Vizag Beach
-
వైజాగ్కి వైన్ కోసం వస్తారు..
సాక్షి, విశాఖపట్నం: పర్యాటకులు వైజాగ్కు వైన్ తాగడానికి రాకపోతే.. కాఫీ తాగడానికి వస్తారా అంటూ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. వైజాగ్ బీచ్కు వచ్చేది టీ, కాఫీలు తాగడానికి కాదని, ఎంజాయ్ చెయ్యడానికని చెప్పారు. సోమవారం ఇక్కడ జరిగిన టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ.. జర్మనీ తరహాలో బీచ్లో చిన్న హట్స్ ఏర్పాటు చేసి టిఫిన్స్, బీరు, డ్రింక్ ఇచ్చేలా ఏర్పాట్లు చెయ్యాలన్నారు. మద్యం విరివిగా లభించేలా పాలసీలు తీసుకొస్తేనే డెవలప్మెంట్ ఉంటుందని అన్నారు. గోవా, బెంగళూరుతో పోలిస్తే వైజాగ్ని ఎందుకు అభివృద్ధి చెయ్యలేకపోతున్నామో ఆలోచించాలన్నారు. టూరిస్ట్కి ఎంటర్టైన్మెంట్ కావాలని, ఆ ఎంజాయ్మెంట్ ఇక్కడ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ఇద్దరు కూర్చుంటే పోలీసులు కేసులు పెట్టేస్తారని అన్నారు. నిబంధనల పేరుతో నియంత్రణ పెడితే పర్యాటకులు రారని చెప్పారు. రూల్స్ అవసరమే కానీ, వెసులుబాట్లు ఉండాలని, ముఖ్యంగా టూరిజానికి మినహాయింపులు ఇవ్వాలని అన్నారు. ప్రకృతి వనరులు ఉన్నా పర్యాటకాభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడంలేదని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి లంబసింగికి పర్యాటకులు వస్తున్నా కనీస వసతులు లేవని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో పెట్టుబడులకు స్థానికులు ఉండాలనే నిబంధనకు పరిష్కారం చూడాలన్నారు. గిరిజనులు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టగలరా అని అన్నారు. ట్రైబల్ యాక్ట్లో మార్పులు చెయ్యాలని చెప్పారు. ఎవరైనా పెట్టుబడికి పర్మిషన్ కోసం వస్తే యస్ ఆర్ నో అని చెప్పడానికి అధికారులు 6 నెలలు, సంవత్సరం ఎందుకు తిప్పుతున్నారని ప్రశి్నంచారు. అనంతరం డిప్యూటీ సీఎం వివాదంపై మీడియా ప్రతినిధుల ప్రశ్నకు అయ్యన్న స్పందిస్తూ.. ఒకరిని డిప్యూటీ సీఎంని చేయాలని అడగడానికి రాజకీయ నాయకులు ఎవరని ప్రశి్నంచారు. అది ప్రజలు నిర్ణయించాలని అన్నారు. -
విశాఖ సాగర తీరం.. కోత ఘోరం!
ప్రముఖ పర్యాటక కేంద్రమైన విశాఖపట్నం (Visakhapatnam) సాగర తీరంలో కొన్ని రోజులుగా ‘అల’జడి కొనసాగుతోంది. పర్యాటకానికి మణిహారంగా నిలిచిన ఆర్కే బీచ్తో (RK Beach) పాటు పలు ప్రదేశాలు.. ఇప్పుడు తీవ్ర కోతకు గురవుతున్నాయి. తుపాన్లకు తోడు ఇటీవల వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాల ప్రభావంతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలు తీరంలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా విశాఖ తీరంలో జరుగుతున్న మార్పులను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది.నోవాటెల్ హోటల్ ఎదురుగా ఉన్న పార్కులో గోడ కూలిపోవడం, నేల కుంగిపోవడం, అంబికా సీ గ్రీన్ హోటల్ ఎదురు కోత పెరగడం వంటివి విశాఖ వాసులను కలవర పెడుతున్నాయి. తీరంలో కోతను నివారించే ప్రయత్నాలు చేపట్టాలని.. నిపుణుల సూచనలతో తీరాన్ని అభివృద్ధి చేసి విశాఖను సంరక్షించాలని అధికారులను విశాఖ వాసులు కోరుతున్నారు. – ఏయూ క్యాంపస్ఎలుగుబంటి కాదు.. మానుపిల్లిగూడెంకొత్తవీధి: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని జడుమూరు వద్ద కాఫీతోటల్లో (Coffee Fields) గురువారం ఎలుగుబంటి (Bear) హల్చల్ చేసిందంటూ జరిగిన ప్రచారంపై అటవీ అధికారులు స్పందించారు. తోటల్లో కాఫీపండ్లను తింటున్నది ఎలుగుబంటి కాదని, అది అడవిలో సంచరించే మానుపిల్లి అని తెలిపారు. ఆకారంలో ఎలుగుబంటిని పోలి ఉన్నా.. ఇది సాధుజంతువని, మనుషులపై దాడిచేయదని పేర్కొన్నారు.చదవండి: నల్లమల అభయారణ్యంలో జాలీగా జంగిల్ సఫారీ -
వైజాగ్ బీచ్ లో కూలిన రిటైనింగ్ వాల్
-
పచ్చ పచ్చాని దారిలో సాగిపోదామా..
కనువిందు చేసే పచ్చని చెట్లు... బడలికను పోగొట్టే చల్లగాలి... ఎవరైనా సరే ఆ మార్గంలో ఒకసారి ప్రయాణిస్తే ఫిదా అవ్వాల్సిందే. మళ్లీ మళ్లీ ఆ దారిలో వెళ్లాలనే కోరిక తట్టాల్సిందే. రహదారికి పచ్చటి తోరణం కట్టినట్లుండి.. వాటి కిందకు వెళ్లగానే ఏదో గుహలోకి ప్రవేశించినట్లుగా కలిగే అనుభూతి ప్రయాణికులను కొద్దిసేపు అక్కడ ఆగేలా చేస్తోంది. అనంతపురం జిల్లా గార్లదిన్నె నుంచి మిడ్పెన్నార్ డ్యాంకు వెళ్లే మార్గంలో రోడ్డుకిరువైపులా చెట్లు ప్రయాణికులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురంగుంటూరు జిల్లా ప్రత్తిపాడు పరిసర ప్రాంతాలు అంటే గుర్తుకువచ్చేది పత్తి, మిర్చి సాగు. దశాబ్దాలుగా ఇవే పంటలు ఈ ప్రాంతంలో సాగుచేస్తుంటారు. కానీ ఇటీవల ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగానే బంతి పూల తోటలు కూడా సాగుచేశారు. గుంటూరు పర్చూరు పాత మద్రాసు రోడ్డు వెంబడి పుల్లడిగుంట సమీపంలో పండించిన బంతి పూలు పసుపు, ఆరెంజ్ రంగుల్లో చూపరులను ఆకర్షిస్తున్నాయి.నిత్యం అలలతో ఎగసి పడే సంద్రం.. వెనక్కు తగ్గింది. ఇప్పటి వరకు అలల మాటున ఉన్న శిలలు అందమైన ఆకృతులతో సరికొత్తగా పరిచయం చేసుకున్నాయి. వాతావరణ మార్పులతో సముద్రం వెనక్కు వెళ్లడంతో విశాఖ బీచ్లోని వైఎంసీఏ ప్రాంతంలో నల్లని రాళ్లు కనువిందు చేశాయి. దీంతో సందర్శకులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం కాకినాడ జిల్లా తుని పట్టణంలోని ఓ రైతుకు చెందిన నాటుకోడి అతి చిన్న గుడ్డు పెట్టడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. రైతు గండి రమణ నాటు కోళ్లు పెంచుతున్నారు. ఇందులో ఒక పెట్ట ముందు రోజు సాధారణ పరిమాణం కలిగిన గుడ్డు పెట్టగా.. మంగళవారం చిన్న గుడ్డు పెట్టింది. జన్యుపరమైన లోపం వల్ల ఇలా జరుగుతుందని పశు వైద్యుడు శ్రీధర్ చెప్పారు.విశాఖ కేంద్ర కారాగారం ఆవరణలో సీజనల్ పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం శీతాకాలం కూరగాయల పంటలు ప్రారంభమయ్యాయి. కొన్ని కాపు దశకు వచ్చాయి. జైలులో ఉండే ఓపెన్ ఎయిర్ ఖైదీలచే రసాయనిక ఎరువుల్లేకుండా అధికారులు ఇక్కడ పంటలు పండిస్తుంటారు. జైలు లోపల మామిడి, కొబ్బరితోపాటు, బయట ఆవరణ సుమారు 20 ఎకరాల్లో సీజనల్ పంటలు పండించి వాటిని ఖైదీలకు వినియోగిస్తుంటారు. మిగిలిన వాటిని జైలు గేటు ముందు బీఆర్టీఎస్ పక్కన సుధార్ కేంద్రంలో విక్రయిస్తుంటారు. ప్రస్తుతం వంగ, బీర, క్యాబేజీ, టమాటా, ఆనప (సొర) సాగు చేస్తున్నారు. ఈ పంటలతో జైలు ఆవరణ అన్ని కాలాల్లోను పచ్చదనంతో కళకళలాడుతోంది.తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కిన ఘటన సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. మండలంలోని వీర్నమల ఎస్సీ కాలనీలో మూడు నెలలుగా తాగునీటి సమస్యతో సతమతమవుతున్నామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. ఎస్సీ కాలనీలో ఉన్న బోరులో నీరు ఇంకిపోవడంతో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చిందని, డబ్బులిచ్చి నీళ్లు కొనుక్కోవాల్సిన ఖర్మ పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోకపోవడంతో వారంతా ఖాళీ బిందెలతో ఆంధ్ర–తమిళనాడు సరిహద్దు రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఈ కారణంగా వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది.చౌక దుకాణాల వద్ద రేషన్ కోసం లబ్ధిదారులు గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి మళ్లీ ఎదురైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో ఇంటి వద్దకే రేషన్ పథకాన్ని అమలు చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాల్లో ఈ వ్యవహారాన్ని తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. చిత్తూరులోని 27వ వార్డు చామంతిపురం రేషన్షాపు వద్ద మంగళవారం ప్రజలు రేషన్ కోసం గంటల కొద్దీ పడిగాపులు కాశారు. గంటల కొద్దీ నిలబడలేక తాము తెచ్చుకున్న సంచులను వరుస క్రమంలో పెట్టారు. సమీపంలోని 28వ వార్డులో, మరికొన్ని మండలాల్లో సైతం ఇదే పరిస్థితులు ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రజలు గత ప్రభుత్వ పాలనే బాగుందని వ్యాఖ్యానిస్తున్నారు. చదవండి: ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు 1,027.58 కిలో మీటర్లు -
ఆర్కే బీచ్ లో బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారం
-
Klin Kaara Beach Photos: క్లీంకారకు బీచ్ని పరిచయం చేసిన రామ్చరణ్.. ఫొటోలు వైరల్
-
'అమ్మా, నాన్నతో తొలిసారి అలా'.. ఉపాసన పోస్ట్ వైరల్!
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ ప్రస్తుతం వైజాగ్లో జరుగుతోంది. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ చెర్రీ సరసన కనిపించనుంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన రామ్ చరణ్ లుక్ నెట్టింట తెగ వైరలైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. చెర్రీ డిఫరెంట్ చూసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. అయితే షూటింగ్కు కాస్తా విరామం లభించండంతో గ్లోబల్ స్టార్ ఫ్యామిలీతో కలిసి చిల్ అయ్యారు. వైజాగ్ సముద్ర తీరాన తన ముద్దుల కూతురు, భార్య ఉపాసనతో కలిసి ఎంజాయ్ చేశారు. క్లీంకారతో ఎత్తుకుని బీచ్లో ఆడుకుంటున్న దృశ్యాలు అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. ఈ వీడియోను ఉపాసన తన ఇన్స్టాలో షేర్ చేసింది. వైజాగ్ మా హృదయాలను దోచేసింది.. క్లీంకారతో ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇదే వీడియోలో మెగా అభిమానులు రామ్ చరణ్ను గజమాలతో సత్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
వైఎంసిఏ బీచ్ లోకి కొట్టుకువచ్చిన అరుదైన పెట్టె
-
అల్పపీడన ప్రభావంతో అల్లకల్లోలంగా వైజాగ్ బీచ్..
-
చిట్టీ.. నాకు ఎప్పుడో తెలుసు.. నేను లేకుండా నువ్వు బిందాస్గా ఉండగలవని..
విశాఖపట్నం: ‘చిట్టీ.. నాకు ఎప్పుడో తెలుసు.. నేను లేకుండా నువ్వు బిందాస్గా ఉండగలవని. నీకు అసలు ఏ మాత్రం ఫరక్ పడదు. ఎనీ వే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ న్యూ లైఫ్. చాలా మాట్లాడడానికి ఉన్నా కూడా నేను ఏం మాట్లాడటం లేదు. బికాజ్.. నువ్వు బయటకు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యూ నో ఎవ్రీ థింగ్. జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఏ బిగ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్’ అంటూ భర్తకు లేఖ రాసి ఐదు నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ సమయంలో ఎంతో ఆనందంగా గడపాల్సిన ఆమె..ఆర్.కె.బీచ్లో విగతజీవిగా కనిపించింది. వరకట్న వేధింపులే తన కుమార్తె మరణానికి కారణమని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలివీ.. పెదగంట్యాడ మండలం నడుపూరులో గురువెల్లి మణికంఠ తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. దొండపర్తికి చెందిన శ్వేత(24)తో గత ఏడాది మణికంఠకు వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. మణికంఠ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వారం రోజుల కిందట అతను హైదారాబాద్ వెళ్లాడు. శ్వేతను ఇక్కడే అతని తల్లిదండ్రుల వద్ద ఉంచాడు. మంగళవారం సాయంత్రం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆమె సాయంత్రం 6.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. తర్వాత ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆమె అత్తామామలు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వాకబు చేశారు. ఫలితం లేకపోవడంతో ఆమె మామ శాంతారావు అర్ధరాత్రి 12 గంటల సమయంలో న్యూపోర్టు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రాత్రి పెట్రోలింగ్ చేసే పోలీసుల గ్రూపులో ఆమె ఫొటో పోస్ట్ చేసి అదృశ్యమైందని వివరాలు పెట్టారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఆర్.కె.బీచ్లో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు 3వ పట్టణ పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని శ్వేత ఫొటోతో సరిపోల్చి.. న్యూపోర్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇసుకలో కూరుకుపోయిన ఆమె మృతదేహాన్ని చూసి.. ఎవరో హత్య చేసి తీరంలో పూడ్చేసినట్లు ముందు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తన భర్తతో ఉన్న కుటుంబ కలహాలతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. వివాహమై ఏడాది పూర్తి శ్వేత, మణికంఠ దంపతుల మొదటి వివాహ వార్షికోత్సవం ఈ నెల 15న జరిగింది. అనంతరం మణికంఠ హైదరాబాద్ వెళ్లాడు. శ్వేత మరణ వార్త తెలియగానే వెంటనే నగరానికి చేరుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో చిట్టీ(మణికంఠ ముద్దు పేరు) నేను లేకపోయినా నువ్వు బిందాస్గా జీవిస్తావని నాకు తెలుసు. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. బిగ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్ అని రాసి ఉంది. భర్త ప్రేమకు నోచుకోలేదు పెళ్లి అయిన తర్వాత అత్త, మామ, ఆడపడుచు భర్త ఎంతగానో నా బిడ్డను వేధించారని శ్వేత తల్లి రమాదేవి ఆరోపించారు. ‘ఆ ఇంట్లో ఉండలేకపోతే వచ్చేయమ్మా.. పెంచుకుంటా అని చెప్పాను. అయినా సరే భర్త ప్రేమ కోసం ఆ ఇంట్లోనే ఉంది. ఐదు నెలల గర్భంతో ఉన్న నా కుమార్తైపె కనీసం కనికరం లేకుండా అత్తమామలు చిత్రహింసలకు గురి చేశారు. ఇంట్లో పనులన్నీ తనతోనే చేయించారు. అల్లుడు వాళ్ల అమ్మానాన్నలకే వత్తాసు పలికేవాడు. ప్రతి రోజూ ఫోన్ చేసి ఏడ్చేది. నెల రోజుల కిందట విడాకులు ఇస్తామని శ్వేతను మణికంఠ బెదిరించాడు. సివిల్స్కు ప్రిపేర్ అవుతానని చెప్పింది. పైళ్లెన తర్వాత చదివించకుండా వంటింటికే పరిమితం చేశారు. నా ఒక్కగానొక్క కుమార్తెను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు’ అంటూ ఆమె వాపోయారు. వరకట్నం వేధింపులే తన కుమార్తెకు మరణానికి కారణామని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్నం తీసుకురావాలని కొద్ది నెలలుగా వేధిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు శ్వేత భర్త మణికంఠ, అత్త, మామ, ఆడపడుచు భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయిలో కేసును విచారిస్తున్నట్లు తెలిపారు. ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని భావించా.. ‘శ్వేత బి.టెక్ సివిల్ ఇంజినీర్ చదువుకుంది. సివిల్స్ సాధించాలని నిరంతరం చదువుకునేది. అందుకు నేను కూడా ప్రోత్సహించా. కుటుంబంలో చిన్న చిన్న గొడవులు సహజం. ఆ మాత్రానికే ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదు. ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని భావించాను. ఇలా శవమై మమ్మల్ని బాధపెట్టింది’ అని మణికంఠ తెలిపారు. -
బీచ్లో శ్వేత మృతదేహం.. పెళ్లైన నెల నుంచే వేధింపులు, సూసైడ్ నోట్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ బీచ్లో శవమై తేలిన మహిళ కేసులో మిస్టరీ కొనసాగుతోంది. వివాహిత శ్వేత మృతికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కేసులో శ్వేత కాల్ రికార్డింగ్స్, పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే శ్వేత తల్లి రమాదేవి స్టేట్మెంట్ను త్రీటౌన్ పోలీసులు నమోదు చేశారు. ఇంటి నుంచి బయలుదేరే గంట ముందు వరకు కూడా భర్త మణికంఠతో గొడవపడినట్లు విచారణలో తేలింది. అయితే అత్తమామలు వేధింపులపై పోలీసులు కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు విడాకులు ఇస్తానని భర్త బెదిరింపులు కాగా అత్తింటి వేధింపులు తట్టుకోలేకే తన కూతురు చనిపోయిందని శ్వేత తల్లి రమాదేవి ఆరోపించారు. పెళ్లైన నెల రోజుల నుంచే కూతుర్ని వేధించడం ప్రారంభించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అల్లుడి అసలు గుణం అప్పుడే బయటపడిందని.. నెల రోజులు క్రితం కూడా విడాకులు ఇస్తామని శ్వేతను భర్త మణికంఠ బెదిరించాడని పేర్కొన్నారు. ఈ మేరకు మృతురాలి తల్లి మాట్లాడుతూ శ్వేత అత్తింటి వారిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తన కూతురు అయిదు నెలల గర్భిణీ అని.. కడుపుతో ఉన్నా కూడా కనికరించకుండా అత్తామామలు చిత్రహింసలు పెట్టేవారని తెలిపారు. ఇంట్లో పనులన్నీ తనతోనే చేయించేవారని, అత్త మామలు చెప్పిన పనులు చేయాలంటూ ఫోన్లో భర్త కూడా ఆదేశాలిచ్చేవాడని పేర్కొన్నారు. ఫోన్ చేసి రోజూ ఏడ్చేది.. ‘భర్తను పొగొట్టుకున్నాను. కూతుర్ని ఒక్కదాన్నే కష్టపడి పెంచి పెద్ద చేశాను. అత్తమామలు ఇబ్బందులు పెడుతున్నారని రోజూ ఫోన్ చేసి ఏడ్చేది. సివిల్స్కు ప్రిపేర్ అవుతానని చెప్పింది. పెళ్లైన తరవాత చదివించకుండా వంటింటికే పరిమితం చేశారు. శ్వేత అత్త నటిస్తోంది. అత్తింటి వేధింపులు, భర్త టార్చర్ వల్ల శ్వేత ప్రాణం తీసుకుంది. నా ఒక్కగానొక్క కూతురిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు’ అంటూ వాపోయారు. సూసైడ్ నోట్ ఇదిలా ఉండగా శ్వేత చనిపోయేముందు ఓ సూసైడ్ నోట్ రాసింది. ఇందులో ‘చిట్టీ...నాకు ఎప్పుడో తెలుసు నేను లేకుండా నువ్వు బిందాస్గా ఉండగలవని. నీకు అసలు ఏమాత్రం ఫరక్ పడదు. ఎనీ వే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.. అండ్ న్యూ లైఫ్. చాలా మాట్లాడడానికి ఉన్నా కూడా నేను ఏం మాట్లాడటం లేదు. బికాజ్.. నువ్వు బయటకు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా యూ నో ఎవ్రీ థింగ్. జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఏ బిగ్ థాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్’ అని రాసి ఉన్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్వేత భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్లో నివసిస్తుండగా.. విశాఖపట్నంలో అత్తమామల వద్ద శ్వేత ఉంటోంది. మంగళవారం అత్తతో గొడవ జరగడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఫోన్లో భర్తతోనూ గొడవపడింది. తర్వాత విగత జీవిగా బీచ్లో కనిపించింది. చదవండి: ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం.. 11 మంది జవాన్లు మృతి.. -
అమ్మకు చేదోడుగా..
విశాఖపట్నం: అమ్మ అనునిత్యం పిల్లల కోసం పరితపిస్తుంది... ఉదయం లేచింది మొదలు ప్రతి నిమిషం పనిలోనే.. పిల్లలను తయారు చేసి బడికి పంపి తిరిగి ఇంటికి చేరే వరకు వారి మీదే ధ్యాస. స్కూల్లో ఎలా ఉన్నారో..? బాగా చదువుతున్నారా..? వారిని మంచి ప్రయోజకులను చేయాలని ఆరాటం. అనుక్షణం తమ కోసం తపన పడుతున్న అమ్మకు సాయం చేసే అవకాశం వచ్చింది. ఆర్కే బీచ్లో మొక్కజొన్నలు అమ్మే ఓ అమ్మకు పని పడింది. కచ్చితంగా వెళ్లాలి...వెళితే వ్యాపారం పోతుంది...ఇటువంటి సమయంలో అమ్మా నేనున్నా...నువ్వెళ్లిరా...అంటూ కన్నపేగు మాటలకు ఆ తల్లి ధనలక్ష్మి మురిసిపోయింది. స్కూల్లో ఇచ్చిన హోంవర్కు చేసుకుంటూ మొక్క జొన్న కంకులు అమ్ముతూ ఇలా కనిపించింది ఆరో తరగతి చదువుతున్న భవాని భార్గవి. తండ్రి కూలి పనులు చేస్తుండగా..తల్లి పాచి పనులు చేసుకుంటూ సాయంత్రం వేళ బీచ్లో మొక్కజొన్న కంకులు అమ్ముతోంది. తనకు జగనన్న అమ్మ ఒడి అందుతోందని భార్గవి చెప్పింది. ఈ చదువుల సిరిని చూసి బీచ్కొచ్చినవాళ్లు అభినందించారు. -
Photo Feature: ప్రకృతి గీసిన చిత్రం
ప్రకృతి.. మనల్ని ఎన్ని రకాల సొబగులతో మురిపిస్తుందో కదా! కొండలు.. గుట్టలు.. లోయలు.. సముద్రం.. నదులు.. చెట్లు.. కొమ్మలు.. ఆకులు.. పూలు.. అసలు అందలేనిదేది? ఆకట్టుకోనిదేది? కవుల వర్ణనలో కనిపించే అందాలకు నెలవు మన విశాఖ. చదవండి: వీటిని ఎక్కువ కాలం వాడుతున్నారా.. అయితే డేంజర్లో పడ్డట్టే! ఇది పర్యాటకుల స్వర్గధామం. ఆహ్లాదపరిచే పర్యావరణం.. పచ్చని అందాలతో అలరారే జీవ వైవిధ్యం.. సహజ అందాల సాగరతీరం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో అందాలు.. మరెన్నో అనుభూతులు.. అలాంటి దృశ్యమే ఇది. ఆకుపచ్చగా గడ్డి.. మబ్బులు కమ్మిన ఆకాశం.. అల్లంతదూరంలో సముద్రం.. నిర్మాణంలో ఉన్న పడవ.. ఆహా ఏం అందం.! ప్రకృతి గీసిన ఈ చిత్రం.. కోస్టల్ బ్యాటరీ వద్ద ఆదివారం సాయం సంధ్య వేళలో ఆవిష్కృతమైంది. -ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
