vijayawada meeting
-
''లీవ్ టీడీపీ, ఓన్లీ బీజేపీ''
-
టీడీపీని వదిలేద్దాం... బీజేపీని రక్షించుకుందాం
- అమిత్ షా ముందు నినదించిన పార్టీ బూత్ స్థాయి నేతలు - తమకు బీజేపీ ముఖ్యమంత్రి కావాలంటూ ప్లకార్డుల ప్రదర్శన సాక్షి, అమరావతి: టీడీపీని వదిలించుకుందాం... బీజేపీని రక్షించుకుందాం, మాకు బీజేపీ ముఖ్యమంత్రి కావాలి.. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నాయకత్వంలో పార్టీ బూత్ కమిటీ నేతల మహా సమ్మేళనంలో వినిపించిన నినాదాలు, కనిపించిన ప్లకార్డులివీ.. విజయవాడలో గురువారం కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికేì కొందరు నేతలు టీడీపీతో పొత్తుపై నిరసన వ్యక్తం చేశారు. లీవ్ టీడీపీ(తెలుగుదేశం పార్టీని వదిలించుకుందాం).. సేవ్ బీజేపీ(భారతీయ జనతా పార్టీని రక్షించుకుందాం)... వుయ్ వాంట్ బీజేపీ సీఎం(మాకు బీజేపీ ముఖ్యమంత్రి కావాలి) అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. కొందరు నినాదాలు చేశారు. సాయంత్రం 5.20 గంటల ప్రాంతంలో వేదికపైకి అమిత్ షా చేరుకున్నాక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ప్రసంగించారు. అనంతరం రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రసంగం మొదలు కాగానే సభా వేదిక ముందు ఉన్న బూత్స్థాయి నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో సభలో ఒక్కసారి కలకలం రేగడంతో సురేశ్ ప్రభు తన ప్రసంగాన్ని కుదించుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తున్న నేతలను భద్రతా సిబ్బంది బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. అమిత్ షా తన పక్కనే ఉన్న నేతలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తూ నేతలు ప్లకార్డులు ప్రదర్శించే సమయంలోనే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రసంగం ప్రారంభించారు. ప్లకార్డులు ప్రదర్శించే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూర్చోవాలని చెప్పారు. దీంతో పెద్ద సంఖ్యలో నేతలు లేచి నిలబడి చేతులు అడ్డంగా ఊపుతూ కేకలు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు. -
ఏపీకి మా సాయం1.75 లక్షల కోట్లు
దక్షిణాదిలో బీజేపీ పాగాకు ఏపీ ప్రవేశద్వారం కావాలి: అమిత్ షా - రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది - విజయవాడలో బీజేపీ బూత్ కమిటీ కార్యకర్తల మహా సమ్మేళనం సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పునరుద్ఘా టించారు. రాష్ట్రానికి ఇప్పటికే రూ.1.75 లక్షల కోట్ల ఆర్థిక సాయం అంద జేసినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తోందన్నారు. అలాగే రాష్ట్రానికి ఎన్నో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఇచ్చిందన్నా రు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై చాలామంది బీజేపీని వేలెత్తి చూపు తున్నారని, విభజన చట్టంలో హోదా అన్న అంశమే లేదన్నారు. అయినా హోదా వల్ల కలిగే ప్రయోజనాల కంటే ఒక్క రూపాయి కూడా తగ్గకుండా కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆర్థిక సహాయం చేస్తోందని వివరించా రు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్ షా గురు వారం విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో బీజేపీ బూత్స్థాయి కమిటీ కార్యక ర్తల మహా సమ్మేళనంలో ప్రసంగించారు. ఈ సమ్మేళనం పార్టీ విజయానికి నాంది కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన మూడేళ్లలో 106 పథకాలను ప్రవేశపెట్టారని అమిత్ షా వివరించారు. ఏపీకి భారీ మొత్తం లో ఆర్థికం సాయం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. జూలైలో మోదీ ఈ గడ్డపై కాలు పెట్టగానే రాష్ట్రమంతటా పార్టీ శ్రేణులు సంబరాలు జరపాలన్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ నేత మంత్రిత్వ శాఖకు జాతీయ స్థాయిలో రెండు అవార్డులు దక్కడం పార్టీ పనితీరుకు నిదర్శన మన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రవేశద్వా రంగా నిల వాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. లక్ష్యాన్ని సాధించేందుకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణు లకు పిలుపునిచ్చారు. విజయవాడ అంటే విజ యాన్ని అందించే ప్రాంతమని, ఇక్కడ జరుగు తున్న బూత్స్థాయి