ సర్విస్ అసోసియేషన్, ది అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంస్థలు చేసిన విజ్ఞప్తిని జడ్జి తిరస్కరించారు. ట్రంప్ ప్రభుత్వం ఆదేశించడంతో యూఎస్ఎయిడ్లో ఇప్పటికే 500 మంది ఉద్యోగులు సెలవులపై వెళ్లగా మరో 2,200 మంది శనివారమే సెలవుపై వెళ్లాల్సి ఉంది. యూఎస్ఎయిడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో సహాయక, అభివృద్ధి, దాతృత్వకార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రతి ఏటా వందల కోట్ల బడ్జెట్ను కేటాయిస్తున్నారు. 2016 గణాంకాల ప్రకారం యూఎస్ఎయిడ్ ప్రభుత్వ విభాగంలో 10,235 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో మూడింట రెండొంతుల మంది విదేశాల్లో పనిచేస్తున్నారు. విదేశాలకు అపరిమిత సాయం అమెరికాకు గుదిబండగా మారిందని, ఉద్యోగుల్లో 90 శాతం మంది తీసేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగానే దశలవారీగా చాలా మంది సెలవుల మీదకు స్వదేశానికి తిరిగొచ్చేయాలని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది. శాశ్వతంగా తిరిగొస్తున్నందున ప్రయాణఖర్చులు కూడా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే విధులు నిర్వర్తిస్తున్న దేశంలోనే ఈ సిబ్బంది పిల్లలు చదువుకుంటున్నారు. -
యూఎస్ఎయిడ్ ఉద్యోగులకు సెలవులు
వాషింగ్టన్: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పని చేస్తున్న యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూఎస్ఎయిడ్) ఉద్యోగులను సెలవులపై ఉండాలని, విధులకు రావొద్దని ఆదేశించింది. అత్యవసర విధుల్లో ఉన్నవారికి మినహాయింపు ఇచ్చింది. యూఎస్ఎయిడ్లో ప్రత్యక్షంగా నియమితులైన ఉద్యోగులంతా బలవంతంగా సెలవులపై ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారంతా 30 రోజుల్లోగా స్వదేశానికి చేరుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం నోటీసును ఆన్లైన్లో పోస్టు చేసింది. యూఎస్ఎయిడ్ సంస్థ గత 60 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇది అమెరికా ప్రభుత్వ ఆధ్యర్యంలో ఉంటూనే స్వతంత్రంగా పనిచేసే సంస్థ. యుద్ధాలు, విపత్తులు, సంక్షోభాల్లో చిక్కుకున్న దేశాల్లో ప్రజలకు మానవతా సాయం అందించడం యూఎస్ఎయిడ్ బాధ్యత. ఇందుకోసం అమెరికా పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తోంది. ఇటీవల డొనాల్ట్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖర్చులకు కళ్లెం వేస్తున్నారు. ఇందులో భాగంగానే యూఎస్ఎయిడ్ ఉద్యోగులకు సెలవులు ఇచ్చేశారు. ప్రపంచదేశాల్లో ఈ సంస్థ కార్యకలాపాలను పూర్తిగా లేదా పాక్షికంగా రద్దుచేసే దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వేలాది మంది యూఎస్ఎయిడ్ సిబ్బందిని విధుల నుంచి తొలగించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. విదేశాలకు తామెందుకు ఆర్థిక సాయం అందించాలని ట్రంప్ ప్రశి్నస్తున్నారు. అమెరికా ప్రజలు కట్టిన పన్నుల సొమ్మును వారి అభివృద్ధికే ఖర్చు చేస్తామని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, యూఎస్ఎయిడ్ సిబ్బందిని ఇంటికి పంపించడాన్ని అమెరికన్ ఫారిన్ సరీ్వసు అసోసియేషన్ వ్యతిరేకిస్తోంది. ట్రంప్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తామని అంటోంది. -
హైదరాబాద్లో యూఎస్ఏఐడీ ఇండియా డైరెక్టర్
యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (USAID) ఇండియా మిషన్ డైరెక్టర్ 'వీణా రెడ్డి' హైదరాబాద్లోని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ క్వాల్కమ్ ఇండియాకు సంబంధించిన ఓఆర్ఏఎన్ రీసెర్చ్ ల్యాబ్లను సందర్శించారు. ఇక్కడ టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ముందుకు సాగుతుందో గమనించారు.యూఎస్ఏఐడీ 5జీ అండ్ ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్లతో సహా కొత్త వైర్లెస్ టెక్నాలజీలను పరీక్షించడంలో భారతీయ టెలికమ్యూనికేషన్ కంపెనీలకు కొన్ని సంస్థలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది టెలికమ్యూనికేషన్ హార్డ్వేర్ అమెరికన్ సరఫరాదారు అయిన 'క్వాల్కమ్ టెక్నాలజీ'.క్వాల్కమ్ టెక్నాలజీ సహకారంతో.. భారతీయ టెలికామ్ రంగం కొత్త ఆవిష్కరణలకు పునాది వేస్తుంది, తద్వారా అనేక గ్లోబల్ అప్లికేషన్ల పరిష్కారాలు సాధ్యమవుతాయి. ఈ సందర్భంగా వీణా రెడ్డి మాట్లాడుతూ.. జీ20 లీడర్స్ సమ్మిట్ సందర్భంగా చెప్పినట్లుగానే యునైటెడ్ స్టేట్స్, భారతదేశంలో విశ్వసనీయ టెలికమ్యూనికేషన్స్ వృద్ధి చెందుతాయని అన్నారు.డిజిటల్ కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా ఆర్థిక శ్రేయస్సును పెంచడమే ప్రధాన లక్ష్యం. భారతదేశంలో సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన వైర్లెస్ కమ్యూనికేషన్ నెట్వర్క్లకు మెరుగుపరచడానికి మేము ప్రైవేట్ రంగంతో భాగస్వామ్యం కలిగి ఉన్నామని వీణా రెడ్డి పేర్కొన్నారు. -
మహిళల సాధికారికత కోసం రిలయన్స్ ఫౌండేషన్ భారీగా నిదుల కేటాయింపు
ముంబై: 'విమెన్ కనెక్ట్ చాలెంజ్" ఇండియా కింద భారతదేశ వ్యాప్తంగా మొత్తం పది సంస్థలు గ్రాంటీలు(మంజూరుకర్తలు)గా ఎంపిక చేశారు. రిలయన్స్ ఫౌండేషన్, యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ ఎయిడ్(USAID) కలసి విమెన్ కనెక్ట్ చాలెంజ్ ఇండియాను ప్రారంభించాయి. ఈ కార్యక్రమం కింద కేటాయించిన రూ.11 కోట్ల(1. 5 మిలియన్ డాలర్లకు పైబడిన మొత్తం)ను లింగ ఆధారిత డిజిటల్ వివక్షను తొలగించేందుకు ఉపయోగించనున్నారు. ఇందులో రిలయన్స్ ఫౌండేషన్ రూ.8.5 కోట్ల మేరకు($ 1.1 మిలియన్ డాలర్లకు పైగా మొత్తం) సమకూర్చనుంది.(చదవండి: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్!) లింగ ఆధారిత డిజిటల్ వివక్షను తొలగించేందుకు వివిధ వినూత్న పరిష్కారాలను రూపొందించే ప్రాజెక్టుల కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. 