ఇంటి పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం తగదు
● డీఎల్పీవో కుమార్
చింతపల్లి: ఇంటి పన్నుల వసూళ్లలో పంచాయ తీ కార్యదర్శులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని, లక్ష్యాలకు అనుగుణంగా సకాలంలో వసూలు చేయాలని పాడేరు డీఎల్పీవో కుమార్ అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాడేరు డివిజన్ పరిధిలో గత ఏడాదితో పోల్చి చూస్తే ఈఏడాది ఇంటి పన్నుల వసూళ్లలో బాగా వెనుకబడినట్టు తెలిపారు. ఈనెలాఖరునాటికి పన్నులు శతశాతం వసూలు చేయాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి లేకుండా ముందుగానే కార్యాచరణ ప్రణాళికలను గ్రామస్థాయినుంచే అమలు చేయాలని ఆదేశించారు. ఎంపీడీవో శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment