voter turnout
-
భారత్కు అమెరికా సాయం.. బంగ్లాకు మళ్లిందా?
న్యూఢిల్లీ: అమెరికా 21 మిలియన్ డాలర్ల సాయం వ్యవహారం.. కొత్త మలుపు తిరిగింది. ఆ సాయం భారత సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసేందుకేనన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ-కాంగ్రెస్లు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ లోపు ఆ సాయాన్ని బంగ్లాదేశ్కు మళ్లించారంటూ ఓ జాతీయ మీడియా సంస్థ నుంచి కథనం వెలువడంది. దాని ఆధారంగా బీజేపీ-కాంగ్రెస్లు పరస్పర ఆరోపణలతో మండిపడుతున్నాయి.భారత్లో ఓటింగ్ శాతం పెంపు కోసం ఇచ్చిన ఆ నిధులను బంగ్లాదేశ్లో ఓ ప్రాజెక్టు వినియోగించారన్నది ఆ కథనం సారాంశం. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్(Jairam Ramesh) దీనిని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి.. బీజేపీ, ఆ పార్టీ అనుకూల మీడియాపై విరుచుకుపడ్డారు. దానిని షేర్ చేస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీపై నిప్పులు చెరుగుతోంది. అయితే.. ఆ కథనాన్ని ఫేక్ అంటూ బీజేపీ ఖండించింది. Lies first mouthed in Washington. Lies then amplified by BJP's Jhoot Sena.Lies made to be debated on Godi media.Lies now thoroughly exposed. Will the Liars apologise? pic.twitter.com/nY7iP4jmnN— Jairam Ramesh (@Jairam_Ramesh) February 21, 2025 FAKE NEWS ALERT 🚨‼️The Indian Express story discusses $21 million in funding to Bangladesh in 2022. However, the article misrepresents the reference to a $21 million funding tranche intended to ‘promote’ voter turnout in India.What Indian Express conveniently sidesteps is… pic.twitter.com/niOaWXivm5— Amit Malviya (@amitmalviya) February 21, 2025భారత్లో ఎవరినో గెలిపించడానికి గత అధ్యక్షుడు జో బైడెన్ 21 మిలియన్ డాలర్ల(రూ.182 కోట్ల నిధులు) కేటాయించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆరోపించిన సంగతి తెలిసిందే. ఓటింగ్ను పెంచడంద్వారా భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు బైడెన్ ప్రయత్నించారని ట్రంప్ విమర్శించారు. అందుకే డోజ్ దానిని రద్దు చేసిందని సమర్థించుకున్నారు. ఈ ట్రంప్ వ్యాఖ్యలపై భారత్లో దుమారం రేగింది.విదేశీ సంస్థల చేతుల్లో రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలుబొమ్మలా మారారని బీజేపీ ధ్వజమెత్తగా.. ట్రంప్వి అర్థం లేని ఆరోపణలని కాంగ్రెస్ తిప్పికొట్టింది. ట్రంప్ వ్యాఖ్యలతో 2024 ఎన్నికల్లో విదేశీ శక్తులు పని చేస్తున్నాయని అప్పట్లో ప్రధాని మోదీ చేసిన ఆరోపణలు నిజమని తేలిందని బీజేపీ పేర్కొంది. విదేశీ శక్తులతో కలిసి రాహుల్ గాంధీ.. భారత్ వ్యూహాత్మక, భౌగోళిక ప్రయోజనాలను దెబ్బతీయాలని చూశారని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ విమర్శించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు అర్థం లేని ఆరోపణలేనని కాంగ్రెస్ కొట్టిపారేసింది. యూఎస్ ఎయిడ్ ద్వారా దశాబ్దాలుగా భారత్లోని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు అందిన సాయంపై శ్వేత పత్రాన్ని కేంద్రం విడుదల చేయాలని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ డిమాండు చేశారు.ఇతర దేశాలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ఫిబ్రవరి 16న జాబితా ప్రకటించింది. అందులో భారత్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన నిధులను రద్దు చేసినట్లు ప్రకటించింది. డోజ్ నిర్ణయం.. భారత్లో రాజకీయ వివాదానికి దారి తీసింది. -
మహారాష్ట్రలో 70 లక్షల ఓటర్లను కలిపారు
న్యూఢిల్లీ: గత ఏడాది జూన్లో లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు మహారాష్ట్రలో ఉన్న ఓటర్ల సంఖ్య హఠాత్తుగా నవంబర్ నెల వచ్చేసరికి 70 లక్షలు పెరిగిందని లోక్సభలో విపక్షనేత రాహు ల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా సోమవారం లోక్సభలో ఆయన మాట్లాడారు. ‘‘మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమగ్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అదే రాష్ట్రంలో జూన్లో లోక్సభ ఎన్నికల వేళ ఉన్న ఓటర్ల సంఖ్యకు నవంబర్లో ఎలా 70 లక్షల ఓటర్లు పెరుగుతారు?. గత ఐదేళ్లలో పెరిగిన ఓట్ల కంటే కూడా ఈ సంఖ్య ఎక్కువ. మొత్తం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల సంఖ్యకు సమాన స్థాయిలో ఓటర్లను కలిపారు. ఇందులో మతలబు ఏంటో కేంద్ర ఎన్నికల సంఘం తేల్చాలి. ఈసీ దీనిపై స్పష్టతనివ్వాలి’’అని రాహుల్ డిమాండ్చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత షిర్డీలోని ఒక భవంతి అడ్రస్తో దాదాపు 7,000 ఓట్లను కలిపారని రాహుల్ చెప్పారు. -
ఢిల్లీలో తగ్గిన పోలింగ్ శాతం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆరవ విడతలో భాగంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. మే 25న జరిగిన ఈ ఎన్నికల్లో రాజధాని వాసులు గతంలో కంటే తక్కువగా ఓటింగ్లో పాల్గొన్నారు. ఆరవ విడతలో ఓటర్ టర్నవుట్ డేటాను ఈసీ మంగళవారం(మే28) వెల్లడించింది.గతంలో ఢిల్లీలో 60.52 శాతం ఓట్లు పోలైతే ప్రస్తుత ఎన్నికల్లో అది 58.69 శాతానికి తగ్గిపోయింది. ఇక్కడ అత్యధికంగా కన్హయ్యకుమార్, మనోజ్తివారీ తలపడిన ఈశాన్య ఢిల్లీలో 62.87 శాతం ఓట్లు పోలవడం గమనార్హం. కన్హయ్యకుమార్ కాంగ్రెస్ నుంచి ఈ ఎన్నికల్లో బరిలో నిలిచారు. ఢిల్లీలో కాంగ్రెస్,ఆప్ కూటమి,బీజేపీ మధ్య ద్విముఖ పోరు జరిగింది.ఢిల్లీలో మొత్తం ఏడు ఎంపీ సీట్లున్నాయి. -
ఐదు విడతల ఓటర్ టర్నవుట్ డేటా వెల్లడి.. ఈసీ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ఐదు విడతల కచ్చితమైన పోలింగ్ ఓటర్ టర్నవుట్ డేటాను ఎన్నికల సంఘం(ఈసీ) శనివారం(మే25) వెల్లడించింది. ఓటింగ్ శాతాల డేటా అభ్యర్థులు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. టర్నవుట్ డేటా అందించడంలో ఎలాంటి ఆలస్యం జరగలేదని, ప్రతి విడత పోలింగ్ రోజు ఉదయం 9.30నుంచి ఎప్పటికప్పుడు ఓటింగ్ డేటాను ఓటర్ టర్నవుట్ యాప్లో ఉంచామని తెలిపింది. పోలైన ఓట్ల సంఖ్యను మార్చడం అసాధ్యమని స్పష్టం చేసింది. తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఈసీ ఖండించింది. ఐదు విడతల్లో బూత్ల వారిగా పోలింగ్ డేటాను వెబ్సైట్లో ఉంచాల్సిందిగా ఈసీని ఆదేశించాలని ఏడీఆర్ వేసిన పిటిషన్పై శుక్రవారమే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే తాము ఈ విషయంలో ప్రస్తుత ఎన్నికల వేళ ఎలాంటి ఆదేశాలివ్వలేమని సుప్రీం తెలిపింది. ఈ విచారణ జరిగిన మరుసటి రోజు ఐదు విడతల్లో పోలైన కచ్చితమైన ఓటర్ టర్నవుట్ డేటాను ఈసీ వెల్లడించడం గమనార్హం.ఈసీ వెల్లడించిన పోలింగ్ శాతాలు..తొలివిడత - 66.14రెండో విడత- 66.71మూడో విడత- 65.68నాలుగో విడత-69.16ఐదో విడత - 62.20 -
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