17 రాష్ట్రాల్లో 3 లక్షల మందికి పైగా మహిళలు, బాలికలు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఇది సాంకేతికత ద్వారా మహిళల ఆర్థిక సాధికారికతను అధికం చేయనుంది. అనుదీప్ ఫౌండేషన్, టీర్ ఫూట్ కాలేజ్ ఇంటర్నేషనల్, సెంటర్ ఫర్ యూత్ అండ్ అండ్ సోషల్ డెవలప్ మెంట్, ప్రెండ్స్ ఆఫ్ విమెన్స్ వరల్డ్ బ్యాంకింగ్, నాంది ఫౌండేషన్, ప్రొఫెషనల్ అసిస్టెన్స్ ఫర్ డెవలప్ మెంట్ యాక్షన్, సొసైటీ ఫర్ డెవలప్ మెంట్ ఆబ్బర్నేటివ్స్, సాలిడారిడాడ్ రీజనల్ ఎక్స్ పర్టయిజ్ సెంటర్, టీఎన్ఎస్ ఇండియా ఫౌండేషన్, జెడ్ఎంక్యూ డెవలప్ మెంట్ ఈ సంస్థల్లో ఉన్నాయి. మహిళా రైతులు, ఆంత్రప్రె న్యూర్లు, స్వయం సహాయక బృందాల సభ్యుల సమస్యలను, సామాజిక, సాంస్కృతిక అడ్డంకులను అధిగమించేందుకు, లింగ ఆధారిత డిజిటల్ అంతరాన్ని తొలగించేందుకు ఈ పరిష్కారాలు తోడ్పడుతాయి.(చదవండి: ఈ గేమ్స్ ఆడుతున్నారా..! అయితే జర భద్రం..!) ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్, వ్యవస్థాపక చైర్ పర్సన్ శ్రీమతి నీతా ఎం అంబానీ మాట్లాడుతూ.. “ప్రతీ జీవనశైలిలో మహిళలను సంసిద్దులను చేసి, వారికి సాధికారికత కల్పించడం మా లక్ష్యం. మేం జియోను ప్రారంభించినప్పుడు, సమాన అవకాశాలు కల్పించే విప్లవం గురించి మేం కల కన్నాం. జియో ద్వారా మేం మన దేశవ్యాప్తంగా అందుబాటు ధరలకే ఇంటర్నెట్ అందిస్తున్నాం. భారతదేశంలో లింగ ఆధారిత డిజిటల్ వివక్షను తొలగించేందుకు యూఎస్ ఎయిడ్ సంస్థతో కలసి రిలయన్స్ ఫౌండేషన్ పని చేస్తోంది. అసమానతలను పరిష్కరించేందుకు, వాటిని తొలగించేందుకు సాంకేతికత అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. విమెన్ కనెక్ట్ చాలెంజ్ ఇండియా విజేతలుగా నిలిచిన పది సంస్థలకు నా అభినందనలు" అని అన్నారు. -
Veena Reddy: కోవిడ్ సాయం.. ఐదు కోట్ల మందికి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు చేసిన సాయం భారత్లో సుమారు ఐదుకోట్ల మందికి చేరిందని యూఎస్ ఎయిడ్ (యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్) మిషన్ డైరెక్టర్ వీణారెడ్డి తెలిపారు. కరోనా వ్యాప్తి చెందుతున్న తొలినాళ్లలో భారత్కు సాయం అందించిన కొద్దిసంస్థల్లో యూఎస్ ఎయిడ్ కూడా ఒకటి అని చెప్పారు. కరోనా తొలినాళ్ల నుంచి ఇప్పటివరకూ దాదాపు 22 కోట్ల డాలర్ల విలువ (సుమారు రూ.1,600 కోట్లు) చేసే సాయం అందివ్వగలిగామన్నారు. రాయలసీమలో పుట్టి మూడేళ్ల వయసులోనే తల్లిదండ్రులతో అమెరికా వెళ్లిన వీణారెడ్డి న్యాయవాదిగా వృత్తిజీవితాన్ని మొదలుపెట్టి అంచలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం యూఎస్ ఎయిడ్ భారత విభాగానికి మిషన్ డైరెక్టర్ అయ్యారు. ఈ ప్రతిష్టాత్మక పదవి చేపట్టిన తరువాత తొలిసారి భారత్కు విచ్చేసిన సందర్భంగా ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. (చదవండి: Veena Reddy: ఏపీ అభివృద్ధి సంతృప్తినిస్తోంది) ప్ర: యూఎస్ ఎయిడ్ భారత్ మిషన్ డైరెక్టర్గా నియమితులైన మీకు శుభాకాంక్షలు. మీరు పుట్టిన భారత్లో దాని ప్రణాళికలెలా ఉండబోతున్నాయి? జ: యూఎస్ ఎయిడ్ భారత్తో పాటు దాదాపు వంద దేశాల్లో పనిచేస్తోంది. యూఎస్ ఎయిడ్ ఏర్పాటై 60 ఏళ్లు అవుతుంటే.. భారత్కు అమెరికా సాయం అన్నది పదేళ్ల ముందే మొదలైంది. ఆరోగ్యం, కాలుష్య రహిత విద్యుదుత్పత్తి, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుధ్యం, అటవీ పరిరక్షణ వంటి అంశాల్లో యూఎస్ ఎయిడ్ భారత్లో పలు కార్యక్రమాలను చేపట్టింది. సమస్యల పరిష్కారానికి, సుస్థిరాభివృద్ధికి తగిన తోడ్పాటు అందిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సైతం స్వచ్ఛంద సంస్థలు కొన్ని ప్రైవేట్ సంస్థలతో కలిసి స్థానిక అభివృద్ధి విషయంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించే ప్రయత్నం చేస్తున్నాం. ప్ర: తెలంగాణ, ఏపీల్లో ఏ రకమైనప్రాజెక్టులు చేపట్టింది? జ: చాలా ఉన్నాయి. ఉదాహరణకు తెలంగాణ అటవీ శాఖ యూఎస్ ఎయిడ్ అభివృద్ధి చేసిన కొన్ని సాంకేతిక మెళకువలు, మొబైల్ అప్లికేషన్లను అటవీ నిర్వహణ కోసం ఉపయోగిస్తోంది. వీటి వాడకం కారణంగా అటవీ నిర్వహణ ప్రణాళికలు తయారు చేయడం సులువు కావడమే కాకుండా స్థానికుల జీవనోపాధి అవకాశాలూ పెరిగాయి. ‘వన్’ పేరుతో యూఎస్ ఎయిడ్ తయారు చేసిన మొబైల్ అప్లికేషన్ను మొదట మెదక్ అటవీ విభాగంలో ఉపయోగించారు. ఇప్పుడు తెలంగాణలోని దాదాపు 31 అటవీ విభాగాలకు విస్తరించారు కూడా. ఇది మచ్చుకు ఒక్క కార్యక్రమం మాత్రమే. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. గురువారం (సెప్టెంబర్ 23వ తేదీ) వైజాగ్లో ‘‘వాటర్ ఫ్రమ్ ఎయిర్’’ కేంద్రాన్ని సందర్శించనున్నాం. గాల్లోని తేమను నీరుగా మార్చే ఈ కేందాన్ని అవసరమైన చోటికి తరలించ వచ్చు కూడా. ఇలాంటి కొత్త టెక్నాలజీ కారణంగా నగర ప్రాంతాల్లోని పేదలకు స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది. ప్ర: కోవిడ్కు సంబంధించి భారత్కు ఎలాంటి సాయం అందింది? జ: కరోనా మొదలైనప్పటి నుంచి అనేక రకాలుగా సాయం అందించాం. పీపీఈ కిట్లు మొదలుకొని ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వరకూ దాదాపు ఏడు విమానాల్లో తరలించాం. కరోనా రెండో దశను సమర్థంగా ఎదుర్కొనే విషయంలో యూఎస్ ఎయిడ్, అమెరికా ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు తమవంతు సాయం అందించాయి. ఒక అంచనా ప్రకారం కోవిడ్ను ఎదుర్కొనేందుకు యూఎస్ ఎయిడ్ అందించిన వేర్వేరు రకాల సాయం వల్ల ఐదు కోట్ల మంది భారతీయులు లబ్ధి పొందారు. ఇక కోవిడ్ కారణంగా జీవనోపాధులు నష్టపోయిన వారికి, చిరు వ్యాపారులకు, మహిళలకూ సాయం అందించాం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. కోవిడ్ తొలి, రెండో దశల్లో యూఎస్ ఎయిడ్ మంగళగిరి (ఏపీ), బీబీనగర్ (తెలంగాణ)లోని ఎయిమ్స్ ఆసుపత్రులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లను సరఫరా చేసింది. దాంతోపాటు ఆరోగ్య సిబ్బందికి తగిన శిక్షణ కూడా ఇప్పించాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో విజయవాడలో ఏర్పాటు కానున్న సీసీఎంబీ శాటిలైట్ సెంటర్కు యూఎస్ ఎయిడ్ సాంకేతిక పరిజ్ఞాన పరమైన సాయం అందిస్తోంది. ప్ర: ‘వాతావరణ మార్పులు’ అంశంలో ఎలాంటి పాత్ర పోషించనుంది? జ: వాతావరణ మార్పుల ప్రభావం భారత్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు తరచూ చవిచూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల ప్రభావానికి ఎక్కువ గా గురయ్యే వర్గాలకు యూఎస్ ఎయిడ్ సాయం అందించే ప్రయత్నం చేస్తోంది. కాలుష్య