Ved Pratap Vaidik
-
'పీకే'కు వినోద పన్ను మినహాయింపు
ఆగ్రా: ఆమిర్ఖాన్ 'పీకే' సినిమాకు ఉత్తరప్రదేశ్ పభుత్వం వినోదపన్ను మినహాయింపు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించారని విశ్వహిందూ పరిషత్, హిందూ జాగరణ మంచ్, భజరంగ్ దళ్ ధ్వజమెత్తాయి. వినోద పన్ను మినహాయింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. సమాజ్వాదీ పార్టీ నాయకులు, సామాజిక కార్యకర్తలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే 'పీకే' సినిమాలో ఎటువంటి తప్పులు లేవని, మతాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిని గురించి ఇందులో చూపించారని బాబా రాందేవ్ అనుచరుడు వేద్ ప్రతాప్ వైదిక్ వ్యాఖ్యానించారు. -
దౌత్య వైదీకం
కాలం కలిసిరావడంవల్ల కావొచ్చు... ఒక్కోసారి కొన్ని ఉదంతాలు వాటికవే ప్రాముఖ్యతను సంతరించుకుని పతాకశీర్షికలవుతాయి. ఎడతెగని వివాదానికి కేంద్రబిందువుగా మారతాయి. ఎన్నెన్నో మలు పులు తిరుగుతాయి. ఇప్పుడు వేద్ ప్రతాప్ వైదిక్ అనే ఒక సీనియర్ పాత్రికేయుడు, కాలమిస్టు, బాబా రాందేవ్ శిష్యపరమాణువు పాకి స్థాన్లోని లాహోర్లో తలదాచుకుంటున్న ఉగ్రవాది హఫీజ్ సయీద్ ను కలవడం సరిగ్గా ఆ బాపతు ఉదంతమే. ఆయన అక్కడికి వెళ్ల డమూ, ఆ తర్వాత హఫీజ్తో తాను తీవ్రమైన చర్చల్లో మునిగివుం డగా తీసిన ఫొటోను ట్వీట్ చేయడమూ ఒక్కసారిగా కలకలం సృష్టిం చింది. సాధారణంగా దేశభక్తి విషయంలో అసలు రాజీపడే అలవాటే లేని సైబర్ ప్రపంచ పౌరులు దీనిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ముంబై మారణహోమానికి కారకుడైన ఉగ్రవాదిని కలవడమేమిటని నిల దీశారు. వెంటనే వైదిక్ కు సంకెళ్లువేసి దేశద్రోహ నేరంకింద కేసుపెట్టా లన్నారు. దీన్నంతటినీ తప్పుబట్టాల్సిన అవసరంలేదు. వారి భావో ద్వేగాలు అందరికీ తెలిసివున్నవే. కానీ, చిత్రమేమంటే... మన పార్ల మెంటు సైతం ఈ సంగతిని తీవ్రంగా చర్చించింది. రాజ్యసభ అయితే రెండురోజులు వాయిదాలతో గడిచింది. సభ వెలుపల సైతం దీనిపై కావలసినంత రచ్చ నడిచింది. చానెళ్లన్నీ హఫీజ్-వైదిక్ భేటీపై వివిధ పార్టీల నేతలతోనూ, పాత్రికేయ ప్రముఖలతోనూ వేడి, వాడి చర్చలు నిర్వహించాయి. ఈ చర్చలు దారితప్పి ఒకరి నొకరు దూషించుకునే స్థాయికి చేరాయి. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో వైదిక్ ఎవరివాడో, ఎలాంటివాడో తెలియక సామా న్యులు గందరగోళపడ్డారు. దేశద్రోహి అందామనుకుంటే ఆరెస్సెస్ వంటి సంస్థ ఆయనను మించిన దేశభక్తుడు లేరన్నది. అదే సమ యంలో ఆయన కాంగ్రెస్వారికే దగ్గరని చెప్పింది. బీజేపీ సైతం ఇంచుమించు అలాగే మాట్లాడింది. కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ వైదిక్ను ఆరెస్సెస్ వ్యక్తిగా తేల్చారు. ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న ఏకే దోవల్... గతంలో నేతృత్వంవహించిన వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్తో వైదిక్కు సంబంధాలున్నాయని మరో కాంగ్రెస్ నేత చెప్పారు. వైదిక్కు నేరుగా మోడీతో సంబంధాలున్నాయని, ఆయన సలహామేరకే వైదిక్ హఫీజ్ను కలుసుకున్నారని చెప్పడం ఇందులోని అంతరార్ధం. వైదిక్ ఎవరివాడో చెప్పడం నిజానికి కష్టమే. రాజకీయాల్లో అమర్సింగ్లా ఆయనకు అన్ని రాజకీయ పార్టీల్లోనూ మిత్రులున్నారు. పాత్రికేయ వృత్తిలో ఉండటంవల్ల ఇందిరాగాంధీ మొదలు కొని పీవీ, వాజపేయి, అద్వానీ వంటి పెద్దలు సహా వివిధ రాజకీయ పక్షాల నేతలతో ఆయనకు సంబంధ బాంధవ్యాలున్నాయి. అసలు వైదిక్ పాకిస్థాన్కు ఒంటరిగా ఏమీ వెళ్లలేదు. కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ నేతృత్వంలో పాకిస్థాన్కు వెళ్లిన సౌహార్ద్ర ప్రతినిధి బృందంలో ఆయన కూడా ఒక సభ్యుడు. ఆ బృందంలో కొందరు సభ్యులు ముందుగా తిరిగివస్తే మరికొందరు మరికొన్ని రోజులు అక్కడున్నారు. వైదిక్ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్తో కూడా చర్చలు జరిపారు. దేశాలమధ్య సంబంధాలు పైకి కనిపించే విధంగానే ఉంటాయనుకోనక్కరలేదు. సమస్యలున్న దేశాలతో ఆ సంబంధాలకు సమాంతరంగా ట్రాక్-2 దౌత్యంగా పిలిచే రహస్య దౌత్యం కూడా నడుస్తుంటుంది. ఇప్పుడు వైదిక్ను అలాంటి దౌత్యా నికి కేంద్రమే పంపిందని అనుమానాలు వ్యక్తంచేస్తున్న కాంగ్రెస్కు ఆయన ఎలాంటివారో తెలియనిదేమీ కాదు. హఫీజ్ సయీద్ను కలిసిన వెంటనే ఆ ఫొటోను ట్వీట్ చేసిన వైదిక్లాంటి వ్యక్తికి ట్రాక్-2 దౌత్యకళ తెలుసుననుకోవడానికి లేదు. ఎంతో గుట్టుగా ఉండగలిగే వ్యక్తులు, ప్రచారం ఆశించనివారు మాత్రమే అలాంటి వ్యవహారాలను చక్కబెట్టగలుగుతారు. తదనంతరకాలంలో ఆ దౌత్యం నెరపినవారు గ్రంథస్థం చేస్తే తప్ప ఆ సంగతి బయటపడే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైదిక్ను సీరియస్గా పట్టిం చుకుని పార్లమెంటులోనూ, బయటా ఇంత హడావుడి చేయాల్సిన అవసరం కాంగ్రెస్కు ఎందుకు కలిగిందో ఊహించలేనిదేమీ కాదు. అధికారంలోకొచ్చి ఇంకా వందరోజులైనాకాని నరేంద్ర మోడీ ప్రభు త్వాన్ని ఇరుకునపెట్టడం ఇప్పుడిప్పుడే సాధ్యంకాదు. అందువల్లే వైదిక్ వ్యవహారాన్ని అందివచ్చిన అవకాశంగా ఆ పార్టీ భావించి వుంటుంది. ఏమాత్రం చేజారనీయొద్దని లెక్కలేసుకుని ఉంటుంది. కానీ ఈ లెక్కల్లో విలువైన పార్లమెంటు కాలం వృథా అయింది. భారత-పాకిస్థాన్ సంబంధాలు క్లిష్టమైనవి. ముంబై దాడులకు ఫలానావారు బాధ్యులని చెబితే అందుకు సాక్ష్యాధారాలు చూపమని ఆ దేశం అడుగుతున్నది. ఆ దాడుల సందర్భంగా సజీవంగా పట్టుబ డిన కసబ్నే తమవాడు కాదు పొమ్మన్నది. అమెరికా మెరుపుదాడి చేసి బిన్ లాడెన్ను మట్టుబెట్టినట్టుగా హఫీజ్ సయీద్ దరిదాపులకు కూడా మన దేశం వెళ్లే అవకాశం లేదు. సాక్షాత్తూ అమెరికాయే అతని తలకు వెల ప్రకటించినా, అతని ఆధ్వర్యంలో నడుస్తున్న జమా- ఉద్-దవా ఆస్తులను స్తంభింపజేసినా దిక్కూ మొక్కూలేదు. అయిదేళ్ల క్రితం అతన్ని పట్టుకున్నట్టే పట్టుకుని చాలా బలహీనమైన కేసులు