కమిటీ కార్యకర్తల సమ్మేళ నం రాష్ట్రంలో బీజేపీ విజయానికి నాంది కావా లన్నారు. విజయవాడ ప్రాంతంలోనే అర్జును డికి శివుడు పాశుçపతాస్త్రం అందించా డన్న నానుడి ఉందని, ఇప్పుడు జరుగుతున్న సమావేశం బీజేపీ గెలుపునకు పాశుపతాస్త్రం కావాలని చెప్పారు. ప్రతి బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణం దేశవ్యాప్తంగా బీజేపీ బలోపేతమయ్యే ప్రక్రియ కొనసాగుతుందని అమిత్ షా అన్నారు. ఏపీలో 25 వేల బూత్స్థాయి కమిటీల నిర్మాణం ఇప్ప టికే పూర్తయిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతి బూత్ కమిటీలోనూ పార్టీ నిర్మాణం పూర్తి చేసే వరకూ తాను రాష్ట నేతల వెంటపడుతూ నే ఉంటానన్నారు. ఆగస్టులో మరో విడత రాష్ట్ర పర్యటనకు వస్తానని, అప్పటిలోగా రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్ల్లో పార్టీ నిర్మాణం పూర్తి కావాలని నేతలకు నిర్దేశించారు. ఆగస్టులో వీటన్నింటినీ క్షుణ్నంగా సమీక్షిస్తాన న్నారు. భవిష్యత్తు మనదే: వెంకయ్య నాయుడు ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని, ఈలోగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికీ బీజేపీని తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. ప్రధాని మోదీ తన పాలనతో ఇప్పటికే దేశంలోని ప్రతి ఇంటికీ, ప్రతి గుండెకూ చేరారని చెప్పారు. రాష్ట్రంలోనూ పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలు బీజేపీలో చేరేలా కృషి చేయాలని కోరారు. భవిష్యత్తు మనదేనని, బీజేపీని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. బీజేపీ సిద్ధాంతాలే దేశానికి శ్రీరామ రక్ష అని, పార్టీ విస్తరణకు తలెత్తుకొని పూనుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తల మహాసమ్మేళంలో రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు ప్రసంగించారు. అమిత్ షా ప్రసంగాన్ని పురందేశ్వరి తెలుగులోకి అనువదించారు. -
''లీవ్ టీడీపీ, ఓన్లీ బీజేపీ''
-
అమిత్ షా సభలో గందరగోళం
-
తెలంగాణ తమ్ముళ్లకు చంద్రబాబు క్లాస్ !
-
తెలంగాణ తమ్ముళ్లకు చంద్రబాబు క్లాస్ !
సమన్వయంతో కలసి పనిచేయండి పరస్పరం గౌరవించుకోకుంటే కేడర్ ఎలా గౌరవిస్తుంది విజయవాడ భేటీలో టీటీడీపీ నేతలతో బాబు సాక్షి, హైదరాబాద్: స్థాయిని మరిచి ఒకరిపై ఒకరు తిట్లదండకం అందుకుంటున్న తెలంగాణ తెలుగుదేశం నాయకులను పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మందలించారని తెలిసింది. మంగళవారం విజయవాడలో చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి, పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి భేటీ అయ్యారు. విశ్వసనీయవర్గాలు చెబుతున్న వివరాల మేరకు... ‘రాష్ట్రస్థాయి నాయకుల మధ్య ‘ కమ్యూనికేషన్ గ్యాప్ ’ ఉంటే ఎలా..? అంతా కలసి ఉం డండి. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నామన్న సం గతి మరిచిపోవద్దు. నాయకులు పరస్పరం గౌరవించుకోవాలి. మిమ్ముల్ని మీరు గౌరవించుకోకుంటే పార్టీ కేడర్ ఎలా మిమ్ముల్ని గౌరవిస్తుంది..’ అని రమణ, ఎర్రబెల్లి, రేవంత్కు చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి జరగాల్సిన కృషిపైనా వీరికి హితబోధ చేశారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టీడీపీకి టికెట్ ఇవ్వమని మిత్రపక్షమైన బీజేపీని అడుగుతానని, అయితే ఏ పార్టీ పోటీచేసినా విజయం కోసం శ్రమించాలని టీటీడీపీ నాయకులకు బాబు సూచించారు. మరోవైపు రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి టీఆర్ఎస్లోకి వెళుతున్న అం శాన్నీ చంద్రబాబు ఆరా తీశారు. వచ్చే నెల 7న తెలంగాణ రాష్ట్ర కమిటీ జనరల్ బాడీ సమావేశం హైదరాబాద్లో నిర్వహించనున్నట్టు తెలిసింది. బాబుతో రేవంత్ భేటీ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి మంగళవారం ఉదయం ఏపీ సీఎం, పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలోని సీఎం విశ్రాంతి గృహంలో చంద్రబాబును కలిసిన ఆయన 15 నిమిషాలపాటు సమావేశమయ్యారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ నాయకుల మధ్య గొడవ నేపథ్యంలో రేవంత్ పార్టీ అధినేతతో ఒంటరిగా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలాఉండగా, సోమవారమే విజయవాడ వెళ్లిన ఆయన చంద్రబాబును కలిసేందుకు అపాయింట్మెంట్ కోరితే నిరాకరించినట్టు సమాచారం.