రహిత విద్యుదుత్పత్తి రంగానికి ప్రోత్సాహం అందించడం కూడా ఇందులో ఒకటి. భారత ప్రభుత్వంతో కలసి సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టులు మరిన్ని ఏర్పాటయ్యేందుకు ప్రయత్నిస్తున్నాం. తద్వారా కాలుష్య కారకమైన బొగ్గుపై ఆధారపడటం కొంతైనా తగ్గుతుంది. వాతవరణంలోకి చేరిన కార్బన్ డయాక్సైడ్ను శోషించుకునేందుకు అవసరమైన అటవీ సంపద పెరుగుదలకూ సహకరిస్తున్నాం. (చదవండి: అగ్రరాజ్యపు కీలక పదవిలో వీణారెడ్డి) రాయలసీమలో పుట్టి .. యూఎస్లో ఎదిగారు వీణారెడ్డి తల్లి వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వారైతే.. తండ్రి కర్నూలు జిల్లా కోయిలకుంట్లకు చెందిన వారు. చికాగో యూనివర్సిటీలో బీఏ, ఎంఏ విద్యనభ్యసించిన వీణారెడ్డి కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి డాక్టర్ ఆఫ్ జ్యూరిస్ ప్రూడెన్స్ పట్టా పొందారు. న్యాయవాదిగా రాణించిన ఈమె ఆ తరువాతి కాలంలో యూఎస్ ఎయిడ్ ద్వారా పలు దేశాల్లో సేవలందించారు. మూడేళ్ల వయసులోనే అమెరికా వెళ్లినప్పటికీ తల్లి తనను తరచూ భారత్కు తీసుకువచ్చేదని, హైదరాబాద్తో పాటు కోయిలకుంట్లలోనూ బోలెడంత మంది బంధువులు ఉన్నారని వీణారెడ్డి చెప్పారు. తన తాత అంకిరెడ్డి జర్నలిస్టు మాత్రమే కాకుండా.. స్వాతంత్య్ర పోరాటంలో కూడా పాల్గొన్నారని తెలిపారు. -
Veena Reddy: ఏపీ అభివృద్ధి సంతృప్తినిస్తోంది
సాక్షి, హైదరాబాద్: తాను జన్మించిన ఆంధ్రప్రదేశ్ సాధించిన అభివృద్ధి తనకెంతో సంతృప్తినిస్తోందని యూఎస్ ఎయిడ్ మిషన్ (యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్) డైరెక్టర్ వీణారెడ్డి అన్నారు. ఏపీ మరింత అభివృద్ధి సాధించేందుకు తన వంతు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్లోని అరణ్యభవన్లో జరిగిన ఫారెస్ట్ ప్లస్ 2.0 సమీక్షా సమావేశంలో వీణారెడ్డి పాల్గొన్నారు. చదవండి: ‘క్రిస్ సిటీ’ తొలి దశకు టెండర్లు కాగా, మంగళవారం విశాఖలో ‘అమెరికన్ కార్నర్’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరవుతారు. ఇందులో అమెరికా కాన్సుల్ జనరల్ జోయెల్ రీఫ్మ్యాన్, తదితరులు పాల్గొంటారు. గాల్లోని తేమను నీరుగా మార్చే యంత్రం ‘వాటర్ ఫ్రమ్ ఎయిర్’ కియోస్క్ను సందర్శిస్తారు. -
వీణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ(యూఎస్ఏఐడీ) మిషన్ డైరెక్టర్గా భారత సంతతి మహిళ వీణా రెడ్డి గురువారం బాధత్యలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వీణా రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. అమెరికాలో భారత సంతతికి చెందిన మొదటి దౌత్యవేత్తగా ఈ ఘనత సాధించినందుకు గర్వపడుతున్నాను అన్నారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు. Congratulations Veena Reddy for being the first diplomat of Indian origin to head @usaid_india. Proud of your achievement. @USCGHyderabad @USAmbIndia @USAndIndia — YS Jagan Mohan Reddy (@ysjagan) August 5, 2021 యూఎస్ఏఐడీ(USAID) మిషన్ డైరెక్టర్గా ఎంపికైన వీణా రెడ్డి భారత్తో పాటు భూటాన్లో