పెట్టి పాక్ ప్రభుత్వం వదిలిపెట్టింది. అక్కడి సైన్యంతోనూ, ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐతోనూ హఫీజ్కున్న చుట్టరికం అలాంటిది. కనుక మన దేశం పాక్పై అన్ని స్థాయిల్లోనూ ఒత్తిళ్లు తీసుకురావడం, అతని అప్పగింత కోసం విడవకుండా డిమాండ్ చేయడం తప్ప మార్గంలేదు. ఈలోగా వైదిక్లాంటివారు రేపిన కలకలానికి లొంగి అనవసర చర్చలకు, ఉద్వేగాలకు సిద్ధపడటం మనల్ని మనం చులకన చేసుకోవడమే. -
'వైదిక్ దేశంలో ఉండటానికి అనర్హుడు'
న్యూఢిల్లీ: ముంబై బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు హఫీజ్ సయీద్ ను వేద్ ప్రతాప్ వైదిక్ కలవడంపై శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. హఫీజ్ ను కలిసిన వైదిక్ భారత్లో ఉండటానికి అనర్హుడు అని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే వ్యాఖ్యలు చేశారు. దేశద్రోహులను కలిసిన వారిపై మోడీ ప్రభుత్వం సానుకూలత చూపవద్దని ఉద్దవ్ విజ్క్షప్తి చేశారు. దేశద్రోహులతో సంబంధాలు ఉన్నవారు ఎవరైనా ఈ దేశంలో ఉండటానికి అనర్హులని ఉద్ధవ్ థాక్రే తీవ్రంగా స్పందించారు. హఫీజ్ ను వైదిక్ కలవడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అయితే లష్కరే తోయిబా చీఫ్, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ను జర్నలిస్టుగా మాత్రమే కలిశానని వేద్ ప్రతాప్ వైదిక్ స్పష్టం చేశారు. -
వైదిక్ది రాజద్రోహమే.. చర్య తీసుకోండి: శివసేన
వేద్ ప్రతాప్ వైదిక్ వ్యవహారం కేంద్రంలోని బీజేపీ సర్కారుకు రోజురోజుకూ ఇబ్బందికరంగా మారుతోంది. ముంబై ఉగ్రదాడికి సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ను వైదిక్ కలవడం రాజద్రోహమేనని బీజేపీ మిత్రపక్షం శివసేన మండిపడింది. తమ అధికారిక పత్రిక సామ్నాలో వైదిక్ దేశభక్తుడు కారని, ఉగ్రవాదిని ఆయన కలవడం రాజద్రోహమని శివసేన వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తమకేమీ సంబంధం లేనట్లు వ్యవహరించడాన్ని కూడా విమర్శించింది. అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి, ఎవరైనా పాత్రికేయుడు హఫీజ్ సయీద్ను గానీ, దావూద్ ఇబ్రహీంను గానీ కలిసుంటే బీజేపీ తప్పనిసరిగా ప్రభుత్వాన్ని విమర్శించి ఉండేదని సామ్నా సంపాదకీయంలో రాశారు. కానీ వాళ్లిప్పుడు అధికారంలో ఉన్నారని, అందుకే తమకు సంబంధం లేదని అంటున్నారని చెప్పారు. ఈ విషయం జాతీయ భద్రతకు సంబంధించినది కాబట్టి ఇందులో హిందూ ముస్లిం వివక్ష ఏమీ ఉండకూడదని, ఆ జర్నలిస్టును అలాగే వదిలేస్తే రేపు వెళ్లి దావూద్ ఇబ్రహీంతోను, టైగర్ మెమన్తోను, సయీద్తోను వెళ్లి బిర్యానీ తిని వస్తారని సామ్నాలో వ్యాఖ్యానించారు. -
ఉభయసభల్లోను 'వైదిక్' రచ్చ