లక్కీ డ్రాలో బహుమతులు గెలుచుకోవచ్చంటే సామాన్యుల కాలు కదలకుండా ఉంటుందా..? మధ్యప్రదేశ్లోని భోపాల్ లోక్సభ స్థానంలో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు ఇలాంటి ఆఫరే ఇస్తున్నారు. మూడో దశలో భాగంగా ఈ నెల 7న భోపాల్లో పోలింగ్ జరుగుతోంది. ఆ రోజున ఓటేసే వారి పేర్లనుంచి ప్రతి మూడు గంటలకు ఒకసారి లక్కీ డ్రా తీయనున్నారు. విజేతలకు వజ్రపు ఉంగరాలు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు తదితర కానుకలిస్తారట! ‘‘నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉదయం 10, మధ్యాహ్నం 3, సాయంత్రం 6 గంటలకు లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులిస్తం. పోలింగ్ మర్నాడు మెగా డ్రా తీసి విజేతలకు మరింత పెద్ద బహమతులిస్తాం’’అని జిల్లా ఎన్నికల అధికారి కౌసలేంద్ర విక్రమ్ సింగ్ ప్రకటించారు. ఓటింగ్ పెంచేందుకే.. మధ్యప్రదేశ్లో ఇప్పటిదాకా జరిగిన రెండు దశల్లో పోలింగ్ 2019తో పోలిస్తే సగటున 8.5 శాతం తగ్గింది. 2019లో భోపాల్లో 65.7 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి ఎండలు విపరీతంగా ఉన్నందున ఓటర్లు పెద్దగా ఇల్లు కదలకపోవచ్చన్న ఆందోళనలున్నాయి. దీంతో ఎలాగైనా ఓటింగ్ను పెంచాలని ఈసీ కృత నిశ్చయంతో ఉంది. భోపాల్ నియోజకవర్గంలో 3,097 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి బూత్ వద్ద ఒక బీఎల్వో, వలంటీర్ను లక్కీ డ్రా కోసం నియమించారు. ఓటేశాక అక్కడి కూపన్ బుక్లెట్లో పేరు, మొబైల్ నంబర్ రాసి రసీదు తీసుకోవాలి. బహమతుల ఖర్చును కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కంపెనీలు భరిస్తున్నాయి. మెగా డ్రా కోసం డైమండ్ ఉంగరాలు, ల్యాప్టాప్లు, ఫ్రిజ్లు ఎనిమిది డిన్నర్ సెట్లు, రెండు మొబైల్ ఫోన్లు రెడీగా ఉన్నాయి. దీంతోపాటు ప్రతి పోలింగ్ కేంద్రంలో తొలి ఓటర్ను గౌరవించేందుకు ప్రత్యేకంగా ఏదైనా చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎడారి రాష్ట్రంలో ఓటింగ్ సునామీ!
జైపూర్: ఎడారి రాష్ట్రం రాజస్థాన్లో ఈసారి ఓటింగ్ శాతం మునుపటి ఓటింగ్ శాతాన్ని మించిపోనుంది. శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల సమయానికి 68 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. జైసల్మేర్ జిల్లాలోని పోఖ్రాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 81.12 శాతం, పాలి జిల్లాలోని మార్వార్ జంక్షన్లో అత్యల్పంగా 57.36 శాతం పోలింగ్ నమోదైంది. 2018లో 74.06 శాతం రాజస్థాన్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 74.06 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ సారి ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల సమయానికే 68 శాతానికి పైగా పోలింగ్ నమోదైన నేపథ్యంలో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలింగ్ స్టేషన్ వెలుపల ఓటర్లు పొడవాటి క్యూలలో నిల్చోవడం చూస్తుంటే, ఓటింగ్ శాతం 75 శాతానికి చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. స్లో ఓటింగ్పై బీజేపీ ఫిర్యాదు ఓటింగ్ శాతం బాగా నమోదవుతుందని భావిస్తున్నప్పటికీ, ప్రతిపక్ష బీజేపీ మాత్రం స్లో ఓటింగ్పై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. స్లో ఓటింగ్ కోసం అధికార యంత్రాంగంపై సీఎం అశోక్ గెహ్లాట్ ఒత్తిడి తెచ్చారని ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్పర్సన్ నారాయణ్ పంచారియా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీనిపై రాజస్థాన్ ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్ గుప్తా మాట్లాడుతూ, పోలింగ్ ముగిసే సమయంలోపు పోలింగ్ స్టేషన్లోకి ప్రవేశించిన ఓటర్లందరినీ ఓటు వేసేందుకు అనుమతించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 5.25 కోట్ల మంది ఓటర్లు రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా గాను 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అభ్యర్థి మృతితో ఒక నియోజకవర్గంలో పోలింగ్ వాయిదా పడింది. 199 నియోజకవర్గాల్లో 5.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరు 1,862 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తమ ఓటు ద్వారా నిర్ణయించారు. నువ్వా.. నేనా.. రాజస్థాన్లో జరుగుతున్న ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య నువ్వా.. నేనా అన్నట్లు ప్రత్యక్ష పోటీ నెలకొంది. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్వుళ్లూరుతుండగా.. ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారే సంప్రదాయానికి చెక్ చెప్పి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా 2018 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ బీజీపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పట్లో కాంగ్రెస్ 100, బీజేపీ 73 సీట్లు గెలుచుకున్నాయి. -
వలసలు, నిరాసక్తత
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడానికి ఉపాధి కోసం వలసలు, పట్టణాల్లో, యువతలో నిరాసక్తత వంటి ఎన్నో కారణాలున్నా యని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. సి బ్బంది, న్యాయం, ప్రజా సమస్యలపై పార్లమెంటు సంఘానికి ఈ మేరకు నివేదించింది. సోమ వారం జరిగిన సంఘం సమావేశంలో ఈ అంశంపై ఈసీ ఉన్నతాధికారులు ప్రజెంటేషన్ సమర్పించారు. ఓటింగ్ శాతం పెంచేందుకు రిమో ట్ ఓటింగ్ సదుపాయం వంటివి అందుబాటులోకి తేవాలని సూచించారు. అయితే, ‘‘రిమోట్ ఓటింగ్ పరిజ్ఞానం కూడా నెట్వర్క్లకు అనుసంధానమయ్యే తరహాలో కాకుండా ఈవీఎంల మాదిరిగా స్వతంత్రంగా ఉండేలా చూడటం ముఖ్యం. అప్పుడే ఎలాంటి దుర్వినియోగానికీ తావుండదు’’ అని అభిప్రాయపడ్డారు. -
‘మునుగోడు’లో ఓటర్ టర్నౌట్ యాప్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు (రియల్ టైమ్లో) ప్రకటించడానికి వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ‘ఓటర్ టర్నౌట్’ పేరుతో అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ను రాష్ట్రంలో తొలిసారిగా మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో వినియోగించనుంది. సామాన్య ప్రజలు సైతం ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అసెంబ్లీ/లోక్సభ నియోజకవర్గాలవారీగా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. యాప్ ఇలా పనిచేస్తుంది... నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్ వివరాలను యాప్ ద్వారా అప్లోడ్ చేస్తారు. యాప్లో ఎంట్రీల నమోదుకు 30 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. ఉదాహరణకు ఉదయం 9 గంటల్లోగా జరిగిన పోలింగ్ శాతం వివరాలను రిటర్నింగ్ అధికారి ఉదయం 9 నుంచి 9.30 గంటల మధ్య నమోదు చేస్తారు. ►ఉదయం 9 గంటలు, 11 గంటలు, మధ్యాహ్నం 1 గంట, 3 గంటలు, సాయంత్రం 5 గంటలు, 7 గంటల వరకు జరిగిన పోలింగ్ వివరాలను ఆ తర్వాతి అర్ధగంటలోగా ప్రకటిస్తారు. తుది పోలింగ్ వివరాలను అర్ధరాత్రి 12 గంటలలోగా విడుదల చేస్తారు. ►పోలింగ్ ముగిసిన తర్వాత పురుషులు, మహిళలు, ఇతర ఓటర్లు ఎంత మంది ఓటేశారు? మొత్తం పోలైన ఓట్లు ఎన్ని? వంటి వివరాలను యాప్లో అప్లోడ్ చేసి, ధ్రువీకరించుకున్న తర్వాత సబ్మిట్ చేస్తారు. ►అనంతరం సీఈఓ నియోజకవర్గాల వారీగా వివరాలను పరిశీలించి ధ్రువీకరించుకున్నాక వాటిని ప్రకటిస్తారు. పోలింగ్ ముగిసే సమయానికి సుమారుగా ఇంత పోలింగ్ జరిగిందని యాప్లో వివరాలు అందుబాటులోకి వస్తాయి. -