నయా ట్రెండ్: డోర్ ఓపెన్ చేసి చూస్తే వేడివేడి వంటకాలతో ఫుడ్ డెలివరీ బాయ్
నాగమణి సాధారణ గృహిణి భర్త ఉద్యోగి. ఓ మధ్యాహ్నం వేళ. అకస్మాత్తుగా ఇంటికి చుట్టాలు వచ్చారు. భోజన సమయం కావడంతో ఏం చేయాలో తోచక భర్తకు ఫోన్ చేసింది. కొద్ది నిమిషాల్లోనే కాలింగ్ బెల్ మోగింది. డోర్ ఓపెన్ చేసి చూస్తే వేడివేడి వంటకాలతో ఫుడ్ డెలివరీ బాయ్ కనిపించాడు. భర్త ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన బంధువులు రీఫ్రెష్ అయ్యేలోపే తాజా వంటకాలు సిద్ధమయ్యాయి. కిరణ్, సంధ్య కొత్తగా పెళ్లయిన జంట ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వర్క్ఫ్రం హోంలో ఇద్దరూ బిజీ. ఇద్దరి షిఫ్ట్లు వేరు. ల్యాప్టాప్లో లాగినైతే క్షణం తీరిక ఉండదు. వంట చేయాలంటే కుదిరే పని కాదు. వర్క్ చేస్తూనే తమ అభిరుచులకు తగినట్టు స్మార్ట్ ఫోన్లోని ఫుడ్ డెలివరీ యాప్స్లో ఆర్డర్ చేయడం.. నిమిషాల వ్యవధిలో వచ్చే ఫుడ్ ఐటమ్స్ను తింటూనే విధులు నిర్వహించడం వారికి అలవాటుగా మారింది. డాబాగార్డెన్స్/బీచ్రోడ్డు: విశాఖ నగర వాసులు కొత్త రుచులను కోరుకుంటున్నారు. వారిని ఆకర్షించేలా వెరైటీ రుచులతో హోటళ్లు ఆహ్వానం పలుకుతున్నాయి. సాంకేతికత పెరగడం, పలు రకాల ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి రావడంతో వంట చేసుకునే వారి సంఖ్య నానాటికీ తగ్గుతోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులతో క్షణం తీరిక లేకుండా ఉండే వారికి ఫుడ్ డెలివరీ యాప్స్ ఓ వరంలా మారాయి. ఈ యాప్స్ ప్రత్యేక ఆఫర్లను కూడా ఇస్తున్నాయి. ఆకలి వేస్తుందన్న సంకేతాలు రాగానే ఆర్డర్ చేస్తే సరి.. వేడివేడి ఆహార పదార్థాలు గడప ముంగిటకు వచ్చేస్తున్నాయి. భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు మాంసాహారం, మరొకరు శాకాహార ప్రియులైనా.. ఒకరు సౌత్ ఇండియన్.. ఇంకొకరు నార్త్ ఇండియన్ అయినా సరే.. ఏక కాలంలో వారి సంప్రదాయాలు, సంస్కృతులకు చెందిన ఆహార పదార్థాలు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వచ్చేస్తున్నాయి. కొత్త వంటల పరిచయం నగరవాసులకు వెరైటీ ఫుడ్ అందించాలని పలు హోటళ్లు ఎప్పటికప్పుడు ఫుడ్ ఫెస్టివళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఉత్తర భారత దేశం రుచులు, నవాబులు బిర్యానీ, కోస్టల్ రుచి.. ఇలా అనేక రకాల పేర్లతో ఫుడ్ ఫెస్టివళ్లను ఏర్పాటు చేసి ఆహార ప్రియులకు కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. కొత్త రుచులు ఇంట్లో కష్టం వారంలో ఐదు రోజులు బిజీబిజీ. తీరిక లేని పనులు. ఫ్యామిలీకి టైం కేటాయించడం కూడా సాధ్యం కావడం లేదు. వీకెండ్ వచ్చిందంటే ఆ ఒత్తిడి నుంచి రిలాక్స్ కావడానికి రెస్టారెంట్ బాట పడుతున్నాం. మెనూలో నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి ఫ్యామిలీతో కలిసి చక్కగా భోజనం చేస్తున్నాం. వేర్వేరు అభిరుచులు ఉన్న వారికి ఇంట్లో తయారు చేయడం కొంత కష్టం. రెస్టారెంట్కో, హోటల్కో వెళితే ఎవరికి నచ్చిన ఐటమ్ వాళ్లు ఆర్డర్ చేసుకోవచ్చు. నచ్చిన వంటకాన్ని కడుపునిండా తినొచ్చు. – సీహెచ్ పవన్కుమార్, ప్రైవేట్ ఉద్యోగి ట్రెండ్ మారింది ఒకప్పటికీ నేటికి ట్రెండ్ మారింది. వర్క్ స్టైల్ కూడా మారింది. అలానే ఆహారపు అలవాట్లు, అభిరుచులూ మారాయి. వీకెండ్స్ సంస్కృతి వచ్చింది. చాలా మంది ఫ్యామిలీతో రెస్టారెంట్కో, హోటల్కో వెళ్లి భోజనం చేస్తున్నారు. మెనూలో వెరైటీలు ఉండేలా చూసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా రెస్టారెంట్లు, హోటళ్లు తమ మెనూ మార్చుకుంటున్నాయి. హోం డెలివరీ, టేక్ ఏవే తగ్గిపోయి ఆన్లైన్లో ఆర్డర్స్ పెరిగాయి. హోటల్ బిజినెస్లో 60 శాతం వరకు ఆన్లైన్ ఆర్డర్స్ ఆక్రమించేశాయి. – వాకాడ రాజశేఖర్రెడ్డి, అతిథి దేవోభవ హోటల్ యజమాని నగరంలో నయా ట్రెండ్ హీరో వెంకటేష్, ఆర్తి అగర్వాల్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. భోజన సమయంలో ఇంటికి వచ్చిన బంధువులకు ఏం వంట చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న హీరోయిన్కు హీరో మంచి ఐడియా చెప్తాడు. సిటీలో ప్రముఖ హోటల్ నుంచి ఫుడ్ రప్పించి బంధువులకు అన్ని రకాల రుచులు చూపించి వారి చేత శభాష్ అనిపిస్తాడు. ప్రస్తుతం నగరంలో ఇటువంటి ట్రెండే నడుస్తోంది. ఇంటికి వచ్చే బంధువులకు నగరంలోని లభించే కొత్త కొత్త రుచులను ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసి.. అందిస్తున్నారు. హోటళ్ల పేర్లూ వెరైటీనే.. విశాఖ నగర వాసులు రోజూ ఇంటి భోజనం తినేందుకు ఇష్టపడడం లేదు. సకుటుంబ సమేతంగా హోటల్కో, దాబాకో వెళ్లి సరికొత్త రుచులను ఆస్వాదించేందుకు మొగ్గు చూపుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు యజమానులు రెస్టారెంట్లు, హోటళ్లకు వెరైటీ పేర్లు పెడుతున్నారు. అమ్మ చేతి వంట, వంటిళ్లు, అరిటాకు, వంటకమ్.. ఇలా రకరకాల పేర్లతోనే కాదు.. బాబాయ్ హోటల్, సుబ్బయ్య హోటల్, రాజుగారి హోటల్, కుండ బిర్యానీ వంటి పేర్లతోనూ నడుస్తున్న హోటళ్లు నగరంలో తమ ప్రత్యేకత చాటుకుంటున్నాయి. బుట్ట భోజనం, కాంబో ఆఫర్, ఫ్యామిలీ ఫ్యాక్, జంబో బిర్యానీ ఇలా స్పెషల్ ప్యాక్లు అందుబాటులో ఉన్నాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ.. ఉదయం ఆరు గంటల నుంచే ఆర్డర్లు మొదలవుతాయి. వాటర్ బాటిల్ నుంచి ఐస్క్రీం వరకు, టిఫిన్ నుంచి భోజనం, పసందైన బిర్యానీ వరకు అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. కొందరు కర్రీస్, స్నాక్స్ ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. రోజు రోజుకూ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇళ్లల్లో వంట చేయడం చాలా వరకు తగ్గింది. వేగంగా డెలివరీ చేయడం కూడా ఇందుకు కారణం. ఆన్లైన్ యాప్లు మంచి ఆఫర్లు ఇస్తున్నాయి. – కిరణ్, ఫుడ్ డెలివరీ బాయ్ ఫుడ్ ఫెస్టివల్స్కు వెళ్తుంటా.. నాకు కొత్త కొత్త రుచులంటే చాలా ఇష్టం. అటువంటి రుచులు ఇంట్లో కష్టం. అందుకే నగరంలో ఎక్కడ కొత్త రుచులు ఉన్నాయంటే అక్కడ వాలిపోతా. ముఖ్యంగా ఫుడ్ ఫెస్టివల్స్, నూతన రెస్టారెంట్లకు వెళ్లి అక్కడ రుచులన్నీ ఆస్వాదిస్తా. –హేమసుందర్ కొత్త రుచులను టేస్ట్ చేస్తాం నేను, నా భర్త ఇద్దరం ఉద్యోగం చేస్తుంటాం. ఇద్దరం కలిసి భోజనం చేయడానికి సమయం దొరకదు. అందుకే వారంలో ఒక్క రోజైనా రెస్టారెంట్కు భోజనానికి వెళ్తాం. కొత్త రుచులను టేస్ట్ చేస్తాం. –రమ్య -
అలల సవ్వడిని ఆస్వాదిస్తూ వేడి వేడి బిర్యానీ.. బస్సుపై కూర్చుని తింటే!
బీచ్రోడ్డు (విశాఖతూర్పు): సాగరతీరం.. ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది.. రోజూ చూస్తున్నా ఏదో తెలియని అనుభూతి.. అలల సవ్వడి పలకరిస్తాయి. చిరుగాలులు మనసును ఆహ్లాదపరుస్తాయి. అందుకే విశాఖ బీచ్ ఎనలేని ఖ్యాతి సొంతం చేసుకుంది. అటువంటి సాగరతీరంలో అలల సవ్వడి వింటూ.. ఎగసి పడే కెరటాలను చూస్తూ..చల్లగాలి ఆహ్లాదాన్ని మజా చేస్తూ మరో వైపు లైవ్ మ్యూజిక్ హమ్ చేస్తూ వేడి వేడి బిర్యానీ తింటే.. నూరూరించే పిజ్జా ఆరగిస్తే.. జింహ్వచాపల్యానికి ఇంతకంటే ఇంకేం కావాలి. ఇప్పుడు అటువంటి రెస్టారెంట్ నగరవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చాడు ఓ యువకడు. నగరవాసుల టేస్ట్ను పట్టుకున్న వెంకట నాగచంద్ర (చందు).. కొత్త ఆలోచనలకు ఎప్పుడూ సిటి జనలు ఆదరస్తారన్న నమ్మకంతో ఓసియన్ ఎడ్జ్ పేరుతో మొబైల్ రూఫ్టాప్ డైనింగ్ రెస్టారెంట్ను తీర్చిదిద్దాడు. బస్సు టాప్పై కూర్చుని సముద్ర అందాలను వీక్షిస్తూ ఇష్టమైన ఆహారాన్ని తీంటుంటే వావ్ అనాల్సిందే.. ఒక్క సారైనా చూడడానికైనా వెళ్లాల్సిందే. చదవండి👉🏾 తిరుపతి, అరకుకు స్పెషల్ టూర్స్ సరికొత్త అనుభూతి.. రూఫ్టాప్పై కూర్చుని సముద్రం అలల చూస్తూ తింటుంటే ఏదో తెలియని సరికొత్త అనుభూతి పొందుతున్నట్టు ఉంది. పాత కాలం గోలిసోడ తాగుతూ ఫిష్ ఫ్రై తింటుంటే చాలా అద్భుతంగా ఉంది. –దుర్గాప్రసాద్, ఆహార ప్రియుడు వైజాగ్లో మొదటిసారిగా.. యూరప్ దేశాలకే పరిమితమైన ఈ రెస్టారెంట్ విశాఖ నగరంలో మొదటి మొబైల్ రూఫ్టాప్ రెస్టారెంట్ను ఏర్పటు చేశాడు. ఈ రెస్టారెంట్ ఇప్పటికే అనేక పార్టీలకు వేదికైంది. ఈ రెస్టారెంట్ను సాగతీరంలోనే కాకుండా ఆహార ప్రియుల ఆసక్తి మేరకు వారి చెప్పిన ప్రాంతంలో కూడా ఏర్పాటు చేస్తారు. బస్సుపైన డైనింగ్ చేస్తూ నగర వాసులు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. మరిన్ని ఇటువంటి రెస్టారెంట్లు నగరంలో ఏర్పాట చేయాలని చందు భావిస్తున్నాడు. చదవండి👉🏻 ముడతలు, బ్లాక్ హెడ్స్కు చెక్.. ఈ డివైజ్ ధర రూ. 2,830 గోలి సోడ నుంచి పిజ్జా వరకు మొబైల్ రూఫ్టాప్ రెస్టారెంట్లో అన్ని రకాల ఆహారం పదార్థాలు లభిస్తున్నాయి. పాతతరం గోలి సోడ నుంచి కొత్త తరం పిజ్జా, బిర్యానీ, బర్గర్లు వరకు అనేక వంటకాలు అందుబాటులో ఉన్నాయి. లైవ్ మ్యూజిక్ యూరప్లో చూసి.. నగరంలో తన మార్కు చూపించాలని చందుకు ఎప్పుడూ ఉండేది. వినూత్నమైన ఆలోచనలతో ముందుకు సాగేవాడు. అలాంటి సమయంలో ఫ్యామిలీతో యూరప్ వెళ్లినప్పుడు ఎక్కువగా ఇంటువంటి మొబైల్ రూఫ్టాప్ డైనింగ్ రెస్టారెంట్లను చూశాడు. అబ్బా భలే ఉందే...మన విశాఖలో ఇలా పెడితే బ్రహ్మాండంగా ఉంటుందని నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా విశాఖ పర్యాటకపరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. మొబైల్ రూఫ్టాప్ డైనింగ్ రెస్టారెంట్ కచ్చితంగా క్లిక్ అవుతుందని భావించాడు. ఆలోచన రావడమే తరువు అన్నట్టు అన్ని ఎర్పాట్లు చేసుకుని జీవీఎంసీ అనుమతులను పొంది ఆరు నెలల క్రితం వైఎంసీఏ వద్ద ఈ ఓసియన్ ఎడ్జ్ మొబైల్ రూఫ్టాప్ డైనింగ్ రెస్టారెంట్ను ప్రారంభించాడు. నగర యువత ఇప్పుడు ఈ రెస్టారెంట్ కొత అనుభూతిని పొందుతున్నారు. ఈ రెస్టారెంట్ ద్వారా 12 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు చందు. చదవండి👉 అధరహో...సిరులు కురుపిస్తున్న చింత ఆహార ప్రియులతో కిటకిటాలడుతున్న రూప్టాప్ డైనింగ్ ప్రభుత్వం సహకరిస్తే ఫ్లైట్ రెస్టారెంట్ ఏర్పాటు ఎప్పుడు వినూత్నంగా ఏదైన చేయాలనేది నా ఆలోచన. అందులో భాగంగానే ఈ రెస్టారెంట్ను ఏర్పాటు చేశా. నగర వాసులు ఆదరణ చాలా బాగుంది. ఆహార ప్రియుల కోరిక, ఆసక్తి మేరకు ప్రజల వద్దకే మా రెస్టారెంట్ను తీసుకొని వెళ్లడం జరుగుంది. ప్రస్తుతం ఫ్లైట్ రెస్టారెంట్ ఏర్పాటు చేయాలనేది నా లక్ష్యం దీనికి ప్రభుత్వం సహకరించాలి. ఇప్పటికే ఫ్లైట్ రెస్టారెంట్ ఏర్పాటుకు కావాల్సిన అన్ని సిద్ధం చేసుకున్నా. కానీ దాన్ని సరైన ప్రదేశంలో ఏర్పాటు చేయాలి. అందుకు ప్రభుత్వం స్థలం కేటాయిస్తే రెస్టారెంట్ ఏర్పాటు చేసి పర్యటకులను ఆకర్షించవచ్చు. –నాగచంద్ర (చందు), ఓసియన్ ఎడ్జి రెస్టారెంట్ -
అలలు చెక్కిన శిల్పాలు
పెదగంట్యాడ (గాజువాక): ఉవ్వెత్తున ఎగసి పడే అలలు.. అలుపు సొలుపు లేని కెరటాలు.. ఒక దాని వెంట మరొకటి వస్తూ.. అక్కడ ఉన్న బండరాళ్లను సుతారంగా తాకు తూ.. అద్భుతమైన శిల్పాలుగా చెక్కుతున్నాయి.. ఆ ప్రదేశాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నాయి.. చూపరులను ఆశ్చర్య చకితుల ను చేస్తున్నాయి.. శిలలపై శిల్పాలు చెక్కినారు అన్నాడో సినీ కవి.. కానీ ఇక్కడి రాళ్లను చూస్తే.. వాటి ఆకృతులను పరిశీలిస్తే అలలు చెక్కిన శిల్పాలు అనాల్సిందే.. అందమైన సాగర తీరం విశాఖ సొంతం.. ఆహ్లాదాన్ని పంచే ఆర్కే బీచ్, రుషికొండ బీచ్తో పాటు యారాడ బీచ్ కూడా విశాఖ ఖ్యాతిని ఇనుమడింపజేస్తాయనడంలో అతిశయోక్తి లేదు.. ఎంతో సువిశాలమైన విశాఖ సాగర తీరంలో.. పెద్దగా ప్రచారం లేని మరోప్రాంతం పెదగంట్యాడ మండలంలోని పాత గంగవరంలో ఉంది.. గంగవరం పోర్టు వెనుక గల సముద్ర తీరం ఆహ్లాదాన్ని పంచుతోంది.. పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తోంది.. ఇక్కడి కొండపై కొలువుదీరిన రాధామాధవ స్వామి ఆలయం వెనుక.. సముద్రం ఒడ్డున ఉన్న ఓ కొండ అందమైన గుహలతో విరాజిల్లుతోంది.. రాధామాధవ స్వామి ఆలయం నుంచి కిందకు దిగుతున్న కొద్దీ వివిధ రూపాల్లో ఉన్న రాళ్లు ఇట్టే ఆకర్షిస్తున్నాయి.. కొండను ఆనుకొని సముద్రం ఉండడంతో సాగరం నుంచి వచ్చే అలలు వాటిని తాకుతూ అందమైన శిల్పాలుగా మల్చడంతో ఈ ప్రాంతం ఇప్పుడు మండలంలో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇటీవల కాలంలో పాతగంగవరం పేరు మారుమోగుతోందంటే దానికి కారణంగా సముద్రం ఒడ్డు న ఉన్న రాళ్లే.. ఇప్పుడు ఈ ప్రాంతం ఒక పర్యాటక కేంద్రంగా మారింది. నిత్యం ఎంతోమంది రాధా మాధవస్వామి ఆలయానికి వెళ్తే.. అక్కడి నుంచి కిందకు దిగుతూ అందంగా పేర్చినట్టు ఉండే రాళ్ల మధ్య ఆటలాడుతూ.. ఫొటోలు దిగుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడే ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతున్నారు.. అక్కడే ఉన్న సొరంగాల్లోకి వెళ్తూ.. కేరింతలు కొడుతున్నారు.. ఇంత సుందరమైన సాగర తీరాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు యువత ఉర్రూతలూగుతున్నారు. ఇక్కడి వాతావరణంలో తేలియాడుతున్నారు. -
ప్లాస్టిక్ వ్యర్థాలకు అడ్డాగా వైజాగ్ బీచ్
-
విశాఖపట్నం: ఐదులోపు చూసి వెళ్లిపోవల్సిందే..
ఆదివారం వచ్చిందంటే చాలు సిటిజనులు ఎక్కడున్నా బీచ్లో వాలిపోవాల్సిందే..కరోనా కారణంగా చాలా రోజులు బీచ్ మొఖం చూడడమే మానేశారు. ఇటీవల కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం..పర్యాటక ప్రాంతాలు తెరుచుకోవడంతో మళ్లీ నగరవాసులు బీచ్కు క్యూ కడుతున్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో వీకెండ్స్, సెలవు రోజుల్లో బీచ్లో ఆంక్షలు విధించారు. దీంతో సాయంత్రం 5 గంటల నుంచి బీచ్లో ఒక్కర్ని కూడా లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బీచ్లో సందడి వాతావరణం నెలకుంది. ఆంక్షల సమయంలో బీచ్ను మొత్తం తమ ఆధీనంలోకి పోలీసులు తీసుకున్నారు. – బీచ్రోడ్డు (విశాఖ తూర్పు) (చదవండి: వైరల్: మేకను మింగిన కొండచిలువ) -
బంగ్లాదేశ్ నౌక తిరిగి సముద్రంలోకి..
సాక్షి, విశాఖపట్నం: అలల ఉధృతికి పోర్టు నుంచి తెన్నేటి పార్కు ఒడ్డుకు కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్కి చెందిన ‘ఎంవీ–మా’ జనరల్ కార్గో నౌకను తిరిగి సముద్రంలోకి పంపించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన అధికారులు, సిబ్బంది ప్రస్తుతం నౌక ఉన్న స్థితిగతులను బుధవారం పరిశీలించారు. నౌక ఎంత మేరకు ఒడ్డుకు కొట్టుకొచ్చింది. కింద భాగంలో రాళ్లు ఏ మేర ఉన్నాయి.. నౌకను సముద్రంలోకి పంపించే సమయంలో నౌకలోని భాగాలు దెబ్బతినే అవకాశం ఉందా వంటి అంశాల్ని పరిశీలించారు. ఎంవీ మా కార్గో షిప్ యాజమాన్యంతో పాటు షిప్ స్థానిక ఏజెంట్, హల్ అండ్ మెషినరీ క్లబ్, విశాఖపోర్టు ట్రస్టు, డీజీ షిప్పింగ్, ఇండియన్ కోస్ట్గార్డు, జిల్లా కలెక్టరేట్, స్థానిక, కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ విభాగాలు ఈ ఆపరేషన్లో భాగస్వాములవుతున్నాయి. అంతర్జాతీయ నిబంధనల మేరకు నౌకను సముద్రంలోకి పంపించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఏర్పడే సమస్యలను పరిష్కరించేందుకు హల్ అండ్ మెషినరీ విభాగం సిద్ధంగా ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. ఒడ్డు నుంచి తీస్తున్న సమయంలో నౌక నుంచి చమురు సముద్రంపై పడి తెట్టులా కాలుష్యం ఏర్పడే అవకాశం ఉంది. దీనికి తోడు ఈ సమయంలో వినియోగించే పరికరాలు, ఇతర సామాగ్రితో ఆ ప్రాంతమంతా వ్యర్థాలతో నిండిపోతుంది. కోస్ట్గార్డు భాగస్వామ్యంతో వీటన్నింటిని తొలిగించేందుకు విశాఖ పోర్టు ట్రస్టు అంగీకారం తెలిపింది. గురువారం లేదా శుక్రవారం ఆపరేషన్ ఎంవీ–మా కు ఉపక్రమించే అవకాశం ఉందని పోర్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కార్గోను చూసేందుకు క్యూ ఆరిలోవ(విశాఖ తూర్పు): తెన్నేటి పార్కు వద్ద తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్కు చెందిన కార్గో నౌకను తిలకించడానికి నగర ప్రజలు తరలివస్తున్నారు. బుధవారం నౌక వద్దకు ఎవ్వరినీ పోలీసులు వెళ్లనీయకపోవడంతో.. దూరం నుంచి చూస్తూ సంతోషించారు. దీంతో జోడుగుళ్లపాలెం బీచ్ నుంచి తెన్నేటి పార్కు వరకు సందడి నెలకొంది. కరోనా కారణంగా బోసిపోయిన ఇక్కడ బీచ్ నౌక వల్ల మళ్లీ నిండుదనం సంతరించుకుంది. ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. సందర్శకులు ఎక్కువ సేపు గుమిగూడకుండా నియంత్రించారు. ఇదిలా ఉండగా ఉదయం నుంచి పలుమార్లు నేవీ అధికారులు ఇక్కడకు వచ్చి నౌక లోపల ఆయిల్ బయటకు తీసే మార్గం, సామగ్రిని ఏ విధంగా తీసుకురావాలనే అంశాలను పరిశీలించారు. -
బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ రేసులో రుషికొండ బీచ్
సాక్షి, విశాఖపట్నం: అందాల విశాఖ సాగరతీరం పర్యావరణహిత బీచ్గా సందర్శకులను అలరించేందుకు ముస్తాబవుతోంది. మూడు దశాబ్దాల తర్వాత దేశంలో బ్లూఫ్లాగ్ ప్రాజెక్టుకు ఎంపికైన 13 బీచ్ల్లో రుషికొండ తీరం చోటు సాధించింది. (చదవండి: త్వరలోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్) బ్లూఫ్లాగ్ బీచ్ అంటే...? బ్లూఫ్లాగ్ బీచ్లు అంటే కాలుష్యం దరిచేరని పూర్తిగా పర్యావరణ అనుకూల సాగర తీరాలు. డెన్మార్క్కి చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) 1987 నుంచి బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ అందిస్తోంది. ఇప్పటివరకు 46 దేశాల్లో 4,500 బీచ్లు ఈ సర్టిఫికెట్ పొందాయి. తొలిసారిగా భారత్కు చెందిన 13 బీచ్లు ఇందుకు అర్హత సాధించాయి. బ్లూఫ్లాగ్ గుర్తింపు ఉన్న బీచ్లకు విశేష ఆదరణతోపాటు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఈ సర్టిఫికెట్ దక్కాలంటే బీచ్ పరిసరాలు పరిశుభ్రంగా, నీరు కలుషితం కాకుండా, రసాయనాలు దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సర్టిఫికెట్ ఇస్తారిలా.. బ్లూఫ్లాగ్ ధ్రువపత్రం పొందాలంటే నాలుగు విభాగాల్లోని 33 అంశాల్లో బీచ్ని అభివృద్ధి చేయాలి. మలినాలు, వ్యర్థాలు ఉండకూడదు. ప్రాజెక్టు పనులు పూర్తయిన అనంతరం ఎఫ్ఈఈ ప్రతినిధులు ఎక్కడైనా ఒకచోట ఒక చదరపు అడుగులో ఇసుకని తవ్వి నాణ్యత పరిశీలిస్తారు. నీటి నాణ్యతని కూడా పరిశీలించి సంతృప్తి చెందితే సర్టిఫికెట్ ఇస్తారు. బీచ్లో బ్లూఫ్లాగ్ (నీలం రంగు జెండా) ఎగురవేస్తారు. 80% పనులు పూర్తి బ్లూఫ్లాగ్ ప్రాజెక్టు కింద రుషికొండ బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.7.35 కోట్లు కేటాయించింది. వీటితో పనులు ప్రారంభించారు.ఇటీవల విశాఖలో బ్లూఫ్లాగ్ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఇక్కడ జరుగుతున్న పనుల్ని నిపుణుల బృందం పరిశీలించింది. 80 శాతం పనులు పూర్తైనట్లు ధృవీకరించారు. 600 చదరపు మీటర్ల మేర బ్లూ ఫ్లాగ్ బీచ్గా అభివృద్ధి చేస్తున్నారు. (బాబాయ్ ఇలా మాట్లాడతారా; సంచయిత భావోద్వేగం..) బ్లూఫ్లాగ్ ఎగరేస్తాం.. ‘రుషికొండ బీచ్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. బ్లూఫ్లాగ్ బీచ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధించాం. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుతూ సముద్ర జలాల్లో ఎలాంటి రసాయనాలు కలవకుండా చర్యలు తీసుకుంటున్నాం. తీరంలో ఇసుకని ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నాం. రెండు ఆధునిక యంత్రాల ద్వారా పనులు నిర్వహిస్తున్నాం. జూన్లో బ్లూఫ్లాగ్ బృందం బీచ్ను పరిశీలించే అవకాశం ఉంది. రుషికొండ బీచ్లో కచ్చితంగా బ్లూఫ్లాగ్ ఎగరేసేందుకు యంత్రాంగమంతా కలిసికట్టుగా పని చేస్తున్నాం’ – పూర్ణిమాదేవి, బ్లూఫ్లాగ్ నోడల్ అధికారి పర్యావరణహితంగా నిర్మితమైన టాయిలెట్లు సదుపాయాలివీ.. ► బీచ్లో మౌలిక సదుపాయాలన్నీ పర్యావరణ హితంగా వెదురుతో నిర్మిస్తున్నారు. త్రిపుర నుంచి తెచ్చిన వెదురు 10 ఏళ్ల పాటు పాడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖపర్యాటకులు ఇసుక తిన్నెల్లో కూర్చొని సేదతీరేలా బెంచ్లతో పాటు గడ్డి, వెదురు పుల్లలతో గొడుగులు ఏర్పాటు చేశారు. వీటి కింద కూర్చోవడం వల్ల చల్లటి వాతావరణంలో పర్యాటకులు ఆహ్లాదంగా గడుపుతారు. ► ఎక్కడా మలినాలు, చెత్త లేకుండా 25 మంది సిబ్బందితో బీచ్ మొత్తం ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. ► విద్యుత్ కోసం సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. 40 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ నుంచి 35 కేవీ విద్యుత్ని ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్నారు. బీచ్లో ఏర్పాటు చేసిన 70 ఎల్ఈడీ విద్యుత్ బల్బులకు సోలార్ పవర్నే వాడుతున్నారు. ► బీచ్ పరిరక్షణ కోసం 10 మంది రక్షణ సిబ్బందిని నియమించారు. బీచ్లో ఎవరూ ప్రమాదాల బారిన పడకుండా ముగ్గురు పర్యవేక్షకుల్ని ఏర్పాటు చేశారు. 55 సీసీ కెమేరాలతో నిరంతరం నిఘా పెట్టారు. ► బీచ్లో చెత్త నుంచి ఎరువు తయారు చేసేందుకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉత్పత్తి చేసే ఎరువుల్ని మొక్కల పెంపకానికి వినియోగించనున్నారు. ► మరుగుదొడ్లకి వినియోగించే నీటిని పునర్వినియోగించేలా గ్రేవాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. రుషికొండ బీచ్లో ఏర్పాటయ్యేవి ⇒ రెండు వైపులా పార్కింగ్ ⇒ 2 చోట్ల లైఫ్గార్డులు, వాచ్టవర్ ⇒ 8 ఓపెన్ షవర్లు, 6 దుస్తులు మార్చుకునే గదులు ⇒ పిల్లల పార్క్ ⇒ వ్యాయామ పరికరాలు ⇒ కూర్చునేందుకు 11 బెంచీలు ⇒ జాగింగ్ ట్రాక్ ⇒ బీచ్ సమగ్ర సమాచారం తెలిపే బోర్డు ⇒ 8 మరుగుదొడ్లు ⇒ మురుగు నీటి నిర్వహణ, గ్రేవాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ⇒ సౌర విద్యుత్తు ప్లాంట్ ⇒ సేఫ్ స్విమ్మింగ్ జోన్ ⇒ రాకీ ప్యాచ్ ⇒ 16 చోట్ల సిట్అవుట్ అంబ్రెల్లా విత్ రిక్లైనర్ ⇒ వాటర్ శాంప్లింగ్ పాయింట్ ⇒ ఏపీటీడీసీ ఫుడ్ కోర్టులు ⇒ ఏపీటీడీసీ బోటింగ్ కార్యాలయం ⇒ యాంఫిబియాస్ వీల్ చెయిర్లు ⇒ దేవాలయం ⇒ కమాండ్ కంట్రోల్ రూమ్ -
విశాఖ బీచ్..అదరహో..