సేవలు అందించనున్నారు. వీణా రెడ్డి ఇంతకాలం ఇదే ఏజెన్సీలో ఫారిన్ సర్వీస్ ఆఫీసర్గా పని చేశారు. కంబోడియా మిషన్ డైరెక్టర్గా 2017 ఆగష్టు నుంచి ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. హైతి భూకంప సమయంలో రక్షణ-అభివృద్ధి చర్యల పర్యవేక్షకురాలిగా ఆమె మెరుగైన ప్రదర్శన కనపరిచారు. ఈ పదవుల కంటే ముందు వీణా రెడ్డి వాషింగ్టన్లో అసిస్టెంట్ జనరల్ కౌన్సెల్గా ఆసియా దేశాల సమస్యలపై ప్రభుత్వ న్యాయసలహాదారుగా పని చేశారు. చికాగో నుంచి బీఏ, ఎంఏ, లా కోర్సులు పాసైన వీణారెడ్డి.. కొలంబియా యూనివర్సిటీ నుంచి ‘జురిస్ డాక్టరేట్’(జేడీ) అందుకుంది. న్యూయార్క్, కాలిఫోర్నియా బార్ అసోషియేషన్లో వీణకు సభ్యత్వం ఉంది. -
అగ్రరాజ్యపు కీలక పదవిలో వీణారెడ్డి
అగ్రరాజ్యంలో భారత సంతతికి చెందిన మరో వ్యక్తికి కీలక పదవి దక్కింది. ‘అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ’ మిషన్ డైరెక్టర్గా వీణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని సంస్థ ట్విటర్ పేజీ ద్వారా అధికారికంగా ప్రకటించింది. కాగా, యూఎస్ఏఐడీ(USAID) మిషన్ డైరెక్టర్గా ఎంపికైన తొలి ఇండియన్-అమెరికన్ వ్యక్తి వీణా రెడ్డి కావడం విశేషం. ఈ నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సందూ, వీణకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉంటే ఇంతకాలం ఆమె ఇదే ఏజెన్సీలో ఫారిన్ సర్వీస్ ఆఫీసర్గా పని చేశారు. కంబోడియా మిషన్ డైరెక్టర్గా 2017 ఆగష్టు నుంచి ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. హైతి భూకంప సమయంలో రక్షణ-అభివృద్ధి చర్యల పర్యవేక్షకురాలిగా ఆమె తన సత్తా చాటారు. Best wishes, Veena @usaid_india . #India - @USAID partnership has the potential to make a difference to the lives of people not only in 🇮🇳 & 🇺🇸, but across the 🌏! https://t.co/t3KAIeblLo — Taranjit Singh Sandhu (@SandhuTaranjitS) July 26, 2021 ఈ పదవుల కంటే ముందు వాషింగ్టన్లో అసిస్టెంట్ జనరల్ కౌన్సెల్గా ఆసియా దేశాల సమస్యలపై ప్రభుత్వ న్యాయసలహాదారుగా ఆమె పని చేశారు. ఇక ప్రభుత్వ సర్వీసుల కంటే ముందు న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, లండన్లో కార్పొరేట్ కంపెనీలకు అటార్నీగా వ్యవహరించిన అనుభవం ఆమెకు ఉంది. చికాగో నుంచి బీఏ, ఎంఏ, లా కోర్సులు పాసైన వీణారెడ్డి.. కొలంబియా యూనివర్సిటీ నుంచి ‘జురిస్ డాక్టరేట్’(జేడీ) అందుకుంది. న్యూయార్క్, కాలిఫోర్నియా బార్ అసోషియేషన్లో వీణకు సభ్యత్వం ఉంది. -
సోలార్ పార్కుల అభివృద్ధికి భారత్ కు రూ.5,681 కోట్లు
యూఎస్ఏఐడీ, ఏడీబీ మధ్య ఒప్పందం న్యూఢిల్లీ: భారత్లో సోలార్ పార్కుల ఏర్పాటుకు గానూ యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఏఐడీ), ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఇవి రెండు క్లీన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులో భాగంగా భారత్లో సోలార్ పార్కుల అభివృద్ధి చేయనున్నాయి. ఇందుకోసం భారత్కు రూ.5,681 కోట్లు అందించనున్నాయి.