ఈ నగరానికి ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: మహానగరంలో పోలింగ్ శాతం మళ్లీ నిరుత్సాహ పరిచింది. శుక్రవారంతోపాటు వారంతం కావడంతో చాలా మంది సెలవులు తీసుకుని కుటుంబాలతో కలిసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. నగరంలో ఉన్న వారు సైతం ఓటు వేసేందుకు నిరాసక్తత కనబరిచారు. హైదరాబాద్లో జిల్లాలో 50.86%, మేడ్చల్ జిల్లాలో 54.99% పోలింగ్ నమోదైంది. ఓటింగ్లో పాల్గొనాలని అధికారులు, పార్టీలు అనేక విజ్ఞప్తులు చేసినా.. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ ఆశించిన స్థాయిలో పోలింగ్ జరగలేదు. పోలింగ్ బూత్లు, ఓటరు స్లిప్లకు ఆధునిక సాంకేతిక సహాయం అందుబాటులోకి వచ్చినా, అనేక చోట్ల ఓట్ల గల్లంతు, నివాసాల నుండి సుదూర ప్రాంతాల్లో పోలింగ్ బూత్ల ఏర్పాటుతో చాలా మంది ఓటేసేందుకు విముఖత చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు నగరంలో ఓటరు గుర్తింపు కార్డులున్నా ఓటరు జాబితాలో పేరు లేకపోవటం, పలు చోట్ల ఈవీఎంలు మొరాయించిన అంశం కూడా పోలింగ్పై ప్రభావాన్ని చూపింది. ఓటు గల్లంతైన వారిలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, దర్శకుడు రాజమౌళి సతీమణి రమ తదితర ప్రముఖులుండటం గమనార్హం. నియోజకవర్గాల వారీగా చూస్తే.. మల్కాజిగిరిలో 51.68%, కుత్బుల్లాపూర్లో 55.77%, కూకట్పల్లిలో 57.72%, ఉప్పల్లో 51.04% నమోదు కాగా, ఎల్బీనగర్లో 49%, మహేశ్వరంలో 55.09%, రాజేంద్రనగర్లో 57.29% ,శేరిలింగంపల్లిలో 48% పోలింగ్ నమోదైంది. ముషీరాబాద్లో 51.34%, అంబర్పేటో 55.20%, ఖైరతాబాద్లో 54%, జూబ్లీహిల్స్ 54.60%, సనత్నగర్లో 52.63%, నాంపల్లిలో 44.02%, సికింద్రాబాద్లో 57%, మలక్పేటలో 55.54%, కార్వాన్లో 50.89%, గోషామహల్లో 50.28%, చార్మినార్లో 46.03%, చంద్రాయణగుట్టలో 48%, యాకుత్పురాలో 45%, బహుదూర్పురాలో 49.50%, కంటోన్మెంట్లో 48.90% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. భారీగా తగ్గిన పోలింగ్ 2014తో పోలిస్తే శుక్రవారం జరిగిన ఎన్నికల్లో నగరంలో పోలింగ్ తగ్గింది. 2014లో హైదరాబాద్లో 53% పోలవగా, ఈ ఎన్నికల్లో 50.86% నమోదైంది. 2014తో పోలిస్తే ముషీరాబాద్, సనత్నగర్,నాంపల్లి,కార్వాన్, గోషామహల్, చార్మినార్, చంద్రాయణగుట్ట, యాకుత్పురా, బహుదూర్పురా నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గిపోగా, ఖైరతాబాద్, జూబ్లిహిల్స్, సికింద్రాబాద్, మలక్పేట తదితర నియోజకవర్గాల్లో పెరిగింది. -
మూడో దశలో 58 శాతం పోలింగ్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో మంగళవారం జరిగిన మూడో దశ ఎన్నికల్లో 58 శాతం పోలింగ్ నమోదైంది. జార్ఖండ్ లో 61 శాతం పోలింగ్ నమోదయినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తెలిపింది. జమ్మూకశ్మీర్లోని 18 స్థానాలకు డిసెంబర్ 2న జరిగిన రెండో విడత ఎన్నికల్లో 72 శాతం పోలింగ్ నమోదవగా, జార్ఖండ్లోని 20 మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 65.46 శాతం పోలింగ్ నమోదైంది. జమ్మూకశ్మీర్లో నవంబర్ 25న 15 సీట్లకు జరిగిన తొలి దశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 71.28 శాతం పోలింగ్ నమోదవగా, జార్ఖండ్లో 13 సీట్లకు అదే రోజు జరిగిన తొలి దశ ఎన్నికల్లో 61.92 శాతం పోలింగ్ నమోదవడం తెలిసిందే. -
పొలింగ్లో జమ్మూకశ్మీర్ రికార్డ్!