యోగా గురువు రాందేవ్ బాబా అనుచరుడు వేద్ ప్రతాప్ వైదిక్ వెళ్లి జమాత్ ఉద్ దవా అధినేత హఫీజ్ సయీద్ను కలిసిన విషయం పార్లమెంటు ఉభయ సభలను మంగళవారం కుదిపేసింది. దీంతో రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది. సభ సమావేశం కాగానే కాంగ్రెస్, వామపక్షాలు, జేడీ(యూ), తృణమూల్ తదితర విపక్షాలకు చెందిన సభ్యులు ఈ అంశంపై ఒక్కసారిగా గందరగోళం సృష్టించారు. దీనిపై ప్రభుత్వం నుంచి వివరణ కావాలని డిమాండ్ చేశారు. ముందు ప్రశ్నోత్తరాల సమయం కానివ్వాలని ఛైర్మన్ హమీద్ అన్సారీ పదే పదే కోరినా ఎవరూ వినిపించుకోకపోవడంతో తొలుత పావుగంట, తర్వాత మధ్యాహ్నం వరకు సభ వాయిదా పడింది. మరోవైపు లోక్సభలో కూడా ఇదే సీన్ కనిపించింది. విపక్షాల సభ్యులు ఇక్కడ కూడా ప్రభుత్వం నుంచి వివరణ కావాలంటూ గందరగోళం సృష్టించారు. దీంతో ప్రశ్నోత్తరాల సమయం అస్సలు జరగలేదు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేయక తప్పలేదు. మళ్లీ రెండోసారి సమావేశమైనప్పుడు గాజా మీద ఇజ్రాయెల్ దాడుల అంశంపై గందరగోళం చెలరేగడంతో సభ మళ్లీ వాయిదా పడింది. -
'జర్నలిస్టుగా మాత్రమే కలిశా'
న్యూఢిల్లీ : లష్కరే తోయిబా చీఫ్, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ను జర్నలిస్టుగా మాత్రమే కలిశానని వేద్ ప్రతాప్ వైదిక్ స్పష్టం చేశారు. తన భేటీ వెనుక ప్రభుత్వ ప్రమేయం లేదని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. పాకిస్తాన్లో హాఫీజ్ సయీద్తో జర్నలిస్ట్, రాందేవ్ బాబా అనుచరుడు వేదప్రతాప్ వైదిక్ కలవటంపై రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు తప్పుబట్టిన విషయం తెలిసిందే. దీనిపై వేద్ ప్రతాప్ వైదిక్ పై విధంగా స్పందించారు. కాగా ఈ భేటీపై ప్రతిపక్షాలు సోమవారం రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీసాయి. వారి భేటీతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేసినా విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. విదేశీ వ్యవహారాల శాక మంత్రితో ప్రకటన చేయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
రాజ్యసభలో హఫీజ్-వేద్ ప్రతాప్ భేటీపై రగడ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సభ్యుల నిరసనలు, నినాదాలతో రాజ్యసభ సోమవారం రెండుసార్లు వెంటవెంటనే వాయిదా పడింది. పోలవరం ఆర్డినెన్స్తో పాటు లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్తో వేద్ ప్రతాప్ వైదిక్ భేటీ కావడంపై కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. వేద్ ప్రతాప్ వైదిక్ యోగా గురువు రాందేవ్ బాబాకు సన్నిహితుడు. నరేంద్ర మోడీ అనుమతితోనే హఫీజ్తో వేద్ ప్రతాప్ వైదిక్ భేటీ అయ్యారా అని కాంగ్రెస్ సభ్యులు సభలో ప్రశ్నించారు. ముంబయి పేలుళ్ల నిందితుడితో కలవటమేంటని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై మంత్రి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొనటంతో చైర్మన్ హమీద్ అన్సారీ సమావేశాలను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. -
రాజ్యసభలో హఫీజ్-వేద్ ప్రతాప్ భేటీపై రగడ