veerapunayunipalle
-
సాగునీటి కోసం రైతులు పోరాటం..
-
రవీంద్రనాథ్రెడ్డికి పడిపోయిన బీపీ, షుగర్
-
రవీంద్రనాథ్రెడ్డికి పడిపోయిన బీపీ, షుగర్
కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నాలుగోరోజు కూడా కొనసాగుతోంది. తాగు, సాగు నీటి సమస్యలు తీర్చాలని కోరుతూ ఆయన వీరపునాయునిపల్లెలో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. బుధవారం నాడు వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రవీంద్రనాథ్ రెడ్డికి బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయాయని వైద్య బృందం తెలిపింది. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించి ఫ్లూయిడ్స్ ఎక్కించాలని వారు సూచించారు. -
మూడో రోజుకు రవీంద్రనాథ్రెడ్డి దీక్ష
కడప: కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి చేపట్టిన నిరవధిక నిరహారదీక్ష మూడో రోజుకు చేరుకుంది. గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్) ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరు అందించాలన్న డిమాండ్తో వీరపునాయునిపల్లెలో ఆదివారం ఆయన నిరవధిక నిరహారదీక్ష చేపట్టారు. రవీంద్రనాథ్రెడ్డి నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు నేడు పలువురు నాయకులు రానున్నారు. -
రెండో రోజుకు రవీంద్రనాథ్రెడ్డి దీక్ష
కడప: కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి చేపట్టిన నిరవధిక నిరహారదీక్ష రెండో రోజుకు చేరుకుంది. గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్) ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరు అందించాలన్న డిమాండ్తో వీరపునాయునిపల్లెలో ఆదివారం ఆయన నిరవధిక నిరహారదీక్ష చేపట్టారు. రవీంద్రనాథ్రెడ్డి నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు నేడు పలువురు నాయకులు రానున్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు ఎం.వి మైసూరారెడ్డి, సీపీఐ నేత నారాయణ, కార్మిక నాయకుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి తదితరులు హాజరవుతారని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రఘునాథరెడ్డి తెలిపారు. -
నిరాహారదీక్ష చేపట్టిన రవీంద్రనాథ్రెడ్డి
కడప: తాగు, సాగు నీటి సమస్యలు తీర్చాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నేత, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి వీరపునాయునిపల్లెలో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. తమ నియోజకవర్గ ప్రజలు తాగు, సాగు నీటికి పడుతున్న ఇబ్బందులు చూసి ఆయన దీక్షకు దిగారు. ప్రభుత్వం దిగివచ్చి సమస్య పరిష్కరించేవరకు దీక్ష కొనసాగిస్తానని ఆయన చెప్పారు. రవీంద్రనాథ్రెడ్డి దీక్షకు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, రఘురామి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, కడప మేయర్ సురేశ్ బాబు సంఘీభావం తెలిపారు.