-
అంబరాన్ని తాకిన క్రిస్మస్ వేడుకలు
-
విశాఖ బీచ్లో మందు బాబుల మృత్యువాత
-
బీచ్ ఫెస్టివల్కు ముస్తాబు అవుతున్న విశాఖ
-
'చంద్రబాబుకు విదేశీ పిచ్చి పట్టుకుంది'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు విదేశీ సంస్కృతి పిచ్చి పట్టుకుందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం సముద్ర తీరంలో డిస్కో డాన్సులు నిర్వహించాలని యోచిస్తుండడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తెలుగువారి మది నిండా ప్రేమ ఉందని, ఇప్పుడు మళ్లీ ప్రేమికుల దినోత్సవం పేరుతో ఆర్భాటాలు అవసరం లేదని స్పష్టం చేశారు. కేవలం ప్రచారం కోసమే చంద్రబాబు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. గోవా తరహాలో విశాఖ తీరంలో బీచ్ లవ్ ఉత్సవాన్ని నిర్వహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పూనుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఫిబ్రవరి 12 నుంచి ప్రేమికుల దినమైన 14వ తేదీ వరకు మూడురోజుల పాటు బీఎల్ఎఫ్-2017 పేరిట ఉత్సవాలు జరగనున్నాయి. ఇది విదేశీ విష సంస్కృతికి బీజమంటూ మహిళా, విద్యార్థి, ప్రజా సంఘాల మండిపడుతున్నాయి. -
ఇది వైజాగా లేక డర్బనా..?
విశాఖపట్నం: టీమిండియా సీనియర్ బౌలర్, ముంబై ఇండియన్స్ క్రికెటర్ హర్భజన్ సింగ్ విశాఖ అందాలకు ముగ్ధుడయ్యాడు. సాగరతీరం అందాలను చూసి పులకించిపోయాడు. వెంటనే ఫొటో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. విశాఖ బీచ్ అద్భుతంగా ఉందని డర్బన్ (దక్షిణాఫ్రికా)తో పోల్చాడు. ఇది వైజాగా లేక డర్బనా అంటూ భజ్జీ ట్వీట్ చేశాడు. ఈ నెల 8న విశాఖలో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ తరపున ఆడేందుకు ఇక్కడికి వచ్చాడు. విశాఖ తీరంలోని ఓ హోటల్లో జట్టు సభ్యులతో కలసి బసచేశాడు. హోటల్ రూమ్ నుంచి బీచ్ను చూసి ఫిదా అయిన భజ్జీ వెంటనే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. బీచ్ మనోహరంగా ఉందంటూ ప్రశంసించాడు. -
నౌకాదళ పండుగ నేటి నుంచే
ఐఎఫ్ఆర్కు సర్వాంగ సుందరంగా ముస్తాబైన విశాఖ సాగరతీరం హాజరుకానున్న రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘ప్రపంచ దేశాల నౌకాదళాలు... సముద్ర జలాల ద్వారా ఐక్యత’ అనే నినాదంతో విశాఖలో నిర్వహించనున్న అంతర్జాతీయ నౌకాదళ ప్రదర్శన(ఐఎఫ్ఆర్)కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ వేడుకలకు విశాఖపట్నం సాగరతీరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భారతదేశం రెండోసారి నిర్వహిస్తున్న ఐఎఫ్ఆర్లో దాదాపు 52 దేశాల నౌకాదళాలు పాల్గొననుండటం విశేషం. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు, త్రివిధ దళాధిపతులు, ఇతర ప్రముఖులు ఐఎఫ్ఆర్కు హాజరుకానున్నారు. ఐఎఫ్ఆర్ షెడ్యూల్... ఫిబ్రవరి 4: విశాఖపట్నం బీచ్రోడ్డులోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద సాయంత్రం 4 గంటలకు నివాళులు అర్పించడంతో ఐఎఫ్ఆర్ను లాంఛనంగా ప్రారంభిస్తారు. సీఎం చంద్రబాబు, నౌకాదళ అధిపతి ఆర్కే ధోవన్ తదితరులు పాల్గొంటారు. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో మారిటైమ్ ఎగ్జిబిషన్, ఐఎఫ్ఆర్ విలేజ్లను చంద్రబాబు ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 5: నేవల్ బేస్లోని ఐఎన్ఎస్ శాతవాహనలో ఐఎఫ్ఆర్-2016ను గవర్నర్ నరసింహన్ అధికారికంగా ప్రారంభిస్తారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రత్యేక విమానాల్లో విశాఖపట్నం చేరుకుంటారు. ఫిబ్రవరి 6: ప్రధాని మోదీ భువనేశ్వర్ వెళతారు. త్రివిధ దళాల అధిపతి హోదాలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భారత నౌకాదళ సామర్థ్యాన్ని సమీక్షిస్తారు. ప్రత్యేక యుద్ధనౌకలో సముద్ర జలాల్లో ప్రయాణిస్తూ యుద్ధ నౌకలను పరిశీలిస్తారు. సాయంత్రం నేవీకి చెందిన సాముద్రిక ఆడిటోరియంలో నేవల్ బ్యాండ్ సంగీత విభావరి నిర్వహిస్తుంది. దేశ, విదేశీ నౌకాదళ ప్రతినిధులకు రాష్ట్రపతి గౌరవ విందు ఇస్తారు. ఫిబ్రవరి 7: రాష్ట్రపతి ఢిల్లీకి తిరిగి వెళ్తారు. రెండు రోజుల అంతర్జాతీయ మారిటైమ్ సదస్సును రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు బీచ్రోడ్డులో నౌకాదళ విన్యాసాలను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. రాత్రి బీచ్రోడ్డులోని ఓ హోటల్లో దేశ, విదేశీ ప్రతినిధులకు నౌకాదళ అధిపతి ఆర్కే ధోవన్ విందు ఇస్తారు. ఇందులో ప్రధాని కూడా పాల్గొంటారు. ఫిబ్రవరి 8: ఐఎఫ్ఆర్ ముగింపు వేడుకలను నిర్వహిస్తారు. ఆకట్టుకున్న పరేడ్, కార్నివాల్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్)లో దేశ విదేశీ నౌకలే కాకుండా కళాకారులు కూడా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. వీటి సన్నాహాల్లో భాగంగా బుధవారం సాయంత్రం బీచ్ రోడ్డులో నిర్వహించిన పరేడ్, కార్నివాల్ సందర్శకులకు కనువిందు చేశాయి. కార్నివాల్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు సంప్రదాయ చిహ్నాలతో పాల్గొన్నారు. ఉగ్రవాదుల ముప్పు ఉండొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఐఎఫ్ఆర్కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. -
విశాఖ బీచ్ లో ముగ్గురి గల్లంతు
-
విశాఖ బీచ్ లో ముగ్గురి గల్లంతు
విశాఖపట్నం : విశాఖజిల్లాలోని తెన్నేటిపార్కు సమీపంలోని జోడుగుళ్లపాలెం తీరంలో సముద్ర స్నానం చేస్తున్న ముగ్గుర్ని ఒక్కసారిగా వచ్చిన రాకాసి అల మింగేసింది. ఈ ఘటనలో లోకేష్(19), రాజు(18), విజయ్(20) అనే ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో సుమారు పది మంది స్నేహితులు ఆ తీరంలో ఉన్నారు. అందులో ముగ్గురు స్నానానికి దిగారు. ఒక్కసారిగా వచ్చిన అల ముగ్గురిని సముద్రంలోకి లాక్కెళ్లింది. కళ్లముందే స్నేహితులు గల్లంతవటంతో మిగతా వారు కన్నీరుమున్నీరవుతున్నారు. గల్లంతయిన వారి కోసం 10 మంది గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. -
'గోవా తరహాలో విశాఖ బీచ్'
హైదరాబాద్: విశాఖ జిల్లా అచ్యుతాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పెట్టాలని భావిస్తున్నట్టు ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. కొద్ది రోజుల క్రితమే టెక్నికల్ కమిటీ ఆ స్థలాన్ని పరిశీలించిందని చెప్పారు. అచ్యుతాపురంలో ఎయిర్పోర్ట్ వద్దని నేవీ అధికారులు అభ్యంతరం తెలుపుతున్నారని చెప్పారు. ఒకవేళ అచ్యుతాపురంలో వీలుకాకుంటే భీమిలిలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. భీమిలిలో ఉన్న ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమకు కేటాయిస్తామని వెల్లడించారు. విశాఖపట్నం బీచ్ను గోవా తరహాలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అయ్యన్నపాత్రుడు తెలిపారు. -
అలల తాకిడికి విశాఖ తీరం విలవిల!